-
మూవీ కోసం స్పీడ్గా బరువు తగ్గిన రణదీప్..తలెత్తుతున్న దుష్ప్రభావాలు!
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ కోసం విపరీతంగా బరువుత తగ్గిపోయాడు. అదికూడా తక్కువ వ్యవధిలోనే కిలోల కొద్ది బరువు తగ్గాడు. చూడటానికి కూడా గుర్తుపట్టలేనంతంగా అతడి శరీర ఆకృతి మారిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు కూడా. దీంతో అతడు వీలైనంత తొందరగా యథాస్థితికి వస్తానని వారికి హామీ ఇచ్చి మరీ ఇందుకు ఉపక్రమించాడు రణదీప్. అలా అతడు ఏకంగా 18 కిలోల వరకు తగ్గిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అతడు మళ్లీ యథాస్థితికి వచ్చే క్రమంలో శరీరం సహకరిచటం లేదు. పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఇలా వేగంగా బరువు తగ్గటం మంచిదేనా? తలెత్తే దుష్ప్రభావాలేంటీ..? పోషకాహార లోపాలు వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్లను అనుసరిస్తే, పోషకాహార లోపానికి దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. మరింత సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. జుట్టు రాలడం శరీరం స్పీడ్గా తగ్గే ప్రయత్నంలో విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. దీంతో జుట్టు రాలు సమస్యను ఎదుర్కొంటారు. బరువుతగ్గే క్రమంలో పోషకాలను అస్సలు పరిమితం చేయకూడదు. కండరాల నష్టం క్యాలరీ-నిరోధిత ఆహారంలో కొవ్వు తగ్గడం ఎలా ఉన్నా..కండరాలపై తీవ్ర ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇది నెమ్మదిగా కండరాలను తినడం ప్రారంభిస్తుంది.అంతేగాదు వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్లో మెటబాలిజం బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే.. చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్ బరువు తగ్గే క్రమంలో డీహెడ్రేషన్కు అనుమతించకూడదు. ఇలా ద్రవాలను తక్కువగా తీసుకునే యత్నం చేస్తే..ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు. ఇతర సమస్యలు.. శక్తి తగ్గడం పెళుసైన జుట్టు, గోర్ల పెరుగుదల లోపం విపరీతమైన అలసట రోగనిరోధక వ్యవస్థ బోలు ఎముకల వ్యాధి తలనొప్పి చిరాకు మలబద్ధకం ఇలాంటి భయానక దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయి. అందువల్ల మెల్లగా బరువు తగ్గడమే మంచిదని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలామంది మూవీ కోసం, అందం కోసం వేగంగా బరువుతగ్గి చేజేతులారా సమస్యలు కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!) -
'అందంగా లేవు.. లావు తగ్గాలన్నారు'.. మృణాల్పై బాడీషేమింగ్ కామెంట్స్!
సీతారామం సినిమాతో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ నటిస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మొదట మరాఠీ చిత్రాల్లో నటించింది, ఆ తర్వాత హిందీ చిత్రాల్లో నటించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా టాలీవుడ్ సీతారామం చిత్రం ద్వారానే ఫేమ్ వచ్చింది. ఆ చిత్రం సక్సెస్ మృణాల్ ఠాగూర్ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల నాని సరసన నటించిన 'హాయ్ నాన్న' చిత్రం హిట్ కూడా ఈమె ఖాతాలో పడింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మృణాల్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకుంది. తాను బాడీ షేమింగ్కు గురయ్యానని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. అయితే ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల్లో నటించే రోజుల్లో ఇబ్బందులకు గురైనట్లు తెలిపింది. నాకు నటించేందుకు అవకాశాలు ఇచ్చినప్పటికీ.. మరొకరితో పోలుస్తూ మీరు వారిలా చేయలేదంటూ కామెంట్స్ చేశారని పేర్కొంది. అందుకే నేను అక్కడే స్థిరపడాలని అనుకోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తాను తల్లి, సోదరి లాంటి పాత్రలు చేసేందుకు కూడా భయం లేదని తెలిపింది. గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు తన బాడీని ఉద్దేశించి కామెంట్స్ చేశారని మృణాల్ ఠాకూర్ తెలిపింది. 'మీరు అస్సలు సెక్సీగా లేరు' అని అన్నారని వెల్లడించింది. మీరు చేసిన పాత్ర సెక్సీగా ఉందని.. కానీ మీరు ఆ పాత్రకు అంత దగ్గరగా కనిపించలేదని దారుణంగా మాట్లాడారని పేర్కొంది. ఓ ఫోటోగ్రాఫర్ నా పాత్రను చూడకుండానే కామెంట్ చేశాడు. మరాఠీలో మాట్లాడుతూ.. ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు? అని కామెంట్ చేశాడని తెలిపింది. కానీ ఆ తర్వాత అతను నాకు క్షమాపణ చెప్పాడని వివరించింది. నేను ఏదైనా ప్రాజెక్ట్లో నటించే సమయంలో తనలాగే ఉండేందుకు ఇష్టపడతానని మృణాల్ తెలిపింది. అప్పుడే ఆ పాత్రను సులభంగా చేయగలనని వెల్లడించింది. ఓ సాంగ్ చేసినప్పుడు కొందరు ఏకంగా తనను బరువు తగ్గమని కూడా సలహా ఇచ్చారని పేర్కొంది. దీనికి బదులిస్తూ నా శరీర బరువుతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. మీరు ఎందుకు ఫీలవుతున్నారు? కాస్తా గట్టిగానే ఇచ్చిపడేశానని వివరించింది. ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాడీ షేమింగ్కు గురైన అనుభవాలను సీతారామం బ్యూటీ పంచుకుంది. ఇక సినిమాల విషయాకొనిస్తే గతేడాది నాని సరసన హాయ్ నాన్నతో హిట్ కొట్టింది. కొత్త ఏడాదిలో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది సౌత్తో పాటు బాలీవుడ్లో జెర్సీ, పిప్పా వంటి చిత్రాలలో మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఏఆర్ మురుగదాస్ శివకార్తికేయన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించనున్న చిత్రంలో కూడా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. -
అమ్మపై దారుణ కామెంట్స్.. ఇప్పుడు కూడా: బుల్లితెర నటి
సినీ ఇండస్ట్రీతో పాటు బాడీ షేమింగ్ సంఘటనలు మనం చూసే ఉంటాం. నటీమణులు బాడీ షేమింగ్కు గురి కావడం కాస్తా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్స్పైనే ఎక్కువగా ఇలాంటి ట్రోల్స్ వస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి వాబిజ్ దోరాబ్జీ తనకు ఎదురైన సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన తల్లిని ఉద్దేశించి కామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది చూసిన తన తల్లి ఏడవడం.. తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆమె గుర్తుచేసుకున్నారు. (ఇది చదవండి: టాయిలెట్స్ శుభ్రం చేసేవాడిని.. సల్మాన్ కామెంట్స్ వైరల్!) బాలీవుడ్ నటి వాబిజ్ దోరాబ్జీ ఇన్స్టాలో రాస్తూ..'ఈ అంశం చాలా సున్నితమైంది. ఎందుకంటే ఇది చాలా వ్యక్తిగతం కూడా. మా అమ్మ ఒకప్పుడు మిస్ పూణేగా నిలిచింది. ఆమె చాలా అందంగా ఉండేది. కానీ నాకు, సోదరుడికి జన్మనిచ్చిన తర్వాత అమ్మ బరువు పెరిగింది. ఆ తర్వాత చాలా మంది మా అమ్మను కామెంట్ చేయడం చూశా. ఆమె ఏడవడాన్ని దగ్గరి నుంచి చూశా. అయినప్పటికీ ఈ విషయాలు బయటకు చెప్పలేకపోయింది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే నాకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో బరువు పెరిగానని వెల్లడించింది. వాబిజ్ తనపై ట్రోల్స్ గురించి రాస్తూ..' నా కెరీర్ ప్రారంభించినప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం బరువు పెరిగా. ఆ తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నా. ఆ దశలో నాకు చాలా కష్టమనిపించింది. నాపై నాకే నమ్మకం తగ్గిపోయింది. నేను దాని గురించే ఆలోచిస్తూ విలవిల్లాడిపోయా. నా గురించి నేను తెలుసుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. అంత ఈజీగా బరువు తగ్గలేననే వాస్తవం నుంచి బయటికొచ్చా. చివరికి నా శరీరం పట్ల నా అవగాహన కూడా మారింది. నన్ను నేను గౌరవించడం ప్రారంభించా. అప్పుడే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించడం ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే నాపై ట్రోల్స్ రావడం తగ్గింది.' అని పేర్కొంది. ఇది చూసిన నాలాగే చాలా మంది మహిళలు తమ అనుభవాల గురించి తనకు ఎలా మెసేజ్ చేస్తారని తెలిపింది. అంతే కాదు.. ఇది కేవలం నటీనటులకు సంబంధించిన సమస్య కాదని వాబిజ్ తెలిపింది. ఏ స్త్రీ అయినా ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించింది. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ గురించి రాసినప్పుడు.. చాలా మంది మహిళలు ఇలాంటి సంఘటనలు ఎలా ఎదుర్కొనేందుకు ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. వారిలో కొందరికైనా తమ కోసం తాము నిలబడే నమ్మకాన్ని అందించగలిగితే నాకు సంతోషం అని తెలిపింది. (ఇది చదవండి: ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. పేరు విహారిక!) కాగా.. వహిజ్ దొరాబ్జీ.. ప్యార్ కీ యే ఏక్ కహానీతో సీరియల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సావిత్రి, సరస్వతీచంద్ర సీరియల్స్లో కీలక పాత్రలు పోషించింది. ప్యార్ కీ యే ఏక్ కహానీకి ఉత్తమ సహాయ పాత్రకు అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత బహు హమారీ రజనీ కాంత్లో సీరియల్లో నటించింది. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన దొరాబ్జీ 2013లో ప్యార్ కీ యే ఏక్ కహానీ సహనటుడు వివియన్ ద్సేనాను వివాహం చేసుకున్నారు. వారు 2017లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Vahbiz Dorabjee (@vahbz) -
శరీరాకృతిపై కామెంట్.. భయంతో బయటకు రాలేదు: సమీరారెడ్డి
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన చాలామంది నటీమణులు పెళ్లి తర్వాత సినిమాలకు సినిమాలకు గుడ్బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాంటి వారిలో నటి సమీరా రెడ్డి ఒకరు. అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. 2014లో అక్షయ్ని వివాహం చేసిన ఇండస్ట్రీకి గుడ్బై చెప్పింది. పెళ్లి తర్వాత ఆమె శరీరంలో మార్పులు వచ్చాయి. (చదవండి: టాప్ హీరోయిన్.. 18 ఏళ్లకే గదిలో శవమై.. మెడపై ఉరితాడు గుర్తులు!) గర్భం దాల్చిన సమయంలో కాస్త బరువు పెరిగారు. ఆ సమయంలో ఎవరికైనా ఈ మార్పులు సహజం. కానీ తనపై మాత్రం దారుణంగా విమర్శలు చేశారని సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు. చివరకు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా బాడీ షేమింగ్ చేశారని బాధపడ్డారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వివాహం తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి చెప్పుకొచ్చారు. ‘2014లో అక్షయ్తో నాకు పెళ్లి జరిగింది. చాలా సింపుల్గా వివాహం చేసుకున్నాం. అయితే కొంతమంది మాత్రం నేను ప్రేగ్నెంట్ అయ్యాయనని, అందుకే ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా పెళ్లి చేసుకున్నారని పుకార్లు సృష్టించారు. అలా ఎందుకు పుట్టించారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఇక నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. 2015లో బాబు పుట్టాక నా శరీరాకృతిలో మార్పులు వచ్చాయి. బరువు పెరిగాను. దీంతో చుట్టు పక్కల వాళ్లు నా శరీరాకృతిపై కామెంట్ చేశారు. చివరకు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ‘ఇది మీరేనా?, ఇలా మారిపోయారేంటి?’అని అన్నారు. వారి మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. మీడియాకు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. అభిమానులతో కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానిని ప్రమోట్ చేయాలని ఇండస్ట్రీలోని స్నేహితులను కోరితే..ఒక్కరు కూడా సాయం చేయలేదు. చాలా బాధపడ్డాను’ అని సమీరారెడ్డి చెప్పుకొచ్చారు. -
'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!
ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్, రణ్వీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సోదరిగా తనదైన నటనతో అందరినీ ఆకర్షించింది బుల్లితెర నటి అంజలి ఆనంద్. రణవీర్ సింగ్ సోదరిగా గాయత్రీ రంధవా పాత్రలో కనిపించిన ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) బుల్లితెర నటి అంజలి ఆనంద్ తాను కూడా బాడీ షేమింగ్కు గురైనట్లు వెల్లడించింది. బాలీవుడ్లో కెరీర్ ప్రారంభంలో యాక్టింగ్ స్కూల్లో చేరినప్పుడు.. తనను శరీర బరువును కించపరిచేలా కొందరు మాట్లాడారని తెలిపింది. తనకు సినిమా ఛాన్స్లు రావనీ.. కేవలం బర్గర్లు తినే పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయని ఎద్దేవా చేశారని వివరించింది. తాను లావుగా ఉన్నందున కొందరు దారుణంగా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది. అంతకుముందు 'ధై కిలో రెమ్','కుల్ఫీ కుమార్ బజేవాలా' వంటి హిట్ టీవీ షోలతో తనదైన ముద్ర వేసింది. "కుల్ఫీ కుమార్ బజేవాలా"లో ప్రధాన పాత్రలో ఆమె తనదైన నటనతో అభిమానులను అలరించింది. కానీ అప్పట్లో ఆ పాత్రకు ప్రశంసల కంటే.. విమర్శలే ఎక్కువ వచ్చాయని తెలిపింది. లావుగా ఉన్న అమ్మాయి లీడ్ రోల్ ఎలా చేస్తుందని.. పలువురు తన క్యారెక్టర్ను కించపరిచేలా సందేశాలు పంపారని వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని తెలిపింది. 'లావుగా ఉన్న అమ్మాయికి సెకండ్ షోలో ప్రధాన పాత్ర ఎవరు ఇచ్చారు? బహుశా ఆమె ఎవరితోనైనా కమిట్ అయినందువల్లే అయి ఉండొచ్చు' అని దారుణంగా కామెంట్స్ చేశారని అంజలి వెల్లడించింది. అయితే వీటిపై తాను అదేస్థాయిలో స్పందించినట్లు వివరించింది. మనం ఇలాంటి వారి గురించి మాట్లాడటం మూర్ఖత్వమని విమర్శించింది. (ఇది చదవండి: 'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!) కాగా.. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో అంజలి గాయత్రి పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. నటనకు కావాల్సింది టాలెంట్ అని.. శరీర బరువుతో సంబంధం లేదని అంజలి నిరూపించింది. అలా విమర్శలు చేసేవారికి తన నటనతోనే సరైన సమాధానమిచ్చింది. సినిమా ఇండస్ట్రీలో విజయమనేది అంకితభావం, కృషిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. View this post on Instagram A post shared by ✨Anjali Anand✨ (@anjalidineshanand)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement