-
కళాత్మక భావనలు విరిసిన వేదిక!
హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్, వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు అతిపెద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుక భావ్-2024 బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా జరిగింది. దిగ్గజ కళాకారులచే కదిలించే ప్రదర్శనలు, పౌరాణిక పాత్రల ఆధారంగా రచించిన కళారూపకాలు, రామాయణ భావోద్వేగ చిత్రణలు, అంతరించి పోతున్న కళారూపాల పునరుజ్జీవనం మొదలైన అంశాలతో జరిగిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుండి అత్యుత్తమ సాంస్కృతిక ప్రతిభావంతులు, వర్ధమాన కళాకారులు హాజరయ్యారు. మానవతావాది, గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ మార్గదర్శకత్వం, ప్రేరణతో జనవరి 25 నుండి 28 వరకు జరిగిన ఈ కార్యక్రమం సంస్కృతి, కళలతో ఆధ్యాత్మికతను మేళవించి సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది. కళాకారుడి భావోద్వేగ స్థితి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానంగా, “కళాకారులు భావోద్వేగాలు కలిగి ఉంటారు. ప్రేక్షకులను సంతోషపెట్టే ప్రయత్నంలో కళాకారులు తరచుగా తమను తామే మరచిపోతారు. పాత్రలతో మమేకమై తమ అంతరంగాన్ని, తమ సహజ స్వభావాన్ని సైతం గమనించలేరు. పైగా మనకు ఒకటి కాదు, కోపం, ధైర్యం, దుఃఖం, విరహం – ఇలా తొమ్మిది రకాలైన భావోద్వేగాలు (నవ రసాలు) ఉన్నాయి. జీవితంలో స్థిరత్వం కావాలంటే ఈ భావాలన్నిటినీ అధిగమించి వెళ్లాలి. వీటికి ఆవలగా వెళ్లగలిగినప్పుడే మనకు బలం వస్తుంది.” అని ప్రబోధించారు. ఈ కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలకు చెందిన సంగీత, నృత్య కళాకారులు హాజరయ్యారు. వర్ధమాన కళాకారులను, ఇందులో భాగంగా 61 అంశాలపై 153మంది కళాకారులతో పరస్పర చర్చలు, ప్రదర్శనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, బృందచర్చలు మొదలైనవి ఏర్పాటు చేశారు. శతాబ్దాల క్రిందటి సంప్రదాయ వర్కరీ యాత్ర, శేషులత కోసురు మొదలైన కర్ణాటక సంగీత ప్రముఖులచే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఈ భావ్-2024 లో భాగంగా నిర్వహించారు. ఈ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశం గురించి వరల్డ్ ఫోరమ్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ డైరెక్టర్ శ్రీవిద్య యశస్వి మాట్లాడుతూ.. “ఇటువంటి ప్రదర్శనలలో మనం ఆ ప్రాచీన కాలానికి వెళ్ళిపోయి చూస్తాం. కళాకారుడు కేవలం దైవానికి సమర్పణగా మాత్రమే ప్రదర్శన ఇస్తాడు. ఇక చూసేవారు ఆ అనుభవానికి ప్రేక్షకులుగా ఉంటారు” అని పేర్కొన్నారు. “ఉదాహరణకు, అయోధ్యలోని దేవాలయాల నుండి 7000 సంవత్సరాలకు పైగా తరతరాలుగా సంప్రదాయబద్ధంగా నాట్యం చేస్తున్న కళాకారులను మేము ఆహ్వానించాము. వారి కళానిబద్ధత, అనుభవ సారాంశం ఇక్కడ జరుగుతున్న అన్ని ప్రదర్శనలలోనూ మనం చూడవచ్చు.” అని ఆమె పేర్కొన్నారు. కళారూపాలకు తమ జీవితాలను అంకితం చేసి, వాటిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ప్రముఖ కళాకారులకు కళాసారథి అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలలో ఈలపాటకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా. కొమరవోలు శివప్రసాద్, కేరళకు చెందిన డా. కళామండలం సరస్వతి, మొదలైనవారు ఉన్నారు. డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యుడు, ఈలపాట మాంత్రికునిగా, ఆంధ్రకోకిలగా పేరొందిన డా. కొమరవోలు శివప్రసాద్ మాట్లాడుతూ.. ''కళా సారథి అవార్డు అందుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో అవార్డులు అందుకున్నాను కానీ ఈ కళాసారథి అవార్డు దివ్యత్వంతో కూడినది. పవిత్రమైన ఈ ఆశ్రమ వాతావరణంలో ఎక్కడ చూసినా చాలా కష్టపడి పనిచేసిన కళాకారులు కనిపిస్తున్నారు. 93 ఏళ్ల వయస్సు ఉన్న కళాకారులు సైతం ఉన్నారు. వారిని కలుసుకోగలగడం, వారి ఆశీస్సులు తీసుకోవడం ఒక అందమైన అనుభవం." అని పేర్కొన్నారు. భావ్-2024 సదస్సులో తన అనుభవాన్ని శేషులత కోసూరు పంచుకున్నారు, తనకు సంగీతమే గొప్ప సాంత్వన చేకూరుస్తుందని తెలిపారు. ఇతరుల అనుభవాలను తెలుసుకునేందుకు గొప్ప అవకాశాన్నిచ్చిందని ప్రముఖ వైణికుడు ఫణి నారాయణ పేర్కొన్నారు. ఇలాంటికార్యక్రమాలు ప్రతీ ఏటా జరగాలన్నారు. సంగీతకారులకు భావ్ అనేది చాలా సముచితమైన గౌరవం అని ఈమని శంకరశాస్త్రిగారి కుమార్తె ఈమని కళ్యాణి పేర్కొన్నారు. భానుమతీ నరసింహన్ రచించిన ‘సీత’ పుస్తకం ఆధారంగా నృత్యరూపకాన్ని ప్రదర్శించిన ప్రముఖ శాస్త్రీయ నృత్యకళాకారిణి క్రాంతి నారాయణ్, వర్ధమాన నాట్య కళాకారిణి వనజా ఉదయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్తాద్ ఫజల్ ఖురేషీతో పండిట్ కాళీనాథ్ మిశ్రా తబలా వాద్య కచేరీ, కేరళకు చెందిన ఇర్రంగాపురం బాబు చెండ వాద్యం, కథక్ కేంద్ర చైర్పర్సన్ ఉమా డోగ్రా ప్రదర్శించిన ‘శబరి’ నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మూడు తరాలకు చెందిన కథక్ నృత్య కళాకారిణులు పద్మాశర్మ, గౌరీ, తారిణి తమ అభినయాన్ని ఈ వేదికపై లయబద్ధంగా ప్రదర్శించారు. దృష్టిలోపం, ప్రత్యేక అవసరాలు కలిగిన కళాకారులు రంగ్ గంధ్ పేరిట ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇవి చదవండి: ఈజిప్ట్ అమ్మాయి నోట మన దేశభక్తి గీతం..మోదీ ప్రశంసల జల్లు! -
ఇంటికి చేరిన నిర్వాసితులు!
ఆర్ట్ అండ్ లిటరేచర్ నిర్వాసితులయ్యేది గిరిజనులు, జానపదులేనా? నగరజీవులూ నిర్వాసితులవుతారు! అటువంటి ఒక నిర్వాసి జి.సత్య శ్రీనివాస్. వివిధ భాషలలో వస్తోన్న పర్యావరణ కవితలను పరిచయం చేస్తున్న వ్యక్తిగా అతడు తెలుగు పాఠకులకు పరిచితుడు. స్వతహాగా కవి, ఫొటోగ్రాఫర్. గిరిజన ప్రాంతాలన్నిటినీ తిరిగిన వాడు. త్రిభాషా పత్రిక మీజాన్లో తెలుగు పత్రికకు సంపాదకుడైన అడవి బాపిరాజు హైద్రాబాద్లో తొలితరం తెలుగు జర్నలిస్ట్. తదుపరి తరానికి చెందిన వ్యక్తి గుడ్లవల్లేరు రామారావు. ‘నంబర్ 20, జర్నలిస్ట్ కాలనీ, బంజారాహిల్స్’ ఆయన ఇల్లు. ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. అన్నలతో సోదరితో సత్య శ్రీనివాస్ అక్కడ పెరిగారు. కారణాంతరాల వలన ఆ ఇంటిని అమ్మివేశారు. మూడు దశాబ్దాలు గిరిజనులు, జానపదులతో గడిపి వారి నిర్వాసిత జీవితాలను మాటలుగా, పాటలుగా విన్న సత్యశ్రీనివాస్కు తాము నిర్వాసితులైన ఇల్లు, ఆ ఇంటితో పెనవేసుకున్న అమ్మలు, అమ్మమ్మలు గుర్తొచ్చారు. జలవర్ణాలతో వారికి ఆకృతి ఇచ్చేందుకు పూనుకున్నాడు. ఒక పరిశోధకునిలా 20 పాత ఫొటోలను సేకరించి, వారి వ్యక్తిత్వాలు తొణికిసలాడే ‘20 మెమోయర్స్’ రూపొందించాడు. భర్త చనిపోయినా బాధ్యతలకు వెరవక పిల్లలను వృద్ధిలోకి తెచ్చిన మిత్రుడు చంద్రశేఖర్ అమ్మ బి.ఆదిలక్ష్మి, ఆప్యాయత ఈమె నుంచే పుట్టిందా అన్నట్లుగా కన్పించే అనంతపురం జిల్లా, చిన్న కోటాల గ్రామానికి చెందిన 92 ఏళ్ల భారకం పాపమ్మ, పురానా షెహర్ నడచి వస్తున్నట్లుగా కన్పించే కవి-గాయకుడు సిద్ధార్ధ అమ్మ బి.సుశీల, స్వాదిష్ట్ భోజనాన్ని తయారు చేసే కరీంనగర్ కు చెందిన గండి సులోచన, తాను తల్లిలా భావించే కొండపల్లి కోటేశ్వరమ్మ, నగరంలో ఉండలేనని రొట్టమాకురేవుకు వెళ్లి వేపచెట్టుకింద కొన్ని రోజులు నివసించిన ‘గ్రామదేవత’ కవి యాకూబ్ అమ్మ హూరంబీ, మామ అమ్మ ముప్పనేని నాగలక్ష్మి తదితరులను సత్యశ్రీనివాస్ చిత్రించాడు. తాను అంతకు ముందు పెయింటింగ్స్ చేయలేదు. వ్యూ ఫైండర్ను కాన్వాస్గా భావించి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని కళాత్మకంగా పట్టే విద్య తనలో ఉన్నది. రంగులతో రూపాలు ఇవ్వడం అనుభవం లేనిదే! గుహల గోడలపై ఆదిమ చిత్రకారులు మట్టి రంగులతో, జంతువుల కొవ్వులను కలిపి ఎలా చిత్రించారు? అదే ఉద్వేగం సత్యశ్రీనివాస్లో నర్తించింది. ‘నంబర్ 20, జర్నలిస్ట్ కాలనీ, బంజారాహిల్స్’ ఇప్పడు చేతులు మారి ‘గోథె జెంత్రమ్’ అయ్యింది. ఆ భవనంలోనే ఈనెల 5వ తేదీ నుంచి 13 వరకూ ప్రదర్శన ఏర్పాటైంది. చిత్తరువుల్లో ఉన్నవారు, వారి బంధువులు విచ్చేశారు. ‘అదుగో అమ్మ, నానమ్మ’ వంటి యురేకా మాటలు వెల్వడినవి. నిర్వాసితులు ఇంటికి చేరిన ఆనందం కువకువలాడింది. వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలు, దేశాలు తమ పరస్పర సంబంధాలను తెలుసుకోవాలని, కలుపుకోవాలని తన రచనల ద్వారా చెప్పిన జర్మన్ మహాకవి గోథె ఆకాంక్ష ‘నంబర్ 20: మెమోయర్స్’ ద్వారా నెరవేరిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అమితాదేశాయ్ అన్నారు. తాము కొన్నేండ్లుగా ఇరుదేశాల మధ్య సాంస్కృతిక బాంధవ్యాలను పెంచే అనేక కార్యక్రమాలను నిర్వహించామనీ, కాని సత్యశ్రీనివాస్ చిత్తరువులు తమ సంస్థకు స్థానికతను ఇచ్చాయని కూడా అన్నారు. తల్లివేరును స్పర్శించిన ఊడలు కదా ఆ చిత్రాలు! -- పున్నా కృష్ణమూర్తి ఇండిపెండెంట్ జర్నలిస్ట్, 7680950863.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement