-
అసైన్డ్ భూముల కబ్జాపై కఠిన చర్యలు
దుబ్బాక: నిరుపేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములను కబ్జాచేసిన ఆక్రమణదారులపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు తౌడ శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో బతుకు దెరువు లేని దళితులకు బతుకునివ్వాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం భూములను పంచితే దళితుల అత్యవసరాలను కొంతమంది ఆసరా చేసుకుని నయానో, భయానో వారి భూములను లాక్కున్నారన్నారు. ప్రభుత్వమిచ్చిన భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన లబ్ధిదారుల ఆధీనంలోనే ఉండాలని, ఎస్సీ, ఎస్టీలు కాకుండా కబ్జాలో ఇతర వర్గాలుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసైన్డ్ భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయో విచారణ చేపట్టాలని రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు. దళితుల నుంచి అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకున్న ఇతర వర్గాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై కులం పేరుతో దాడులు చేసినా, వారి భూములను ఆక్రమించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరారు. -
అసైన్డ్ భూములు సరెండర్ చేయాలి
దుబ్బాక: జీవనోపాధి కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన నిరుపేద కుటుంబాలకు గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఆసైన్డ్ భూములను ఇతర వర్గాలు బలవంతంగా లాక్కున్నాయని, అక్రమించిన ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి సరెండెర్ చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తౌడ శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం దుబ్బాక విలేకరులతో ఆయన మాట్లాడుతూ జీవనోపాధి కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను అగ్రవర్ణాలు స్వాధీనం చేసుకుని, తహశీల్దార్ కార్యాలయాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తుల పేరున ఆసైన్డ్ భూములు వెళ్లిపోయాయని ఆరోపించారు. దళితుల అవసరాలను ఆసరా చేసుకున్న ఆగ్రవర్ణాలు అప్పులిచ్చి ఎస్సీ, ఎస్టీ భూములను స్వాధీనం చేసుకున్నారన్నారు. గత ప్రభుత్వాలు దళితులకిచ్చిన భూముల రికార్డులు, ఇప్పుడు ఎవరిపేరున మోటేషన్ అవుతున్నాయో రెవెన్యూ అధికారులు లెక్కలు తేల్చాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల నుంచి ఇతర వర్గాలకు మారిన భూ రికార్డులను సరి చూసి, సర్వే చేయాలని రెవెన్యూ అధికారులకు ఆయన సూచించారు. ఎస్సీ, ఎస్టీ భూములను అక్రమించిన ఇతర వర్గాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేయాలని, లేనియెడల చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement