-
గురుగ్రామ్పై మిడతల దండు దాడి
గురుగ్రామ్/న్యూఢిల్లీ: దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాపించిన రాకాసిమిడతల గుంపులు ఢిల్లీ–గురుగ్రామ్ సరిహద్దు దాకా చేరాయి. ఢిల్లీలోకి ఇంకా ప్రవేశించలేదని అధికారులు చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు వైపు పయనమైన మిడతల దండు శనివారం ఉదయం 11.30 గంటలకు గురుగ్రామ్లోకి ప్రవేశించిందని హరియాణా వ్యవసాయ శాఖలో మిడతల హెచ్చరిక విభాగం అధికారి కేఎల్ గుర్జార్ తెలిపారు. ప్రస్తుతం హరియాణాలోని పాల్వాల్ వైపు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. పంటలను భోంచేసే ఈ మిడతలు ఈ ఏడాది మే నెలలో ఆఫ్రికా ఎడారుల నుంచి భారత్లోకి అడుగుపెట్టాయి. తొలుత రాజస్తాన్లో, తర్వాత పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో విధ్వంసం సృష్టించాయి. ఢిల్లీలో హై అలర్ట్ మిడతల దండు ఢిల్లీ సరిహద్దు దాకా రావడంతో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాల్లో శనివారం హైఅలర్ట్ ప్రకటించింది. మిడతలు దండెత్తకుండా చెట్లపై రసాయనాలు, పురుగు మందులు చల్లాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వేప ఆకులను మండిస్తే పొగకు మిడతలు పారిపోతాయని వెల్లడించింది. -
ఢిల్లీలో మణిపూర్ యువకుడికి కత్తిపోట్లు, దోపిడీ
దేశ రాజధాని నగరంలో ఈశాన్య ప్రాంతాల వారిపై దాడులు ఆగడంలేదు. మంగళవారం నాడు మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడిని పొడిచి, అతడిని దోచుకున్నారు. అయితే, పోలీసులు మాత్రం ఇది జాత్యహంకార దాడి కాదని అంటున్నారు. ఖుప్సియాంగెన్ (22) అనే యువకుడు మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మెహరౌలిలోని ఓ చర్చికి వెళ్లి అక్కడినుంచి పర్యావరణ్ కాంప్లెక్సులోని తన ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉన్నాడనగా అతడిపై ఈ దాడి జరిగింది. కేవలం అతడిని దోచుకోడానికే ఈ దాడి చేశారని డీసీపీ బీఎస్ జైస్వాల్ తెలిపారు. గడిచిన 15 రోజుల్లో ఈశాన్య ప్రాంతాల వారిపై దాడి జరగడం ఇది మూడోసారి. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన నిడో తానియా అనే యువకుడిపై దాడి జరగడంతో అతడు జనవరి 30న మరణించాడు. ఆదివారం నాడు మణిపూర్కు చెందిన ఇద్దరు యువకులను కొందరు మోటార్ సైకిళ్లపై వచ్చి కొట్టారు. మంగళవారం నాటి సంఘటనలో ఖుప్సియాంగెన్ వద్ద నుంచి అతడి మొబైల్ ఫోన్, పర్సును ఐదుగురు వ్యక్తులు కత్తులు చూపించి దోచుకున్నారు. అతడి కడుపులో సెంటీమీటరు లోతులో కత్తిపోట్లు ఉన్నాయని డీసీపీ చెప్పారు. అతడిని సాకేత్ సిటీ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. నాలుగేళ్లుగా ఢిల్లీలో ఓ స్నేహితుడితో కలిసి ఉంటున్న ఆ యువకుడు అనాథ అని, ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాడని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement