-
Hyd: బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి ప్లేయర్ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడో వ్యక్తి. లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో ఈ ఘటన జరిగింది. మృతుడు మల్కాజిగిరికి చెందిన పరమేశ్ యాదవ్ అని పోలీసులు తెలిపారు. కాగా ప్రైవేట్ ఉద్యోగి పరమేష్ యాదవ్ (39) ప్రతిరోజు బ్యాడ్మింటన్ ఆడటానికి లాలాపేటలోని ప్రొ.జయశంకర్ ఇండోర్ స్టేడియానికి వస్తుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అపస్మారకస్థితికి చేరిన అతడినిఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. గుండెపోటుతో పరమేశ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని స్థానిక పోలీసులు తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో కార్డియాక్ అరెస్టులు, గుండెపోటుతో హఠాన్మరణాలు సంభవించడం చూస్తూనే ఉన్నాం. ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోందని నిపుణులు అంటున్నారు. కార్డియాక్ అరెస్టు అయినపుడు సరైన సమయంలో సీపీఆర్ చేయడం ద్వారా బాధితులను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. చదవండి: హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టుల కాలం ఇది! ఆగిపోయే గుండె మీది కాకూడదంటే.. -
షటిలర్స్.. షహర్
చార్మినార్.. గోల్కొండ.. బిర్లామందిర్.. హైటెక్ సిటీ.. ఇలా హైదరాబాద్కీ షాన్గా నిలిచే జాబితాలోకి షటిల్ను కూడా చేర్చాలేమో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ బ్యాడ్మింటన్ జరిగినా.. మన సిటీ రాకెట్లు రివ్వున దూసుకుపోతున్నాయి. సైనా మొదలు సాయిదత్ వరకు విజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో నలుగురు హైదరాబాదీలు పతకాలు సాధించడం విశేషం. స్వర్ణ, రజత, కాంస్యాలతో మన షటిల్ ఎక్స్ప్రెస్ దూసుకుపోయింది. వీరంతా ఇక్కడే ఆటలో ఓనమాలు నేర్చుకొని ఇంతింతై... వటుడింతై అన్నట్లు ఎదిగారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంతో వారికున్న అనుబంధాన్ని ఆ నలుగురు పంచుకున్నారు. ఫ్రమ్ హైదరాబాద్ ‘నేను హైదరాబాదీని అని చెప్పుకోవడంలోనే నాకు గర్వంగా అనిపిస్తుంది. టోర్నీల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా కేవలం ఇండియాతో సరి పెట్టకుండా ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పుకుంటాను. బయటి వాళ్లలో కూడా చాలా మందికి మన సిటీ గురించి బాగా తెలుసు. ఇక్కడి ప్రతీ చోటు ఇష్టమే. చార్మినార్ వంటి చారిత్రక ప్రాంతాల నుంచి కొత్త తరం మాల్స్ వరకు ఎక్కడైనా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఎల్బీ స్టేడియంలో శిక్షణ నుంచి ఏ స్థాయికి చేరుకున్నా అన్నీ హైదరాబాద్తోనే ముడిపడి ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా మన సిటీ మరో మెగా ఈవెంట్కు వేదిక అవుతుందని నమ్ముతున్నా. నేను అందులో భాగం కావాలని కోరుకుంటున్నా. బిర్యానీ భలే రుచి ‘నేను పుట్టి పెరిగింది ఇక్కడే.. హైదరాబాద్ తప్ప మరో సిటీ గురించి ఊహించలేను. ఇతర నగరాలతో దీనిని పోల్చడం కూడా సరైంది కాదు. సికింద్రాబాద్లోని ఆగ్జిలియం స్కూల్లో, ఆ తర్వాత మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీలో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్పై దృష్టి పెట్టాను కాబట్టి ఫ్రెండ్స్తో తిరగడంవంటి సరదాలు తక్కువే. ఎక్కడికి వెళ్లినా అమ్మా నాన్నలతోనే. మన హైదరాబాదీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ బిర్యానీ టేస్ట్కు పడి చస్తాను. అందుకే నా ఫేవరేట్ ఫుడ్ పాయింట్ అంటే ప్యారడైజ్ హోటలే. అక్కడ లభించే అన్ని వెరైటీలను టేస్ట్ చేస్తాను. భవిష్యత్తులోనూ హైదరాబాద్కు గర్వకారణంగా నిలుస్తాను. ఈజీ గోయింగ్ సిటీ హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో మూడేళ్లు బెంగళూరు వెళ్లడం మినహా అంతా ఇక్కడే ఉన్నాను. బహుశా నగరంతో అనుబంధం పెరిగిపోవడం వల్లే తొందరగా వెనక్కి వచ్చేశానేమో! ఆల్ సెయింట్స్ హైస్కూల్, రత్న జూనియర్ కాలేజి, సెయింట్ ఫ్రాన్సిస్ (బర్కత్పురా)లలో నా చదువు సాగింది. ఈ సిటీ గురించి సరిగ్గా చెప్పాలంటే కంఫర్ట్.. ఈజీ గోయింగ్.. ఈజిలీ రీచబుల్. ఎల్బీ స్టేడియంలో తొలిసారి రాకెట్ పట్టుకొని ఫుల్ వైట్డ్రెస్లో అడుగు పెట్టిన రోజు నాకు ఇంకా గుర్తుంది. నాటినుంచి ఇప్పటి వరకు నేనేం సాధించినా హైదరాబాదీగానే. మొదట్లో మేం బషీర్బాగ్, ఆ తర్వాత అత్తాపూర్లో ఉండేవాళ్లం. ఇప్పుడు అకాడమీకి దగ్గరగా గచ్చిబౌలికి మారాం. సిటీ బస్సుల్లో వేలాడుతూ గ్రౌండ్కు చేరిన రోజులు ఉన్నాయి. కానీ దానినీ ఎంజాయ్ చేశాను. సిటీ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో దాదాపు ప్రతీ హోటల్లో వెరైటీ ఐటమ్స్ ప్రయత్నించాను. హైదరాబాద్ స్పోర్ట్స్ సిటీగా మరింత పేరు తెచ్చుకోవాలని నా కోరిక. మధుర జ్ఞాపకం చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఎంజాయ్ చేసినంత నేను ఎక్కడా ఎంజాయ్ చేయలేను. టోర్నీల కోసం బయటి నగరాలకు వెళ్లడం తప్పదు. ఆల్ సెయింట్స్ హైస్కూల్, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాను. అజహర్లాంటి క్రికెటర్లు చదివిన స్కూల్లోనే చేరగానే నాలో అనుకోకుండానే క్రీడాకారుడి ఆలోచనలు వచ్చాయేమో! సిటీలో నాకు బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు. నా కజిన్స్తోనే అన్ని సరదాలు. వారాంతంలో జీవీకే మాల్, ఇనార్బిట్ మాల్లోనే ఎక్కువగా ఉంటాను. నాకున్న డైట్ పరిమితుల వల్ల బిర్యానీ ఎక్కువగా తినలేను కానీ.. బషీర్బాగ్ కేఫ్ బహార్ నా ఫేవరేట్ ఫుడ్ జాయింట్. ఎలాంటి నాన్ వెజ్ అయినా ఎక్కువగా అక్కడి నుంచి తెప్పించుకుంటా. ఇక రంజాన్ నెలలో బహార్ హలీమ్ ఒక్క రోజూ మిస్ కాను. మొదటి నుంచి కొత్తపేట సమీపంలోని అష్టలక్ష్మి టెంపుల్ దగ్గరే ఉంటున్నాం. సిటీ ఎంత మారినా ప్రతీది మధుర జ్ఞాపకమే. - మొహమ్మద్ అబ్దుల్ హాదీ -
కోచ్లకు ‘కోచింగ్’
తణుకు, న్యూస్లైన్: నైపుణ్యం గల కోచ్లు అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో ఏ క్రీడలోనైనా మంచి ఫలితాలు వస్తాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన దేశంలో కోచ్ల కొరత ఉన్నందున శిక్షణ ద్వారా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోచ్ల శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 300 బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులో ఉన్నా నైపుణ్యం కలిగిన కోచ్లు 50కి మించి లేరని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్లో రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లే అద్భుతంగా రాణిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల కోచ్లకు ఈ ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో ఈ తరహాలో కోచింగ్ ఇవ్వడం దేశంలో ఇదే మొదటి సారి కావడం విశేషం. గతంలో చీరాలలో రెండు సార్లు శిబిరాలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ అనంతరం ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో పురస్కారాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి కేసీ పున్నయ్యచౌదరి కూడా పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement