-
లూటీ సొమ్మును రాబట్టారు..
సాక్షి, రాంచీ : పలము జిల్లాలోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో సిబ్బందిని బెదిరించి చోరీకి పాల్పడిన దుండగుల నుంచి జార్ఖండ్ పోలీసులు చోరీ సొత్తును రాబట్టారు. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలోని ఓ ఇంటిపై దాడి చేసిన జార్ఖండ్ పోలీసులు బ్యాంకులో లూటీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 15న పలము జిల్లాలోని ఓ ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు ప్రైవేట్ బ్యాంక్ సిబ్బంది వెళుతుండగా దుండగులు దాడి చేసి రూ 54 లక్షలు దోచుకెళ్లారు. జల్పాయిగురి పోలీసుల సహకారంతో ఫతపుకూర్ ప్రాంతంలోని ఓ గృహంపై జార్ఖండ్ పోలీసులు దాడి చేసి రూ 35 లక్షలను రాబట్టారు. పోలీసులు దాడి చేసే ముందు గృహంలో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. -
మధుకరా.. భయంకరా!
4 హత్యలు.. 3 హత్యాయత్నాలు పదుల సంఖ్యలో దోపిడీలు బెంగళూరు ఏటీఎం కేసుతో సంచలనం నాలుగు రాష్ట్రాల ఖాకీలకు ముప్పుతిప్పలు చివరకు జిల్లా పోలీసులకు చిక్కిన వైనం చిత్తూరు (అర్బన్): 300 మంది పోలీసులు.. 25 ప్రత్యేక బృందాల కళ్లు గప్పి తిరుగుతున్నాడు.. నాలుగు రాష్ట్రాల పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు మదనపల్లె పోలీసులకు పట్టుపడ్డాడు. అతనే కొండయ్యగారి మధుకర్రెడ్డి. బెంగళూరులో ఏటీఎంలో మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడు. తంబళ్లపల్లె నియోజకవర్గం బాలిరెడ్డిగారి పంచాయతీ, దిగువపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడే మధుకర్రెడ్డి (38). పదో తరగతి చదువుకున్న ఇతనికి పెద్దలు పెళ్లి చేసినా ప్రవర్తన నచ్చక భార్య వదిలి వెళ్లిపోయింది. 2005లో దిగువపల్లెలో నీటి విషయమై ఆనందరెడ్డిపై బాంబులు వేసి చంపడంతో న్యాయస్థానం ఇతనికి జైలుశిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తూ కడప జైలు నుంచి తప్పించుకున్న ఇతను నేరాలు చేయడమే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తంబళ్లపల్లె కాకుండా హైదరాబాద్, మహబూబ్నగర్, పీలేరు ప్రాంతాల్లో మూడు హత్యలు చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. అనంతపురం, కదిరి, ధర్మవరం, బెంగళూరు, జడ్చర్ల ప్రాంతాల్లో హత్యాయత్నాలు చేశాడు. మదనపల్లెలో తన తల్లిదండ్రులకు చెందిన ఓ ఇళ్లు ఉండటంతో తరచూ అక్కడి వస్తూ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు షాక్... మధుకర్రెడ్డి కడప జైలు నుంచి తప్పించుకున్న విషయం మాత్రమే తొలుత పోలీసులకు తెలుసు. ఇటీవల పాత నేరస్తుల వేలి ముద్రలను ట్యాబ్లలో అప్లోడ్ చేసి వాళ్లను గుర్తించే సాఫ్ట్వేర్ను అమల్లోకి తీసుకొచ్చిన జిల్లా పోలీసులకు మధుకర్రెడ్డి దొరికిపోయాడు. గత నెల 30న మదనపల్లెలో గస్తీలో ఉన్న ఎస్ఐ తిప్పానాయక్ సిబ్బంది శ్రీనివాసులు, రాఘవలతో పాటు ఓ సీపీవోలు మధుకర్రెడ్డిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నాలుగు రోజులు విచారించిన పోలీసులకు దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. నిందితుడు చెప్పిన విషయాలతో పీలేరులో యశోదమ్మ హత్య తరువాత కదిరిలోని ఏటీఎంలో డబ్బులు తీస్తున్న ఫుటేజీలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, జడ్చర్ల, కదిరి, కేరళ, కర్ణాటక పోలీసులు ఇతన్ని పీటీ వారెంట్పై తీసుకుని దర్యాప్తు చేయనున్నారు. పదుల సంఖ్యలో మధుకర్రెడ్డిపై ఉన్న దోపిడీ కేసులను సైతం పోలీసులు విచారించాల్సి ఉంది. మధుకర్రెడ్డిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపించిన మదనపల్లె పోలీసుల్ని ఎస్పీ అభినందించారు. సీఐ హనుమంతప్పనాయక్తో పాటు ఎస్ఐ తిప్పానాయక్, సిబ్బంది శ్రీనివాస్, రాఘవ, నర్సిం హులు, మొహీద్దీన్లను అభినందించారు. మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్తూరు డీఎస్పీలు రామక్రిష్ణ, లక్ష్మీనాయుడు, సీఐ నాగరాజు, విజయకుమార్ పాల్గొన్నారు. -
... ఆ ఘటనకు రెండేళ్లు
కొలిక్కిరాని బ్యాంకు ఉద్యోగి జ్యోతిపై దాడి కేసు 15 బృందాలు గాలించినా ఫలితం శూన్యం బెంగళూరు: 15 ప్రత్యేక పోలీసు బృందాలు, 400 మంది పోలీసులు, ఐదు రాష్ట్రాల్లో నిఘా, దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువ ఖర్చు, ముగ్గురు నగర కమీషనర్ల వ్యూహ రచన ఇవేవీ ఆ నిందితుడి జాడను గుర్తించలేకపోయాయి. బెంగళూరు నగరంలోని కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్శంకర్ పై ఏటీఎంలో దాడి జరిగి ఈనెల 19కు రెండేళ్లు పూర్తి కావస్తున్నాయి. అయినా ఇప్పటికీ దాడికి పాల్పడ్డ నిందితుడి జాడను మాత్రం పోలీసులు తెలుసుకోలేకపోయారు. 2013 నవంబర్ 19న నగరంలోని జేసీ రోడ్ ప్రాంతంలో ఉన్న కార్పొరేషన్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేయడానికి వెళ్లిన కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్శంకర్పై ఆగంతకుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఏటీఎంలో దాడి ఘటన అక్కడి సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో రికార్డు కావడంతో, ఈ ఘటన అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఐదు రాష్ట్రాల్లో నిఘా.... ఉద్యోగి జ్యోతి ఉదయ్శంకర్ పై పట్టపగలే ఏటీఎంలో జరిగిన దాడి ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడంతో నిందితుడిని పట్టుకునేందుకు నగర పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం నాలుగు వందల మంది పోలీసులతో 15 ప్రత్యేక పోలీసు ృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఏటీఎంలోని సీసీ టీవీ ఫుటేజ్లలో రికార్డ్ అయిన నిందితుడిని ఫొటోలను, ఏటీఎంలో లభించిన నిందితుడి వేలి ముద్రలు తీసుకొని దాదాపు వారం రోజుల పాటు ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. అయినా ఫలితం మాత్రం శూన్యం. ఈ కేసును చేధించేందుకు పడిన శ్రమ, పెట్టిన ఖర్చు మరే కేసులోనూ తాము చూడలేదన్నది పోలీసు శాఖలోని ఉన్నతస్థాయి అధికారుల వ్యాఖ్య. ముగ్గురు కమిషనర్లు వ్యూహ రచన చేసినా..... ఇక జ్యోతి ఉదయ్ శంకర్పై ఏటీఎంలో దాడి జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం ముగ్గురు కమీషనర్లు ఈ కేసుకు సంబంధించి వ్యూహ రచన చేశారు. ఏటీఎంలో దాడి జరిగిన సమయంలో రాఘవేంద్ర ఔరాద్కర్ బెంగళూరు పోలీస్ కమీషనర్గా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ప్రత్యేక పోలీసుృబందాలు ఏర్పాటయ్యాయి. అనంతరం ఎం.ఎన్.రెడ్డి బెంగళూరు పోలీస్ కమీషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఎం.ఎన్.రెడ్డి సైతం ఈ కేసును తాము ఒక సవాల్గా తీసుకున్నామని, నిందితుడిని పట్టుకొని తీరతామని ప్రకటించారు. అయినా ఈ కేసును ఛేదించలేక పోయారు. ఇక ఎం.ఎన్.రెడ్డి అనంతరం ప్రస్తుతం మేఘరిక్ నగర పోలీస్ కమీషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండడం శోచనీయం. ముఖం మార్చుకుని ఉండవచ్చా? ఇక జ్యోతి ఉదయ్శంకర్పై దాడి అనంతరం నిందితుడి ఫొటోలు అన్ని మాధ్యమాల్లోనూ విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో తనను సులువుగా గుర్తించేందుకు వీలుందని గ్రహించిన నిందితుడు తన ముఖాన్ని మార్చుకొని ఉండవచ్చనే దిశగా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ఈ దాడి అనంతరం అతను మరే నేరానికి కూడా పాల్పడలేదని, అందువల్లే అతన్ని పట్టుకోవడం కష్టతరమైందని కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏటీఎంలో దాడి తర్వాత లభించిన నిందితుడి వేలి ముద్రలను నగర పోలీసులు అన్ని రాష్ట్రాలకు పంపించారు. అయితే ఈ ఘటన అనంతరం మరే నేర సంఘటనలోనూ నిందితుడి వేలి ముద్రలతో సరిపోలే వేలి ముద్రలు లభించలేదని, అందువల్లే అతని ఆచూకీని కనుక్కోవడం కష్టతరమవుతోందనేది పోలీసు అధికారుల వాదన. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల్లోని పోలీసులను అలర్ట్ చేస్తూనే ఉన్నామని, అందువల్ల అతన్ని కచ్చితంగా పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
ఏటీఎం దాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
బెంగళూరు : బెంగళూరు ఏటీఎం దాడి కేసులో మరో అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని తుంకూరులో అనుమానితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గత నెల19న బెంగళూరు ఏటీఎం కేంద్రంలో కార్పోరేషన్ బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్పై హత్యాయత్నం చేసిన ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు తలమునకలై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక జాయింట్ ఆపరేషన్గా చేపట్టిన ఈ వేటలో 200మంది ఏపీ, 200 కర్ణాటక పోలీసులు ఉన్నారు. ఓ నిందితుడి వేటలో నాలుగు వందలమందిని నియమించటం ఇది రెండవసారి. గతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకునేందుకు అప్పటి తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు జాయింట్ ఆపరేషన్ను నిర్వహించాయి. ఇందులో రెండు రాష్ట్రాలకు చెందిన 500 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాని తర్వాత అదే స్థాయిలో జాయింట్ ఆపరేషన్ ఇదేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. -
పోలీసుల అదుపులో బెంగళూరు ఏటీఎం నిందితుడు
కర్ణాటక రాజదాని బెంగళూరులోని ఏటీఎం కేంద్రంలో సుమారు పది రోజుల కిందట పట్టపగలే ఓ మహిళపై దారుణంగా దాడికి పాల్పడిన అగంతకుడిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం బ్యాంక్ ఉద్యోగిపై ఏటీఎంలో విచాక్షనాత్మకంగా దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నిందితుణ్ణి పట్టిచ్చిన వారికి ప్రకటించిన నజరానాను ఇటీవల రూ.లక్ష నుంచి 3 లక్షలకు పెంచారు. ఇప్పటికే కర్ణాటక ప్రకటించిన నజరానా రూ. లక్షతోపాటు అనంతపురం పోలీసుల తరఫున మరో రూ.2 లక్షలు బహుమతి ఇస్తామని చిత్తూరు, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ బుధవారం రాత్రి అనంతపురంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దాడి సంఘటన తర్వాత నిందితుడిని పట్టుకోవడానికి కర్ణాటక పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి నిందితుడి కోసం గాలింపును ముమ్మరం చేశారు. గాలింపు చర్యల్లో భాగంగానే అనంతపురం జిల్లాలోని రాంనగర్ లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement