-
మరో మూడు బీసీ హాస్టళ్ల మూసివేత..!
కలెక్టర్కు నివేదిక అందజేసిన అధికారులు ఆరుకు చేరిన సంఖ్య హన్మకొండ అర్బన్: విద్యార్థులు లేని కారణంగా గత ఏడాది మూడు బీసీ హాస్టళ్లను మూసివేసిన అధికారులు తాజాగా మరో మూడింటికి కూడా తాళం వేసేందుకు సిద్ధమయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఒక్క విద్యార్థి కూడా బీసీ హాస్టళ్లలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో వాటిని మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారులు కలెక్టర్కు నివేదిక పంపించారు. ఒకటి, రెండు రోజుల్లో కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాగానే బచ్చన్నపేట, మహ బూబాబాద్, నల్లబెల్లి మండలంలోని నాచినపల్లి బీసీ బాలుర హాస్టళ్లను అధికారులు మూసివేయనున్నారు. ఇదిలా ఉండగా, గత ఏడాది జిల్లాలోని మూడు హాస్టళ్లను విద్యార్థులు లేక మూసివేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు హాస్టళ్లు కూడా మూతపడేందుకు సిద్ధంగా ఉండడంతో వాటి సంఖ్య ఆరుకు చేరినట్లయింది. కాగా, జిల్లాలోని మరికొన్ని హాస్టళ్లలో కూడా ప్రసుత్తం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో ఈ సంఖ్యను పెంచుకునేందుకు వార్డెన్లకు ఈ నెలాఖరువరకు కలెక్టర్ గడువు విధించారు. నెలాఖరు తర్వాత కూడా విద్యార్థుల సంఖ్య కనీసం 30 మందికి దాటకుంటే వాటిని కూడా మూసివేసి ఉన్న వారిని పక్క హాస్టళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో మరో ఐదు నుంచి ఆరు వసతిగృహాలు కూడా మూత పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మూతపడుతున్న హాస్టళ్లలోని వార్డెన్లు, వర్కర్లను ఇతర ప్రాంతాల్లో అవసరం ఉన్న చోటకు సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
కళేబరం ఉన్న నీటితో వంటలు: హాస్టల్లో ఆకలి కేకలు
రాజాం (శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా రాజాం బస్డాండ్ వెనుక ఉన్న బీసీ బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విద్యార్థినులు నాలుగు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులు వంట వండకపోవడంతో విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డెక్కారు. హాస్టల్లో వంట వండటానికి పక్కనున్న బావి నుంచి నీళ్లు ఉపయోగించేవారు. నాలుగు రోజుల క్రితం బావిలో ఓ పిల్లి పడి చనిపోయింది. దాంతో పాటు మోటారు పాడైంది. అయితే మోటారును బాగుచేసినా నీటిలో ఉన్న పిల్లి కళేబరం అలానే ఉంది. నీటిని శుద్ధి చేయకపోవడంతో వాటితోనే వండిన వంటలు.. దుర్వాసన వచ్చాయి. దీంతో పిల్లలు తినలేక పోతున్నారు. నీటిని శుద్ధిచేసి మంచినీటితో వండితేనే తింటామని భీష్మించారు. దాంతో ఆగ్రహించిన వార్డెన్ వంట వండేది లేదని తేల్చిచెప్పడంతో అప్పటినుంచి డబ్బున్న వాళ్లు హోటళ్లలో తింటుండగా డబ్బులు లేనివారు ఆకలితో పస్తులున్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు సోమవారం మధ్యాహ్నం హాస్టల్ విద్యార్థినులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులు పరిస్థితిని విచారించి చర్యలు తీసుకుటామని హామీ ఇచ్చారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రత్యేక పోలింగ్ కేంద్రాలిక్కడే..
వేసవిలోనూ నిరంతరం మంచినీటి సరఫరా
‘రిజర్వేషన్ల వ్యతిరేక బీజేపీని ఓడించాలి’
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి విద్యార్థుల ఎంపిక
ఐటీఐలో కొత్త కొర్సులు
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ
అంగన్వాడీల రిటైర్మెంట్..!
● నేటి సాయంత్రం 4గంటల వరకే అనుమతి ● బంద్ కానున్న ఎన్నికల ప్రచార మోత
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement