-
భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం కార్యక్రమం.. హాజరైన గవర్నర్
భద్రాచలం: శ్రీరామనవమి వసంత ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్యను గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భద్రాద్రి రామయ్య దర్శించుకోవడానికి వెళ్లిన గవర్నర్ తమిళసైకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళసై స్వామి వారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. భద్రాచలం మిధిలా స్టేడియంలో రామయ్య పుష్కర పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని వివిధ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి రుత్వికులు తీసుకొచ్చిన 12 నది జలాలతో స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ క్రమంలోనే రామయ్య పుష్కర పట్టాభిషేక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. నేటి భద్రాద్రి వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్లు హాజరయ్యారు. -
సీతారామ కల్యాణం.. కమనీయం
సాక్షి, భద్రాద్రి: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో.. సీతారామకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. అభిజిత్ లగ్నముహూర్తాన మాంగల్యధారణ జరిగింది. భద్రాద్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం.. ► తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ► ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి సువర్ణ ద్వాదశ వాహనాలపై సీతారాముల్ని ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ► భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నట్లు అంచనా. అందుకు తగ్గట్లే ఉదయం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ►మిథిలా స్టేడియంలో జరగనున్న సీతారామా కల్యాణం కోసం.. రామ భక్త జనసంద్రం తరలి వచ్చింది. ► కల్యాణం వీక్షించేందుకు వీఐపీతో పాటు 26 సెక్టార్లు.. ఎల్ఈడి తెర లు ఏర్పాటు చేశారు. ► చిన్నజీయర్ స్వామి ఇతర ప్రముఖులు కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ► భక్తులకు మూడు లక్షల మంచినీరు ,లక్ష మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కి సిద్దం చేశారు. ► భక్తులకు అందుబాటులో రెండు లక్షల లడ్డు ప్రసాదాలు, 200 క్వింటాల తలంబ్రాలు.. వాటి పంపిణీకి 70 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ► మొదట గర్భగుడిలో రామయ్య మూలవిరాట్కు లఘుకల్యాణం నిర్వహిస్తారు. ► ఆపై అభిజిత్ లగ్నంలో వేలాది మంది భక్తుల నడుమ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్యాణం జరగనుంది. ► రేపు(శుక్రవారం) స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ► భద్రాద్రి రాములోరి కల్యాణాన్ని వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భద్రాదికి తరలివచ్చారు భక్తులు. -
అదిగో భద్రాద్రి..
రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రణాళిక - భక్తుల మదిని దోచేలా ఆధునీకరణ పనులు - రెండు వేల మందికి సరిపడా వసతి ఏర్పాట్లు భద్రాచలం భారతా వనిలో పౌరాణికంగా, చారిత్రకంగాను అతి ప్రసిద్ధమైనది భద్రాచల క్షేత్రం. గోదావరి నదీ తీరాన శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేతంగా వెలిసిన ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఓ వైపు గోదావరి గలగలలు మరో వైపు చారిత్రిక నేపథ్యం గల పర్ణశాల కుటీరం... ఇంకో వైపు పాపికొండల సోయగాలు ఇలా ప్రకృతి రమణీయతతో కూడిన భద్రాచలం ప్రాంతాన్ని ఒక్క సారైనా చూడాల్సిందే...గోదావరి స్నానం ఆచరించి రామయ్య పాదాల చెంత సేదతీరాల్సిందే.. త్రేతాయుగమున దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేయుచున్న సీతారాములకు, ఒకనాటి విహార సమయాన విశ్రాంతి స్థానమైన ఆ దివ్య దంపతులకు ఆనందాన్ని కలిగించి, వారి అనుగ్రహానికి పాత్రమైన ఒక శిల, బ్రహ్మదేవుని వరప్రసాదంగా మేరు దేవి ,మేరు పర్వత రాజదంపతులకు భద్రుడు అను పేరిట పుత్రుడై జన్మించాడు. బాల్యం నుంచి శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొంది శ్రీరామ సాక్షాత్కారమునకై దండకారణ్యంలో ఘోరతపస్సు నాచరించెను. ఆ తప ప్రభావంతో శ్రీమన్నారాయునుడు మరలా శ్రీ రామ రూపమును దాల్చి చతుర్భుజ రామునిగా శంక చక్ర దనుర్భాణములను దరించి, వామాంకమున(ఎడమ తొడపై) సీతతో, వామ పార్శమున(ఎడమ ప్రక్కన) లక్ష్మణునితో కూడి పద్మాసనమున ఆసీనుడై ప్రత్యక్షమయ్యాడు. పిమ్మట భద్ర మహర్షి కోరికపై పర్వత రూపంగా మారిన అతని శిఖరాగ్రముపై శ్రీ పాదముల నుంచి పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా ఆభద్రుని హృదయ స్థానమున వెలిసెను. భద్రుని కొండ అయినందున ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు. స్వామికి భద్రాద్రి రాముడని, వైకుంఠము నుంచి సాక్షాత్తుగా అవతరించుట చేత వైకుంఠ రాముడని, ఇక్కడ సీతారామ లక్ష్మణుల దివ్య మూర్తులు ‘అ’కార ‘ఉ’కార ‘మ’కార స్వరూపములు అయినందున ఓంకార రాముడని, శంఖ చక్ర దనుర్భాణములు ధరించుటచే రామ నారాయణుడు అని కూడా పేర్లు కలవు. దశాబ్దాల కోవెలకు ఎన్నో మార్పులు... 16వ శతాబ్ధంలో భద్రాద్రిలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం ఆ నాటి నుంచి నేటి వరకు ఎన్నో మార్పులను సంతరించుకుంది. భద్రుని ఘోర తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుడు శంకు, చక్ర, ధనుర్బాణాలతో చదుర్భుజ రామునిగా కొండపై సాక్షాత్కరించారు. పోకల దమ్మక్క అనే భక్తురాలు పుట్టలో ఉన్న శ్రీరామున్ని చూసి తాటాకు పందిరి వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో పాల్వంచ పరగణా తహశీల్దార్గా ఉన్న కంచర్ల గోపన్న ఆరు లక్షల రామమాడలు వెచ్చించి రామాలయాన్ని నిర్మించారు. 1958లో భద్రాద్రి రామాలయం ధర్మాదాయ శాఖ పరిధిలోనికి వచ్చింది. దీంతో 1960లో తొలిసిరిగా రామాలయాన్ని పునరుద్దరించే కార్యక్రమాన్ని అప్పటి రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి కల్లూరి చంద్రమౌళి చేపట్టారు. ఈ క్రమంలోనే రాజగోపురం, కల్యాణ మండపం, చిత్రకూట మండపం నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వీటిని సంప్రదాయోక్తంగా ప్రారంభించారు. అనంతర కాలంలో ఆలయాభివృద్ధి పేరిట పరిసర ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ప్రధానంగా చెప్పదగ్గ భద్రాచలం తాజాగా కొత్తగూడెం జిల్లాలో కొంగెత్తుగా రూపాంతరం చెందుబోతోంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.100 కోట్లు మంజూరైతే ఆలయం మరింతగా అభివృద్ధి చెందనుంది. భక్తుల మది దోచేలా ఆధునీకరణ.. రాములోరి క్షేత్రమున్న కొత్తగూడెం జిల్లా దేశవ్యాప్తంగా కీర్తిగడించనుంది. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటించిన రూ.100 కోట్లతో భక్తుల మదిని దోచేలా ఆలయాన్ని ఆధునీకరించేందుకు దేవాదాయశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. రెండో ప్రాకార మండపం.. రామాలయంలో ప్రస్తుతం ఉన్న ప్రాకార మండపానికి బయట మరో ప్రాకార మండపం నిర్మించేందుకు దేవస్థానం అధికారులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న దానికి సమాంతరంగా పోర్టికో మాదిరిగా సుమారు 30 అడుగులకు పైగా బయటకు జరిపి ప్రాకారాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. స్వామి వారి వెండిరథ సేవ, ఇతర పూజాది కార్యక్రమాలన్నీ దీనిలో జరిగేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే ప్రాకారం ముందుకు జరుగుతున్నందున మాడవీధులు కూడా విస్తరించాల్సి ఉంటుంది. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాభివృద్ధి.. రామాలయానికి ఎదురుగా ఉన్న పురాతన లక్ష్మీ నర్సింహస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. రామాలయం నుంచి నేరుగా లక్ష్మీ నర్సింహస్వామి ఆలయానికి వెళ్లేలా ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో అటుగా వెళ్లే వారికి గోదావరి అందాలు కనువిందు చేయనున్నాయి. భక్తుల వసతికి పెద్ద పీట.. భద్రాచలం వచ్చే భక్తులకు దేవస్థానం ద్వారా వసతి కల్పించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అన్నీ కలుపుకొని 200 గదులు అందుబాటులో ఉన్నాయి. శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల సమయంలో ఇవి సరిపోక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.100 కోట్లలో వసతి నిర్మాణానికి కూడా నిధులు కేటాయించేలా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. 15 వేల నుంచి 20 వేల మంది వేచి ఉండేలా గదులు, సత్రాలు, కల్యాణ మండపాలను నిర్మించేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులు యోచిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర
డంప్యార్డ్లో ధనుష్.. ఫ్యాన్స్ అభినందనలు
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
సమ్మర్లో హాయినిచ్చే పొందూరు చీరలు..అందుకు చేపముల్లు తప్పనిసరి!
గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
మూడు రోజుల పాటు భారత్- నేపాల్ సరిహద్దు మూసివేత!
అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
ప్రపంచకప్కు అర్హత సాధించిన శ్రీలంక, స్కాట్లాండ్
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement