-
హత్య కేసులో ఎనిమిది మంది రిమాండ్
అర్వపల్లి :చేతబడి నెపంతో పలువుర గ్రామస్తులు ఏకమై ఓ ఇంటిపై దాడికి పాల్పడి ఒకరిని హత్య చేసి, మరికొందరిని గాయపర్చిన కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన ఘటన శనివారం అర్వపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. తుంగతుర్తి సీఐ దండి లక్ష్మణ్, అర్వపల్లి ఎస్సై మోహన్రెడ్డిలు విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ ఆవాసం తుంగగూడెంలో ఈ నెల 6న రాత్రి కొంతమంది గ్రామస్తులు అదే గ్రా మానికి చెందిన చిలుకూరి సోమయ్య ఇంటిపై దాడి చేసి సోమయ్యను హత్య చేసి ఆయన భార్య భారతమ్మ, కుమారుడు రమేష్లను తీవ్రంగా గాయపర్చారు. కేసుకు సంబంధించి ఎనిమిది మంది నింది తులను శుక్రవారం కోదాడ కోర్టులో హజరుపరిచారు. చేతబడి చేస్తూ తమ ను ప్రశాంతంగా బతకనివ్వడం లేద ని, ప్రతి ఇంట్లో ఏదో ఓ సమస్య, తర చూ అనారోగ్యం చోటుచేసుకోవడాని కి సోమయ్య చేతబడి చేయడమే కారణమని నిందితులు నర్సింగ సుమన్, తుంగ వెంకన్న, సైదుల లక్ష్మణ్, సైదుల నగేష్, డేగల శ్రవణ్, సైదుల సైదులు, దుబ్బాక నాగరాజు, వెన్నమళ్ల యాకయ్యలు తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిపై కేసు నమోదు చేశామని, త్వరలోనే అందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. అలాగే నిందితుల వద్ద నుంచి రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లు, ఏడు కర్రలు, ఒక ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో హెడ్కానిస్టేబుళ్లు వెంకట్రాములు, వీరన్న, వెంకన్న, రవీందర్, రత్నం, సిబ్బంది రాజు, సైదులు, సుధాకర్, అఖిల్, పురుషోత్తం, నాగరాజు, సైదులు పాల్గొన్నారు. -
వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి
అర్వపల్లి : పాలకుల వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. బహుజన బతుకమ్మలో భాగంగా శుక్రవారం రాత్రి తిమ్మాపురంలో మన భూములు మనవే–మన వనరులు మనవే అనే నినాదంతో బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన వనరులను బహుళజాతి కంపెనీలకు పాలకులు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వనరులను కాపాడుకోవడానికి అంతా కలిసి పోరాడాలన్నారు. బతుకమ్మ పండుగతో బహుజనులు ఏకం కావాలన్నారు. ఆడపిల్లలను ఎదగనివ్వాలని, మద్యాన్ని తరిమికొట్టాలని కోరారు. ఈసందర్భంగా ఆమె బతుకమ్మ పేర్చి ఆతర్వాత ఎత్తుకొని గ్రామంలో ఊరేగింపు జరిపారు. అనంతరం గ్రామ చావడి వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈకార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ బైరాగి, తెలంగాణ రైతుకూలి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణదాసు, రాష్ట్ర నాయకులు మల్సూరు, బొమ్మకంటి కొమురయ్య, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఆవుల నాగరాజు, తీగల పూలన్, పటేల్ మధుసూధన్రెడ్డి, సైదులు, మిడసనమెట్ల వెంకన్న, బైరబోయిన జానయ్య, బండి యాదయ్య, అంబటి సైదులు, రవి, కిరణ్ పాల్గొన్నారు. -
తాత్కాలికంగా గోదావరి జలాల నిలిపివేత
అర్వపల్లి: శ్రీరాంసాగర్ రెండోదశ (ఎస్సారెస్పీ)కు గోదావరి జలాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరంగల్ జిల్లాలో పెద్దమ్మగడ్డ వద్ద కాకతీయ కాలువకు గండిపడిన చోట మరమ్మతు పనులు జరుగుతుండటంతో నీటిని నిలిపివేశారు. అయితే వరంగల్ జిల్లాలోని మైలారం రిజర్వాయర్, బయ్యన్న వాగులలో ఉన్న నీటిని ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలోని 69, 71 డిస్ట్రిబ్యూటర్లకు విడుదల చేశారు. అయితే వాటిలో నీళ్లు తగ్గడం, పైనుంచి రాకపోవడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. కాకతీయ కాలువకు పడిన గండిని పూడ్చిన తర్వాత కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి (లోయరు మానేరు డ్యాం) నుంచి వరంగల్ జిల్లాకు వదిలి మైలారం రిజర్వాయర్, బయ్యన్న వాగులను నింపి ఆ తర్వాత జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేస్తామని ఎస్సారెస్పీ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. -
టిప్పర్ నుంచి డీజిల్ చోరీ
అర్వపల్లి: అర్వపల్లి మండల కేంద్రంలోని భారత్ పెట్రోలియం బంక్ పక్కన నిలిపి ఉన్న టిప్పర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డీజిల్ చోరీ చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం....జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్సింగ శ్రీనివాస్గౌడ్ తన టిప్పిర్ వాహనాన్ని సోమవారం రాత్రి పెట్రోలియం బంక్ పక్కన పెట్టి వెళ్లాడు. మంగళవారం ఉదయం వచ్చి వాహనాన్ని తీయబోగా స్టార్ట్ కావడం లేదు. అనుమానం వచ్చి టిప్పర్ ట్యాంక్ను చూడగా తాళం పగులగొట్టి ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు ట్యాంక్ తాళం తీసి అందులోని 85 లీటర్ల డీజిల్ను చోరీ చేశారు. ఎస్ఐ ఎ.మోహన్రెడ్డి సంఘటన స్థలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. -
ఎస్సారెస్పీ 71 డీబీఎం కాల్వకు నీటి విడుదల
అర్వపల్లి : ఎస్సారెస్పీ రెండో దశ పరిధిలోని 71 డీబీఎం కాల్వకు ఎట్టకేలకు అధికారులు నీటిని విడుదల చేశారు. సోమవారం రాత్రి నుంచి నీటిని వదిలారు. వరంగల్ జిల్లా బయ్యన్న వాగు నుంచి కొడకండ్లలోని అవుట్ ఫ్లో గేటు ద్వారా 69 డీబీఎంకు 500 క్యూసెక్కులు, 71 డీబీఎంకు 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 69 డీబీఎం ద్వారా నీళ్లు తుంగతుర్తి, నూతనకల్ మండలాలకు, 71 డీబీఎం ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి నీటిని ఇస్తున్నారు. 15 రోజుల పాటు ఈ కాల్వలకు నీటిని వదలాలని మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, కాల్వలను ఈఈ సుధీర్, డీఈలు సునీల్, ప్రసాద్, సలీంబేగ్, ప్రవీణ్, ఏఈఈ హరికృష్ణ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement