-
ఆ పార్టీలను ఓడించండి: బీవీ రాఘవులు
సాక్షి, నిజామాబాద్నాగారం: సామాజిక తెలంగాణ సాధన కోసం ఏర్పడిన బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పోలీటీబ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిని ఓడించాలని కోరారు. మంగళవారం బీఎల్ఎఫ్, సీపీఎం, ఎంబీటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మూన్నూరుకాపు కల్యాణమండపంలో నిర్వహిం చిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ జిల్లా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశాయన్నారు. జిల్లాకు కొత్తగా పరిశ్రములు తీసుకరాకపోగా ఉన్న పరిశ్రమలను మూసేసి, యు వతకు ఉద్యోగావకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేసి కార్మికులను రోడ్డున పడేశారని, పసుపుశుద్ధి కర్మాగారం కలగానే మిగిలి పోయిందన్నారు. అవకాశవాద రాజకీయాలను తిప్పికొట్టి సామాజిక న్యా యాన్ని, సమగ్రాభివృద్ధిని కాంక్షించే బీఎల్ఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్, ఎస్.రమ, సీపీఎం జిల్లా అధ్యక్షుడు రమేశ్బాబు, ఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి సాయిబాబా, సీపీఐ జిల్లా కార్యదర్శి మార్టిన్రాజు, టీమాస్ కన్వీనర్ పెద్ది వెంకట్రాములు, బీఎల్ఎఫ్ అభ్యర్థులు ఇస్మాయిల్, నూర్జహాన్, మధుకర్, నేతలు మాల్యల గోవర్ధన్, వెంకటేశ్, లత పాల్గొన్నారు. కోట్లు పెట్టి ఓట్లు కొంటున్నారు బోధన్: ప్రజా సంపదను లూటీ చేసే కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సీపీఎం కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కోరారు. ఆయా పార్టీలు రూ.కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేస్తున్నాయని, వారికి అధికార దాహం తప్ప ప్రజల కష్టా లు పట్టవని విమర్శించారు. మంగళవారం బోధన్లోని ఉర్దూఘర్ సమీపంలోని బీఎల్ఎఫ్ బోధన్ అసెంబ్లీ అభ్యర్థి జీవన్ నాయక్కు మద్దతుగా ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజాధనానికి నష్టం కలిగించారని విమర్శించారు. గతంలో ముందస్తు ఎన్నిలకు వెళ్లి పార్టీలు ఓడిపోయాయని రాఘవులు గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ స్వాధీనం, పునరుద్ధరణ విషయంలో టీఆర్ఎస్ మౌనం వహించిందన్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన సామాన్యులనే నిలబెట్టామన్నారు. నేతలు పాలడుగు భాస్కర్, వనం సుధాకర్, రమా, సాయిబాబా, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామిక విలువల కోసం పోరాడాలి
మంచాల: ప్రజాస్వామిక విలువల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని, హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. రంగా రెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ఆరుట్లలో శని వారం ఆ పార్టీ జాతీయ మహాసభల ప్రచార బస్సు యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన పాలక వర్గాలు ఆయా వర్గాలపై నిరంకుశ ధోరణిని అవలంబించడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ బాటలోనే నడుస్తోందన్నారు. సామాజిక న్యాయంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాఘవులు అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జాతీయ నాయకుడు అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చుక్కా రాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కిల్ల గోపాల్, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పెసరగాయల జంగారెడ్డి పాల్గొన్నారు. -
'ఏపీ ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు ఏకం కావాలి'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాతపాటే పాడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విభజన జరిగేటప్పుడు మాట ఇచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తప్పుతున్నారని చెప్పారు. -
రుణాలన్నీ మాఫీ చేస్తారా.. లేదా?
సీఎం చంద్రబాబుకు సీపీఎం నేత బి.వి. రాఘవులు సూటి ప్రశ్న పాలకొల్లు: ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిస్థారుులో మాఫీ చేస్తారో లేదోనన్న విషయూన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే తేల్చిచెప్పాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీపై చంద్రబాబు చేసిన తాజా ప్రకటన రైతులు, డ్వాక్రా మహిళలను అయోమయంలోకి నెట్టేసిందన్నారు. చంద్రబాబు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. సార్వా సీజన్ ప్రారంభమై పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న రైతులు.. రుణాలు మాఫీ అవుతాయో లేదో, రీ షెడ్యూల్ అరుునా చేస్తారో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కౌలు రైతులకూ రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రీయింబర్స్మెంట్ సంగతేంటి? హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ విషయం ఎటూ తేలకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమై సమస్య పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే హైదరాబాద్లో నివసిస్తున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని సూచించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా కేంద్రం జోక్యం కోసం ముఖ్యమంత్రి పడిగాపులు పడడం అవివేకమన్నారు. మద్యం వ్యాపారానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి సంబంధాలున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే చంద్రబాబు అధికారం చేపట్టి మద్యం వ్యాపారానికి తెరలేపారని చెప్పారు. బెల్ట్షాపులు నిరోధిస్తామని, ఇందుకోసం గ్రామస్థాయిలో కమిటీలు వేస్తామని ప్రభుత్వం చెప్పడం దళారులను పెంచిపోషించడానికేనని విమర్శించారు. ఉద్యోగుల వయోపరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరిందని, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. నిరుద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు -
అది కాలకూట విషపు జట్టు
మోడీ, బాబు, పవన్లపై రాఘవులు ధ్వజం అనంతపురం /కడప, నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ జట్టు అభివృద్ధి కోసం ఏర్పడినది కాదని, అది ఒక కాషాయ కాలకూట విషం వెదజల్లే జట్టని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభివర్ణించారు. బీజేపీ మతతత్వ విధానాలు దేశ సమగ్రతకే ప్రమాదమని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టుకొని రాష్ట్ర విభజనకు సహ కరించి తెలుగు పదానికి చంద్రబాబు అపచారం చేశాడని విమర్శించారు. శుక్రవారం అనంతపురంలో విలేకరులతో, కడపలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోడి ప్రధాని అయితే గుజరాత్ తరహా కార్పొరేట్ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసే ప్రమాదముందన్నారు. ఆయన ప్రధాని కావడం చారిత్రక అవసరం కాదని, చారిత్రక అపచారం అవుతుందని హెచ్చరించారు. వీరు అధికారంలోకొస్తే ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేస్తారని, తద్వారా సామాజిక న్యాయం జరగదని వివరించారు. పవన్కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడో.. పెట్టలేదో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ఈయన ఐదు నిమిషాలకే పార్టీ మార్చే రకం అని ఎద్దేవా చేశారు. అతడిని చూస్తే జాలేస్తుందన్నారు. రాష్ట్ర విభజన పాపం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్లదేనని అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement