-
సుమారు రూ. 11 కోట్లు
కరాచీ: క్రికెట్ మైదానంలోనే కాదు... న్యాయపరమైన వ్యవహారాల్లో కూడా బీసీసీఐ చేతిలో పాక్ క్రికెట్ బోర్డుకు గట్టి దెబ్బ తప్పలేదు. ద్వైపాక్షిక ఒప్పందాన్ని భారత బోర్డు ఉల్లంఘించిందంటూ దావా వేసి ఇటీవలే ఓటమిపాలైన పీసీబీ ఇప్పుడు దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. న్యాయపరమైన ఖర్చులు, ఇతర నష్టం కలిపి పీసీబీ 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.11 కోట్లు) బీసీసీఐకి చెల్లించినట్లు పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి వెల్లడించారు. ‘బీసీసీఐ చేతిలో ఓడిన నష్టపరిహారం కేసులో మేం 2.2 మిలియన్ డాలర్లు కోల్పోయాం. చివరకు ఐసీసీ భారత్కు చెల్లించాల్సిన మొత్తాన్ని 1.6 మిలియన్ డాలర్లుగా ఖరారు చేసింది’ అని మణి పేర్కొన్నారు. 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఇరు దేశాల మధ్య కనీసం ఆరు ద్వైపాక్షిక సిరీస్లు ఆడే విధంగా బీసీసీఐ తమతో ఒప్పందం కుదుర్చుకుందని, అయితే దీనిని ఉల్లంఘించిన కారణంగా తమకు 70 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 490 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని పాక్ బోర్డు ఐసీసీ వివాద పరిష్కార కమిటీలో కేసు వేసింది. అయితే చివరకు ఎదురు డబ్బులు ఇచ్చుకోవాల్సి వచ్చింది! వరల్డ్ కప్ మ్యాచ్ ఆగదు: ఐసీసీ మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య ప్రపంచ కప్లో జరగాల్సిన లీగ్ మ్యాచ్కు ఎలాంటి సమస్య రాదని ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే దీనిపై రిచర్డ్సన్ స్పష్టతనిచ్చారు. ‘ఐసీసీ టోర్నీలలో పాల్గొనడానికి సంబంధించి అన్ని సభ్య దేశాలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఆయా జట్లు టోర్నీలో అన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే ప్రత్యర్థి జట్టుకు పాయింట్లు ఇస్తాం. కాబట్టి మ్యాచ్ జరుగుతుందనే భావిస్తున్నా’ అని ఆయన చెప్పారు. -
లోధా ప్రతిపాదనలపై చర్చ
బీసీసీఐ ప్రత్యేక సమావేశం ఎజెండా అంగీకరిస్తే రూ.1600 కోట్లు నష్టం ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో పెను మార్పులను సూచిస్తూ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై బోర్డు పెద్దలు చర్చించబోతున్నారు. ఈనెల 19న దీని కోసమే ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే ఐసీసీ నుంచి ప్రస్తుతం వివిధ దేశాలకు అందుతున్న వాటాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశానికి హాజరయ్యేలోపే అన్ని సభ్య సంఘాలు లోధా కమిటీ ప్రతిపాదనలపై చర్చించాలని ఇప్పటికే బోర్డు సూచించింది. ఒకవేళ లోధా కమిటీ ప్రతిపాదనలకు అంగీకరిస్తే బీసీసీఐకి ఏడాదికి రూ.1600 కోట్లు దాకా నష్టం వస్తుందని అంచనా. ప్రస్తుతం టీవీ రైట్స్, ప్రకటనల ద్వారా ఏడాదికి సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. లోధా ప్రతిపాదనల ప్రకారం ప్రకటనలు కేవలం లంచ్, డ్రింక్స్ విరామాల్లో మాత్రమే ప్రసారం చేయాలి. ఇలా చేస్తే సంవత్సరానికి రూ.400 కోట్లు కూడా రావని అంచనా. ప్రస్తుతం స్టార్స్పోర్ట్స్ సంస్థ ఒక్కో మ్యాచ్ ప్రసారం చేసినందుకు బోర్డుకు రూ.43 కోట్లు చెల్లిస్తోంది. లోధా నిబంధన అమల్లోకి వస్తే మ్యాచ్కు రూ.10 కోట్లు కూడా ఇవ్వకపోవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement