-
జిల్లాల్లో భారీ వర్షం
నిడమనూరులో 17.3 సెం.మీ వర్షపాతం సాక్షి నెట్వర్క్: తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 17.3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇదే జిల్లా చండూరు మండలంలో 12.4 సెం.మీ, నార్కట్పల్లిలో 8.8, చింతపల్లిలో 7.3, శాలి గౌరారంలో 7.1 సెం.మీ వర్షం పడింది. ఈ జిల్లాల్లో పలు చోట్ల రోడ్లు తెగి రాకపోకలు నిలిచి పోయాయి. సూర్యా పేట జిల్లాలోని హుజుర్నగర్లో 6.4 సెం. మీ, తుంగతుర్తిలో 5.2, మేళ్లచెరువులో 5.0, మఠంపల్లిలో 4.2 గరిడేపల్లిలో 4.0 సెం.మీ వర్షం కురిసింది. హుజూర్నగర్ నుంచి మఠం పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై చింతబావి వాగు ఉధృతంగా ప్రవహించింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సైదాపూర్ మండలం ఊరచెరువు మత్తడి పొంగుతోంది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరంగల్ నగరంలోని పలు కాలనీలు జలమయ మయ్యాయి. పాకాల సరస్సులో నీటిమట్టం 23 అడుగులకు చేరింది. పాక్షికంగా ఆలయం ధ్వంసం వరంగల్ అర్భన్ జిల్లా కాజీపేట కడిపికొండలో పిడుగుపాటుకు బ్రహ్మంగారి ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. ఆంజనే యస్వామి విగ్రహంతోపాటు, గోపురం స్వల్పంగా ధ్వం సమైంది. కుమ్రంభీం జిల్లా రెబ్బెన మండలం కైర్గాంలో రైతు నామని పోచయ్య పిడుగు పాటుకు మృతి చెందాడు. -
పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం
♦ షాబాద్ మండలం నాగరగూడలో బాలుడు.. ♦ శంషాబాద్ మండలం కవ్వగూడలో మహిళ.. ♦ తొండుపల్లిలో రెండు.. ఘాంసిమియాగూడ, నాగిరెడ్డిపల్లిలో ♦ ఒక గేదె, మన్సాన్పల్లిలో ఐదు మేకలు మృతి ♦ సిరిగిరిపల్లిలో కోళ్లఫాం కూలి రెండువేల కోళ్లు మృత్యువాత ♦ మహేశ్వరం మండలం సిరిగిరిపురంలో ♦ వర్షానికి కూలిన గోడ.. ఒకరి మృతి కవ్వగూడ(శంషాబాద్ రూరల్): పిడుగుపాటుతో ఓ మహిళ దుర్మరణం చెందగా.. కూలీకి వచ్చిన మరో యువతి పరిస్థితి విషమంగా ఉంది. శంషాబాద్ మండలంలోని కవ్వగూడలో మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రొడ్డ పెంటయ్య, భార్గవి(28) దంపతులు తమకున్న అరెకరం పొలంలో వ్యవసాయం చేస్తున్నారు. వీరికి పిల్లలు మణిరాం(5), శ్రీనాథ్(3) ఉన్నారు. పొలంలో బెండకాయ, సొరకాయ, ఆకుకూర సాగు చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన గొడుగు గోపాల్ కూతురు సంధ్య(19) మంగళవారం వీరి పొలంలోకి కూలీకి వచ్చింది. భార్గవి, సంధ్య సొరకాయ పంటలో కలుపు తీస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. దీంతో వీరిద్దరూ సమీపంలో ఉన్న ఓ మేడిచెట్టు కిందికి చేరుకున్నారు. అదే సమయంలో పిడుగుపడడంతో భార్గవి, సంధ్య స్పృహ కోల్పోయారు. సమీపంలోని పొలాల్లో ఉన్న వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గ్రామం నుంచి భార్గవి భర్త పెంటయ్య, మాజీ ఎంపీటీసీ మైసయ్యతోపాటు స్థానికులు ఆటోలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. భార్గవి అప్పటికే మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న సంధ్యను ఆటోలో శంషాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అప్పటి వరకు పొలంలో హుషారుగా పని చేసిన ఆమె దుర్మరణం చెందడంతో భర్త కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
రైతులపై నీటి తీరువా ‘పిడుగు’
పెంపునకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ * త్వరలో ఉత్తర్వులు జారీ * రూ.631.56 కోట్ల ఆదాయం లక్ష్యం సాక్షి, హైదరాబాద్: రైతులపై నీటి తీరువా రూపంలో పిడుగు పడనుంది. వారి నుంచి భా రీస్థాయిలో నీటి తీరువా వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలు 1996 సంవత్సరంలో నిర్ణయించినవని, ఈ నేపథ్యంలో వాటిని రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈమేరకు సీసీఎల్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. పెంపుదల ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి అమల్లోకి రానుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రెండంకెల వృద్ధి సాధనలో భాగంగా మద్యం ఆదాయంతో పాటు నీటి తీరువా ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నీటి తీరువా ద్వారా రూ.86.08 కోట్ల ఆదాయం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.631.56 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించారు. ధరలను రెట్టింపు చేయడంతో పాటు వసూలు పరిధిని పెంచడం ద్వారా ఈ మొత్తాన్ని ఆర్జించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1996లో చంద్రబా బు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నీటి తీరువాను పెంచారు. ఇప్పుడు మళ్లీ ఆయన హయాంలోనే పెంపునకు రంగం సిద్ధమైందని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో రైతులు నీటి తీరువా కింద ఎకరానికి బస్తా ధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దా నిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కు తగ్గారు.ప్రాజెక్టుల కింద రైతులకు సాగునీటిని ఇస్తున్నందున అందుకయ్యే నిర్వహణ వ్యయం మొత్తాన్ని నీటి తీరువా రూపంలో రాబట్టాలనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉందని సాగునీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రెండు కేటగిరీలుగా వసూలు చేస్తున్నారు. ఒకటవ కేటగిరీలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఎకరానికి ఇంత అని వసూలు చేస్తున్నారు. రెండో కేటగి రీలో ఇతర ప్రభుత్వ ఇరిగేషన్ వనరుల కింద ఐదు నెలలు ఆపైన నీటి సరఫరా చేసే భూముల నుంచి వసూలు చేస్తున్నారు. -
పిడుగు కాటు
♦ పిడుగుపడి నలుగురు మృతి ♦ మృతుల్లో దంపతులు ♦ రైతు కుటుంబాల్లో అంతులేని విషాదం ♦ సహాయ కార్యక్రమాలకు అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బూడి, కలెక్టర్ యువరాజ్ వారి బతుకులపై ప్రకృతి కన్నెర్ర చేసింది...అనుకోకుండా వాన కురుస్తుండటంతో తలదాచుకునేందుకు చెట్టుకిందకు వెళ్లిన వారిని పిడుగు పొట్టనపెట్టుకుంది. ఒకేసారి నలుగురిని బలితీసుకున్న ఈ సంఘటన కోటపాడు మండంల పిడ్రంగిని విషాదంలోకి నెట్టేసింది. ఈ దుర్ఘటనలో దంపతులు కన్నుమూయగా మరో ఇద్దరు కూలీలు విగతజీవులయ్యారు. పొలానికి వెళ్లిన వారు శవాలుగా మారడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. కూలినాలి చేసుకునే బతుకుల్లో పిడుగు పెనుకల్లోలం నింపింది ఆధారం కోల్పోయిన కుటుంబాలు కూలిపనికి వెళ్లిన తమ ఇంటి యజమానులు సాయంత్రం వస్తారని ఎదురుచూసిన కుటుంబసభ్యులకు మరణ వార్త తీవ్ర విషాదంలో ముంచింది. జాగారపు సన్నిబాబు, జాగారపు ఈశ్వరరావులు వరుసకు అన్నదమ్ములు. రోజూ కూలిపని చేసుకుంటూ కుంటుంబాలను పోషించుకుంటున్నారు. ఆకస్మికంగా వీరి మృతితో ఆయా కుటుంబాలు ఆధారం లేకుండా పోయింది. సన్నిబాబుకు భార్య, కుమార్తె,కుమారుడు ఉన్నారు. ఈశ్వరరావుకు భార్య, కుమార్తె,కుమారుడు ఉన్నారు. కుమార్తెలకుపెళ్లిలుఅయిపోయాయి. కె.కోటపాడు : ఒకే రోజు పిడుగుపాటుకు నలుగురు మృతితో మండలంలోని పిండ్రంగిలో విషాదం చోటుచేసుకుంది. ఆయా రైతు, రైతుకూలీ కుటుంబాల్లో అంతులేని వేదన మిగిలింది. చోడిపంట నూర్పిడికి శుక్రవారం పొలానికి వెళ్లిన సింగంపల్లి అప్పారావు(53), కళావతి(38) దంపతులతోపాటు కూలీపనికి వచ్చిన గ్రామానికి చెందిన జాగారపు సన్నిబాబు(49), జాగారపు ఈశ్వరరావు(48)లు మధ్యాహ్నం వరకు పంటను నూర్పిడి చేశారు. భారీ వర్షంతో నలుగురూ సమీపంలోని చెట్టుకిందకు చేరారు. దానిపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు మృతిచెందారన్న వార్తతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి పరుగులు తీశారు. విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసి బోరున విలపించారు. రోదనలతో గ్రామం శోకసంద్రమైంది. చావులోనూ వీడని బంధం: వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రైతు సింగంపల్లి అప్పారావు, అతని భార్య కళావతిలు చావులోనూ వీడలేదు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఇటీవల పెళ్లి చేశారు. కొడుకు రాజేష్ను ఇంజినీర్ను చేయాలని ఆశపడ్డారు. ఆరుగాలం కష్టపడేవారు. వచ్చిన ఆదాయంతో కొడుకును ఇంజినీరింగ్ చదివించారు. నేడోరేపో ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో మృత్యువు పిడుగు రూపంలో ఆ దంపతులను కబళించింది. కొడుకు రాజేష్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తనకు దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పారావుకు 80 ఏళ్లు పైబడిన వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. కొడుకుకోడలు మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎమ్మెల్యే ముత్యాలనాయుడు వాకబు నియోజకవర్గంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారని తెలుసుకున్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కర్నూలు నుంచి ఫోన్లో ఆయా కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయం అందించాలని ఇన్చార్జి తహాశీల్దార్ నాగేశ్వరరావును ఆదేశించారు. ఆర్డీఓ పద్మావతి సంఘటన స్థలానికి వచ్చారు. ఇదిలావుండగా జిల్లా కలెక్టర్ యువరాజ్, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఫోన్ ద్వారా సంఘటపై ఆరాతీసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగు మృతదేహాలను పిండ్రంగి గ్రామ పొలిమేరకు శుక్రవారం రాత్రి తరలించారు. శనివారం మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తారు. -
పిడుగుపాటుకు యువకుడి మృతి
విడపనగల్లు(అనంతపురం): అనంతపురం జిల్లా విడపనగల్లు మండలం గడేకల్లు గ్రామంలో శనివారం సాయంత్రం ఓ యువకుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. గ్రామానికిచెందిన మేకల శ్రీనివాసులు(24) తన పొలంలో శనివారం సాయంత్రం పనులు చేసుకుంటుండగా సమీపంలో పిడుగు పడింది. షాక్కు గురైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య శకుంతల, ఏడాది కూతురు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement