-
మధుర స్మృతులతో తిరిగి వెళ్తున్నా..
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ బ్రిటన్ ప్రొఫెసర్ అనూహ్యంగా లాక్డౌన్తో భారత్లో చిక్కుకుపోయారు. విధిలేని పరిస్థితిల్లో భగవంతుడిపైనే భారం వేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతీ నిలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో 22 రోజులపాటు గడిపారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్గా తేలడంతో బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి లభించింది. క్వారంటైన్లో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు, వైద్య సేవలు, తన అనుభవాలను ప్రొఫెసర్ క్లైవ్ కుల్లీ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ► నా స్వస్థలం యూకేలోని బేబింగ్టన్ అనే చిన్న పట్టణం. వృత్తి రీత్యా జాగ్రఫీ ప్రొఫెసర్ని. విదేశాలను సందర్శించడం నా హాబీ. ప్రధాన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, విదేశాల సంస్కృతిని ప్రత్యక్షంగా గమనిస్తుంటా. తిరుమల శ్రీవారి దేవాలయాన్ని చూడాలనిపించి భారత్కు వచ్చా. ► మార్చి 23న తిరుపతి చేరుకున్న మరుసటిరోజే భారత్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దీంతో నన్ను క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అక్కడ 22 రోజులు ఉన్నా. నేను ఊహించిన దానికి, క్వారంటైన్లో పరిస్థితికి ఎంతో వ్యత్యాసం వుంది. విదేశాల్లో కూడా ఈ సౌకర్యాలను చూడలేదు. స్టార్ హోటల్స్ను తలపించేలా క్వారంటైన్లో వసతి సౌకర్యాలు ఉన్నాయి. క్వారంటైన్లో సౌకర్యాలు, వైద్య సేవలు ఎంతో బాగున్నాయని క్లైవ్ కుల్లీ రాసిన లేఖ ► వైద్య సిబ్బంది సేవలు, అధికారుల ప్రేమానురాగాల మధుర స్మతులతో స్వదేశానికి తిరిగి వెళ్తున్నా. వారి సేవ, ఆప్యాయత తలచుకుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేవరకు నిత్యం ప్రతి 30 నిమిషాలకు ఒకసారి నా గదికి వచ్చి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సిబ్బంది ప్రవర్తన, ప్రేమ మరువలేనివి. రక్త సంబంధీకులు కూడా ఇంత సేవ చేయలేరు. వారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. మరోసారి భారత్కు వచ్చినప్పుడు వారిని తప్పకుండా కలుస్తా. ► క్వారంటైన్ కేంద్రంలో నాణ్యమైన ఆహారంతోపాటు హాట్వాటర్, టీ, కాఫీ, కంపెనీ వాటర్ బాటిల్స్ అందించారు. నిత్యం గదిని శానిటైజర్స్తో శుభ్రపరుస్తూ దుప్పట్లు, టవళ్లు మార్చారు. తాజా కూరగాయలతో వండిన ఆహారం, పలు రకాల పండ్లు అందించారు. రోజుకు రెండుసార్లు స్నాక్స్, బిస్కెట్లు ఇచ్చారు. వైద్యులు సూచించిన పౌష్టికాహారాన్ని గది వద్దే అందించారు. ► క్వారంటైన్లో ఉండేవారి కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఏ అవసరం వచ్చినా మెసేజ్ చేస్తే సిబ్బంది వెంటనే వచ్చేవారు. ► క్వారంటైన్ కేంద్రంలో అందించే సౌకర్యాలు మన ఇంట్లో కూడా ఉండవు. ఒకసారి ఇక్కడకు వచ్చాక తిరిగి ఇంటికి వెళ్లాలన్నా సంకోచిస్తారు. అనుమానితులు క్వారంటైన్కు స్వచ్ఛందంగా వెళ్లి అధికారులకు సహకరించండి. ► రెండు సార్లు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్గా రావడంతో నన్ను డిశ్చార్జి చేసి రూ.2 వేలు నగదు ఇచ్చారు. ట్రీట్మెంట్, మంచి వసతి సౌకర్యాలు కల్పించి నగదు సాయం చేయడం అభినందనీయం. ► శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బ్రిటన్ వెళ్లేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రయాణించేందుకు క్వారంటైన్ కేంద్రం అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మా స్వస్థలానికి వెళ్తున్నా... బై..బై... -
టీవీ రిమోట్పై ఆధిపత్యం ఎవరిది?
టీవీ రిమోట్పై ఆధిపత్యం ఎవరిది? దీనికి సమాధానం దశాబ్దాలుగా తేలనేలేదు.. నాకా సీరియల్ కావాలి.. నేనీ మ్యాచ్ చూడాలి అంటూ కుటుంబాల్లో పోరాటం కొనసాగుతునే ఉంది.. సందట్లో సడేమియాలా ఇప్పుడో కొత్త పోటీదారు వచ్చింది.. భార్యా, భర్త, పిల్లల పోరాటం మధ్య కుక్క కూడా వచ్చి చేరింది.. నేనా డిస్కవరీ చానల్ చూడాలి అంటూ గయ్యిమంటోంది.. పైగా.. దీని కోసం ప్రత్యేకంగా ఇప్పుడు కొత్త రిమోట్ కూడా వచ్చేసింది.. అంటే.. మనతో సంబంధం లేకుండా దానికిష్టం వచ్చినట్లు చానల్స్ మార్చేస్తుందన్నమాట. బ్రిటన్కు చెందిన ప్రొఫెసర్ డగ్లస్, వాగ్ అనే పెట్ కంపెనీ కలిసి దీన్ని తయారుచేశాయి. కాళ్లతో నొక్కేటట్లుగా రూపొందించారు. వైర్లు వంటివాటిని కుక్కలు నమిలేయకుండా ఉండటానికి ఇందులో మందంగా ప్లాస్టిక్ కోటింగ్ వేశారు. ఇంట్లో కుక్కలను ఒంటరిగా వదిలివెళ్లినప్పుడు వాటికి ఉద్దేశించిన చానళ్లను అవి చూడటానికి ఈ రిమోట్ ఉపయోగపడుతుందని డగ్లస్ చెబుతున్నారు. ఇప్పటికే కుక్కలకు దీన్ని ఇచ్చి.. వాడేలా చూశారు.. సానుకూల ఫలితాలు వ చ్చాయట. ఇటీవల బ్రిటన్లో జరిపిన ఓ సర్వేలో కుక్కలు తమతోపాటు సోఫాలో కూర్చుని టీవీ చూస్తాయని 91 శాతం మంది చెప్పారు. ప్రతి కుక్క రోజులో సగటున ఒక గంట 20 నిమిషాల సమయాన్ని టీవీ చూడటానికి వెచ్చిస్తుందట. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ రిమోట్ ధర రూ.4500.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement