పబ్లిక్సర్వెంట్లకు రక్షణ కల్పించడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అవినీతి కేసుల విచారణలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు అవినీతి నిరోధక చట్టంలో కల్పించిన రక్షణ సదుపాయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వ ముందస్తు అనుమతితో మాత్రమే వారిని విచారించాలని పేర్కొన్న అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణల నుంచి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం.. అవినీతికి పాల్పడినట్లు సరైన సాక్ష్యాధారాలుంటే విచారణ జరపడం.. ఈ రెండింటి మధ్య సరైన సమతౌల్యం పాటించాలని జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తప్పుడు ఆరోపణల నుంచి నిజాయితీపరులను రక్షించేందుకు ‘ముందస్తు అనుమతి’ అనేది ఒక చట్టబద్ధమైన రక్షణ అని ధర్మాసనం వివరించింది.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19ని తొలగించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా బుధవారం ధర్మాసనం పై స్పష్టీకరణ ఇచ్చింది. సెక్షన్ 19 లోని ‘ముందస్తు అనుమతి’ నిబంధన వల్ల అవినీతిపరులైన రాజకీయ నేతలపై విచారణ సాధ్యం కావడం లేదంటూ యూపీ మాజీ సీఎం మాయావతి ఉదంతాన్ని ఉటంకిస్తూ న్యాయవాది మంజూర్ అలీ ఖాన్ ఆ పిల్ దాఖలు చేశారు. సెక్షన్ 19తో సంబంధం లేకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరు రాజకీయ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులను విచారించేలా ఆదేశాలివ్వాలని ఆయన అందులో కోరారు.
Related news
-
‘ఎర’కు ఆధారమేదీ? నగదు పట్టుబడకుంటే ఏసీబీ సెక్షన్లు వర్తించవు’
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రెడ్ హ్యాండెడ్గా నగదు పట్టుబడనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని హైదరాబాద్లోని సరూర్నగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన రిపోర్టును తిరస్కరించారు. నిందితులను విడుదల చేయాలని.. వారికి సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేసి విచారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో నిందితులు కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో ఫుటేజీలు ఉన్నాయని పోలీసులు విన్నవించినా దీనిని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. గురువారం పొద్దంతా విచారించి.. టీఆర్ఎస్కు రాజీనామా చేసి, బీజేపీలో చేరితే రూ.100 కోట్ల డబ్బు, కాంట్రాక్టులు, కేంద్ర పదవులు ఇస్తామని ముగ్గురు వ్యక్తులు ప్రలోభపెట్టారంటూ నలుగురు ఎమ్మెల్యేలు ఆరోపించడం, బుధవారం రాత్రి అజీజ్నగర్లోని ఫామ్హౌజ్పై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డిలతో.. ఢిల్లీలోని ఫరీదాబాద్కు చెందిన పురోహితుడు రాంచంద్రభారతి అలియాస్ సతీశ్శర్మ, హైదరాబాద్కు చెందిన హోటల్స్ వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజీ స్వామిలు మంతనాలు జరిపినట్టుగా ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి నిందితులు ముగ్గురిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 120బీ, 171 బీ, 171ఇ, 506 సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్–8ను నమోదు చేశారు. వారిని శంషాబాద్ రూరల్ పోలీసుస్టేషన్కు తరలించి విచారించారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీస్స్టేషన్ ఆవరణలోనే నర్కుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రాత్రి శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ), శంషాబాద్ రూరల్ పోలీసులు సుమారు 10 వాహనాల్లో భారీ భద్రత మధ్య ముగ్గురు నిందితులను సరూర్నగర్లోని ఏసీబీ కోర్టు జడ్జి రాజగోపాల్ నివాసంలో హాజరుపర్చారు. సరైన ఆధారాలేవి? పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నిందితులను రిమాండ్కు పంపేందుకు తగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులు పట్టుబడిన సమయంలో వారి నుంచి ఎలాంటి నగదు స్వాదీనం చేసుకోకపోవటంతో వారిపై నమోదు చేసిన కేసులు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ.. ఆ ముగ్గురికి 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి విచారించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే నిందితులు ఫామ్హౌజ్కు వచ్చారని.. కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో, వీడియో రికార్డులు ఉన్నాయని పోలీసులు వివరించినా పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. బీజేపీలో చేరితే రూ.100 కోట్లు ఇస్తామన్నారు తనతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించారని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి బుధవారం రాత్రి 11.30కు మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నందకుమార్ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ప్రతిని రాత్రి 12.30 గంటలకు కోర్టుకు పంపారు. ఉన్నతాధికారులు రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్కు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఆ ఎఫ్ఐఆర్ (నంబర్ 455/2022)లోని వివరాల మేరకు.. రూ.100కోట్లు, పదవులు, కాంట్రాక్టులు ఎర.. బీజేపీకి చెందిన ఢిల్లీలోని ఫరీదాబాద్ వాసి రాంచంద్రభారతి అలియాస్ సతీశ్శర్మ, హైదరాబాద్కు చెందిన వ్యాపారి నందకుమార్ ఇద్దరూ రోహిత్రెడ్డిని కలిసి బేరసారాలు చేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయవద్దని, ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని కోరారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. తమ మాట వినకుంటే క్రిమినల్ కేసులతో పాటు సీబీఐ, ఈడీ దాడులు తప్పవని బెదిరించారు. టీఆర్ఎస్ నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనలు అనైతికం, అక్రమం కావడం, అవినీతిని ప్రోత్సహించేలా ఉండటంతో.. వారిని ఏమాత్రం ప్రోత్సహించకూడదని రోహిత్రెడ్డి నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలంటూ.. ఈ క్రమంలో బుధవారం మరోసారి రోహిత్రెడ్డిని సంప్రదించిన నందకుమార్, రాంచంద్రభారతి.. ఆ రోజు మధ్యాహ్నం అజీజ్నగర్లోని ఫామ్హౌస్కు వస్తున్నామని, అక్కడే బేరసారాలు పూర్తి చేద్దామని చెప్పారు. ఇదే సమయంలో రూ.50 కోట్ల చొప్పున ఆశ చూపి మరికొందరు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరేందుకు సిద్ధం చేయాలని కూడా కోరారు. రోహిత్రెడ్డితోపాటు ఈ డీల్కు అంగీకరించిన ఎమ్మెల్యేలు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా, నిబద్ధతతో, నిజాయతీతో పని చేయకూడదని.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కోరారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతికి చెందిన సింహయాజి స్వామితో కలిసి ఫామ్హౌస్కు వస్తున్నామని.. అక్కడే డీల్ను పూర్తి చేద్దామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాధ్యులపై కేసు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని రోహిత్రెడ్డి తన ఫిర్యాదులో కోరారు. -
‘పాఠశాలల స్కామ్’ దర్యాప్తు పూర్తి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రైవేట్ స్కూళ్లకు అక్రమ అనుమతుల స్కామ్లో నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) పోలీసులు దర్యాప్తు పూర్తిచేశారు. నిందితులపై దర్యాప్తు అధికారులు అవినీతి నిరోధక చట్టాన్ని ప్రయోగించారు. సీసీఎస్ పోలీసులు ఈ చట్టాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల ఆధారంగానే కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లనూ చేర్చారు. ఇప్పటివరకు నిందితులుగా తేలిన 9 మందిలో అత్యధికులు ప్రభుత్వ ఉద్యోగులే. వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ప్రాసిక్యూషన్కు అనుమతించాలని సర్కారుకు లేఖ రాశారు. గోల్మాల్ ఇలా... ప్రైవేట్ స్కూళ్లు నిర్ణీత కాలానికి అనుమతుల్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త పాఠశాలలు అనుమతులు తీసుకుంటూ ఉంటాయి. వీటి ఫైళ్లు డీఈవో కార్యాలయాలతోపాటు రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్(ఆర్జేడీఎస్ఈ) కార్యాలయానికి వెళ్తాయి. దరఖాస్తు చేసుకున్న స్కూళ్లు కొంత మొత్తం రుసుమును చలానా రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని దరఖాస్తుల్ని హైదరాబాద్ డీఈవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ మన్సూర్ అలీ గోల్మాల్ చేశాడు. ఆయా స్కూళ్ల యాజమాన్యాల నుంచి తీసుకున్న సొమ్మును చలానా రూపంలోకి మార్చకుండా స్వాహా చేశాడు. ఆర్జేడీఎస్ఈ పేరిట నకిలీ అనుమతిపత్రాలు సృష్టించాడు. ఆర్జేడీఎస్ఈ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేసి ప్రస్తుతం మంచిర్యాల డీఈవో ఆఫీస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న మహ్మద్ అబ్దుల్ ఘనీ, ఆర్జేడీఎస్ఈ కార్యాలయం సూపరింటెండెంట్ మహ్మద్ హసన్ సయీద్, డీఈవో కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ జి.వేణు గోపాల్ సాయంతో వీటిని రూపొందించి పాఠశాలల యాజమాన్యాలకు అందించాడు. ఇవి సరైనవే అని నమ్మిన యాజమాన్యాలు 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి విద్యార్థుల్ని ఎన్రోల్ చేసుకున్నాయి. టెన్త్ పరీక్షల సమయంలో జిల్లాలవారీగా పరీక్షలు రాసేందుకు అనుమతి ఉన్న పాఠశాలల జాబితాలను ప్రభుత్వ పరీక్షల విభాగానికి డీఈవోలు అందిస్తారు. ప్రతి పాఠశాల సైతం తన వద్ద ఉన్న టెన్త్ క్లాస్ విద్యార్థుల పూర్తి వివరాలను ఆన్లైన్లో అదే విభాగానికి అప్లోడ్ చేస్తుంది. గత ఏడాది అలా చేసిన సందర్భంలోనే ఈ స్కామ్ బయటపడింది. డీఈవోల నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించిన పరీక్షల విభాగం అందులో లేని స్కూళ్లు సైతం తమ విద్యార్థుల వివరాలను అప్లోడ్ చేసినట్లు గుర్తించింది. విచారణకు ఆర్జేడీ ఆదేశం ప్రైవేట్ స్కూళ్లకు అక్రమ అనుమతుల వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వపరీక్ష విభాగం హైదరాబాద్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ను ఆదేశించింది. ఈ విచారణ నేపథ్యంలోనే అసలు విషయం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారులు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన నిందితులపై ఐపీసీతోపాటు అవినీతి నిరోధక చట్టం(పీసీ యాక్ట్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్లో మన్సూర్, ఘనీ, హసన్, వేణుగోపాల్లను పట్టుకుంది. మహమూద్ అలీ విచారణ నేపథ్యంలోనే 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి 14 స్కూళ్లకు అక్రమంగా ఇచ్చిన ఈఆర్టీని గుంజా శామ్యూల్ జోసఫ్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు వెల్లడైంది. దీంతో శామ్యూల్ను అరెస్టు చేశారు. మరికొందరు నిందితులు ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే చార్జ్షీట్లు దాఖలు చేయనున్నారు. -
వ్యాపారాలనూ వదలని అవినీతి
న్యూఢిల్లీ: లంచాలు, అక్రమార్జన అనేవి భారత్ సహా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక స్థాయిలో ఉన్నట్టు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నిర్వహించిన సర్వేలో తేలిసింది. వ్యాపారాల్లో అవినీతి, లంచాలు తారస్థాయిలో ఉన్నాయని ఈవై సర్వేలో 52 శాతం మంది చెప్పడం గమనార్హం. మన దేశంలోనూ 40 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘భారత్లో 40 శాతం మంది ఎగ్జిక్యూటివ్లు వ్యాపారాల్లో అవినీతి అక్రమార్జన విధానాలు విస్తృతంగా ఉన్నాయని చెప్పారు. 12 శాతం మంది గత రెండేళ్లలో తమ కంపెనీ పెద్ద ఎత్తున మోసాలను చవిచూసినట్టు చెప్పారు. 20 శాతం మంది నగదు చెల్లింపులు అన్నవి వ్యాపారం నిలదొక్కుకునేందుకు అవసరమన్నారు’’ అని ఈవై నివేదిక తెలియజేసింది. భారత్లో కార్పొరేట్ పరిపాలన, పారదర్శకతను పెంపొందించేందుకు... అవినీతి నిరోధక చట్టం 2018, కంపెనీల చట్టం 2017, ఐబీసీ, నిబంధనలు పాటించకపోతే జరిమానాల వంటి పలు ప్రయ త్నాలు జరిగినట్టు ఈవై తెలిపింది. ‘‘అయినప్పటికీ మోసం, అవినీతి అనేవి వృద్ధికి ప్రధాన అడ్డంకులు. మీడియాలో తరచుగా అవినీతికి సంబంధించి పెద్ద కేసులను చూపించడం వల్ల సంబంధిత ప్రాంతంలో వ్యాపారాలను నిర్వహించే కంపెనీల ప్రతిష్టకు రిస్క్ ఉంటుంది’’ అని ఈవై అభిప్రాయం వ్యక్తం చేసింది. చాలా వర్ధమాన దేశాల్లో కొత్త చట్టాల అమలు, నిఘాను పెంచడం, మోసాల నివారణకు కంపెనీల స్వీయ కార్యాచరణ వంటివి చేపట్టినాగానీ సెంటిమెంట్ బలహీనంగానే ఉందని ఈవై తెలిపింది. అక్రమాలను ముందే గుర్తించి నిరోధించేందుకు ఫోరెన్సిక్ డేటా అనలిటిక్స్ వినియోగం వంటి చర్యలు అవసరమని సూచించింది. ఈవై ఫోరెన్సిక్ అండ్ ఇంటెగ్రిటీ సర్వీసెస్ ఈ సర్వేను నిర్వహించింది. భారత్తోపాటు జపాన్, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ సహా 33 వర్ధమాన మార్కెట్లకు సంబంధించి 1,450 ఎగ్జిక్యూటివ్ల అభిప్రాయాలను సేకరించింది. ఆసక్తికర అంశాలు ►వ్యాపారానికి మోసాలు, అవినీతి అతిపెద్ద ముప్పు అని 42% మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 29 శాతమే. ►కంపెనీ మనుగడ సాగించాలంటే కొంత మేర ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పని పరిస్థితిగా చాలా సంస్థలు చెప్పడం గమనార్హం. ► కాంట్రాక్టుల కోసం లంచాలు సాధారణమేనని 16% మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 5 శాతం మంది ఉన్నారు. ► వ్యాపార ప్రయోజనాల కోసం నగదు రూపేణా ప్రోత్సాహకం ఇవ్వడం ఆమోదనీయమేనని వర్ధమాన మార్కెట్లలో 19% మంది చెప్పారు. దీన్ని సమర్థించే విషయంలో 33 వర్ధమాన దేశాల్లో భారత్ 12, చైనా 6వ స్థానంలో ఉన్నాయి. -
లంచమిచ్చినా జైలుకే
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేకం చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దీని ప్రకారం లంచం తీసుకున్న అధికారులే కాదు, ఇచ్చిన వారు కూడా శిక్షార్హులవుతారు. అవినీతి నిరోధక చట్టం–1988 సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘లంచం తీసుకోవటంతోపాటు ఇవ్వడమూ నేరమే. లంచం ఇచ్చే వారికి ఇకపై మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు జరిమానా విధిం చే వీలుంటుంది. అవినీతి కేసులు దాఖలైన రెండేళ్లలోగా కోర్టులు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ మునియప్ప మాట్లాడుతూ.. అవినీతిని అరికట్టాలంటే ఎన్నికల సంస్కరణలే మార్గమన్నారు. -
గోశాల ఘోష!
గోమాతను సకల దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోపూజతోనే శ్రీరాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీమఠంలో గోసంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గోశాలకు కోట్ల రూపాయల్లో విరాళాలు పోగవుతున్నా శ్రీమఠం అధికారులు గోసంరక్షణ మరచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత గోశాల దుస్థితి ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. సాక్షి, మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపాన గోశాల నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత చర్యలు చేపట్టకపోవడం..దోమల విజృంభణతో గతేడాది థ్రిప్స్ వ్యాధి (మెదడువాపు వ్యాధి) ప్రబలింది. ఫలితంగా నెలలోనే 50 గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో శ్రీమఠం అధికారులు రూ.అరకోటితో సంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే ఇవి మున్నాళ్ల ముచ్చటగాగా మారాయి. కారణంగా గతేడాది పరిస్థితే గోవులకు దాపురించింది. చేపట్టాల్సిన సంరక్షణ చర్యలు.. గోశాల విస్తరణ రూ.25 లక్షలతో చేపట్టాల్సి ఉంది. అపరిశుభ్రత తొలగింపునకు రూ.8లక్షలు వెచ్చించాలి. రెడిమేడ్ డ్రెయినేజీకి రూ.8 లక్షలు, కాంక్రీట్ ప్లాట్పామ్ నిర్మాణానికి రూ.12 లక్షలు అవసరమని తేల్చారు. బంతిపూలతోట, ఉసిరివనం, పౌంటైన్ ఏర్పాటుకు రూ.3 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అలాగే 40 ఎకరాల్లో పచ్చగడ్డి, 10 ఎకరాల్లో లూసెర్నీ, కోపియాన్, స్టెల్లోహెమటా జాతుల న్యూట్రిన్ గడ్డి పెంపకం చేపట్టేందుకు పూనుకున్నారు. స్వచ్ఛఅభియాన్ పేరుతో ప్రతి 15 రోజులకు ఏకాదశి రోజున మఠం ఉద్యోగులంతా అక్కడే పరిశుభ్రత పనులు చేపట్టాలని నిశ్చయించారు. ఏం చేశారంటే.. సంరక్షణ చర్యల్లో భాగంగా గోశాలను విస్తరణ చేపట్టారు. డ్రెయినేజి, క్రాంకీటు ప్లాట్పాం నిర్మించారు. మిగతా పనులు ఏవీ చేపట్టలేకపోయారు. దోమల నివారణ కోసం బంతిపూల సాగు చేపడతామని చెప్పినా పనులు ఇంచు కూడా కదలేదు. గోశాలలో స్వచ్ఛత కనుచూపు మేరలో ఉండిపోయింది. ఏకాదశిన ఉద్యోగుల శ్రమదానానికి దారి లేకపోయింది. వానొచ్చినా.. దోమకుట్టినా.. ఆకలి వేసినా గోవులు మూగవేదన భరించాల్సి వస్తోంది. చిన్న వానొచ్చినా గోశాల ప్రాంగణం పేరుకుపోయిన పేడతో చిత్తడిగా మారుతోంది. గోవులు వానలో తడుస్తూ జాగారం చేయాల్సి వస్తోంది. దాతలు ఇచ్చిన పశుగ్రాసంతోనే గోవులు కడుపు నింపుకోవాలి. న్యూట్రిన్స్ గడ్డిలేకపోవడంతో గోవులు బలహీనంగా మారుతున్నాయని పశువైద్యాధికారులు మొత్తుకుంటున్నా చెవిన వేసుకునే నాథుడు లేకపోయాడు. గోవుల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం గోశాలలో గోవుల సంరక్షణ కోసం కట్టుకడి పనిచేస్తాం. త్వరలోనే బంతిపూలతోట, ఉసిరి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. స్వామిజీ సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో గోశాలలో వసతులపై సమీక్ష నిర్వహించి సంరక్షణ కోసం పాటుపడతాం. పశుగ్రాసం పెంపకం పనులు వేగవంతం చేస్తాం. ఎస్కే శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్
Related News by category
-
నేడు అమేథీలో స్మృతి ఇరానీ నామినేషన్
ఈరోజు (ఆదివారం) భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా నేత స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ లోక్సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు ఆమె అయోధ్యలోని రామ్లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం ఆమె తన లోక్సభ నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. మే 20న అమేథీలో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం (ఏప్రిల్ 26) ప్రారంభమైంది. ఐదో దశలో మొత్తం 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది.అమేథీలో నామినేషన్కు చివరి తేదీ మే 3. దీంతో కాంగ్రెస్కు ఈ సీటు నుంచి పోటీచేయబోయే అభ్యర్థిని ప్రకటించడానికి ఎక్కువ సమయం లేదు. కాంగ్రెస్ పార్టీ అమేథీలో తన అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. అయితే రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నియోజకవర్గం చాలాకాలంపాటు గాంధీ కుటుంబం ఆధీనంలో ఉంది. అయితే 2019లో రాహుల్ను ఓడించడం ద్వారా స్మృతి ఇరానీ ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యానికి స్వస్తి పలికారు. అయితే ఇప్పుడు స్మృతిని ఓడించి, కాంగ్రెస్ కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు రాహుల్ ప్రయత్నించనున్నారని సమాచారం.అమేథీతో పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ఎవరికీ టిక్కెట్ కేటాయించలేదు. ఈ సీటు కూడా కాంగ్రెస్ సంప్రదాయ సీటు. 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. సోనియాగాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు నుంచి సోనియా కుమార్తె ప్రియాంక ఎన్నికల బరిలో దిగవచ్చని తెలుస్తోంది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కూడా ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
కుతుబ్ మినార్పై కొత్త థీమ్ - వీడియో
ఢిల్లీ: ఏడు దశల లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న (మొదటి దశ) ఓటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలకు ఓటు హక్కు మీద అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ఓ వినూత్న పద్దతిని ఎంచుకుంది.కుతుబ్ మినార్ మీద త్రివర్ణ పతాకంతో పాటు.. మిరమిట్లు గొలిపే ఎన్నికల సంఘం లోగో కనిపించింది. ఎన్నికల నేపధ్యానికి సంబంధించిన లైట్లు, పోస్టర్లు, విజువల్స్ అన్నీ కుతుబ్ మినార్ మీద ఆకర్షణీయంగా కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన ఎక్స్ (ట్విటర్) పేజీలో పోస్ట్ చేసింది.ఇప్పటికే రెండు దశల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మే 3న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి.Qutub Minar radiates the spirit of Jash-e-Matdan with its dazzling display of the #ChunavKaParv theme.Let's celebrate this festivity by casting our votes #GeneralElections2024📹 @ceodelhi #DeshKaGarv #LokSabhaElections2024 #YouAreTheOne pic.twitter.com/NPhlifadmT— Election Commission of India (@ECISVEEP) April 27, 2024 -
జైల్లో కుదుటగానే కేజ్రీవాల్ ఆరోగ్యం: ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటగానే ఉన్నట్లు తెలుస్తోంది. టైప్-2 డయాబేటిస్తో బాధపడుతున్న కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ అందిస్తోంది. ఈ మేరకు ఎయిమ్స్కు చెందిన అయిదుగురు వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. కేజ్రీవాల్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నందున, ఆయన ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్ బోర్డు సూచించిం.ది మెడిసిన్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని తెలిపింది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం సీఎంను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొన్నాయి.కాగా ఆయన షుగర్ లెవల్స్ 320కు పెరగడంతో గతవారం తీహార్ జైల్లో తొలి ఇన్సులిన్ అందించారు. తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో మాధ్యమంలో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందేందుకే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే స్వీట్స్, మామిడిపండ్లు, ఆలూపూరీ వంటి ఆహార పదార్దాలు తీసుకుంటున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.అయితే టైప్ 2 డయాబెటిక్ పేషెండ్ అయిన కేజ్రీవాల్కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా కోర్టు అనుమతించింది. అయితే అది ఖచ్చితంగా డాక్టర్ సూచించిన డైట్ చార్ట్కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement