-
ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు ఉన్నత పదవులు
నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): ఉమ్మడి నిజామా బాద్లో ఎల్లారెడ్డి అ సెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలు పొందిన ఎమ్మెల్యేల్లో చాలా మంది ఉన్నత పదవులు నిర్వర్తించారు. 1962లో ఏర్పడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం మొదట కామారెడ్డితో కలిసి ఉమ్మడి నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు ఈ స్థానం ఎస్సీకి రిజర్వు చేయబడింది. 1962లో మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి టి.ఎన్.సదాలక్ష్మి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి పోటీచేసి గెలుపొందిన టి.ఎన్.సదాలక్ష్మి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం 1967, 1972లలో జరిగిన వరుస ఎన్నికల్లో ప్రస్తుత మాజీమంత్రి గీతారెడ్డి తల్లి జెట్టి ఈశ్వరీబాయి ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1967 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బరిలోకి దిగిన ఈశ్వరీబాయి 1969లో మొదలైన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆ రోజుల్లోనే ఈశ్వరీబాయి సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి(ఎస్టీఎస్) పార్టీని ఆమె స్థాపించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో ఎస్టీఎస్ తరపున ఈశ్వరీబాయి, కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఈశ్వరీబాయి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆనాటి రాష్ట్రశాసనసభ ప్రతిపక్ష నాయకులలో ప్రముఖ నాయకులైన తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య, జి.శివయ్యగార్ల వరుసలో ఈశ్వరీబాయి కూర్చునేవారు. 1978లో ఎస్సీ రిజర్వ్డ్ 1978 ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం ఎస్సీ రిజర్వేషన్ నుంచి జనరల్కు మారడంతో నియోజకవర్గ పరిధిలోని లింగంపేట మండలం అయిలాపూర్కు చెందిన తాడూరి బాలాగౌడ్ కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన అప్పటి ముఖ్యమంత్రులు టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి కేబినెట్లలో చక్కెర పరిశ్రమశాఖ మంత్రిగా, రోడ్లుృభవనాలశాఖ మంత్రిగా కొనసాగారు. దీంతోపాటు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అనంతరం బాలాగౌడ్ నిజామాబాద్ పార్లమెంట్స్థానం నుంచి రెండుసార్లు పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగా రు. నేరెళ్ల హ్యాట్రిక్ 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గాంధారి వాస్తవ్యులు నేరేళ్ల ఆం జనేయులు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994, 1999ల లో వరుసగా జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పోటీచేసిన నేరేళ్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి వరుసగా మూ డుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన నేతగా పేరొందారు. వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికైన నేరేళ్ల ఆంజనేయులు 1998లో ప్రభుత్వవిప్గా కొనసాగారు. 2001లో రాష్ట్ర సివిల్ సప్లయ్ చైర్మన్గా పనిచేశారు. 2004లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. ఇ లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్న త పదవులను అధిరోహించి జిల్లాలో ఎల్లారెడ్డి ప్రత్యేకతను చాటారు. -
క్యాంపు రాజకీయాలు..
గంగాధర మండలంలో హంగ్ ఏర్పడింది. మొత్తం 14 స్థానాలకు కాంగ్రెస్ 5 గెలిచింది. బీజేపీ నాలుగు గెలిచింది. టీఆర్ఎస్ మూడు స్థానాలు గెలిచింది. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉంది. ప్రస్తుతం రెండు పార్టీలు క్యాంపు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బూర్గుపల్లి ఎంపీటీసీ బాలాగౌడ్, కురిక్యాల ఎంపీటీసీ నందయ్య ఎంపీపీకోసం ఒకే క్యాంపులో ఉన్నారు. బీజేపీ నుంచి గంగాధర ఎంపీటీసీ పెరుక మల్లారెడ్డి ఇద్దరు స్వతంత్రులతో కలిసి క్యాంపు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ మద్దతు కీలకంగా మారింది. ఎల్కతుర్తి మండలంలో టీఆర్ఎస్కు 5, కాంగ్రెస్కు 5, స్వతంత్ర, టీడీపీ అభ్యర్థులు చెరో స్థానంలో గెలిచారు. స్వతంత్ర, టీడీపీ అభ్యర్థులు టీఆర్ఎస్కు మద్దతివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరోపక్క ఎమ్మెల్యే ఎన్నిక తర్వాత ఏ పార్టీ గెలిస్తే వారికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. చందుర్తి మండలంలో హంగ్ ఏర్పడింది. మొత్తం 12 స్థానాలకు కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్లు ముగ్గురు, బీజేపీ, టీఆర్ఎస్లు రెండు సీట్ల చొప్పున గెలిచాయి. స్వతంత్రులు ముగ్గురు బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒకరిని బీజేపీ మద్దతు కోరుతోంది. మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇల్లంతకుంట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఏడు టీఆర్ఎస్, ఆరు కాంగ్రెస్, రెండు ఇతరులు గెలుచుకోగా అక్కడ హంగ్ ఏర్పడింది. ఇక్కడ టీఆర్ఎస్కు ఒక సీటు అవసరముండగా ఇతరుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అనంతగిరి ఇండిపెండెంట్ అభ్యర్థిని టీఆర్ఎస్ మద్దతు అడుగుతుండగా, రహీంఖాన్పేట, అనంతగిరి స్వతంత్రులిద్దరి మద్దతును కాంగ్రెస్ కోరుతున్నాయి. ఎంపీపీకి అవసరమైన మెజార్టీ కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పావులు కదుపుతూ క్యాంపు రాజకీయాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చిగురుమామిడి మండలంలో 12 స్థానాలున్నాయి. సీపీఐకి4, కాంగ్రెస్కు 4, బీజేపీకి 1, టీఆర్ఎస్కు 2, స్వతంత్రుడొకరు గెలుపొందారు. కాంగ్రెస్, సీపీఐ కలిసి ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు యత్నాలు చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ను కలుపుకునేందుకు సీపీఐ యత్నిస్తున్నది. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డితో సీపీఐ ఎంపీటీసీ అభ్యర్థులు చర్చలు జరిపారు. ముస్తాబాద్ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 4, బీజేపీ 3, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు గెలుపొందారు. ఇందులో టీఆర్ఎస్, ముగ్గురు బీజేపీ అభ్యర్థుల మద్దతు తీసుకుని ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ అభ్యర్థులతో తిరుపతిలో క్యాంపుకెళ్లింది. కోహెడలో 13 స్థానాలున్నాయి. టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5, టీడీపీ 1, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిని తీసుకుని టీఆర్ఎస్ సింగపూర్కు క్యాంపు కెళ్లింది. ఎమ్మెల్యేగా అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి గెలిస్తే.. టీడీపీ అభ్యర్థితోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్కు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. మల్హర్లో హంగ్ ఏర్పడింది. మొత్తం ఏడు స్థానాలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరో మూడుస్థానాలు కైవసం చేసుకున్నాయి. టీడీపీ ఒక చోట గెలిచింది. ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారోనని వేచి చూసి ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు టీడీపీ అభ్యర్థి ఉన్నాడు. ఇబ్రహీంపట్నం మండలంలో ఎంపీటీసీ స్థానాలు మొత్తం 15 ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్కు 6, టీఆర్ఎస్కు 5, బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 3 వచ్చాయి. దీంతో ఎంపీపీ పీఠం విషయంలో హంగ్ పరిస్థితి నెలకొంది. ఇండిపెండెంట్లు, బీజేపీ ఎంపీటీసీల మద్దతు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు మంతనాలు చేస్తున్నారు. కథలాపూర్లో 13 స్థానాలుండగా.. టీఆర్ఎస్, బీజేపీలు చెరో 5 స్థానాలను సమానంగా దక్కించుకున్నాయి. ఇరుపార్టీలూ ఓ ఒప్పందానికి వచ్చాయి. ఎంపీపీ స్థానం కాంగ్రెస్ పార్టీ, ఉపాధ్యక్ష పదవి బీజేపీకి ఖరారైంది. సైదాపూర్ మండలంలో కాంగ్రెస్4, టీఆర్ఎస్ 4, బీజేపీ 3, స్వతంత్రుడు 1 స్థానంలో గెలుపొందగా.. ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ పీఠం బీజేపీకి లేదా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశముంది. ఇక్కడ ఎంపీపీ పీఠం ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. ఇక్కడ బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ఎవరికి మద్దతునిస్తే వారే ఎంపీపీ పీఠం అధిరోహిస్తారు. రామగుండం మండలంలో.. 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీఆర్ఎస్కు 4, కాంగ్రెస్-3, వైఎస్సార్సీపీ, బీజేపీకి చెరో ఒకటి, స్వతంత్రులు ఐదు చోట్ల గెలిచారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులతో క్యాంపు నిర్వహిస్తోంది. వారికి వైఎస్సార్సీపీ, బీజేపీ అభ్యర్థులు, ఇండిపెండెంట్ ఇద్దరు మద్దతు తెలిపి క్యాంపులో చేరారు. కోరుట్ల మండలంలో 12 స్థానాలకు టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపులో ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్నిక తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు తేలనుంది. మెట్పల్లి మండలంలో ఎంపీటీసీ స్థానాలు 10 ఉండగా, కాంగ్రెస్కు 5, టీఆర్ఎస్ 3, బీజేపీ1, ఇండిపెండెంట్ 1 గెలుపొందారు. మేజిక్ ఫిగర్ 6 కాగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఈ మేజిక్ ఫిగర్ కోసం యత్నిస్తున్నాయి. క్యాంపులు లేవు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement