-
కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి దుర్మార్గం
సీఎల్పీ నేత జానారెడ్డి ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిపక్షనేతల అభిప్రాయం చెప్పకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకుని దాడులకు దిగడం దుర్మార్గమని కాంగ్రెస్ శాసనసభాపక్షనేత కె.జానారెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన శాసన మండలి విపక్షనేత షబ్బీర్ అలీతో కలసి విలేక రులతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు కలసి దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నామన్నారు. ప్రాజెక్టులు నిర్మిం చాలా, వద్దా అని అధికారులు ప్రశ్న అడగడమే సరైందికాదని జానారెడ్డి అన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని ఎవరు అంటారు అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాలని, భూము లు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు కట్టొద్దనేది కాంగ్రెస్ పార్టీ అభిమతం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డుపడుతోందని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం భావ్యంకాదన్నారు. భూముల సమగ్ర సర్వే విధివిధానాలను బయటపెడితే సమాచారం తెలుస్తుందన్నారు. భూ సమగ్ర సర్వేపై తాము కూడా నిర్మాణా త్మక సూచనలు చేస్తామన్నారు. భూముల సర్వేను శాస్త్రీయంగా నిర్వహిస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని జానారెడ్డి అన్నారు. పోలీసులకు బుద్ధి రాలేదు: షబ్బీర్ అలీ నేరెళ్ల సంఘటనతోనూ పోలీసులకు బుద్ధి రాలేదని, వ్యవస్థను కాపాడాల్సిన పోలీసులే చెడగొడుతున్నారని శాసనమండలి విపక్ష నాయకుడు షబ్బీర్ అలీ విమర్శించారు. పోలీసులను వాడుకుని ప్రజావ్యతిరేక నిర్ణయా లను అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్ని స్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణకు పోలీసు లను మోహరించి, ప్రజలను భయభ్రాం తులకు గురిచేస్తున్నదన్నారు. అనుభవరాహి త్యం, మొండితనంతో కేసీఆర్ పాలనకు ఎదు రుదెబ్బలు తగులుతున్నాయన్నారు. భూముల సర్వేను శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు. ఇప్పుడు సంతోషంగానే ఉన్నా ఇప్పుడున్న పదవితో సంతోషం గానే ఉన్నానని సీఎల్పీనేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. గురు వారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ ఏమోకానీ... బతికే తెలంగాణ ఉంటే చాలునని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే చెప్పానన్నారు. కాగా, పీసీసీ చీఫ్ పదవికోసం ఏనాడూ ప్రయత్నించలేదని, ఇప్పుడూ ప్రయత్నించడంలేదని అన్నారు. ‘సీఎల్పీ నేతగా ఉండి చేయలేనిది పీసీసీ అధ్యక్షుడిని అయ్యి ఏంచేస్తా ?’ అని ప్రశ్నించారు. అందరి అభిప్రా యంతోనే పీసీసీ పనిచేస్తుందన్నారు. ఏ పార్టీలో అయినా కొంతమంది నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉం టాయన్నారు. ఇప్పటిదాకా అధిష్టా నాన్ని ఏ పదవీ అడగలేదన్నారు. అధిష్టానం ఏ బాధ్యతలను అప్పగిం చినా నిర్వహిస్తూ వచ్చానని జానారెడ్డి పేర్కొన్నారు. -
ఉద్రిక్తం..
భువనగిరిటౌన్, న్యూస్లైన్ : కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి చేసిన సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్రెడ్డితో పాటు మరి కొందరిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఎంపీ రాజగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట సుమారు గంటకుపైగా ధర్నా నిర్వహించారు. కేసునమోదు చేసి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాలపై కేసు నమోదు కులం పేరుతో దూషించడంతో పాటు హత్యాయత్నం చేశారని ఎంపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దామోదర్రెడ్డి, చింతల వెంకటేశ్వర్రెడ్డిపై కేసునమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అలాగే తమను కులం పేరుతో దూషించారని దామోదర్రెడ్డి వర్గీయులు ఎంపీ రాజగోపాల్రెడ్డి, సతీష్లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దామోదర్రెడ్డి హత్యారాజకీయాలు ఇకసాగవు భువనగిరి, న్యూస్లైన్: జిల్లాలో సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్రెడ్డి హత్యారాజకీయాలు ఇక సాగబోవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు. సోమవారం స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలో 30 ఏళ్లుగా హత్యారాజకీయాలకు పాల్పడుతున్న దామోదర్రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో సూర్యాపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై స్వయంగా దాడి చేసిన దామోదర్రెడ్డి.. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలను జిల్లాలో నడుపుతున్నారని ఆరోపించారు. తమసోదరుల జోలికి వచ్చిన ఆర్డీఆర్ను సొంత జిల్లా అయిన ఖమ్మంకు పంపించడం ఖాయమన్నారు. ‘‘నీ హత్యా రాజకీ యాలకు ఇక్కడ ఎవరూ బయపడరని.. జిల్లా ప్రజలకు నీవు ఏం చేశావని నీకొడుకును ఎంపీ చేయాలని అనుకుంటున్నావు’’ అని దామోదర్రెడ్డిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. సిట్టింగ్ ఎంపీగా తాను ఉన్నప్పటికీ ఆర్డీఆర్ తన కొడుకును పోటీలో దింపడానికి టికెట్ కోరడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని చోట్ల మంచి పేరున్న నూతన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కోరానన్నారు. ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలో రెండుసార్లు ఓడిపోయిన చింతల వెంక టేశ్వర్రెడ్డికి మరో మారు టికెట్ ఇవ్వొద్దని ఏఐసీసీ దూతను కోరినట్లు చెప్పారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కోమటిరెడ్డి సోదరులను ప్రజలు గుర్తించారన్నారు. తెలంగాణ కోసం చనిపోయిన విద్యార్థుల శవాలపై ప్రమాణం చేసిన ఆర్డీఆర్.. ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మంత్రి పదవికోసం సీఎం పంచన చేరారని ఆరోపించారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, బర్రె జహంగీర్, భాస్కర్, చంద్రకళ ఉన్నారు. ఆర్డీఆర్ను వెంటనే అరెస్టు చేయాలి నల్లగొండ టౌన్, న్యూస్లైన్: భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో పాటు దళిత యువకులపై దాడులకు పాల్పడిన సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్డీఆర్పై అట్రాసిటీ కేసునమోదు చేసి అరెస్టు చేయకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. దామోదర్రెడ్డి స్వయంగా రౌడీలతో వెళ్లి రాజగోపాల్రెడ్డిపై దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన ఆర్డీఆర్ను జిల్లా ప్రజలు ఆదరించిన విషయాన్ని మరచి హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారని ఘాటుగా విమర్శించారు. గతంలో తనపై కూడా దాడి చేశారని ఆరోపించారు. కిరాయి హత్యలు చేయించే స్వభావం ఉన్న ఆర్డీఆర్.. రాజగోపాల్రెడ్డిపై కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానంతోనే ప్రయివేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయించామన్నారు. తాము తలుచుకుంటే నార్కట్పల్లి మీదుగా సూర్యాపేటకు కూడా వెళ్లలేవని సవాల్ చేశారు. దామోదర్రెడ్డిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దామోదర్రెడ్డి చర్యలకు జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రోత్సాహం ఉందని, వెంటనే మంత్రి తన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గుమ్ముల మోహన్రెడ్డి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement