-
కూలి కష్టం దక్కలే!
- బ్యాంక్ ఖాతాకు అనుసంధానం కాని ఆధార్ – రూ.7.5 కోట్లకు చేరిన వేతన బకాయిలు – జిల్లాలో ఉపాధి హామీ కూలీల అవస్థలు – సమస్య పరిష్కారానికి చొరవ చూపని యంత్రాంగం 7,79,365 : జిల్లాలో జారీ చేసిన జాబ్కార్డులు 48,428 శ్రమశక్తి సంఘాలు 3,99,528 ఈ ఏడాది ఇప్పటి వరకు ఉపాధి పనులు చేసిన వారు 1,24,938 ఆధార్ అనుసంధానం కాని కూలీల సంఖ్య రూ.7,42,13,188 ఆధార్ అనుసంధానం కాక తిరస్కరణకు గురైన కూలీల వేతన మొత్తం ఉపాధి కూలీలు పనులు చేశారు.. డ్వామా అధికారులు వేతనాల బిల్లులను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి.. కానీ బ్యాంకులో కూలీల ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోతవడంతో నెలల తరబడి వేతనాలు అందక కూలీలు అవస్థలు పడుతున్నారు. మండుటెండలో గట్టినేలలో కష్టపడి చేసిన పనికి ప్రతిఫలం దక్కకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అనంతపురం టౌన్ : జిల్లాలో ఉపాధి హామీ పనులు చేసే శ్రమశక్తి సంఘాలు 48,428 ఉన్నాయి. ప్రభుత్వం 7,79,365 జాబ్కార్డులు జారీ చేయగా 7,74,657 మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,99,528 మందికి ఉపాధి పనులు కల్పించారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 6,51,981 మంది కూలీలు పనులకు వెళ్తున్న జాబితాలో ఉన్నారు. గతంలో ఉపాధి కూలీలకు తపాలా శాఖ ద్వారా వేతనాలు చెల్లించేవారు. ఈ ఏడాది జనవరి నుంచి నేరుగా కూలీల బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కూలీలందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపించాలని ఆదేశాలు వచ్చాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మేరకు చర్యలు తీసుకోలేదు. దీంతో చాలా మంది కూలీలకు ఖాతాలు లేవు. ఇన్యాక్టివ్లో లక్ష ఖాతాలు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,92,325 మంది ఖాతాలు మాత్రమే యాక్టివ్లో ఉండగా 1,24,938 మంది ఖాతాలు ఇన్యాక్టివ్ జాబితాలో ఉన్నాయి. తాజా నిబంధనల మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సర్వర్కు కూలీల బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి. అయితే పెద్ద సంఖ్యలో కూలీల ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని నేపథ్యంలో వేలాది మందికి పనులు చేసినా నగదు జమ కావడం లేదు. నెలల తరబడి ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి నిధులు బ్యాంకర్లకు చేరినా కూలీలు అందుకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఎన్పీఐసీ సర్వర్కు అనుసంధానం ప్రక్రియ పూర్తయితేనే కూలీలకు సొమ్ము జమ అవుతుందని తెలిసినా, జిల్లా యంత్రాంగం మాత్రం నిర్లక్ష్య ధోరణి వీడడం లేదు. వివరాలు అందజేసినా... ఉపాధి కూలీలు మండల కంప్యూటర్ సెంటర్ల (ఎంసీసీ)లో తమ వివరాలు అందజేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో ఎన్పీసీఐ సర్వర్కు అనుసంధానం కాని కూలీలు పనులకు వెళ్లినా, వారికి సంబంధించి నగదు తిరస్కరణ జాబితాలో చేరుతోంది. ఆదివారం (జూలై 2) నాటికి జిల్లా వ్యాప్తంగా 84,736 లావాదేవీలకు సంబంధించి రూ.7,42,13,188 తిరస్కరణకు గురైంది. ఆధార్ అనుసంధానం విషయంలో ధర్మవరం, ఎన్పీ కుంట, పెద్దపప్పూరు, పుట్లూరు, తాడిపత్రి, యల్లనూరు మండలాలు మాత్రమే 85 శాతానికి పైగా పురోగతి సాధించాయి. అగళి, అమరాపురం, బొమ్మనహాళ్, సీకే పల్లి, హిందూపురం, కంబదూరు, కుందుర్పి, మడకశిర, రొద్దం, రొళ్ల, శెట్టూరు తదితర మండలాల్లో ఇంకా 30 శాతానికి పైగా కూలీల ఖాతాలు అనుసంధానం కావాల్సి ఉంది. బ్యాంకర్లతో సమస్య వస్తోంది కూలీలకు ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలయ్యాయి. కానీ బ్యాంకర్లతో సమస్య వస్తోంది. కొందరు కూలీలు కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేయడం కూడా నగదు జమ కాకపోవడానికి కారణం. అలాంటి వారంతా కొత్త అకౌంట్ వివరాలను ఎంసీసీల్లో అందజేయండి. ప్రస్తుతం బ్యాంకుల్లో రుణాల రీ షెడ్యూల్ జరుగుతుండడంతో వారు కూలీల గురించి పట్టించుకోవడం లేదు. జిల్లాలో 610 మంది బ్యాంక్ కరస్పాండెంట్లున్నారు. వారంతా ప్రత్యేక డ్రైవ్ చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఉపాధి కూలీల ఖాతాల సమస్య తీర్చేందుకు త్వరలోనే వారికి శిక్షణ ఇస్తాం. వేతన బకాయిలు ఓ వైపు క్లియర్ అవుతుంటే మరోవైపు జమ అవుతున్నాయి. -నాగభూషణం, డ్వామా పీడీ రూ. 20 వేలకుపైగా రావాలి నేను ఉపాధి పనులపైనే ఆధారపడి జీవిస్తున్నా. 25 వారాల కూలి డబ్బు రూ.20 వేలకు పైగా రావాలి. అధికారులను అడిగితే ఆధార్ లింక్ కాలేదంటున్నారు. బ్యాంక్ వాళ్లను అడిగితే అన్నీ సక్రమంగానే ఉందంటున్నారు. నా కష్టం ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది. మా ఊళ్లో నాతో పాటు ఇంకా చాలా మందికి 20 వారాలకు పైగా డబ్బులు రావడం లేదు. పనులు చేసి డబ్బులకోసం తిరగాల్సి వస్తోంది. - గోపాల్నాయక్, వెంకటాంపల్లి, గుంతకల్లు మండలం బ్యాంకోళ్లు విసుక్కుంటున్నారు నేను, నా భర్త ఇద్దరం ఉపాధి పనులు చేస్తాం. మా ఆయన డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. నాకు మాత్రం 18 వారాలుగా కూలి డబ్బులు రావడం లేదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టంచుకోవడం లేదు. ఆధార్ లింక్ కాలేదంటున్నారు. బ్యాంక్కు వెళితే ఎన్నిసార్లు తిరుగుతావమ్మా అంటూ విసుక్కుంటున్నారు. సమస్య ఎక్కడుందో తెలీక బేజారొస్తోంది. అసలు మా డబ్బులు వస్తాయో లేదో కూడా తెలియదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు డబ్బులు రాకపోతే వారిని ఎలా పోషించుకోవాలి. -చిట్టెమ్మ, వెంకటాంపల్లి, గుంతకల్లు మండలం -
పాపం.. పండుటాకులు
కొవ్వూరు : వయోభారంతో కదలలేని స్థితిలో ఉన్న పండుటాకులను కష్టాలు వెంటాడుతున్నాయి. పింఛను సొమ్ముల కోసం మూడు రోజుల నుంచి సహాయకులను వెంటబెట్టకుని.. చేతికర్ర సాయంతో కాళ్లీడ్చుకుంటూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. బ్యాంకుల ఎదుట గంటల తరబడి క్యూలో నిలబడి కౌంటర్ వద్దకు వెళితే.. మీ అకౌంట్లో సొమ్ము రాలేదనే సమాధానం వస్తోంది. వికలాంగులు, వితంతువుల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. జిల్లా వ్యాప్తంగా 3,38,153 మందికి ప్రభుత్వం సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందులో సుమారు 2లవేల మంది ఖాతాల్లో సొమ్ము జమకాలేదు. కొందరికి బ్యాం క్ ఖాతాలు లేకపోవడం.. ఖాతాలున్నా వినియోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. శనివారం నాటికి కొన్ని ఖాతాలను సరిచేసినప్పటికీ ఇంకా 15,251 మందికి పింఛను సొమ్ము ఖాతాల్లో చేరలేదు. ప్రాంతాల వారీగా ఇలా.. ఉంగుటూరు మండలంలో గరిష్టంగా 784 మందికి, లింగపాలెం మండలంలో 674, పెదవేగి మండలంలో 599, పోడూరు మండలంలో 538, దేవరపల్లి మండలంలో 534 మందికి పింఛను సొమ్ములు వారి ఖాతాల్లో వేయలేదు. నరసాపురం, యలమంచిలి, ఇరగవరం, ఆచంట, తాడేపల్లిగూడెం తదితర మండలాల్లో ఒక్కోచోట 400 మందికి పైగా పింఛను సొమ్ము రాలేదు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో 1,909 మందికి సొమ్ము జమ కాలేదు. గరిష్టంగా ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 771 మందికి, భీమవరం పట్టణంలో 244 మందికి, తణుకులో 246 మందికి పింఛన్లు జమ కాలేదు. మిగిలిన మునిసిపాలిటీల్లో 654 మంది నేటికీ పింఛను సొమ్ముకు నోచుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పింఛను సొమ్మును పంపిణీ చేసేందుకు జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 2,300 రేష¯ŒS డీలర్లు, 350 మంది బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా ఈనెల 6వ తేదీ నుంచి పింఛను సొమ్ము పంపిణీ చేయాలని నిర్ణయించారు. లేవలేని స్థితిలో ఉన్న పింఛనుదారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రతి గ్రామానికి ముగ్గురు చొప్పున బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. మూడు రోజులుగా తిరుగుతున్నా.. పింఛను డబ్బు కోసం మూడు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. అయినా సొమ్ము అందలేదు. బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేసినట్టు చెప్పారు. బ్యాంకుకు వెళితే.. ఖాతాలో సొమ్ము పడలేదని సిబ్బంది చెబుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. – సంపతి అమ్మన్న, తాళ్లపూడి చాలా ఇబ్బంది పడుతున్నాం గతంలో ప్రతినెలా 1వ తేదీన పింఛను సొమ్ము చేతికి ఇచ్చేవారు. ఈ నెల డబ్బులు ఎక్కడ ఇస్తారో తెలియక అయోమయంలో పడ్డాను. బ్యాంకు ఖాతాలో జమ చేస్తారని చెప్పడంతో బ్యాంకుకు వెళితే అక్కడ ఖాళీ లేదు. నాకు ఏటీఎం కార్డు లేదు. పింఛను డబ్బు ఖాతాలో పడిందో లేదో తెలియడం లేదు. – అంకోలు శేషయ్య, వేగేశ్వరపురం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement