-
షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) తన కొత్త వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? ఆ వ్యాపారం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ.. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తికి కీలకమైన ముడిసరుకు చెరుకు వ్యర్దాలు సేకరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చక్కెర మిల్లు నిర్వాహకులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. రిలయన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్స్ మరిన్ని త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బయోగ్యాస్ ఉత్పత్తి కోసం కంపెనీ టన్నుల కొద్దీ చెరకు వ్యర్థాలు కొనుగోలు చేయనుంది. రానున్న ఐదేళ్లలో 100 బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు.. ఒక్కో ప్లాంట్ 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను ప్రాసెస్ చేసి బయోగ్యాస్ను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. రిలయన్స్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను నిర్వహిస్తోంది, ఈ మధ్య కాలంలో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్వహణకు టన్నుల కొద్దీ చెరుకు వ్యర్దాలు అవసరమని స్పష్టమైంది. బయోగ్యాస్ ప్లాంట్లలో ఉపయోగించే వ్యర్దాల వల్ల సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని, 2.5 టన్నుల సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చని చెబుతున్నారు. ఇదీ చదవండి: రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్ గత నెలలో కోల్కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 7వ ఎడిషన్లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. స్వదేశంలో అభివృద్ధి చెందిన సాంకేతికల ఆధారంగా అతి పెద్ద బయో ఎనర్జీ ఉత్పత్తిదారుగా భారత్ అవతరిస్తుందని వెల్లడించారు. బయోగ్యాస్ ఉత్పత్తికి రిలయన్స్ కంపెనీ మాత్రమే కాకుండా అదానీ కంపెనీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. -
‘చెత్త’తో వెలుగులు.. ప్లాంట్ ఎలా పనిచేస్తుందంటే?
సాక్షి, హైదరాబాద్ : వ్యర్థాలు కూడా వెలుగులు నింపుతున్నాయి. డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను ఇంధన శక్తిగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మార్కెటింగ్ శాఖ.. నగరవ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నింటిలోనూ ఈ విధానంతో విద్యుత్ను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బోయిన్పల్లి మార్కెట్లో పవర్ప్లాంట్ను ఏర్పాటు చేసిన ఆ శాఖ.. 10 టన్నుల చెత్తతో 550 యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా మార్కెట్ అవసరాలన్నింటికీ ఈ కరెంట్ సరిపోతుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సహాయంతో చెత్తను బయోగ్యాస్గా మార్చిన నేపథ్యంలో ఇదే విధానాన్ని ఇతర మార్కెట్లలోనూ అవలంభించాలని మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ క్రమంలో ఎర్రగడ్డ రైతుబజార్లో ఒకడుగు ముందుకేసి.. ప్లాంట్ను అందుబాటులోకి కూడా తెచ్చింది. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్తో క్యాంటీన్ కూడా నిర్వహిస్తున్నట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ప్రతిరోజూ 500 కిలోల చెత్తను బయోగ్యాస్ మార్చడం ద్వారా.. ఈ పవర్ను ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో ఈ మార్కెట్లో వ్యర్థాలను తరలించేందుకు నెలకు సుమారు రూ.1.5 లక్షల మేర ఖర్చు చేసేవారు. పవర్ప్లాంట్ రాకతో సుమారు రూ.70వేల మేర ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది. బోయిన్పల్లే ఆదర్శం.. బోయిన్పల్లి తరహాలో గుడిమల్కాపూర్, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ సరూర్నగర్ రైతు బజార్తో పాటు గ్రేటర్ పరిధిలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఇతర మార్కెట్లలో కూడా ఇలాంటి ఏర్పాట్లకు మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించిందని ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. ఇప్పటికే మెహిదీపట్నం రైతుబజార్లో సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్ నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్, అల్వాల్ రైతుబజార్లో ఎర్రగడ్డ తరహాలో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. చదవండి: కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ బోయిన్పల్లి ప్లాంట్.. ►1500 ఎరువు ఉత్పత్తి రూ.3 కోట్లతో బోయిన్ పల్లిలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ పవర్ ప్లాంట్ విశేషాలు ►నిత్యం 10 టన్నుల చెత్తను ఇంధనంగా మార్చుతోంది. రోజుకు 1220–1400 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ► 550 ఎల్పీజీ గ్యాస్తో సమానం ►నగరంలోని వివిధ హోల్సేల్ మార్కెట్లలో చెత్త ఎత్తడానికి నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.20 లక్షలు బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్.. ►10 టన్నుల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్తుగా ఎలా మారుస్తోంది. ►ఆహారం వృథా: ఐక్యరాజ్య సమితి 2019 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయిందని అంచనా. ►వీటిలో 61శాతం గృహాల నుండి, 26 శాతం ఆహార సేవ నుండి, 13 శాతం చిల్లర వర్తకం (రిటైల్) నుండి వృథా అయ్యాయి. ►భారతదేశంలో గృహ ఆహార వ్యర్థాల సంవత్సరానికి 68.7 మిలియన్ టన్నులు అని ఆ నివేదిక తెలిపింది. బోయిన్పల్లి మార్కెట్ ►హైదరాబాద్ మార్కెట్ స్థిరమైన పద్ధతిలో రోజువారీగా 10 టన్నుల వ్యర్థాన్ని నిర్వహిస్తోంది. ►ఇది ఆహారం, కూరగాయ వ్యర్థాలను బయోగ్యాస్, విద్యుత్తుగా మారుస్తోంది. ► వీధి దీపాల దుకాణాలకు విద్యుత్తునందిస్తోంది ► గత కొన్ని నెలలుగా, 500 యూనిట్ల విద్యుత్తును వినియోగించడం జరుగుతోంది. ►120 వీధి దీపాలకు విద్యుత్తు ►170 దుకాణాలకు విద్యుత్తు ►శీతల గిడ్డంగి (కోల్డ్ స్టోరేజ్ యూనిట్)కి విద్యుత్తు. ఎల్పీజీ స్థానంలో.. ► గ్యాస్ హరిత విద్యుత్తు సేంద్రీయ ఎరువు వెచ్చదనం ► ప్లాంట్ వద్ద అదే వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ను ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ►ఇది మార్కెట్ క్యాంటీన్లో ఉపయోగించే ఎల్పీజీ వంట గ్యాస్ స్థానాన్ని భర్తీ చేస్తోంది. ►ఈ క్యాంటీన్ రోజుకు 800 మందికి భోజనాలను వడ్డిస్తుంది. ఈ ప్లాంట్ ఎలా పనిచేస్తుంది? ► మార్కెట్ నుంచి వ్యర్థాల సేకరణ ►ప్లాంట్కు వాటిని తీసుకురావడం ► వ్యర్థాల మక్కించడం ► ఫీడ్ తయారీ ట్యాంక్లో నానబెట్టడం ► ముద్దగా మార్చడం ►ఏరోబిక్ బయో మీథనేషన్ ప్రక్రియకు గురికావడం ► ప్రత్యేక ట్యాంకుల్లో బయోగ్యాస్ సేకరణ ►బయోగ్యాస్ను వంటగదికి పంపడం ►బయో ఇంధనం 100% బయోగ్యాస్ జనరేటర్లోకి సరఫరా చేయడం ► నీటి పంపునకు, శీతల గిడ్డంగులకు, వీధి దీపాలు, దుకాణాలకు కరెంట్ సరఫరా ► హైదరాబాద్ బోయిన్పల్లిలోని కూరగాయల మార్కెట్ తీసుకున్న చొరవను ప్రధాని నరేంద్ర మోడీ తన ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించారు. ► ‘హైదరాబాద్లోని బోయిన్పల్లిలోని కూరగాయల మార్కెట్ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తోందో తెలుసుకుని ఆనందిస్తున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ► సహజ వాయువుకు ప్రతిగా బయోగ్యాస్, అమెరికాలో సహజ వాయువు కన్నా బయోగ్యాస్ 5 రెట్లు అధిక ధర పలుకుతుంది. ► విద్యుత్తు డిమాండ్కు తగినంతగా వృథా లేనందున సహజ వాయువు స్థాయిని బయోగ్యాస్ భర్తీ చేయలేదు. కానీ ఇది వ్యర్థాలను తగ్గించడంలో తోడ్పడుతుంది. -
విషవాయువు పీల్చి ముగ్గురు కూలీల మృతి
చాపాడు: వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం సిద్దారెడ్డిపల్లె పరిధిలో గల శ్రీ వెంకటేశ్వర బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో విషవాయువు ప్రభావంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. బయోగ్యాస్ ఉత్పత్తికి అవసరమైన మరిగించిన వ్యర్థ పదార్థాలు పైపుల్లో నుంచి తొలగించేందుకు 12 అడుగుల లోతులో ఉన్న సంపులోనికి సోమవారం ముగ్గురు కూలీలు నిచ్చెన ఆధారంగా దిగారు.కొద్ది సేపటికే వారు కేకలు పెట్టడంతో ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి ముగ్గురు వ్యక్తులను బయటికి తీశారు. అప్పటికే చాపాడు మండలం వీవీ కొట్టాలకు చెందిన వడ్డెమాను జగదీశ్చంద్ర ప్రసాద్రెడ్డి(29), మైదుకూరు సంత కాలనీకి చెందిన గొర్రె రాముడు(38) మృతి చెందారు. కొనఊపిరితో ఉన్న సిద్దారెడ్డిపల్లెకు చెందిన అల్లాడుపల్లె ఆంజనేయులు(40)ను కడప రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలుస్తాయని చాపాడు ఎస్ఐ శివశంకర్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement