-
కొద్దిసేపు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికారాలను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్(57)కు శుక్రవారం కొద్దిసేపు బదిలీ చేశారు. సాధారణ ఆరోగ్య పరీక్షలో భాగంగా కలనోస్కోపీ కోసం వైద్యులు ఆయనకు మత్తు మందు (అనస్తీషియా) ఇవ్వడమే ఇందుకు కారణం. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా బైడెన్ రికార్డుకెక్కారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 79వ పడిలోకి ప్రవేశించారు. వాషింగ్టన్ శివారులోని వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో చేరారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు స్పృహలో లేనిపక్షంలో ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. బైడెన్కు శుక్రవారం మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆయన కొంతసేపు స్పృహలో లేరు. ఈ సమయంలో కమలా హ్యారిస్ వైట్హౌస్ వెస్ట్వింగ్లోని తన కార్యాలయం నుంచి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దేశ సర్వ సైన్యాధ్యక్షురాలిగా వ్యవహరించారు. అణ్వాయుధాల నియంత్రిత వ్యవస్థలతో కూడిన బాక్సు కూడా ఆమె సొంతమైనట్లు తెలుస్తోంది. పరీక్షల అనంతరం బైడెన్ స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాలన్నీ మళ్లీ ఆయనకే సంక్రమించాయి. 2002, 2007లో అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఇలాగే కలనోస్కోపీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు సందర్భాల్లో తన అధికార బాధ్యతలను ఉపాధ్యక్షుడు డిక్ చెనీకి బదిలీ చేశారు. -
భూమిలో కూరుకు పోయిన నంజనగూడు రథ చక్రం
భక్తుల్లో భయాందోళన గంటకు పైగా శ్రమించిన సాంకేతిక నిపుణులు మైసూరు, న్యూస్లైన్ : దక్షిణ కాశీ క్షేత్రంగా భాసిల్లుతున్న నంజనగూడులో శుక్రవారం అపశ్రుతి చోటు చేసుకుంది. నంజుండేశ్వర పంచ మహా రథోత్సవం సందర్భంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తున్న భారీ రథం చక్రం భూమిలో కూరుకుపోయింది. సంఘటనతో వేలాది మంది భక్తుల్లో భయాందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే... నంజుండేశ్వర బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం పంచ మహారథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 90 అడుగుల ఎత్తై రథం, 120 టన్నులు బరువైన రథం(గౌతమ)పై ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేసేందుకు సన్నాహాలు చేశారు. ఉదయం 5.30 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 8.30కు రథోత్సవం మొదలైంది. పాఠశాల వీధిలో రథం ముందుకు సాగుతుండగా 9.30 గంటలకు కుడివైపు ముందు చక్రం ఒక్కసారిగా భూమిలో కూరుకుపోయింది. రథం ఒక వైపు ఒరిగింది. సంఘటనతో భక్తులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. వెంటనే ఆలయ అధికారులు, పోలీసులు, సిబ్బంది అప్రమత్తమై రథం చుట్టు పక్కల భక్తులు ఎవరూ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రథం చక్రాన్ని వెలికి తీసేందుకు రైల్వే సహకారాన్ని తీసుకున్నారు. రైల్వే శాఖకు చెందిన సాంకేతిక నిపుణులు పెద్ద పెద్ద జాకీలను రథం కింద అమర్చారు. అనంతరం నాలుగు జేసీబీలను ఉపయోగించి 1.30 గంటల పాటు శ్రమించి రథాన్ని యథాస్థితికి తీసుకొచ్చారు. రథానికి ఈ ఏడాది రూ. 20 లక్షల వ్యయంతో రెండు కొత్త చక్రాలను అమర్చారు. కాగా, రథోత్సవానికి ఒక రోజు ముందే రూ. 25 లక్షల వ్యయంతో రోడ్డును మరమ్మతు చేశారు. పనులు నాసిరకంగా ఉండడంతో పాటు గత రాత్రి వర్షం కురవడంతో ఈ అపశ్రుతి చోటు చేసుకున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. కాగా, రథోత్సవానికి కర్ణాటక నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. తొలుత గణపతి రథం, తర్వాత శ్రీకంఠేశ్వర(గౌతమ), చండికేశ్వర, సుబ్రహ్మణ్య, చివరగా పార్వతమ్మ రథాలు ఒకదాని వెనుక ఒకటి వరుసగా భక్తులు లాగుతారు. గౌతమ రథంలో శ్రీకంఠేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని అధిష్ఠింపజేసి ప్రత్యేకంగా అలంకరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement