-
అపర భగీరథుడు ఆంధ్ర కేసరి
నేడు ‘టంగుటూరి’ జయంతి ఆంధ్రుల ఆవేశం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక ప్రకాశం పంతులు నేడు రాష్ట్రవ్యాప్తంగా అధికారిక జయంతి కార్యక్రమాలు 1953, ఫిబ్రవరి 13న ప్రకాశం బ్యారేజీకి శంకుస్థాపన బ్యారేజీ నిర్మాణంతో కృష్ణాడెల్టాకు తీరిన నీటి కరువు బతికుండగానే బెజవాడలో కాంస్య విగ్రహం దివిలోని గంగమ్మను భగీరథుడు భువికి రప్పిస్తే.. అక్కరకు రాకుండాపోతున్న కృష్ణమ్మను ఆయకట్టుకు అనుకూలం చేసి అపర భగీరథుడయ్యూడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిని వేరుచేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యూరు. అంతటి గొప్పవ్యక్తి జయంతి కార్యక్రమాలను రాష్ట్రమంతటా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి, విజయవాడ బ్యూరో : టంగుటూరి ప్రకాశం పంతులు పేరు వినగానే మొదట గుర్తొచ్చేవి రెండే రెండు. మొదటిది ప్రకాశం జిల్లా, రెండోది ప్రకాశం బ్యారేజీ. ఒంగోలుకు సమీపంలోని వినోదరాయునిపాలెంలో పుట్టిన టంగుటూరి బాల్యమంతా ఒంగోలు, అద్దంకి, నాయుడుపేట ప్రాంతాల్లోనే గడిచింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో పట్టభద్రుడయ్యాక ఆయన దృష్టి స్వాతంత్య్రోద్యమం వైపు మళ్లింది. 1928లో బొంబాయి చేరుకున్న సమైన్ కమిషన్పై ఉద్యమించి ‘ఆంధ్రకేసరి’గా గుర్తింపు పొందారు. ఉమ్మడి మద్రాసు నుంచి మన రాష్ట్రం విడిపోయాక కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. దీనికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టంగుటూరి బెజవాడ కేంద్రంగా కీలక రాజకీయాన్ని నెరిపి ఇక్కడి నుంచే పాలన కొనసాగించారు. కృష్ణాడెల్టా వరప్రదాయిని ప్రకాశం బ్యారేజీ అప్పట్లో కోల్కతా, బొబ్బిలి, విజయనగరం, వాల్తేరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి మద్రాసు, తిరుపతి, కంచి వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన వారు బెజవాడ చేరుకోగానే కృష్ణానది దాటేందుకు నానా అవస్థలు పడేవారు. ఒక్కోసారి పడవ ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు పోతుండేవి. 1952లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. నదీ ప్రవాహ వేగానికి బెజవాడ వద్ద నదికి అడ్డంగా కాటన్ నిర్మించిన కొండరాళ్ల ఆనకట్ట కొంతమేర కొట్టుకుపోయింది. అప్పట్లో ఇంజినీరుగా గుర్తింపు పొందిన వేపా కృష్ణమూర్తి పంటు మీద నదీ ప్రవాహంలోకి ప్రవేశించి గండిని పూడ్చే ప్రయత్నంలో నదిలో పడి కొట్టుకుపోయారు. ఈ సంఘటన ప్రకాశం పంతులును కదిలించింది. వెంటనే బ్యారేజీ కట్టాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులకు తోడు రైతాంగం నీటి తీరువా కింద చెల్లించిన వేల రూపాయలను జోడించి బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారు. సీఎం హోదాలో 1954 ఫిబ్రవరి 13న (భీష్మేకాదశి) బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత సీఎంగా పదవిలోకి వచ్చిన నీలం సంజీవరెడ్డి 1957 డిసెంబరు 24న బ్యారేజీని కృష్ణాడెల్టా ప్రజలకు అంకితమిచ్చారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, సర్కారు జిల్లాల మధ్య రాకపోకలు పెరిగాయి. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వల్ల ఏలూరు, కొమ్మమూరు, బకింగ్హాం కాల్వలు అభివృద్ధి చెంది కాకినాడ- మద్రాసు నగరాల మధ్య జలరవాణా మార్గం సులభతరమైంది. అంతేకాకుండా కృష్ణాడెల్టాలోని నాలుగు జిల్లాల రైతులు 13 లక్షల ఎకరాల్లో ఏటా మాగాణి సాగు చేసుకునేందుకు ప్రకాశం బ్యారేజీ వరదాయినిగా మారింది. ‘టంగుటూరి’ జీవితంలో ప్రధాన ఘట్టాలు న్యాయవాద వృత్తిలో స్థిరపడాలని కలలుగన్న ప్రకాశం పంతులుకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక రాత్రికి రాత్రి 50 కిలోమీటర్ల నడిచి మేనమామ దగ్గరికి వెళ్లినా ఫీజుకు అవసరమైన రూ.3 లభించలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి తన పట్టువస్త్రాన్ని తాకట్టు పెట్టి ఫీజు చెల్లించింది. ఈ ఘటన ఆంధ్రకేసరి మనసులో చిరస్థాయిగా మిగిలిపోయింది. తాను సీఎంగా పనిచేసిన రోజుల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. తన గురువు హనుమంతరావును చూసేందుకు ఒంగోలు నుంచి రాజమండ్రి వెళ్లిన ప్రకాశం తిరుగు ప్రయాణంలో కృష్ణానదిని దాటలేక వెనక్కి వెళ్లారు. ప్రియ శిష్యుడు వెళ్లిపోవడంతో బాధపడుతూ కూర్చున్న గురువు హనుమంతరావు తిరిగొచ్చిన ప్రకాశాన్ని చూసి పులికించిపోయి రాజమండ్రిలోనే ఉంచుకుని చదివించారు. 1949లో కారులో కృష్ణానది వరకు చేరుకున్న ప్రకాశం పంతులు నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న నదిని దాటి మద్రాసు వెళ్లాల్సి ఉంది. కారు డ్రైవర్ ముందుకు పోనిచ్చేందుకు భయపడుతుంటే ఆయనకు ధైర్యం చెప్పి కారును నీళ్లలోనే పోనిచ్చి ఆవలి ఒడ్డుకు చేరుకున్న ప్రకాశం ధైర్యాన్ని అప్పట్లోనే జనం అభినందించారు. 1951 జులై 23న బెజవాడలో ప్రకాశం పంతులు అభిమానులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి విమానంలో బయల్దేరిన ప్రముఖులందరూ వర్షం వల్ల నాగపూర్లోనే ఆగిపోయారు. మరుసటి రోజు బెజవాడ చేరుకున్న వీరంతా విగ్రహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆ రోజు ప్రకాశం పంతులు బెజవాడలోనే ఉండి విగ్రహం నెలకొల్పిన చోటకు వెళ్లలేదు. -
తూర్పు డెల్టాకు తాగునీరు విడుదల
విజయవాడ : కృష్ణా తూర్పు డెల్టా పరిధిలోని గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ కృష్ణా మెయిన్ కెనాల్ వద్ద నీటిపారుదల శాఖ తూర్పు డెల్టా డివిజన్ చీఫ్ ఇంజినీర్ సాంబయ్య లాంఛనంగా గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. తొలి దశగా 500 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నీటి ఒరవడిని దశలవారీగా పెంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్, డెప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్ రామకృష్ణ, తూర్పు డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారావు పాల్గొన్నారు. -
నీరంతా కడలిపాలు
=వాడింది తక్కువ.. వృథా ఎక్కువ =ఖరీఫ్కు వాడకం 68 టీఎంసీలు =సముద్రంలోకి వదిలింది 381 టీఎంసీలు =రబీకి అనుమతిచ్చే అవకాశం సాక్షి, విజయవాడ : జిల్లాలో ఈ ఏడాది సాగునీటి వాడకం కన్నా వృథానే ఎక్కువగా ఉంది. ఈ సీజన్ మొదట్లో డెల్టాకు ఇవ్వడానికి కూడా ప్రాజెక్టులలో నీరు లేని పరిస్థితి ఉండగా, రెండు నెలల కాలంలోనే పరిస్థితిలో మార్పు వచ్చింది. భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండు కుండల్లా ఉండగా, నిల్వ చేయలేక సముద్రంలోకి వదిలిన నీరు ఎక్కువగా ఉంది. ఖరీఫ్ తొలినాళ్లలో రైతన్నకు కష్టాలు... ఈ ఏడాది ఖరీఫ్ తొలినాళ్లలో రైతన్నకు కష్టాలు తప్పలేదు. ఏటా జూన్లో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది జూన్ 30కి నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. సాగర్లో నీటిమట్టం 510 అడుగులకు పడిపోవడంతో విభజనవాదులు కోర్టును ఆశ్రయించి సాగునీటి విడుదలపై స్టే తెచ్చారు. ఈ ఏడాది స్టే అమలులో లేదు. ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా తన విచక్షణతో నీటినిృవిడుదల చేయాలని హైకోర్టు సూచించినా ప్రభుత్వం స్పందించలేదు. నాగార్జునసాగర్లో నీటిమట్టం 520 అడుగులకు పైగా ఉన్నా నీటి విడుదలలో తాత్సారం చేసింది. అదే సమయంలో కొంత వర్షాలు పడటంతో రైతన్న ఊరట చెందాడు. జూలై 30న సాగర్ నుంచి నీటిని విడుదల చేయడం మొదలుపెట్టింది. ఈలోగా వరదలు పెద్ద ఎత్తున రావడం, ఆ తర్వాత భారీ వర్షాలు కురవడంతో ఇప్పటివరకు 381 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇప్పటివరకు ఖరీఫ్లో కృష్ణాడెల్టాకు 68 టీఎంసీల నీటిని వినియోగిస్తే.. సముద్రం పాలైన నీరు 381 టీఎంసీలు ఉంది. పూర్తికాని ‘పులిచింతల’.. అవకాశం లేని నీటి నిల్వ... పులిచింతల ప్రాజెక్టు పూర్తికాకపోవడం వల్ల అక్కడ క్రస్ట్ లెవల్ కన్నా ఎక్కువ నీటిని నిల్వచేసే అవకాశం లేకుండా పోతోంది. దీంతో నీరంతా వృథాగా సముద్రం పాలవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు 133 రోజుల ఖరీఫ్ పూర్తవగా అందులో 70 రోజులు సాగర్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా విడుదల చేయకుండానే నడిచిపోయింది. సెప్టెంబర్లో 17 నుంచి 24 వరకు రోజుకు లక్షా 20 వేల నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేశారు. గత వారంలో కూడా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మూడున్నర లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చింది. ప్రతిరోజూ పులిచింతల నుంచి ఎనిమిదివేల క్యూసెక్కులు దిగువకు వస్తుండగా, కీసర నుంచి ఐదువేల క్యూసెక్కులు వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నాగార్జున సాగర్ నుంచి నీటివిడుదల ఆపివేయాలని జిల్లా ఇరిగేషన్ అధికారులు కోరారు. దిగువ క్యాచ్మెంట్ ఏరియా నుంచి నీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఎప్పుడూ ఓవర్ఫ్లో ఉంటోంది. మరోవైపు వాయుగుండం కారణంగా శుక్రవారం నుంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నీటి అవసరం పెద్దగా ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జలాశయాలు పూర్తిస్థాయిలో ఉండటంతో రబీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement