-
అజ్మీర్ దర్గా పేలుళ్లు దోషులకు జీవితఖైదు
జైపూర్: అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దోషులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఇద్దరు దోషులు భవేష్ పటేల్, దేవేంద్ర గుప్తాలకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం యవజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. 2007 అక్టోబర్లో అజ్మీర్ దర్గాలో బాంబు పేలుళ్లు సంభవించాయి. రంజాన్ పర్వదినం ఇఫ్తార్ సమయంలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. కాగా స్వామి అసిమానంద సహా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. దోషులుగా తేలిన ముగ్గురిలో సునీల్ జోషి మరణించగా, దేవేంద్ర గుప్త, భావేష్ పటేల్కు ఇవాళ కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటికీ ముగ్గురు నిందితులు పరారీలోనే ఉన్నారు. -
ప్రపంచ టాప్-10 వేతన సీఈఓల్లో.. మనోళ్లు ఇద్దరు!
♦ ఈక్విలార్ జాబితాలో ఇంద్రా నూయి, భవేశ్ పటేల్... ♦ టాప్-100లో సత్య నాదెళ్ల న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వేతనాలందుకునే తొలి పదిమంది సీఈఓల జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులకు చోటు లభించింది. ఈక్విలార్ సంస్థ రూపొందించిన ఈ జాబితాలో పెప్సికో ఇంద్రా నూయి 8వ స్థానంలో, ల్యాండెల్బాసెల్స్ సీఈఓ భవేశ్ పటేల్ ఆరవ స్థానాల్లో నిలిచారు. ఇక అత్యధికంగా వేతనాలందుకునే తొలి వందమంది జాబితాలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు స్థానం లభించింది. ఈ జాబితాలో ఇంద్రా నూయి, భవేశ్ పటేల్లతో పాటు సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. వివరాలు.. ♦ రసాయనాల కంపెనీ ల్యాండెల్బాసెల్ ఇండస్ట్రీస్ సీఈఓ భవేశ్ వి. పటేల్ 2.45 కోట్ల డాలర్ల వేతనంతో ఆరవ స్థానంలో ఉన్నారు. ♦ 2.22 కోట్ల డాలర్ల వేతనంతో పెప్సికో ఇంద్రా నూయికి ఎనిమిదవ స్థానం లభించింది. ♦ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 26వ స్థానంలో ఉన్నారు. ఆయన వేతనం 1.83 కోట్ల డాలర్లు. ♦ ఒరాకిల్ కార్పొరేషన్కు చెందిన మార్క్ వి. హర్డ్, సఫ్ర ఏ కాట్జ్లు 5.32 కోట్ల డాలర్ల వేతనాలతో మొదటి స్థానంలో నిలిచారు. ♦ వాల్ట్ డిస్ని రాబర్ట్ ఏ ఐగర్ 4.35 కోట్ల డాలర్ల వేతనంతో రెండో స్థానంలో ఉండగా, హనీవెల్ ఇంటర్నేషనల్ సీఈఓ డేవిడ్ ఎం. కోట్ 3.31 కోట్ల డాలర్ల వేతనంతో మూడో స్థానంలో, జనరల్ ఎలక్ట్రిక్ చీఫ్ జెఫ్రీ ఆర్ ఇమ్మెల్ట్ 2.64 కోట్ల డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ♦ గత ఏడాది సీఈఓల సగటు వేతనం 1.45 కోట్ల డాలర్లు. అంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 3% అధికం. యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు సగటు వేతనం కంటే తక్కువగానే (1.03 కోట్ల డాలర్లు) లభిస్తోంది. వారెన్ బఫెట్ వేతనం 4.7 లక్షల డాలర్లు మాత్రమే. ♦ ఈ టాప్-100లో 8 మంది మహిళలకు చోటు దక్కింది. అత్యధిక వేతనం అందుకుంటున్న మహిళగా ఒరాకిల్ సీఈఓ కాట్జ్ నిలిచింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement