-
విద్యాసంస్థల బంద్ విజయవంతం
ఏలూరు సిటీ : విద్యార్థి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పీడీఎస్యూ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించాయి. జిల్లాలో 1,200కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, 400కు పైగా కళాశాలలు సోమవారం తెరుచుకోలేదు. కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలను విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు మూసివేయించి బంద్ పాటించారు. పాఠశాలలు, కళాశాలలు, ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ ఇలా అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించాయి. రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా, అణచివేత దోరణితో వ్యవహరిస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. జిల్లాలోని ఎనిమిది ముఖ్య పట్టణాల్లో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ సంఘాలు సంయుక్తంగా బంద్లో పాల్గొన్నాయి. ఇక మిగిలిన మండలాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. కొయ్యలగూడెంలో పోలవరం ఎమ్మెల్యేను విద్యార్థులు అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఘెరావ్ చేశారు. బంద్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్పొరేట్ విద్యావ్యాపారుల అనుకూల వైఖరి విడనాడకుంటే ఐక్యపోరాటాలు ద్వారా గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి, పీడీఎస్యూ జిల్లా నాయకులు కాకి నాని, పి.శివ, ప్రవీణ్, హేమంత్, ఇబ్రహీం, అజయ్, అరుణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
ఏలూరు సిటీ : విద్యార్థి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పీడీఎస్యూ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు ముందుగానే సెలవులు ప్రకటించాయి. జిల్లాలో 1,200కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, 400కు పైగా కళాశాలలు సోమవారం తెరుచుకోలేదు. కొన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలను విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు మూసివేయించి బంద్ పాటించారు. పాఠశాలలు, కళాశాలలు, ఇంజినీరింగ్, ఫార్మసీ, పాలిటెక్నిక్ ఇలా అన్ని విద్యాసంస్థలు బంద్ పాటించాయి. రాష్ట్ర ప్రభుత్వ విద్యరంగ సమస్యలు పరిష్కరించటంలో నిర్లక్ష్యంగా, అణచివేత దోరణితో వ్యవహరిస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. జిల్లాలోని ఎనిమిది ముఖ్య పట్టణాల్లో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ సంఘాలు సంయుక్తంగా బంద్లో పాల్గొన్నాయి. ఇక మిగిలిన మండలాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. కొయ్యలగూడెంలో పోలవరం ఎమ్మెల్యేను విద్యార్థులు అడ్డుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఘెరావ్ చేశారు. బంద్ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంపన రవికుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్పొరేట్ విద్యావ్యాపారుల అనుకూల వైఖరి విడనాడకుంటే ఐక్యపోరాటాలు ద్వారా గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి, పీడీఎస్యూ జిల్లా నాయకులు కాకి నాని, పి.శివ, ప్రవీణ్, హేమంత్, ఇబ్రహీం, అజయ్, అరుణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement