-
మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్’ ఉడకదురా: చిరు
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్తో ఇళ్లకే పరమితమైన సెలబ్రిటీలు కుటుంబ సభ్యుల మధ్య ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా హీరో రామ్చరణ్ తన నాన్నమ్మ అంజనాదేవి నుంచి వెన్న తీయడం నేర్చుకుని మంచి మార్కులు కొట్టేశాడు. అయితే ఆ వీడియోను మెగాస్టార్ చిరంజీవి రీ ట్వీట్ చేస్తూ కామెంట్ చేశారు. (కిచెన్లో రామ్చరణ్.. ఏం చేస్తున్నాడో చూడండి) ‘మైడియర్ బచ్చా... మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్’ ఉడకదురా, ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. బట్టర్ ఎంత మంచిగా చేసినా, నీ స్థానం మాత్రం బెట్టర్ అవ్వదు’ అంటూ చిరంజీవి తనదైన రైమింగ్తో ట్వీట్ చేశారు. బచ్చా, బట్టర్, బెట్టర్ అంటూ ప్రాసతో కుమారుడి మీద ఉన్న ఆప్యాయతను, అమ్మ మీద ఉన్న ప్రేమను చూపించడంతో.. మీ టైమింగ్ 'రచ్చహ రచ్చస్య రచ్చోభ్యహ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫస్ట్ ప్లేస్ స్థానంలో అదే గ్యారంటీ నాకు మీ అమ్మ సురేఖ దగ్గర లేదనుకో అంటూ చిరు ఛమత్కరించారు. -
కిచెన్లో రామ్చరణ్.. ఏం చేస్తున్నాడో చూడండి
హైదరాబాద్ : లాక్డౌన్తో ఇళ్లకే పరమితమైన సెలబ్రిటీలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు వర్క్ అవుట్స్లో బిజీగా ఉంటే మరి కొందరు వంట గదిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా హీరో రామ్చరణ్ కూడా కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చారు. తన తల్లి, నాన్నమ్మ నుంచి వెన్న తీయడం నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను రామ్చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ తన తల్లి సురేఖ, నాన్నమ్మ అంజనాదేవి పర్యవేక్షణలో వెన్న తీయడం పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేసేందుకు ప్రారంభించిన బి ది రియల్ మ్యాన్ చాలెంజ్ను రామ్చరణ్ విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇళ్లు క్లీన్ చేయడం, మొక్కలు నీళ్లు పట్టడంతోపాటుగా.. తన భార్య కాఫీ కూడా పెట్టి ఇచ్చారు. సినిమాల విషయానికి వస్తే.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరో హీరో ఎన్టీఆర్తో కలిసి ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చదవండి : ప్రేమలే కాదు పనులూ పంచుకుందాం -
డెయిరీ కళకళ
కర్ణాటక నుంచి పాల వెల్లువ నిత్యం 40 ట్యాంకర్ల వరకు రాక ఇప్పటివరకు 60 లక్షల లీటర్లు సరఫరా పూర్తిస్థాయిలో పనిచేస్తున్న పాల పొడి ఫ్యాక్టరీ డెయిరీకి పెరగనున్న ఆదాయం ఒంగోలు డెయిరీకి మంచి రోజు లొచ్చాయి. ఉద్యోగులకు చేతిని ండా పనిదొరికింది. వారానికి రెండు రోజులు పనిచేసే పాల పొడి ఫ్యాక్టరీ గత పదిరోజుల నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తోంది. పాల పొడి, వెన్న తయారీ కోసం కర్ణాటక నుంచి పాలు వెల్లువలా వస్తున్నాయి. అక్కడ పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుండటంతో పాల పొడి తయారీ, వెన్న తయారీ కోసం ప్రకాశం జిల్లా ఒంగోలు డెయిరీకి తెప్పిస్తున్నారు. కనీసం రోజుకు 30 నుంచి 40 ట్యాంకర్లు అక్కడ నుంచి వస్తున్నాయి. కేజీ పాల పొడి తయారీకి రూ.30, కేజీ వెన్న తయారీకి రూ.15 డెరుురీకి చెల్లిస్తారు. ఈ లెక్కన ఒంగోలు డెయిరీకి రోజుకు నాలుగు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. గత పది రోజులుగా కర్ణాటక నుంచి 60 లక్షల లీటర్ల పాలు వచ్చాయి. రూ.45.50 లక్షల వరకు ఆదాయం సమకూరింది. కర్ణాటక పాలతో కళకళ జిల్లాలో పాడిపరిశ్రమ గత రెండు, మూడేళ్లుగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పాల దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం డెయిరీకి వస్తున్న పాలకు బయట బాగా డిమాండ్ ఉండటంతో పాల పొడి, వెన్న తయారీకి పాలు మిగలని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా ఒంగోలు డెయిరీకి పాల పొడి తయారీ కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నిత్యం పెద్ద సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి పాల ట్యాంకర్లు వస్తుండటంతో డెయిరీ కళకళలాడుతోంది. ట్యా ంకర్లను నిలిపేందుకు కూడా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. అన్సీజన్లో అంతంతమాత్రమే.. ఒంగోలు డెయిరీలో 20 సంవత్సరాల క్రితం రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేసి పాల పొడి ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల టన్నుల పాల పొడి, వెన్న తయారుచేసే సామర్థ్యం ఫ్యాక్టరీకి ఉంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి వస్తున్న పాల వల్ల ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. సాధారణంగా పాల సీజన్లో మాత్రమే ఈ ఫ్యాక్టరీ 24 గంటలూ పనిచేస్తుంది. ఈసారి సీజన్ ప్రారంభమైనా జిల్లాలో పాల ఉత్పత్తి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వర్షాభావ పరిస్థితులు జిల్లాను వెంటాడుతుండటమే అందుకు కారణం. అన్ సీజన్లో అరుుతే ఫ్యాక్టరీ కేవలం వారానికి రెండు రోజులు పనిచేస్తుంది. స్థానిక పాలతో పాల పొడి, వెన్న తయూరుచేస్తుంది. ఫ్యాక్టరీ ఏ మేరకు పనిచేస్తే ఆ మేరకు డెయిరీకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్ణాటక పాలతో రోజుకి 35 టన్నుల పాల పొడి, 15 నుంచి 20 టన్నుల వెన్న తయారు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశముంటుందని డెయిరీ ఎండీ శివరామయ్య తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement