-
పుస్తకాల దొంగలు
నిజామాబాద్నాగారం: ప్రభుత్వ పుస్తకాలను ప్రైవేట్గా అమ్మకానికి పెడుతున్నారు కొందరు అక్రమార్కులు. విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పుస్తకాలను రాష్ట్ర కార్యాలయానికి తరలించాల్సి ఉంటుంది. అయితే, అలా వెనక్కి పంపించకుండా ఆటో నిండా పుస్తకాలను అక్రమంగా అమ్ముకున్న వైనమిది. జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకులానికి గతేడాది వచ్చిన పుస్తకాల్లో చాలా వరకూ మిగిలి పోయాయి. నిబంధనలకు విరుద్ధంగా వీటిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అధికారులు ప్రింటింగ్ప్రెస్కు తరలించారు. గురుకుల పాఠశాల అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నడిపించిన ఈ తతంగం ‘సాక్షి’ కంట పడడంతో ప్రింటింగ్ప్రెస్ నుంచి మరో స్థలానికి మార్చారు. సుమారు రూ.3.50 లక్షలకు పైగా విలువ చేసే వెయ్యి పుస్తకాలను ఆటోలో తరలించి, అమ్మకానికి పెట్టడం గమనార్హం. ఈ విషయమైన సంబధిత అధికారులను వివరణ కోరగా తమకేమీ తెలియదని బుకాయించడం విశేషం. నిబంధనలకు విరుద్ధంగా.. పేద విద్యార్థులు చదుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలను సరఫరా చేస్తోంది. ఐదో తరగతికి సంబంధించిన పుస్తకాల సెట్ ధర రూ.280 కాగా, ఆరో తరగతి రూ.363, ఏడో తరగతికి రూ.407, ఎనిమిదో తరగతికి రూ.520, తొమ్మిదో తరగతి పుస్తకాలకు రూ.584 చొప్పున ధర ఉంటుంది. అయితే, ప్రభుత్వం వీటిని ఉచితంగా సరఫరా చేస్తుంది. ఆయా పుస్తకాలపై ఫ్రీ అని కూడా ముద్రించి ఉంటుంది. ఆయా పుస్తకాలను పాఠశాలకు సరఫరా చేయగా, వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలి. ఏమైనా పుస్తకాలు మిగిలితే వాటిని నిబంధనల ప్రకారం రాష్ట్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి అధికారులు మాత్రం మిగిలిన పుస్తకాలను వెనక్కి పంపించకుండా బహిరంగ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి పుస్తకాలను బయట ఎట్టి పరిస్థితులో విక్రయించరాదు. కానీ, పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు బహిరంగ మార్కెట్లోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారు.. రెండు, మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ఈ సంవత్సరం 10వ తరగతి ప్రారంభం కానుంది. ప్రతి గురుకుల పాఠశాలలో ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో 40 మంది చొప్పున మొత్తం 80 మంది విద్యార్థులు ఉంటారు. కానీ కొన్ని స్కూళ్లలో 80 మంది విద్యార్థులు లేరు. ఈ క్రమంలో ప్రతి గురుకుల పాఠశాలకు సరఫరా చేసినట్లే ఆయా స్కూళ్లకు కూడా పుస్తకాలను సరఫరా చేశారు. ఇలా మిగిలి పోయిన పుస్తకాలను నిబంధనల ప్రకారం హైదరాబాద్లోని హెడ్ఆఫీస్కు తరలించాలి. చాలా చోట్ల పుస్తకాలను వెనక్కి పంపించారు. అయితే, జిల్లా కేంద్రంలో ఓ గురుకుల పాఠశాలకు సంబంధించిన పుస్తకాలను మాత్రం వెనక్కి పంపించలేదు. ఈ పుస్తకాలను విక్రయించేందుకు ఇటీవల ఆటోలో ఓ ప్రింటింగ్ ప్రెస్కు తరలించారు. వాస్తవానికి ఉచిత పుస్తకాలను అమ్మడం, కొనడం నేరం. కానీ, వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలని కొందరు యత్నించడం విశేషం. గత రెండేళ్లకు సంబంధించి మిగిలి పోయిన పుస్తకాలను విక్రయించేందుకు తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. విచారణ చేయిస్తా.. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పుస్తకాలను విక్రయించరాదు. మిగిలి పోయిన పుస్తకాలను హైదరాబాద్కు పంపించాలి. మా గురుకులాలకు సంబంధించిన పుస్తకాలు ఎవరైనా బయటకు విక్రయించినట్లు తెలిస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. క్లీన్ అండ్ గ్రీన్ కింద ఫర్నిచర్, ఇతర పనికి రాని వస్తువులను మాత్రమే ప్రత్యేక కమిటీ ద్వారా విక్రయించి, వచ్చిన డబ్బులు స్కూల్ ఖాతాలో జమా చేయాలి. పుస్తకాలు మాత్రం అమ్మరాదు. – సింధూ, రీజినల్ కో–ఆర్డినేటర్ -
ట్రెండ్స్ స్థలానికి ఎసరు
చిత్తూరు (జిల్లా పరిషత్), న్యూస్లైన్: తిరుపతిలోని మంగళంలో ట్రెండ్కు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు (ఏపీబీసీఎల్) కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం ఏపీబీసీఎల్, ట్రెండ్స్ మేనేజర్ జిల్లా కలెక్టర్ను కలిసి చర్చించారు. ప్రస్తుతం తిరుపతిలోని మంగళం గ్రామంలో ట్రెండ్స్కు 7 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ కోసం కొన్ని భవనాలు నిర్మించారు. ఇంకా కొంత స్థలం ఖాళీగా ఉంది. దాన్ని తమకు కేటాయించాలంటూ ఏపీబీసీఎల్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 1981లో చేతివృత్తులను ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణ ఇవ్వడం, వస్తువులు తయారు చేసి వాటి అమ్మకం ద్వారా ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో 20 ఎకరాల విస్తీర్ణంలో తిరుపతికి దగ్గరగా మంగళంలో ట్రెండ్స్ ను ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి యువతకు బుక్ బైండింగ్, ఉడ్ వర్క్స్ ద్వారా బెంచీలు, టేబుళ్లు, కప్బోర్డు తయారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉత్పత్తులను మార్కెట్ చేసేవారు. 1991లో టీటీడీకి 13 ఎకరాలు ఇచ్చారు. కాలక్రమంలో చేతివృత్తులపై మోజుతగ్గడం, ఇక్కడ పనిచేస్తూ నైపుణ్యం కలిగిన సిబ్బంది సొంతంగా వ్యాపారాలు పెట్టుకుని బయటకు వెళ్లిపోవడంతో శిక్షణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారు. అనంతరం అక్కడున్న సిబ్బందే వర్క్ ఆర్డర్లు తీసుకువచ్చి వాటి ద్వారా వచ్చే లాభాన్ని జీతాలుగా తీసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ట్రెండ్స్లో 16 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రెండ్స్ మూసివేయడం మినహా చేయగలిగిందేమీ లేదంటూ సెట్విన్ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ స్థలాన్ని ఏపీబీసీఎల్ తమకు కేటాయించాలని, దానిలో లిక్కర్ స్టాకు గోడౌన్ నిర్మించుకుంటామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ప్రస్తుతమున్న భవనాలు స్థలాన్ని ఏపీబీసీఎల్కు కేటాయించడం వల్ల ఆదాయం వస్తుందనే భావనలో ఉన్నట్లు సమాచారం. దీనికి అనుగుణంగానే గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ట్రెండ్స్, సెట్విన్. ఏపీబీసీఎల్ అధికారుల సమావేశంలో ఏపీబీసీఎల్కు ఇస్తే సరిపోతుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ స్థలాన్ని పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రాంగోపాల్ తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డిని ఆదేశించినట్లు తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement