-
‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక
సాక్షి, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం పేరిట జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర నివేదికను ఏపీ మంత్రి వర్గ ఉప సంఘం రూపొందించింది. అయితే.. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు జరిగాయని, క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు అదీ బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో వెల్లడైంది. రాజధాని దొంగలపై కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడి కాగా.. ఈ నివేదిక సాక్షి చేతికి దొరికింది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దుల నిర్ణయం జరిగింది. అలాగే.. లంక, పోరంబోకు,ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తించింది కేబినెట్ సబ్ కమిటీ. లేండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారణ కావడంతో పాటు భూ కేటాయింపుల్లోనూ భారీ అక్రమాలకు పాల్పడింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. 1977 అసైన్డ్ భూముల చట్టంతో పాటు 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది. ఇన్ సైడర్ ట్రేడింగ్పై పక్కా ఆధారాలు బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటుకై చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. ఇందుకోసం తెల్లరేషన్కార్డు ఉన్నవాళ్లను బినామీలుగా ఉపయోగించుకున్నారు టీడీపీ నేతలు. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరగ్గా.. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేశారు వాళ్లు. టీడీపీ నేతలు, ప్రముఖులు రాజధాని భూ కుంభకోణం నివేదికలో అసలు దొంగత పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను నివేదికలో పేర్కొంది ఉప సంఘం. నారా లోకేష్ బినామీ వ్యవహారం.. నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉప సంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో భారీగా భూముల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించింది. సుమారు 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు తేలింది. 👉 అలాగే.. భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేశాడు చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్. 👉 ఇక మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను నివేదిక బయటపెట్టింది. సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూముల్ని మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. 👉 బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్. 👉 ఇక గుమ్మడి సురేష్ పేరుతో 38.84 ఎకరాల భూమి కొన్నాడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 👉 మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు బట్టబయలైంది. 👉 పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక సమర్పించింది మంత్రి వర్గ ఉప సంఘం ఆ జీవో టీడీపీ నేతల కోసమే.. టీడీపీ నేతల కోసం సిఆర్డీయే పరిధి మార్చేసింది చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు సంక్షేమ పథకాలకు, జీవోలకు అడ్డుపుడుతున్న ఇదే పచ్చ నేతల కోసం.. అప్పట్లో జీవో జారీ చేసింది బాబు సర్కార్. 👉 సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పు చేసింది. అలాగే నటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయింపు చేసింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించి.. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేసింది. 👉 ఇక.. సత్తెనపల్లి మండలంలో దూళిపాళ్లలో కోడెల శివప్రసాద్(దివంగత మాజీ స్పీకర్)కు భూములు ఉన్నాయి. మొవ్వ మండలం పెద ముట్టేవి, చిన ముట్టేవిలో లింగమనేనికి భూములు ఉన్నాయి. భూముల్ని కేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇక కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీ ఆర్డీయే సరిహద్దుల్లో మార్పులు చేసింది. సంస్థల కేటాయింపుల్లోనూ.. వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లోనూ అక్రమాలను గుర్తించింది ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. ఆ వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఐదు ప్రైవేట్ సంస్థలకు 850 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించినట్లు తేలింది. అలాగే.. సింగపూర్ తో ఒప్పందంలోనూ లోపాలను గుర్తించిన మంత్రివర్గ ఉప సంఘం.. మొత్తంగా టీడీపీ హయాంలో జరిగిన భూ దందాను, అక్రమాలను సమగ్రమైన నివేదిక ద్వారా ప్రభుత్వానికి సమర్పించింది. ఇదీ చదవండి: చంద్రబాబు హయాం అవినీతిపై సిట్ దర్యాప్తునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ -
ఇకపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి
ఉప ప్రణాళిక స్థానంలో అమలుకు ఎస్సీ, ఎస్టీ కమిటీల తీర్మానం చట్ట సవరణలకు సిఫారసు... పథకాల్లో మార్పులు రెండ్రోజుల్లో ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు ఇకపై ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీఎస్డీఎఫ్), ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీఎస్డీఎఫ్)గా మారనున్నాయి. ఈ మేరకు చట్ట సవరణలు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. బడ్జెట్ లో పద్దుల మార్పు నేపథ్యంలో సబ్ప్లాన్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఎస్సీ కమిటీ, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ అధ్యక్షతన ఎస్టీ కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలు... తాజాగా శుక్రవారం మూడోసారి సమావేశమయ్యాయి. ఈ క్రమంలో చట్ట సవరణలపై చర్చ నిర్వహించిన కమిటీ సభ్యులు, అధికారులు పది అంశాలపై తీర్మానాలు చేశారు. వీటిని ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణ యించారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎస్సీఎస్ డీఎఫ్, ఎస్టీఎస్డీఎఫ్లలో తలపెట్టనున్న పథకాలSపైనా సుదీర్ఘ చర్చ నిర్వహించి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎస్టీఎస్డీఎఫ్కు సంబంధించి పథకాల్లో మార్పులు, కొత్త పథకాలపై సూచనల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. అయితే ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద చేపట్టే కార్యక్రమాలపై స్పష్టత రాలేదు. చట్ట సవరణలపై తీర్మానాలివి: సబ్ప్లాన్ అమలులో ప్రస్తుతమున్న పదేళ్ల కాలపరిమితిని తొలగించి.. ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని తీర్మానించారు. జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను సభ్యులుగా చేర్చాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రాష్ట్ర స్థాయిలో ఏర్పాటయ్యే కౌన్సిల్కు ఎస్సీ అభివృద్ధి శాఖ/ఎస్టీ అభివృద్ధి శాఖల సీనియర్ ముఖ్య కార్యదర్శిని కన్వీనర్గా నియమించాలని తీర్మానించారు. సవరణలపై ముసాయిదా ప్రకటించిన తర్వాతనే కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ కమిటీలు చట్ట సవరణలపై చేసిన సిఫార్సుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేస్తుంది. గిరిజనాభివృద్ధి పథకాలపై ప్రధాన సిఫార్సులు... ► గిరిజనుల అక్షరాస్యతను పెంచేందుకు సాక్షరభారత్ పథకానికి అదనపు నిధులు ► బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో సీట్ల సంఖ్య 2 వేలకు పెంచాలి ► పదివేల మంది గిరిజన డ్రాప్అవుట్లకు ఒపెన్ వర్సిటీ ద్వారా పట్టభద్రులుగా తీర్చిదిద్దాలి ► హాస్టళ్లలో మెస్ చార్జీలను ప్రస్తుతం 25 శాతం పెంచడంతో పాటు ఏటా 5శాతం పెంచాలి. ► కొత్తగా మరో 50 గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు ► ‘ఓన్ యువర్ కార్’ కింద ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో మరో 500మందికి అవకాశం కల్పించాలి ► గిరిజన భూఅభివృద్ధి పథకం కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10 వేల మంది గిరిజన రైతులకు గాను 30వేల ఎకరాల అభివృద్ధికి రూ.300 కోట్లు ఖర్చు చేయాలి ► గుడుంబా బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలి ► మిషన్ భగీరథ కింద ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు మంజూరు. ► ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలి ► వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద గిరిజనులకు వందశాతం రాయితీతో యంత్రాలు ► కల్యాణ లక్ష్మి ఆర్థిక సాయాన్ని రూ.1.01 లక్షలకు పెంచి, పెళ్లి రోజు నాటికే అందించాలి ► 42 శాఖల పరిధిలో ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement