-
జీన్ ఎడిటింగ్తో జననం.. వినాశనం తప్పదు!
హాంగ్కాంగ్: చైనాలోని షెంజెన్కు చెందిన పరిశోధకుడు హే జియాంకుయ్ సంచలన ప్రకటన చేశారు. తాను మానవ పిండాల్లో జీన్ ఎడిటింగ్ చేపట్టాననీ, తద్వారా ఈ నెలలో ఇద్దరు చిన్నారులు జన్మించారని బాంబు పేల్చారు. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త డా.మైకెల్ డీమ్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా మనుషుల డీఎన్ఏలోని వ్యాధికారక జన్యువులను తొలగించి, ఆరోగ్యకరమైన జన్యవులను చేర్చుకోవచ్చు. తద్వారా భవిష్యత్ తరాలకు అస్సలు ఎలాంటి వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. అంతేకాదు.. తమ కుమారుడు లేదా కుమార్తె జుట్టు రంగు, ఎత్తు, శరీర ఛాయ, ఎలా ఉండాలో పిండం దశలోనే నిర్ణయించవచ్చు. అయితే ఈ ప్రక్రియను ఎవరైనా దుర్వినియోగం చేసి రోగాలు, అలసట, ముసలితనం, చావు అంటూలేని శక్తిమంతమైన మనుషులను తయారుచేస్తే మానవజాతి మొత్తం అంతరించిపోతుందన్న భయంతో అమెరికా, చైనా సహా పలు ప్రపంచదేశాలు జీన్ ఎడిటింగ్ను నిషేధించాయి. అయితే చైనాలో పిండాల్లో జీన్ ఎడిటింగ్ చేయడంపై ఎలాంటి నిషేధం లేదు. హెచ్ఐవీ దంపతుల ఎంపిక తాజాగా ఈ విషయమై జియాంకుయ్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం కోసం హెచ్ఐవీ/ఎయిడ్స్ సోకిన దంపతులను ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఫలదీకరణం తర్వాత మూడు నుంచి 5 రోజుల వయసున్న పిండాలను ఎడిట్ చేసి ఎయిడ్స్ సోకేందుకు కారణమయ్యే సీసీఆర్5 అనే ప్రొటీన్ను పిండాల నుంచి తొలగించామని వెల్లడించారు. ఈ ప్రక్రియను ముందుగా ఎలుకలు, కోతులపై పరీక్షించాకే మనుషుల్లో చేపట్టామన్నారు. పుట్టిన ఇద్దరు బాలికల్లో ఒకరిలో మార్పిడి చేసిన రెండు జన్యువులు ఉండగా, మరో చిన్నారిలో ఒకే జన్యువు ఉందన్నారు. హాంకాంగ్లో మంగళవారం జీన్ ఎడిటింగ్ సదస్సు నేపథ్యంలో జియాంకుయ్ చేసిన ఈ ప్రకటన ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ప్రయోగం మానవాళికి వినాశకరంగా మారుతుందనీ, సమాజంలో నైతిక విలువలు పడిపోతాయని చాలామంది శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యాధి నిరోధక లక్షణాలు భవిష్యత్ తరాలకు వారసత్వంగా సంక్రమిస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా, మరికొందరు ఈ మొత్తం ప్రక్రియపైనే సందేహాలు వ్యక్తం చేశారు. -
నాలుగు కాళ్లతో శిశువు జననం
మార్కాపురం టౌన్: ప్రకాశం జిల్లా మార్కాపురంలో నాలుగు కాళ్ల మగశిశువు జన్మించాడు. పట్టణానికి చెందిన శిరీషకు శనివారం స్థానిక చైత్ర నర్సింగ్ హోంలో కాన్పు చేశారు. ఆమెకు నాలుగు కాళ్లతో మలద్వారం మూసుకుపోయిన శిశువు జన్మించాడు. ఇది అరుదైనదని, 35 వేలమందిలో ఒకరికి ఇలా జరుగుతుందని చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ రవీంద్రారెడ్డి తెలిపారు. దీన్ని సాక్రోకాక్సిజియల్ కెరటోమ్ అంటారన్నారు. శస్త్రచికిత్స ద్వారా మలద్వారాన్ని పునరుద్ధరించవచ్చని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం శిశువును గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement