-
పాస్ బుక్కులకు బ్రేక్!
♦ వెబ్ల్యాండ్ అప్డేషన్ తర్వాతే పంపిణీ ♦ ఈ -పాస్బుక్కులపై సర్కారు కసరత్తు ♦ రెవెన్యూ రికార్డులను సరిదిద్దకుండా జారీచేస్తే కొత్త సమస్యలు రాష్ర్టం ఏర్పడిన తర్వాత జిల్లాలో 60వేల పట్టాదారు పాసు పుస్తకాలను రెవెన్యూ యంత్రాంగం ముద్రించింది. వీటిలో ఇప్పటివరకు దాదాపు 35వేల మంది రైతులకు అందజేసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11,12,029 సర్వేనంబర్లకు సంబంధించి ఆరు లక్షల క్లెరుుమ్లు అధికారుల దృష్టికి వచ్చారుు. వీటిన్నింటిని సవరించి కంప్యూటరీకరించడమే సవాలుగా మారింది. పట్టాదారు పాస్పుస్తకాల జారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ నేపథ్యంలో పాస్పుస్తకాల జారీని నిలిపివేసింది. త్వరలోనే ఈ-పాస్ బుక్కులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న సర్కారు.. ప్రస్తుతం జారీచేస్తున్న వాటికి మంగళం పాడాలని నిర్ణరుుంచింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ రేమాండ్పీటర్ ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లాలో పాసుపుస్తకాల పంపిణీ ఆగిపోరుుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దాదాపు ఏడాదిపాటు కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం జారీ చేయలేదు. ప్రభుత్వ చిహ్నం మార్పు తదితర కారణాల వల్ల పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. దీంతో భూ క్రయవిక్రయాలు జరిగినా యాజమాన్య హక్కుల్లో కీలకంగా భావించే పాసు పుస్తకాలను ఇవ్వకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పట్లో కష్టమే! తప్పులతడకగా ఉన్న రెవెన్యూ రికార్డులను సరిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకనుగుణంగా ప్రతి భూమి చరిత్ర, పట్టాదారు, అనుభవదారులు, పహనీల్లో నమోదైన పేర్లను కంప్యూటరీకరించాలని భావించింది. ఈ మేరకు వెబ్ల్యాండ్ అప్డేషన్ పేరిట సాఫ్ట్వేర్ను రూపొందించింది. దీనికి అనుగుణంగా క్షేత్రస్థారుులో సర్వే చేసిన రెవెన్యూ సిబ్బంది ప్రతి సర్వే నంబర్ భూమి పుట్టుపుర్వోత్తరాలను సేకరించారు. అదేసమయంలో రికార్డుల్లో మార్పులు, చేర్పులను కూడా నమోదు చేసుకున్నారు. ఇవేకాకుండా అభ్యంతరాలను కూడా తెలుసుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న 11,12,029 సర్వేనంబర్లకు సంబంధించి ఆరు లక్షల క్లెరుుమ్లు అధికారుల దృష్టికి వచ్చారుు. వీటిన్నింటిని సవరించి కంప్యూటరీకరించడం ద్వారా రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా తయారు చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఇంతవరకు ప్రక్రియ సజావుగానే సాగినా.. సేకరించిన సమాచారాన్ని కంప్యూటరీకరించడం రెవెన్యూ అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ఆరు లక్షల క్లెరుుమ్లు జిల్లావ్యాప్తంగా ఆరు లక్షల సవరణలు రావడం, వీటన్నింటిని కంప్యూటర్లలో అప్లోడ్ చేయడంలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దీంతో వెబ్ల్యాండ్ అప్డేషన్ లో జిల్లా వెనుకబడింది. ఈ ప్రక్రియంతా పూర్తరుుతేనే.. ఈ -పాస్పుస్తకాల జారీకి సార్థకత చేకూరుతుంది. క్షేత్రస్థారుులో వెలుగులోకి వచ్చిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సవరించిన వాటినీ కంప్యూటరీకరించకుండా ఈ- పట్టాదారు పాస్పుస్తకాలను ఇవ్వాలనుకుంటే మాత్రం సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ -పుస్తకాల్లోనే సమగ్ర సమాచారాన్ని పొందుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా పట్టాదారుకు సంబంధించిన పహనీల్లో సదరు భూమిపై ఏమైనా రుణాలు తీసుకున్నారా? బ్యాంకుల్లో ఏమైనా కుదవ పెట్టారా? తదితర సమాచారాన్ని కూడా ఆ పుస్తకంలో నమోదు చేయనున్నారు. ఈ సమాచారాన్ని ఆన్ లైన్ లో ఎవరైనా పరిశీలించుకునే వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు, ఇతరులు కూడా సంబంధిత సర్వే నంబర్ భూమి వివరాలను ఆన్ లైన్ లో పరిశీలించుకోవచ్చు. రికార్డులన్నీ సవరించిన తర్వాత ఈ -పాస్ పుస్తకాలను జారీచేస్తే బాగుంటుంది తప్ప.. వాటిని గాలికొదిలేసి.. ప్రస్తుతం మాన్యువల్గా ఇస్తున్న పీటీ బుక్కులను నిలిపివేయాలనే నిర్ణయం సరికాదని రైతులు అంటున్నారు. -
పాలన పడక
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మెతుకుసీమ యంత్రాంగం ‘కునుకు’తీస్తోంది. ఫలితంగా జిల్లాలో పాలన పడకేసింది. ఒక్క పనీ సరిగా సాగడం లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రజలకు అధికారులకు మధ్య అంతరం పెరుగుతోంది. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు గట్టిగా అదిలించి చేయిస్తున్నవి తప్ప మిగతావన్నీ పెండింగ్లో పడుతున్నాయి. జిల్లాలోని రెవెన్యూ, పంచాయితీ తదితర అన్ని ముఖ్య విభాగాల్లో కలిపి దాదాపు 3 లక్షల అర్జీలు, వేల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులకు ఇచ్చే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మొదలు రైతులకు ఇవ్వాల్సిన భూ పట్టాదారు పాసు పుస్తకాల వరకు జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారుల ఇష్టారాజ్యంతో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల అమలు మందగిస్తోంది. ఏ విభాగం చూసినా అధికారిక నివేదికలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతనే ఉండటం లేదు. గతంలో అధికారులు భయానికో, భక్తికో దివగస్థాయి ప్రజా ప్రతినిధుల ఫోన్కాల్స్ను ఎత్తి ఫిర్యాదులు స్వీకరించే వారు. కానీ ఈ ఫ్రెండ్లీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల కాల్స్ తప్పితే మిగిలిన వారిని అసలు లెక్కే చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఎప్పుడొస్తారో.. ఎప్పుడు వెళ్తారో.. జిల్లా అత్యున్నత స్థాయి అధికారులంతా క్షేత్రస్థాయి అధికారులే.. అంటే, వారంలో కనీసం రెండు, మూడుసార్లు పల్లెలకు వెళ్లి ప్రజల గోడు వినాలి. వారి సమస్యలకు పరిష్కారాలు అన్వేషించాలి. కానీ అధికార యాంత్రాంగం ప్రజలకు దూరంగా గడుపుతోంది. సమస్యలను చెప్పుకోవడం కోసం జనం కలెక్టరేట్కు వచ్చినా ‘సార్లు’ దొరకటం లేదు. పోనీ కార్యాలయంలో ఉంటున్నారా? అంటే అదీ లేదు. జిల్లా ఉన్నతాధికారులంతా హైదరాబాద్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కీలక శాఖల అధికారులంతా తమ సమయ పాలనను ‘అత్యున్నత స్థాయి అధికారి’ దిన చర్యతో సెట్ చేసుకున్నారు. ఆయన రాకకు పావుగంట ముందు, ఆయన వెళ్లిన పావుగంట తరువాత వచ్చివెళ్లిపోతున్నారు. దీంతో ముఖ్య అధికారులు కార్యాలయంలో గడిపే సమయం 3-4 గంటలకు మించటం లేదు. అంతా ఓకే అంటూ లేఖలు! గ్రీవెన్స్ సెల్ దాదాపు నిర్వీర్యమైపోయింది. ఉన్నతాధికారులు గ్రీవెన్స్కు.. దిగువ స్థాయి సిబ్బందిని పంపుతున్నారు. ప్రజావాణి ద్వారా ఈ ఐదేళ్లలో 5552 ఫిర్యాదులు రాగా.. అన్నీ పరిష్కరించినట్లు, 178 మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు నివేదికల్లో పొందుపరిచారు. సమస్యకు పరిష్కారం చూపకుండానే ‘మీ సమస్య పరిష్కరించడమైనది’ అంటూ ఉత్తరాలు పంపుతుండటం ప్రజలను విస్మయపరుస్తోంది. జవాబుదారీతనం లేని పర్యటనలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో అత్యున్నత, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటి వరకు 200 సార్లు పర్యటించారు. అక్కడికి వెళ్లిన ప్రతి అధికారి ‘గడా’ ఓఎస్డీ ఇచ్చిన నివేదికలను చూడటంతోనే సరిపెడుతున్నారు. వారికి ప్రజ ల్లోకి వె ళ్లాలనే ఆలోచనే రావట్లేదు. సీఎం రూ.3వేల కోట్లకుపైగా నిధులు తన నియోజకవర్గానికి గుమ్మరించారు. కానీ జరుగుతున్న పనులను వేళ్లపై లెక్కించవచ్చు. ఇక్కడే ఇలా ఉంటే సాధారణ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యంతోనే గజ్వేల్ నియోజకవర్గంలో రైతు, సాధారణ ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలున్నాయి. ఇక, ఈ సీజన్లో పాముకాటు మరణాలూ ఆందోళన కలిగిస్తున్నాయి. పాముకాటు మందులు అన్ని ఆసుపత్రిల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నా.. బాధితులు చికిత్సకు వెళ్తుంటే వైద్యులు చేతులెత్తేస్తున్నారు. కల్తీ విత్తనాలు కూడా గజ్వేల్లోనే ఎక్కువగా పట్టుపడుతున్నాయి.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజంపేట లో అశేష ప్రజా స్పందన
కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు
భారత టాప్ రెజ్లర్పై సస్పెన్షన్ వేటు
గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు
పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించండి: సీఎం జగన్
కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మోదీ, రాహుల్ గాంధీలకు ‘బహిరంగ చర్చ’ ఆహ్వానం
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement