-
భారతదేశంలోని అంత ప్రసిద్ధి కాని కొన్ని అందమైన బీచ్లు (ఫొటోలు)
-
థాయ్.. టూరిస్టుల స్వర్గధామం
సుందరమైన బీచ్లకు నెలవైన థాయ్లాండ్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. సాగరజలాలు, అందమైన దీవుల్లో విహరించాలనుకునే వారికి ఇదో స్వర్గధామం. థాయ్లాండ్లో వందకుపైగా చిన్నచిన్న దీవులున్నాయి. ప్రతి దీవీ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నదే. ఏ దీవికి వెళ్లినా సందర్శకులు సరికొత్త అనుభూతికి లోనవుతారు. వాటిలో కొన్ని సుందర దీవుల గురించి తెలుసుకుందాం.. వినోదం, విశ్రాంతితోపాటు ఆధ్యాత్మిక అనుభూతిని సైతం ఈ దీవులు అందిస్తాయి. కో ఫైఫై.. ఇదో ద్వీప సమూహం. కో ఫై ఫై డాన్, కో ఫైఫై లీ, కో యుంగ్, కోయ్ మాయ్ ఫాయ్, కో పాయ్, కో బిడా అనే ఆరు దీవులు కలిసి ఉన్న ద్వీప సమూహం కో ఫైఫై. దక్షిణ థాయ్లాండ్లోని క్రాబి ప్రాంతంలో కో ఫైఫై ఉంది. నీలి రంగులో ఉండే నీటితో, చుట్టూ పర్వతాలతో ఆకట్టుకునే ఈ దీవి 2004లో సునామీ ప్రభావానికి గురైంది. కొంతకాలం తర్వాత అధికారులు మళ్లీ ఈ దీవిని పునరుద్ధరించారు. భవిష్యత్లో ప్రకృతి విపత్తుల ప్రభావానికి గురికాకుండా, ఈ సారి ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. అనేక సినిమాల చిత్రీకరణ ఈ దీవుల్లో జరిగినట్లు స్థానికులు చెబుతారు. కో లాంటా.. క్రాబి ప్రాంతంలో ఉండే కో లాంటా దీవి సుందరమైన బీచ్లకు ప్రసిద్ధి. తెల్లటి ఇసుకతో కిలోమీటర్ల పొడవునా ఉండే ఇక్కడి బీచ్లు, పక్కనే ఉండే ఉష్ణమండల అడవులు పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ దీవిలో నిత్యం ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. దీంతో పర్యాటకులు పోటెత్తుతుంటారు. స్కూబాడైవింగ్, స్నోర్కెలింగ్లకు ప్రసిద్ధి చెందిన ఈ దీవిలో లభించే రుచికరమైన ఫుడ్ మరో ఆకర్షణ. స్కూబాడైవింగ్ చేసేవారు సముద్ర జలాల్లోని దాదాపు వంద రకాల చేపలు, ఇతర జలచరాల్ని, 200కు పైగా కోరల్ రీఫ్స్ని అతి దగ్గరగా చూడొచ్చు. ఇక ఇక్కడి జాతీయ పార్కులో ఎలిఫెంట్ ట్రెక్కింగ్ సందర్శకులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది. సముద్ర జలాలు చాలా పారదర్శకంగా ఉంటాయి. దీంతో ఈ నీటిలో ఆడుకుంటూ టూరిస్టులు ఉల్లాసంగా గడుపుతారు. కో టావో.. తూర్పు థాయ్లాండ్ ప్రాంతంలో కో టావో అనే చిన్న దీవి ఉంది. స్థానిక భాషలో కో టావో అంటే తాబేలు దీవి అని అర్థం. ఈ దీవి తాబేలు ఆకారంలో ఉంటుంది కాబట్టి, దీనికి ఆ పేరు వచ్చింది. కో టావోకు వచ్చే సందర్శకుల్లో ఎక్కువగా డైవింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 20కి పైగా ప్రత్యేక డైవింగ్ శిక్షణ కేంద్రాలున్నాయి. బోట్ రైడింగ్ కూడా సందర్శకుల్ని ఎక్కువగా ఆకర్షించే అంశం. చిన్న చిన్న బోట్లను అద్దెకు తీసుకుని పర్యాటకులు దీవిని చుట్టి రావొచ్చు. కో లైప్.. చాలా చిన్నగా ఉన్నప్పటికీ, ఎన్నో ఆకర్షణలు కలగిన కో లైప్ దీవి దక్షిణ థాయ్లాండ్లోని శాట¯ŒS ప్రాంతంలో ఉంది. ఇక్కడ పట్టాయా, సన్రైజ్, సన్సెట్ అనే మూడు బీచ్లు ఉన్నాయి. సముద్ర జలాలు నీలిరంగులో పారదర్శకంగా ఉంటాయి. సందర్శకులు బోట్ రైడింగ్, స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్ చేస్తూ సందడి చేస్తారు. కొత్తగా ఈత, డైవింగ్ నేర్చుకోవాలనుకునే వారికి ఈ దీవి అనువైనది. తెల్లటి ఇసుకతో కనిపించే బీచ్లో, పక్కనే ఏర్పాటు చేసిన రిసార్టుల్లో పర్యాటకులు సేదతీరుతారు. సాయంత్రం పూట మ్యూజిక్, డాన్స్లతో టూరిస్టులు ఉల్లాసంగా గడుపుతారు. థాయ్లాండ్లో ఎక్కువమంది టూరిస్టులు సందర్శించే దీవుల్లో ఇదీ ఒకటి. కో చాంగ్.. థాయ్లాండ్లోని మూడో అతిపెద్ద దీవి కో చాంగ్. ఇది థాయ్-కంబోడియా సరిహద్దులో ఉంటుంది. దీవి చుట్టూ ఎత్తైన పర్వతాలు, సుందర జలపాతాలు, కోరల్ రీఫ్స్, పక్కన ఉన్న అడవి వంటివి అన్నీ కలిపి కో చాంగ్ దీవిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. పారదర్శకంగా, నీలి రంగులో ఉన్న నీరు, తెల్లటి ఇసుక పరుచుకున్న బీచ్లు, పచ్చని చెట్లతో ఉన్న వర్షారణ్యం, రిసార్టులు పర్యాటకులకు మధురానుభూతిని అందిస్తాయి. ఇతర దీవులతో పోలిస్తే ఇది చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా సందర్శకులు భారీగానే వస్తుంటారు. కో సామెట్.. రాయంగ్ ప్రాంతంలో ఉన్న చిన్న దీవి కో సామెట్. ఈ దీవిలో సూర్యాస్తమయాన్ని వీక్షించడం పర్యాటకులకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. నీలి రంగులో ఉండే నీరు, తెలుపు రంగులో ఉండే మెత్తటి ఇసుకతో కూడిన అందమైన బీచ్లు అదనపు ఆకర్షణలు. పైగా ఈ దీవిలో ఏడాదంతా ఒకే రకమైన సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. రాత్రిపూట బీచుల్లోని రెస్టారెంట్లలో మ్యూజిక్, ఫుడ్తో సందర్శకులు సందడిగా గడుపుతారు. డైవింగ్, స్విమ్మింగ్, బోట్ రైడింగ్, ఫిషింగ్, విండ్సర్ఫింగ్ లాంటివి అసలైన మజాను అందిస్తాయి. ఏడాది పొడవునా సందర్శకులు ఈ దీవిని సందర్శిస్తుంటారు. -
గో.. గో..గోవా
సెలవులొస్తే.. గో గో..గోవా అంటుంటారు. చిన్నా పెద్దా అందరు కలిసి గోవాకి చేక్కేస్తుంటారు. అందమైన సముద్రం.. తెల్లని ఇసుక బీచ్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం గోవా సొంతం. మనదేశం నుంచే కాకుండా, విదేశాల నుంచి సైతం పర్యాటకులు గోవా బీచ్లలో సేదతీరేందుకు వస్తుంటారు. ఇటీవల గోవాలో బ్రిక్స్ సమావేశం జరిగింది. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద దేశాల(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ఆఫ్రికా) ప్రతినిధులు ఒక్కచోట చేరి పలు విషయాలపై చర్చించారు. దీంతో ఇప్పటికే పర్యాటక స్థలంగా పేరొందిన గోవా పేరు రాజకీయ, ఆర్థిక, ఇతర విషయాల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. ఈ నేపథ్యంలో గోవా అందాలపై స్పెషల్ ఫోకస్.. బెసిలికా ఆఫ్ బోమ్ జీసస్ గోవా వెళ్లిన వారు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఈ చర్చి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహాన్ని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు.1605లో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రై స్తవులు వస్తుంటారు. యునెస్కో దీన్నీ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీంతోపాటు ఇక్కడి వైస్రాయ్ ఆర్చి, ఆసియాలో అతిపెద్ద చర్చిల్లో ఒకటైన సెయింట్ కేథరీన్ చూడదగ్గవి. కేథడ్రల్, అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ చర్చి, శాంత దుర్గ టెంపుల్, సలీమ్ అలీ బర్డ్ శాంక్చురీ, గోవా స్టేట్ మ్యూజియం, ఫట్రోడ స్టేడియంలు చూడాల్సినవి. భారత-పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రాసాదాలెన్నో కనిపిస్తాయక్కడ. పనాజీలోని ఫాంటెన్హౌస్ అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తించారు. గోవా జీవనానికి, నిర్మాణాలకు ప్రతిబింబం ఇది. కొన్ని హిందూ దేవాలయాలు కూడా ఈ శైలిలోనే కనిపిస్తాయి. రైలు ప్రయాణమే థ్రిల్లింగ్! గోవా రైలు ప్రయాణం భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ప్రయాణంలో పడమటి కనుముల ప్రకృతి అందాలతోపాటు, లోతైన లోయలు, సుందర జలపాతాలు మనకు దర్శనమిస్తాయి. ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, చీకటి గుహల మీదగా ఈ ప్రయాణం సాగుతుంది. మధ్యమధ్యలో సొరంగ మార్గాల ద్వారా రైలు వెళుతున్నప్పుడు కొన్ని క్షణాలవరకూ అది మిట్టమధ్యాహ్నమో మధ్యరాత్రో అర్థంకాదు. అంతచీకటి కమ్ముకుంది. అందాల దూధ్సాగర్.. రెళ్లో గోవాకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యలో ఒకటోట రెండు ఎత్తయిన కొండలు కనిపిస్తాయి. ఆ రెండు కొండల శిఖరాల మధ్య నుంచి దూధ్ సాగర్ జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దృశ్యం కన్నుల పండువల ఉంటుంది. తెల్లని నురగలతో పై నుంచి కిందకి జాలువారే ఆ జలపాతాన్ని చూస్తుంటే ఆకాశగంగ భువికి చేరుతున్నట్లుగా ఉంది. గోవా, కర్ణాటక సరిహద్దుల మధ్య పరవళ్లుతొక్కే పాల జలపాతాన్ని తప్పక చూడాల్సిందే. ఈ జలపాతం వర్షాకాలంలో రెట్టింపు అందంగా కనిపిస్తుంది. ఇది దేశంలోనే ఐదవ అతిపెద్ద జలపాతం. పసందైన విందు! గోవాలో పురాతన ఇళ్లు ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీలుగా మారారుు. కళాప్రేమికులకు ఇండియన్ పెయింటింగ్స్, యాంటిక్స్ పండగ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ ఎంపోరియాలు, ప్రైవేట్ షాప్లు ఉంటాయి. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలప్పుడు గోవా కళకళలాడుతుంటుంది. క్రిస్మ్స వేడుకలు, గోవా కార్నివాల్, వినాయక చవితి, గ్రేప్ ఫెస్టివల్, హోలీలను ఎంతో ఆర్భాటంగా జరుపుతారు. మసాలాలు, మూలికలకు గోవా ఫేమస్. స్పా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే బోలెడు మసాజ్ సెంటర్లు ఉన్నాయి. చేపలు, మసాలా దినుసులు... అబ్బో ఒకటేంటి ఒక పక్క షాపింగ్ ప్రియుల మనసుదోచి మరో పక్క భోజనప్రియులకు రుచికరమైన విందును అందిస్తుంది గోవా. సన్ బర్న్ ఫెస్టివల్.. గోవాలోని వగాటర్లో ఈ సన్బర్న్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద మ్యూజిక్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్లో మ్యూజిక్ను ఎంజాయ్ చేయడంతో పాటు ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. గోవా ప్రత్యేక వంటకాలను ఎంజాయ్ చేస్తూ షాపింగ్ కూడా చేయవచ్చు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యటకులు ఈ ఫెస్టివల్కు తరలివస్తారు. భలే బీచ్లు..! పాలోలెమ్, బాగా, కాలన్ ఘాట్, అంజునా, కాండోలిమ్, మజోర్డా, మిరామర్, సింక్వేరియమ్, వగాటర్, వర్కా, కోల్వా బీచ్లు తప్పక చూడాలి. ఒక్కో బీచ్దీ ఒక్కో ప్రత్యేకత. కొబ్బరిచెట్లు కొలువుదీరింది ఒకటయితే నల్లరాళ్లతో నిండినబీచ్ మరొకటి. అడుగడుగునా రంగురంగుల చేపలతో పెద్ద అక్వేరియంను తలపించే బీచ్ ఒకటయితే ఆరు బయట వాలు కుర్చీల్లో బీర్లు తాగుతూ కూర్చునేది మరొకటి. ఓల్డ్గోవాలో ఎక్కువగా అరబ్బులు, పర్షియన్లు, యూదులు, మలబార్ వాసుల పడవలు కనిపిస్తాయి. మహవీర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం.. గోవా రాజధాని పనాజీకి 60 కి.మీ. దూరంలో భగవాన్ మహావీర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. గోవాలోనే అతిపెద్దది ఇది. పశ్చిమకనుమల పాదభాగంలో సుమారు 240 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఏనుగులు, పులులు, లేళ్లు, జింకలు, పెద్దపెద్ద ఉడుతలు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సఫారీలకు జీపులు కూడా దొరుకుతాయి. ఈ అడవిలో ఉండేందుకు అతిథిగృహాలున్నాయి. ఎన్నెన్నో.. మనదేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గోవా వైశాల్యం తక్కువ..కానీ చూసి ఆస్వాదించాల్సిన ప్రాంతాలు ఎక్కువ. సీ, సాండ్, సర్ఫ్, సన్ కలిసి ఆహ్వానం పలికేచోటు ఇది! నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే గోవాలో ప్రసిద్ధి చెందిన బీచ్లు, చర్చిలు, దేవాలయాలు, ఇంకా మరెన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్గోవాలో ఆహారపు అలవాట్ల నుంచి భవన నిర్మాణాల వరకు పోర్చుగీసు సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది. అందమైన బీచ్లు, పురాతన కట్టడాలు, అందమైన జలపాతాలతో పర్యాటకుల స్వర్గధామంగా విలసిల్లుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
బ్యాంకుల వద్ద పెన్షన్దారుల కష్టాలు
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
Advertisement