-
గోశాల ఘోష!
గోమాతను సకల దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోపూజతోనే శ్రీరాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీమఠంలో గోసంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గోశాలకు కోట్ల రూపాయల్లో విరాళాలు పోగవుతున్నా శ్రీమఠం అధికారులు గోసంరక్షణ మరచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత గోశాల దుస్థితి ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. సాక్షి, మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపాన గోశాల నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత చర్యలు చేపట్టకపోవడం..దోమల విజృంభణతో గతేడాది థ్రిప్స్ వ్యాధి (మెదడువాపు వ్యాధి) ప్రబలింది. ఫలితంగా నెలలోనే 50 గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో శ్రీమఠం అధికారులు రూ.అరకోటితో సంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే ఇవి మున్నాళ్ల ముచ్చటగాగా మారాయి. కారణంగా గతేడాది పరిస్థితే గోవులకు దాపురించింది. చేపట్టాల్సిన సంరక్షణ చర్యలు.. గోశాల విస్తరణ రూ.25 లక్షలతో చేపట్టాల్సి ఉంది. అపరిశుభ్రత తొలగింపునకు రూ.8లక్షలు వెచ్చించాలి. రెడిమేడ్ డ్రెయినేజీకి రూ.8 లక్షలు, కాంక్రీట్ ప్లాట్పామ్ నిర్మాణానికి రూ.12 లక్షలు అవసరమని తేల్చారు. బంతిపూలతోట, ఉసిరివనం, పౌంటైన్ ఏర్పాటుకు రూ.3 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అలాగే 40 ఎకరాల్లో పచ్చగడ్డి, 10 ఎకరాల్లో లూసెర్నీ, కోపియాన్, స్టెల్లోహెమటా జాతుల న్యూట్రిన్ గడ్డి పెంపకం చేపట్టేందుకు పూనుకున్నారు. స్వచ్ఛఅభియాన్ పేరుతో ప్రతి 15 రోజులకు ఏకాదశి రోజున మఠం ఉద్యోగులంతా అక్కడే పరిశుభ్రత పనులు చేపట్టాలని నిశ్చయించారు. ఏం చేశారంటే.. సంరక్షణ చర్యల్లో భాగంగా గోశాలను విస్తరణ చేపట్టారు. డ్రెయినేజి, క్రాంకీటు ప్లాట్పాం నిర్మించారు. మిగతా పనులు ఏవీ చేపట్టలేకపోయారు. దోమల నివారణ కోసం బంతిపూల సాగు చేపడతామని చెప్పినా పనులు ఇంచు కూడా కదలేదు. గోశాలలో స్వచ్ఛత కనుచూపు మేరలో ఉండిపోయింది. ఏకాదశిన ఉద్యోగుల శ్రమదానానికి దారి లేకపోయింది. వానొచ్చినా.. దోమకుట్టినా.. ఆకలి వేసినా గోవులు మూగవేదన భరించాల్సి వస్తోంది. చిన్న వానొచ్చినా గోశాల ప్రాంగణం పేరుకుపోయిన పేడతో చిత్తడిగా మారుతోంది. గోవులు వానలో తడుస్తూ జాగారం చేయాల్సి వస్తోంది. దాతలు ఇచ్చిన పశుగ్రాసంతోనే గోవులు కడుపు నింపుకోవాలి. న్యూట్రిన్స్ గడ్డిలేకపోవడంతో గోవులు బలహీనంగా మారుతున్నాయని పశువైద్యాధికారులు మొత్తుకుంటున్నా చెవిన వేసుకునే నాథుడు లేకపోయాడు. గోవుల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం గోశాలలో గోవుల సంరక్షణ కోసం కట్టుకడి పనిచేస్తాం. త్వరలోనే బంతిపూలతోట, ఉసిరి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. స్వామిజీ సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో గోశాలలో వసతులపై సమీక్ష నిర్వహించి సంరక్షణ కోసం పాటుపడతాం. పశుగ్రాసం పెంపకం పనులు వేగవంతం చేస్తాం. ఎస్కే శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ -
సెక్షన్ 19 రాజ్యాంగబద్ధమే!
పబ్లిక్సర్వెంట్లకు రక్షణ కల్పించడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: అవినీతి కేసుల విచారణలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు అవినీతి నిరోధక చట్టంలో కల్పించిన రక్షణ సదుపాయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వ ముందస్తు అనుమతితో మాత్రమే వారిని విచారించాలని పేర్కొన్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణల నుంచి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం.. అవినీతికి పాల్పడినట్లు సరైన సాక్ష్యాధారాలుంటే విచారణ జరపడం.. ఈ రెండింటి మధ్య సరైన సమతౌల్యం పాటించాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తప్పుడు ఆరోపణల నుంచి నిజాయితీపరులను రక్షించేందుకు ‘ముందస్తు అనుమతి’ అనేది ఒక చట్టబద్ధమైన రక్షణ అని ధర్మాసనం వివరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19ని తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా బుధవారం ధర్మాసనం పై స్పష్టీకరణ ఇచ్చింది. సెక్షన్ 19 లోని ‘ముందస్తు అనుమతి’ నిబంధన వల్ల అవినీతిపరులైన రాజకీయ నేతలపై విచారణ సాధ్యం కావడం లేదంటూ యూపీ మాజీ సీఎం మాయావతి ఉదంతాన్ని ఉటంకిస్తూ న్యాయవాది మంజూర్ అలీ ఖాన్ ఆ పిల్ దాఖలు చేశారు. సెక్షన్ 19తో సంబంధం లేకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరు రాజకీయ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులను విచారించేలా ఆదేశాలివ్వాలని ఆయన అందులో కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement