-
ఆ వ్యాధితో...అపుడసలు బుర్ర పని చేయలేదు : స్టార్ హీరోయిన్
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి పరిచయం అవసరం లేదు. కేవలం నటనతోనేకాకుండా బోల్డ్ స్టేట్మెంట్లు, జిమ్లో కసరత్తులు చేస్తూ అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇంత ఫిట్గా ఉన్న ఈ అమ్మడు కూడి ఇటీవల గుండెజబ్బు బారిన పడింది. తనకు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాలను ఇటీవల ఒక ఇంటర్య్వూలో వెల్లడించారు. మార్చి 2023లో, ఆమెకు గుండెపోటు రావడంతో స్టెంట్ అమర్చాల్సి వచ్చింది. కానీ కొద్ది రోజుల్లోనే మంచి వ్యాయాయంతో తిరిగి ఫిట్ నెస్ను సాధించింది. అప్పటినుంచి వివిధ ఇంటర్వ్యూలలో తన ఆరోగ్య పరిస్థితి గురించి నిస్సంకోచంగా వెల్లడిస్తూ వస్తోంది. సుస్మిత చివరిగా వెబ్ సిరీస్ ఆర్య సీజన్ 3లో కనిపించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తల్లిదండ్రులిద్దరూ హార్ట్ పేషెంట్లని అందుకే తాను కూడా అప్రత్తమంగా ఉండేదాన్ని చెప్పుకొచ్చింది. గుండెపోటు తర్వాత తాను ఆపరేషన్ థియేటర్లో నవ్వుతున్నానని సుస్మిత వెల్లడించింది. అలాగే దీని తర్వాత తన ఆమె జీవనశైలిలో వచ్చిన మార్పుల గురించి కూడా వెల్లడించింది. తాను చాలా హ్యాపీ గోయింగ్ మనిషిని అని తెలిపింది. అలాగే తన ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి కూడా సుస్మితా సేన్ ఓపెన్ అయింది. తన జీవితంలో పెద్ద సమస్య అని, ఆ సమయంలో తన మెదడు మొద్దు బారి పోయిందనీ, ఇప్పటికీ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకోలేకపోతున్నానని పేర్కొంది 2014లోనే సుస్మిత ఆడిసన్స్ వ్యాధిబారిన పడిందట. ఆటో ఇమ్యున్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే డిప్రెషన్కు లోనైంది. కార్టిసోల్ వంటి స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ లతో బాధపడ్డానని కూడా తెలిపింది సుస్మిత. ప్రస్తుత కఠోర సాధనతో సాధారణ స్థితికి వచ్చానని కూడా తెలిపింది. -
మహిళల్లో అధికంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్
కర్నూలు(హాస్పిటల్): వ్యాధికారక క్రిములతో పోరాడే శత్రువులుగా మారి వ్యాధికి గురిచేసే ఆటో ఇమ్యూన్ డిసీజ్ మహిళల్లో అధికంగా వస్తున్నాయని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బి. ఉదయ్కుమార్ చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజిలోని క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో ఆదివారం పలురకాల ఆటో ఇమ్యూన్ డిసీజ్లపై జోనల్ స్థాయి వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సును కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం డాక్టర్ ఉదయ్కుమార్ మాట్లాడుతూ సిస్టమిక్ లోపస్ ఎరిటమోసిస్ అని పిలవబడే చర్మ సంబంధ ఆటో ఇమ్యూన్ డిసీజ్ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణం తీసే ప్రమాదం ఉందన్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్లు చర్మం, కీళ్లు, కిడ్నీ, గుండె, మెదడు, కాలేయానికి వస్తాయన్నారు. వైద్యుల సూచన మేరకు మందులు తీసుకుంటే ఇతర అవయవాలకు ఈ వ్యాధి పాకకుండా చూసుకోవచ్చన్నారు. అనంతరం పలు రకాల చర్మవ్యాధులపై చర్మవ్యాధినిపుణులు డాక్టర్ మస్తాన్ సాహెబ్, డాక్టర్ గౌతమిశ్రీ, డాక్టర్ పి. విజయలక్ష్మి, డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి, డాక్టర్ అరుణకుమారి ప్రసంగించారు. కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు డాక్టర్ చంద్రన్న, మెడికల్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం!
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
- ‘సత్య’ మూవీ రివ్యూ
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- 'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement