-
వైభవంగా లాల్ దర్వాజా బోనాలు
-
లండన్లో ఘనంగా బోనాల జాతర వేడుకలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరి, హౌన్సలౌ డిప్యూటీ మేయర్ ముఖ్య అతిథులు హాజరైన ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 మందికి పైగా ప్రవాస సభ్యులు హాజరయ్యారు. టాక్ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన కార్యక్రమానికి అధికార ప్రతినిధి హరిగౌడ్ వాఖ్యాతగా వ్యవహరించారు. సాంప్రదాయ బద్దంగా పూజలు, లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, ముఖ్యంగా పోతురాజు ఆటలు ఎన్నారైలను ముగ్ధులను చేశాయి. ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం పోతురాజు వేషధారణ ఆకట్టుకుంది. సందీప్ కుమార్ బుక్క బృందం పర్యవేక్షణలోనే జరిగిన పోతురాజు విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. భారత సంతతికి చెందిన స్థానికి ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్నా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు. లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని.. టాక్ సంస్థ, టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం సేవలను కొనియాడారు. ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, తొట్టెల ఊరేగింపు అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే, ఒక మహిళగా ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను సత్కరించి, బహుమతులందజేశారు. ఎంపీ రూత్ క్యాడ్బరి కూడా ఈ ఉత్సవాలపై సంతోషం వ్యక్తం చేశారు. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని కోరారు. టాక్ సంస్థ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టాక్ సంస్థ బోనాల జాతర వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్కు కృతఙ్ఞతలు తెలిపారు. టాక్కు అన్ని సందర్భాల్లో అండగా నిలుస్తున్న ఎంఎల్సీ కవితకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. టాక్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ స్పూర్తి వల్లే ఇంత ఘనంగా సంబరాలు నిర్వహించు కున్నామన్నారు. టాక్ జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు సంస్థ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆమె సభకు వివరించారు. ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు-బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షులు అశోక్ దూసరి తెలిపారు. ఈ సందర్బంగా అనిల్ కూర్మచలం కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలిపి, వారిని సత్కరించారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి మన దేశమంతా అమలు కావాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలంతా నినదించారు. ‘ఫ్యూచర్ కాండిడేట్ ప్రోగ్రాం ఫర్ యూకే’ ఉదయ్ నాగరాజు తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి మహాశక్తి నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ చిన్నారులు, కమిటీ మహిళా విభాగం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపికలతో సత్కరించింది. అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి, సభ్యులు.. పవిత్ర రెడ్డి కంది, నవీన్ రెడ్డి, స్వాతి బుడగం, రాకేష్ పటేల్, సత్య పింగిళి, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, వీర ప్రవీణ్ కుమార్, సురేష్ బుడగం, క్రాంతి, శ్రీ శ్రావ్య, శ్వేతా మహేందర్, శ్రీ లక్ష్మి, రవికిరణ్, గణేష్, మధుసూదన్ రెడ్డి, మల్ రెడ్డి, పృధ్వి, శ్రీకాంత్, భూషణ్, అవినాష్, శశి, జస్వంత్, మణి తేజ, నికిల్, మధు, మనోజ్, అక్షయ్, సందీప్, లడ్డు, స్రవంతి, జాహ్నవి, వెంకట్రెడ్డి, వంశీ, రవి పులుసు, మాధవ్, క్రాంతి, వేణు, శ్రీవిద్య, అక్షిత, శ్రీవిద్య, గణేష్ రంజిత్, రవి రతినేని, వంశీ పొన్నం, రాజేష్ వర్మ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బోనమెత్తిన గోల్కొండ
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తొట్టెల - వేలాదిగా తరలివచ్చిన భక్తులు సాక్షి, హైదరాబాద్: పోతురాజు విన్యాసాలు, సంప్రదాయ నృత్యాలు, శివసత్తుల ప్రదర్శన.. డప్పు వాయిద్యాలు.. కోలాటాలు.. భక్తజనం సమర్పించిన బోనాలతో గోల్కొండ బోనమెత్తింది. హైదరాబాద్ నగరా నికి తలమానికమైన గోల్కొండలో ఆషాఢ జాతరగా పిలిచే తొలి బోనాల ఉత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. లంగర్హౌజ్ నుంచి గోల్కొండ వరకు ఆధ్యా త్మిక వాతావరణం వెల్లి విరిసింది. భక్తజనం వెంట రాగా జగదంబిక మహంకాళి అమ్మవారి రథం లంగర్హౌజ్ నుంచి ముందుకు కదిలి, సాయంత్రానికి గోల్కొండ కోటపైన ఉన్న జగదంబికా అమ్మ వారి ఆల యం వద్దకు చేరింది. వేలాది భక్తులు అమ్మవారి కి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. బోనాలు ప్రారంభమయ్యాయిలా... ఈ బోనాల సందర్భంగా తొలిపూజను చోటా బజార్లోని ప్రధాన అర్చకుడు అనంతాచారి ఇంట్లో నిర్వహించారు. అనంతరం వేదపండి తులు రామాకాంత్ వైద్యుల ఇంట్లో వేదశాస్త్రం ప్రకారం పీఠపూజ చేశారు. ఉదయం 11 గంట లకు లంగర్హౌస్ గాంధీ విగ్రహం నుంచి ప్రా రంభమైన ఊరేగింపు సాయంత్రం 5 గంటలకు గోల్కొండ కోటకు చేరుకుంది. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, సాకపోసి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తొట్టెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతబస్తీ చార్మినార్ నుంచి ప్యారసాని శ్రీనివాస్ ప్రత్యేకంగా 25 అడుగుల ఎత్తున తయారు చేసిన తొట్టెల భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి ఊరేగింపులో ప్రత్యేక అలంకరణతో తయారు చేసిన హంసవాహనం వేలాదిమంది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. -
బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి: ఉపసర్పంచ్ మృతి
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతుల్ల గ్రామంలో ఆదివారం జరిగిన బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఉప సర్పంచ్ మక్కు కృష్ణ (30) మృత్యువాత పడ్డారు. ఆదివారం సాయంత్రం ఉత్సవాల సందర్భంగా విద్యుత్ తీగల నుంచి విద్యుత్ తీసుకునేందుకు వైర్ వేస్తుండగా షాక్ కొట్టడంతో కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పాతబస్తీలో ఎక్సైజ్ ‘బోనాల’ దాడులు
చార్మినార్: బోనాల ఉత్సవాల సందర్భంగా చార్మినార్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వాఖ అధికారులు శనిఆదివారాల్లో పాతబస్తీలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3900 గుడుంబా ప్యాకెట్లు, 25 లీటర్ల కల్లు, 32 విస్కీ (180ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకొని ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. చార్మినార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. చంద్రశేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... లలితాబాగ్ , భయ్యాలాల్నగర్, ఉప్పుగూడ సాయిబాబానగర్, సరూర్నగర్ ఎర్రకుంట, చాంద్రాయణగుట్ట బండ్లగూడలోని అడ్డాలపై దాడులు చేసి పెద్ద మొత్తంలో గుడుంబాను, 32 విస్కీ (180ఎంఎల్) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏడుగురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement