-
మొండిబకాయిలు.. 10 లక్షల కోట్లు దాటిపోతాయ్!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిలు స్థూలంగా (జీఎన్పీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే నాటికి రూ. 10 లక్షల కోట్లు దాటిపోతాయని ఇండస్ట్రీ బాడీ అసోచామ్, రేటింగ్స్ సంస్థ– క్రిసిల్ తన అధ్యయనంలో పేర్కొన్నాయి. రిటైల్తో పాటు, సూక్ష్మ లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుంచి మొండిబకాయిలు పెరిగే అవకాశం ఉందని అధ్యయన నివేదిక పేర్కొనడం కొంత ఆందోళన కలిగించే అంశం. ‘రీఎన్ఫోర్సింగ్ ది కోడ్’ శీర్షికన ఆవిష్కరించిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ►మార్చి 2022 నాటికి ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 8.5 శాతం నుంచి 9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. దీనికితోడు పునర్వ్యవస్థీకరించిన కొన్ని అకౌంట్ల నుంచి సైతం ‘డిఫాల్ట్’లు చోటుచేసుకునే అవకాశం ఉంది. ►గత కొన్నేళ్ల క్రితం చోటుచేసుకున్న మొండిబకాయిల అకౌంట్లతో పోల్చితే ప్రస్తుత ధోరణి భిన్నంగా ఉంది. గతంలో ఎన్పీఏలు బడా కార్పొరేట్లకు చెందినవి అవి ఉండేవి. ఇప్పుడు ఎంఎస్ఎంఈ, రిటైల్ రంగాల్లో ఎన్పీఏలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడా కార్పొరేట్లకన్నా ఈ విభాగాల్లో ఎన్పీఏ సమస్యలు తీవ్రంగా ఉండవచ్చు. బడా కంపెనీల బ్యాలెన్స్షీట్స్ పటిష్ట మయ్యాయి. ►పెరగనున్న ఎన్పీఏ సమస్యలు దివాలా కోడ్ (ఐబీసీ) పటిష్టత, సామర్థ్యాలను పరీక్షకు నిలపనున్నాయి. మహమ్మారి సవాళ్ల నుంచి గట్టెక్కించడానికి ప్రకటించిన పలు విధానపరమైన చర్యలు వెనక్కు తీసుకునే అవకాశాలు ఉండడంతో కంపెనీలు దివాలా సమస్యలు కూడా తీవ్రం కానున్నాయి. ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్తో పాటు, నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల స్థూల ఎన్పీఏలు కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ►బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2021–22లో పెరిగినప్పటికీ, 2018 మార్చి నాటి తీవ్రత ఉండకపోవచ్చు. ప్రభుత్వ నుంచి అందుతున్న పలు సహాయక చర్యలు దీనికి కారణం. ఆరు నెలల రుణ మారటోరియం, అత్యవసర రుణ హామీ పథకం, రుణ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. ►భారత్ బ్యాంకుల్లో ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రిస్క్ను తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఇప్పుడు ఎంతో మెరుగుపడింది. ►గతంలో నిబంధనలు రుణదాతలకు అనుకూలంగా ఉండేవికావు. ఇది ప్రమోటర్లు ఉద్దేశపూర్వక మోసాలకు పాల్పడ్డానికి ఇవి దోహదం చేసేవి. దీనివల్లే అధిక సంఖ్యలో ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారులు తయారయ్యారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను కఠినతరం చేసింది. రిజల్యూషన్ ప్రణాళికలతో పాటు, ఐబీసీ ఫ్రేమ్వర్క్ ఎన్పీఏలను సమర్థవంతంగా రికవరీ చేసుకోడానికి దోహదపడుతోంది. -
హెచ్డీఎఫ్సీ క్యూ4 ఫలితాలు, డివిడెండ్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాలుగవ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఫలితాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ బ్యాడ్ లోన్ బెడద మాత్రం వెన్నాడుతోంది. క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 18.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. రూ. 3,990 కోట్లను నికార లాభాలను పోస్ట్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 21,560 కోట్లుగా ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 18,862 కోట్ల రూపాయలను రిపోర్ట్ చేసింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 21.5 శాతం పెరిగి రూ. 9,055 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.1 శాతం నుంచి 4.3 శాతానికి బలపడ్డాయి. ఇతర ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 3446 కోట్లను అధిగమించగా.. నిర్వహణ లాభం(ఇబిటా) 27 శాతం జంప్చేసి రూ. 7,279 కోట్లయ్యింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి బ్యాంకు మొత్తం స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పిఏ) 1.05 శాతం పెరగ్గా, 2015-15 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 0.94 శాతం గా ఉన్నాయి. రుణాలు రూ. 1,261 కోట్లుగా ఉన్నాయని , 2015-16 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో రూ.662 కోట్లగా బ్యాంకు బిఎస్ఇ ఫైలింగ్ లో తెలిపింది.ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కౌంటర్ 2.4శాతానికిపైగా లాభపడింది. మరోవైపు గత ఐదు సంవత్సరాలుగా మంచి డివిడెండ్ ట్రాక్ రికార్డు ఉన్న బ్యాంకు మరోసారి వాటాదారులకు డివిడెండ్ ప్రకటించింది. షేరుకి రూ. 11 చొప్పున డివిడెండ్ చెల్లించనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. గత ఏడాది ప్రతి ఈక్విటీ షేరుకి రూ.9.5 లు అందించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
Advertisement