-
బెంగళూరుకు మరో ఓటమి
న్యూఢిల్లీ: స్టార్ ఆటగాళ్లున్నా... ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో బెంగళూరు టాప్గన్స్ జట్టు ఖాతాలో మరో ఓటమి చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు టాప్ గన్స్పై ఢిల్లీ ఏసర్స్ జట్టు విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్లో అజయ్ జయరామ్ (ఢిల్లీ) 15-11, 15-12తో సమీర్ వర్మ (బెంగళూరు)పై గెలిచాడు. దాంతో ఢిల్లీ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ‘ట్రంప్ మ్యాచ్’ పురుషుల డబుల్స్ మ్యాచ్లో కూ కీట్ కీన్-తాన్ బూన్ హింగ్ (ఢిల్లీ) ద్వయం 15-9, 15-10తో హూన్ థిన్ హౌ-ఖిమ్ వా లిమ్ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. దాంతో ఢిల్లీ ఆధిక్యం 3-0కు చేరుకుంది. మూడో మ్యాచ్గా జరిగిన పురుషుల రెండో సింగిల్స్లో రాజీవ్ ఉసెఫ్ (ఢిల్లీ) 4-15, 15-11, 15-9తో ప్రపంచ పదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు)పై సంచలన విజయం సాధించ ాడు. దాంతో ఢిల్లీ 4-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ లీగ్లో బెంగళూరు జట్టుకిది నాలుగో పరాజయం కావడం గమనార్హం. దాంతో మిక్స్డ్ డబుల్స్, మహిళల సింగిల్స్ మ్యాచ్లు నామమాత్రమయ్యాయి. శనివారం జరిగే మ్యాచ్లో అవధ్ వారియర్స్తో హైదరాబాద్ హంటర్స్ జట్టు తలపడుతుంది. -
వారెవ్వా... వారియర్స్
♦ సైనా జట్టుకు రెండో విజయం ♦ బెంగళూరుకు మూడో ఓటమి ♦ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ లక్నో: వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి... వెనుకబడిన దశలో అవధ్ వారియర్స్ జట్టు అద్భుత ఆటతీరుతో పుంజుకుంది. వరుసగా రెండు ‘ట్రంప్ మ్యాచ్’ల్లో నెగ్గి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో రెండో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. బెంగళూరు టాప్గన్స్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో అవధ్ వారియర్స్ (లక్నో) జట్టు 4-1తో గెలుపొందింది. తొలి మ్యాచ్ మిక్స్డ్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప-ఖిమ్ వా లిమ్ ద్వయం 15-13, 11-15, 15-13తో బోదిన్ ఇసారా-మనీషా జంట (అవధ్ వారియర్స్)ను ఓడించి బెంగళూరుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్ పురుషుల సింగిల్స్లో ప్రపంచ 46వ ర్యాంకర్ సమీర్ వర్మ 15-13, 15-14తో ప్రపంచ 34వ ర్యాంకర్ భమిడిపాటి సాయిప్రణీత్ (అవధ్ వారియర్స్)ను బోల్తా కొట్టించడంతో బెంగళూరు 2-0తో ముందంజ వేసింది. అవధ్ వారియర్స్కు విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. బెంగళూరు జట్టు‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకున్న మ్యాచ్లో తనోంగ్సక్ (వారియర్స్) 15-11, 15-10తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు)ను ఓడించాడు. ఫలితంగా వారియర్స్ ఖాతాలో ఒక పాయింట్ చేరగా... బెంగళూరు జట్టు ఒక పాయింట్ను చేజార్చుకుంది. దాంతో స్కోరు 1-1తో సమమైంది. ‘ట్రంప్ మ్యాచ్’గా జరిగిన మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ 15-10, 13-15, 15-8తో సూ దీ (బెంగళూరు)పై గెలుపొందడంతో అవధ్ వారియర్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరడంతోపాటు 3-1తో విజయం ఖాయమైపోయింది. ఐదో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో బోదిన్ ఇసారా-కాయ్ యున్ (అవధ్ వారియర్స్) జంట 15-12, 15-6తో హూన్ థిన్ హౌ-ఖిమ్ వా లిమ్ (బెంగళూరు) జోడీని ఓడించడంతో వారియర్స్ ఓవరాల్గా 4-1తో విజయాన్ని దక్కించుకుంది. గురువారం జరిగే మ్యాచ్లో ఢిల్లీ ఏసర్స్తో హైదరాబాద్ హంటర్స్ జట్టు తలపడుతుంది. -
‘ట్రంప్’తో జంప్...
* హైదరాబాద్ హంటర్స్ బోణీ * బెంగళూరు టాప్గన్స్పై 3-2 పాయింట్ల తేడాతో గెలుపు * మలుపు తిప్పిన ట్రంప్ మ్యాచ్లు * లీ చోంగ్ వీకి శ్రీకాంత్ షాక్ ముంబై: చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠ ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘ట్రంప్ మ్యాచ్’ నిబంధన హైదరాబాద్ హంటర్స్ జట్టును గట్టెక్కించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఆడిన తొలి మ్యాచ్లో హైదరాబాద్ హంటర్స్ విజయాన్ని దక్కించుకుంది. బెంగళూరు టాప్గన్స్తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ హంటర్స్ 3-2 పాయింట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. మొత్తం ఐదు మ్యాచ్ల్లో బెంగళూరు జట్టు మూడు మ్యాచ్ల్లో నెగ్గినా ఫలితం లేకపోయింది. మరోవైపు హైదరాబాద్ కీలకమైన రెండు ట్రంప్ మ్యాచ్ల్లో గెలిచి విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. బెంగళూరు టాప్గన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పెను సంచలనం సృష్టించాడు. హైదరాబాద్ హంటర్స్ ప్లేయర్, ప్రపంచ మాజీ నంబర్వన్ లీ చోంగ్ వీ (మలేసియా)ను బోల్తా కొట్టించాడు. అంతర్జాతీయ సర్క్యూట్లో లీ చోంగ్ వీతో గతంలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిన శ్రీకాంత్ ఐదో ప్రయత్నంలో నెగ్గడం విశేషం. తొలి మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో సుపనిద (హైదరాబాద్) 8-15, 11-15తో సుయో ది (బెంగళూరు) చేతిలో ఓడిపోవడంతో హంటర్స్ జట్టు 0-1తో వెనుకపడింది. అయితే పురుషుల డబుల్స్ మ్యాచ్ను తమ ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొని కార్స్టెన్ మోగెన్సన్-మార్కిస్ కిడో (హైదరాబాద్) జంట 13-15, 15-9, 15-14తో హూన్ థీమ్ హౌ-ఖిమ్ వా లిమ్ (బెంగళూరు) జోడీపై నెగ్గింది. దాంతో హంటర్స్ 2-1 పాయింట్లతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో బెంగళూరు జట్టు వ్యూహాత్మక తప్పిదం చేసింది. మూడో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్ను తమ ‘ట్రంప్ మ్యాచ్’గా నిర్ణయించింది. అయితే ఈ మ్యాచ్లో పారుపల్లి కశ్యప్ (హైదరాబాద్) 15-14, 15-13తో సమీర్ వర్మ (బెంగళూరు)ను ఓడించాడు. హైదరాబాద్ ఖాతాలో పాయింట్ చేరగా... తమ ట్రంప్ మ్యాచ్లో ఓడిన బెంగ ళూరు పాయింట్ కోల్పోయింది. దీంతో హైదరాబాద్ 3-0 ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగో మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప-నీల్సన్ (బెంగళూరు) జంట 15-13, 15-13తో గుత్తా జ్వాల-మార్కిస్ కిడో (హైదరాబాద్) ద్వయంపై నెగ్గగా... చివరిదైన ఐదో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో పోటీలో కిడాంబి శ్రీకాంత్ (బెంగళూరు) 15-12, 6-15, 15-7తో లీ చోంగ్ వీ (హైదరాబాద్)పై సంచలన విజయం సాధించాడు. ఈ రెండు విజయాలతో బెంగళూరు ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. ఓవరాల్గా హైదరాబాద్ 3-2తో విజయాన్ని దక్కించుకుంది. పీబీఎల్లో నేడు లక్నో x ఢిల్లీ రా. గం. 7.00 నుంచి స్టార్స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం చెన్నై స్మాషర్స్ శుభారంభం మరో మ్యాచ్లో చెన్నై స్మాషర్స్ 4-3 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్స్ జట్టును ఓడించింది. మిక్స్డ్ డబుల్స్లో క్రిస్ అడ్కాక్-పియా జెబాదియా ద్వయం (చెన్నై) 15-10, 7-15, 15-11తో కామిల్లా జుల్-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ బ్రైస్ లెవెర్డెజ్ (చెన్నై) 8-15, 11-15తో హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై) చేతిలో ఓడిపోయాడు. ‘ట్రంప్ మ్యాచ్’ పురుషుల డబుల్స్లో మథియాస్ బో-ఇవనోవ్ (ముంబై) జంట 15-10, 9-15, 15-13తో క్రిస్ అడ్కాక్-ప్రణవ్ చోప్రా (చెన్నై) జోడీని ఓడించి 3-1 పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. విజేతగా నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన తర్వాతి రెండు మ్యాచ్ల్లో చెన్నై పైచేయి సాధించింది. మహిళల సింగిల్స్లో తెలుగు అమ్మాయి పీవీ సింధు (చెన్నై) 15-8, 11-15, 15-8తో హాన్ లీ (ముంబై)పై నెగ్గగా... తమ ‘ట్రంప్ మ్యాచ్’లో సిమోన్ సాంతోసో 15-9, 15-12తో గురుసాయిదత్ (ముంబై)ను ఓడించడంతో చెన్నై 4-3తో విజయాన్ని దక్కించుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement