-
క్రేజీ కపుల్ భారత యాత్ర!
వయసేమో డెబ్భయ్ మూడు. గుండె ఆపరేషన్ జరిగి నెలలు కూడా కాలేదు. ఇంతలోనే... మూడు చక్రాల కారేసుకుని... దేశం కాని దేశమంతా తిరిగేస్తానని ఎవరైనా అంటే మీరేమంటారు? మతిగానీ పోయిందా? అనేస్తాం. ఒకరు కాకుండా ఓ జంట ఇలా బయలుదేరితే.. క్రేజీ కపుల్ అనాల్సిందే. వాళ్లే.. అలన్ బ్రాత్వెయిట్, పాట్ బ్రాత్వెయిట్! అరవై ఏళ్ల తరువాత జీవితం చివరకు వచ్చేసినట్లే అని భూమికి ఒక దిక్కున ఉన్న వాళ్లు అనుకుంటారు. కానీ మరో దిక్కున ఉన్న వాళ్లకు మాత్రం అప్పుడే అసలైన జీవితం మొదలైనట్లు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం అలన్, పాట్ బ్రాత్వెయిట్ దంపతులు. బ్రిటన్కు చెందిన వీరు నాలుగు రోజుల క్రితం భారత్లో ఓ సాహసయాత్ర మొదలుపెట్టారు. సాహసయాత్ర అని ఎందుకు అనాల్సి వస్తుందంటే.. కచ్చితంగా మూడు నెలల క్రితమే ఆలన్కు ఓపెన్హార్ట్ సర్జరీ జరిగింది. విమానం ఎక్కవచ్చు అని డాక్టర్లు సర్టిఫై చేయడమే తడవు.. రెండేళ్లుగా వీరు చాలా జాగ్రత్తగా, ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేసుకున్న ‘ద ట్రాన్స్ ఇండియా ఛాలెంజ్’ కోసం భారత్కు విచ్చేశారు. ఫిబ్రవరి ఒకటవ తేదీ వీరి సాహసయాత్రకు కావాల్సిన మూడు చక్రాల కారు ముంబైకి చేరుకుంది. మీరు చదివింది కరెక్టే.. ఎప్పుడో 1909లో నిర్మించి.. 2011లో మళ్లీ లాంచ్ చేసిన మూడు చక్రాల ‘మోర్గన్’ కారులోనే వీరు భారత్ మొత్తం తిరిగేయనున్నారు. ముంబై నుంచి బయలుదేరిన అలన్, పాట్లు సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బిట్రిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ క్రేజీ కపుల్ తమ సాహసయాత్ర తాలూకూ ఉద్దేశాలు.. వివరాలు వెల్లడించారు. మోర్గన్ను చూపించాలనే..! నిజానికి అలన్, పాట్లకు భారత్ కొత్తేమీ కాదు. అలన్ వాళ్ల అమ్మ కర్ణాటకలోని బెల్గామ్ లో జన్మిస్తే అమ్మమ్మ పుట్టింది మైసూరులో. తాత, అమ్మమ్మల పెళ్లి జరిగింది ముంబైలోనైతే.. అలన్ తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంది సిమ్లాలో. అప్పట్లో అలన్ తండ్రి బ్రిటిష్ సివిల్ సర్వీసెస్ అధికారి. ఈ నేపథ్యంలో తాము గతంలో రెండుసార్లు (2013, 2017) ఇండియాకు.. మరీ ముఖ్యంగా బెల్గామ్కు వచ్చామని అలన్ తెలిపారు. 2017లో బెల్గామ్ నుంచి కేరళకు వెళుతూండగా.. బెంగళూరుకు చెందిన కొందరు హ్యార్లీ డేవిడ్సన్ మోటర్బైక్లలో ఆయనకు ఎదురయ్యారు. ‘‘ఆ మోటర్ బైక్ల చేస్తున్న ధ్వనులు.. నడుపుతున్న వారి ఉత్సాహం చూసిన నాకు.. అకస్మాత్తుగా వీళ్లకు.. బ్రిటన్లో తయారైన మోర్గన్ కార్లు చూపించాలి అనిపించింది’’ అంటారు అలన్. అలా ఈ ట్రాన్స్ ఇండియా ఛాలెంజ్కు బీజం పడిందన్నమాట! ‘ద ట్రాన్స్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా మోర్గన్ కారులో హైదరాబాద్ చేరుకున్న అలన్, పాట్ బ్రాత్ వెయిట్ దంపతులు స్వచ్ఛంద సంస్థ గూంజ్ కోసం మోర్గన్ కారులో భారత్లో తిరగాలన్న ఆలోచన మొదలైన తరువాత ఈ యాత్రకు ఏదైనా ఒక లక్ష్యం ఉండాలని అలన్ నిర్ణయించుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ’గూంజ్’ ఆయన కళ్లల్లో పడింది. నగరాలు వ్యర్థాలుగా పారబోసే వస్తువుల సాయంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనకు, గ్రామీణులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు కృషి చేస్తున్న ‘గూంజ్’ కోసం రెండు లక్షల పౌండ్ల (1.86 కోట్ల రూపాయలు) నిధులు సేకరించాలని అలన్, పాట్లు నిర్ధారించుకున్నారు. తమ సాహసయాత్రకు సంబంధించిన డాక్యుమెంటరీని తీసి దాన్ని అమెజాన్ ప్రైమ్ వంటి ప్లాట్ఫార్మ్లకు అమ్మగా వచ్చే డబ్బును గూంజ్కు ఇవ్వాలన్నది ప్లాన్. తద్వారా గూంజ్ చేస్తున్న పనుల గురించి భారత్తోపాటు ప్రపంచమంతా తెలుస్తుందని.. వాళ్లు తమ కార్యకలాపాలను మరింత విస్తరించవచ్చునని అలన్ తెలిపారు. దీంతోపాటు రాల్ఫ్ లారెన్, మోర్గన్ మోటర్ కంపెనీ, యూకే విదేశీ, కామన్వెల్త్ కార్యాలయాలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి. ఇదీ ప్రస్థానం..! భారత్లో 34 రోజుల్లో 5600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలన్నది అలన్, పాట్ల ప్రణాళిక. ముంబై నుంచి హైదరాబాద్... అక్కడి నుంచి ఖమ్మం మీదుగా రాజమండ్రి.. ఆ తరువాత విశాఖకు యాత్ర కొనసాగుతుంది. విశాఖ నుంచి కోల్కతా.. అక్కడి నుంచి న్యూఢిల్లీ వెళతారు. దేశ రాజధాని నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి మహారాష్ట్రలోని పాల్గర్ వచ్చి ఆ తరువాత ముంబైకి చేరడంతో యాత్ర ముగుస్తుంది. యాత్రను చిత్రీకరించేందుకు అలన్, పాట్ల మోర్గన్ కారును మరికొన్ని వాహనాలు అనుసరిస్తూంటాయి. నాలుగు రోజుల యాత్ర అనుభవాలేమిటన్న ప్రశ్నకు అలన్ సమాధానమిస్తూ.. ఆగిన ప్రతిచోట జనాలు బోలెడన్ని సెల్ఫీలు తీసుకుంటున్నారని ఈ లెక్కన చూస్తే తన యాత్ర సఫలమైనట్లేనని వ్యాఖ్యానించారు. రహదారులు కొన్నిచోట్ల ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మొత్తమ్మీద యాత్ర సజావుగానే సాగుతోందని ముక్తాయించారు. – గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
నములుతుంటే.. పంటి కింద పన్నొచ్చింది!
ఏదైనా తింటుంటే పంటికింద రాయి వస్తేనే కలుక్కుమంటుంది. అలాంటిది తినే సమయంలో పంటి కింద పన్ను తగిలితే.. ఆహారంలో ఏకంగా మానవదంతం కనిపిస్తే.. ఆ ఫుడ్ను చూస్తేనే అసహ్యం కలుగుతుంది. తినాలనిపించదు. అచ్చం ఇలాంటి అనుభవం ఈ బ్రిటన్ జంటకు ఎదురైంది. డేవ్ బరోస్, అతని ప్రియురాలు స్టెఫానీ మెక్డొనౌగ్ వర్సెస్టెర్షైర్లోని ఓ చైనీస్ రెస్టారెంట్లో ఫుడ్ పార్శల్ తీసుకొని ఇంటికి వెళ్లారు. పోర్క్ (పంది మాంసం)తో తయారుచేసిన చైనీస్ ఫుడ్ మంచి రుచిగా ఉంటుంది లాగించేద్దామనుకున్నారు. కానీ ఫుడ్ తింటుంటే వాళ్లకు చిన్నపాటి వింత వస్తువు దర్శనమిచ్చింది. దానిని తేరిపారా చూస్తే.. అది మానవదంతం అని తేలింది. అది కొంపదీసి తమ పన్ను కాదు కదా! అని వారు మొదట భయపడ్డారు. ఫుడ్ తింటుంటే తమ పన్ను ఊడలేదని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే రెస్టారెంట్కు ఫోన్ చేసి.. ఇదేందయ్యా.. చైనీస్ ఫుడ్లో పన్ను కూడా పంపించావని ప్రశ్నించారు. దానికి.. అది పన్ను అయి ఉండదని, పోర్క్ ఎముక ముక్కో, ఉల్లిగడ్డ ముక్కో అయి ఉంటుందని మేనేజర్ బుకాయించాడు. దీంతో ‘వర్సెస్టెర్లోని న్యూటౌన్ చెనీస్ రెస్టారెంట్ ఫుడ్ను ఎవరూ వాడకండి. వారి ఫుడ్లో పన్ను వచ్చింది. ఇదేంటని అడిగితే అది పన్ను కాదు ఎముక, లేదా ఉల్లిగడ్డ ముక్క అంటూ బుకాయిస్తున్నారు. ఇదిగో చూడండి ఫుడ్లో పన్ను ఫొటోలు’అంటూ స్టెఫానీ పోస్ట్ చేసింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
53లో నిశ్చితార్థం.. 16లో పెళ్లి!
పేరెంట్స్ బెదిరింపుల కారణంగా విడిపోయిన ప్రేమజంట.. 63 ఏళ్ల తర్వాత తిరిగి ఒక్కటైంది. ఆమె పేరు హెలెన్ ఆండ్రీ. అతను డేవ్ మాక్స్. కాలేజ్ మేట్స్. ఆర్ట్స్ కాలేజీలో చదువుకునేటప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. చదువు పూర్తయిన వెంటనే, అంటే 1953లో ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయం తెలుకున్న అమ్మాయి తల్లిదండ్రులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘పనీపాటాలేని వెధవ నిన్నెలా పోశిస్తాడనుకున్నావ్?’ అని హెలెన్ ను తిట్టి, బెడ్ రూమ్ లో బంధించారు. అటు డేవ్ మాక్స్ పేరెంట్స్ ఓకే చెప్పినా పెళ్ళి చేసుకునే మార్గాలన్నీ మూసుకుపోయాయి. 63 ఏళ్ల తర్వాత.. డిజైనర్ గా మంచి పేరుతోపాటు సొంత ఫ్యాబ్రిక్ కంపెనీని ఏర్పాటుచేసుకున్న హెలెన్.. 2010లో రిటైర్మెంట్ తీసుకుంది. శేషజీవితాన్ని గడిపేందుకు కూతురి ఊరైన డెర్బీషైర్ కు వెళ్లింది. ఆ ఊళ్లోని ఆర్ట్స్ కాలేజీలోనే హెలెన్, డేవ్ లు కలిసి చదువుకుంది! ఓ రోజు యథాలాపంగా కాలేజీకి వెళ్లిన హెలెన్ కు అక్కడో శిల్పం, దానిమీద ‘మాక్స్’అనే సంతకం కనిపించాయి. అంతే, ఒక్కసారిగా కూలబడి కన్నీరు విడిచింది. పక్కనే ఉన్న మనుమరాలికి ప్రేమకథ మొత్తం చెప్పేసింది. అప్పుడా మనుమరాలు ‘మాక్స్’శిల్పి కోసం తీవ్రంగా గాలించింది. చివరికి ఆ శిల్పి మరెవరోకాదు.. డేవ్ మాక్స్ చిన్న కొడుకని తేలింది. అలా ఇద్దరూ ఇద్దరికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. హెలెన్ తో ఎంగేజ్ మెంట్ రద్దయిన మూడేళ్లకు డేవ్ మాక్స్ కు ఆర్ట్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. 1956లో వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మొదటిభార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది నెలల కిందటే ఆవిడకూడా ప్రాణాలు విడిచింది. 86 ఏళ్ల వయసులో ఒంటరిగా జీవిస్తోన్న డేవ్ ను.. తొలిప్రేయసి హెలెన్ కు సంబంధించిన కబురు మళ్లీ యవ్వనంలోకి లాక్కెళ్లింది. డేవ్ తో ఎంగేజ్ మెంట్ రద్దయిన తర్వాత ఉన్నత చదువులపై దృష్టిసారించిన హెలెన్ 1960లో పెళ్లిచేసుకుంది. ముగ్గురు పిల్లలు పుట్టాక భర్త నుంచి వేరైంది. తర్వాత మరో రెండు పెళ్లిళ్లు చేసుకుంది. 2010లో హెలెన్ మూడో భర్త చనిపోయిన సమచానికే డిజైనర్ గా రిటైర్మెంట్ తీసుకున్న ఆమె.. కూతురు నివసించే ఊరికి వెళ్లి అనూహ్యంగా తొలి ప్రేమికుడిని కలుసుకుంది. 1953లో నిశ్చితార్థం చేసుకున్న హెలెన్, డేవ్ లు 2016లో పెళ్లి చేసుకున్నారు. గత జీవితంలో ఎంత మందిని పెళ్లాడినా తన మనసు మాత్రం తొలి ప్రేమికుడిచుట్టూ తిరిగేదని, ఇన్నేళ్ల తర్వాత అతణ్ని కలుసుకోవడం తనను తాను వెతుక్కున్నట్లుందని హెలెన్ చెప్పారు. ‘వాళ్ల పేరెంట్స్ తీరు ఆక్షేపణీయమే. పారిపోవడం తప్ప మాకు వేరే దారిలేదప్పుడు. కానీ మేం ఆ పని చేయలేకపోయాం. ఇన్నాళ్లకు నా తొలిప్రేమ దక్కినందుకు సంతోషంగా ఉంది’అని డేవ్ అంటున్నారు. వాటె లవ్ స్టోరీ కదా! హెలెన్, డేవ్ ఎంగేజ్ మెంట్ నాటి ఫొటో..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement