-
కమల్కు ట్విట్టర్లో చురకలు
చెన్నై: కులానికి వ్యతిరేకంగా ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్లో దుమారం రేగుతోంది. కులంపై తన కూతురు శ్రుతి హాసన్ చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. సంస్కరణలను ముందుగా కమల్ ఆయన ఇంటి నుంచి ప్రారంభించాలని సూచించారు. తన ఇద్దరు కూతుళ్ల స్కూల్ అడ్మిషన్ దరఖాస్తులో కులం, మతానికి సంబంధించిన కాలమ్ను ఖాళీగా వదిలేశానని కమల్ ఇటీవల ట్వీట్చేశారు. వచ్చే తరానికి కులం, మతం గురించి తెలియకుండా చేయాలంటే ఇదే సరైన మార్గమన్నారు. అయితే, కమల్ ట్వీట్పై ట్విట్టర్లో విమర్శల దాడి మొదలైంది. కొన్నేళ్లక్రితం శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. తాను ‘అయ్యంగర్’ (బ్రాహ్మణ) అని పేర్కొన్న వీడియోను ఓ ట్విటర్ ఖాతాదారుడు పోస్ట్ చేశాడు. ‘పిల్లలకు వారి కులం తెలియకుండా పెంచాలి’ అని వ్యాఖ్యానించాడు. ‘జంధ్యం తీసి, కుల ధ్రువీకరణ పత్రాన్ని చించినంత మాత్రాన కులం పోదు’ అని ట్వీట్చేశారు. -
మా సంస్కరణలకు ప్రజామోదం
న్యూఢిల్లీ: అధికార దాహంతో కాంగ్రెస్ గుజరాత్లో కులతత్వాన్ని వ్యాప్తి చేయాలనుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన సంస్కరణలకు ప్రజామోదం ఉందనడానికి తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ కార్యకర్తలను ఉద్దేశించి సోమవారం ప్రసంగించారు. గత కొన్నాళ్లుగా గుజరాత్లో కులాల ఆధారంగా ఉద్యమాలు జరుగుతున్న వేళ... ఆ రాష్ట్రంలో సామాజిక సామరస్యం విలసిల్లాలనీ, అన్ని వర్గాల ప్రజలు గొడవల్లేకుండా ప్రశాంతంగా జీవించాలని మోదీ ఆకాంక్షించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని నెలకొల్పామనీ, దానిని ఎవరూ పాడు చేయకూడదని ఆయన కోరారు. బీజేపీ గుజరాత్లో వరసగా ఆరోసారి గెలిచినా ఈసారి గత రెండు దశాబ్దాల్లోనే అత్యల్ప స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో... ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవని అన్నారు. తాను ప్రధాన మంత్రి అయ్యాక రాష్ట్రంలో తమ పార్టీ నాయకత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని మోదీ ఆరోపించారు. బీజేపీని ఓడించేందుకు విశ్వప్రయత్నాలు జరిగాయనీ, అన్ని రకాల కుట్రలను పన్నారని మోదీ దుయ్యబట్టారు. 30 ఏళ్ల క్రితం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిన రోజుల్లో కులతత్వం అనే విషం బాగా ఎక్కిందనీ, బీజేపీ ప్రభుత్వాలు, నేతలు దానిని నిర్మూలించేందుకు పనిచేశారని మోదీ అన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా దేశం మంచి గుర్తింపు పొందాలంటే అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకోవాల్సి ఉందనీ, ప్రజల సమస్యలకు అదే పరిష్కారమని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోనూ తప్పుడు పనులకు వ్యతిరేకంగా, అభివృద్ధికి అనుకూలంగానే ప్రజలు ఓటేశారని మోదీ పేర్కొన్నారు. తన ప్రసంగం చివర్లో మోదీ ‘ఎవరు గెలుస్తారు’ అని ప్రశ్నించగా అభివృద్ధి గెలుస్తుంది అని కార్యకర్తలంతా ముక్తకంఠంతో జవాబిచ్చారు. -
సం‘కుల సమరం’..!
సాక్షి నాలెడ్జ్ సెంటర్ : వచ్చే నెలలో గుజరాత్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు విషయంలో బీజేపీ, కాంగ్రెస్... ఇరు పార్టీలు కులాల సమతుల్యం పాటిస్తున్నాయి. ఫలితాన్ని నిర్ణయించే పటేళ్లు, ఓబీసీలకు ప్రాతినిధ్యం విషయంలో ఇరు పక్షాలూ జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. మొత్తం 182 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే బీజేపీ 134 స్థానాలకు, కాంగ్రెస్ 77 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఓబీసీల్లో చేర్చాలనే డిమాండ్తో ఉద్యమించిన పాటీదార్లకు(పటేళ్లు) రెండు ప్రధాన పక్షాలూ తగినన్ని టికెట్లు కేటాయించాయి. తొలి విడతలో బీజేపీ 70 సీట్లకు తమ అభ్యర్థులను ప్రకటించగా, వాటిలో 17 టికెట్లను పాటీదార్లకు ఇచ్చింది. మరో 18 సీట్లను బీసీలకు, వారిలోనూ అధికంగా ఠాకూర్లు, కోలీలకు బీజేపీ కేటాయించింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లో బీజేపీ కోలీ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ఇప్పటి వరకూ ప్రకటించిన 77 మంది అభ్యర్థుల జాబితాలో 20 మంది పటేళ్లు, 23 మంది బీసీలున్నారు. కాంగ్రెస్ జాబితాలో ఎక్కువ కొత్త ముఖాలు 2012 ఎన్నికల్లో కాంగ్రెస్ 57 సీట్లే గెలిచింది. ఆ తర్వాతా కొందరు పార్టీ మారడంతో కాంగ్రెస్ బలం ఇంకా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువగా లేరు కాబట్టి కాంగ్రెస్ 77 సీట్లకు ప్రకటించిన తన తొలి జాబితాలో 53 సీట్లను కొత్తవారికి కేటాయించింది. అలాగే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా అహ్మద్ పటేల్ను గెలిపించుకునేందుకు ఇచ్చిన మాట ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ మళ్లీ టికెట్లు ఇస్తోంది. ఇప్పటికే బీసీ, దళిత సంఘాల నేతలు కాంగ్రెస్కు తమ మద్దతు ప్రకటించడం తెలిసిందే. అటు పటేళ్లకు రిజర్వేషన్ల సాధన కోసం పోరాడుతున్న పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) మొదట కాంగ్రెస్వైపు మొగ్గుచూపి, తమకు 20 టికెట్లు కావాలని డిమాండ్ చేసింది. కానీ కాంగ్రెస్ తన తొలిదశ జాబితాలో పటేళ్లకు 20 టికెట్లు ఇచ్చినప్పటికీ, వారిలో పాస్ నేతలు ఇద్దరే ఉన్నారు. దీంతో కాంగ్రెస్కు పాస్ మద్దతుపై ప్రస్తుతం కొంత సందిగ్ధత నెలకొంది. బీజేపీ మతతత్వంపై నోరు మెదపని కాంగ్రెస్! 2002లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోపే గుజరాత్లో అల్లర్లు చెలరేగడం తెలిసిందే. 2007 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయనను ‘మౌత్ కా సౌదాగర్’ (జనం చావుతో వ్యాపారం చేసే నేత) అంటూ ముస్లింల ఊచకోతను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పదేపదే ప్రస్తావించారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం బీజేపీ మతతత్వం గురించి కానీ, గోధ్రా అల్లర్ల గురించి కానీ కాంగ్రెస్ మాట ఎత్తడం లేదు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ రాష్ట్రంలోని ప్రధాన గుళ్లనన్నింటినీ సందర్శించి హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనేది కొందరి వాదన. ముస్లింలు, మసీదుల ఉనికిని ఆయన పట్టించుకోకపోయినా గుజరాత్లో మైనారిటీలు హస్తానికిగాక మరే ఇతర పార్టీకి ఓటేయరనే దీమా కాంగ్రెస్ను మందిరాల వైపు నడిపిస్తోంది. మొత్తానికి గోధ్రా అల్లర్ల తర్వాత జరుగుతున్న నాలుగో అసెంబ్లీ ఎన్నికలు మిగిలిన మూడు ఎన్నికల కంటే భిన్నమైన రీతిలో ఉంటాయని ఎన్నికల విశ్లేషకుల అంచనా. -
కులాధిపత్య భాషను సహించాలా?
కొత్త కోణం ఛండాల జాతికి చెందినవారైన నేటి షెడ్యూల్డ్ కులాల వారు తమ పూర్వ చరిత్రను అర్థం చేసుకోవాలి. ఆధిపత్య కులాహంకారంతో పదే పదే ఛండాల పద ప్రయోగానికి పూనుకోవడాన్ని ఎంత మాత్రం సహించ రాదు. సంప్రదాయాల ద్వారా తెలియకుండానే భాషలో వ్యక్తమయ్యే కుల వివక్షను అంతం చేయాలి. మారుతున్న సామాజిక పరిస్థితులకు అను గుణంగా ఎప్పటికప్పుడు తప్పొప్పులను బేరీజు వేసుకొని భాషను సరిదిద్దుకోవడం ఒక నిరంతర ప్రక్రియ. లేకుంటే భాషాభివృద్ధే ఉండదు. తప్పులు అక్షరాల్లో కాదు, భాషలో ఉంటాయి. మనం నివసిస్తున్న సమాజంలోనూ, అది ఆధార పడిన భావజాలంలోనూ ఉంటాయి. ఒక మని షిని, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని కించపరిచే అభి వ్యక్తి సమాజ గౌరవానికే భంగకరం. ఇటీవల హిందూ మత ప్రచారకులు చాగంటి కోటేశ్వరరావు చేసిన కొన్ని వ్యాఖ్యలు యాదవులకు మనస్తాపం కలిగించాయి. ఇలాగే గతంలో పలువురు రాజ కీయ నేతల వ్యాఖ్యలు, సామెతలు పలు కులాలకు బాధ కలిగించాయి. చాగంటి వ్యాఖ్యలపై నేనిక్కడ చర్చ చేయబోవడం లేదు. కాకపోతే ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి అన్నది వాస్తవం. కులాన్ని కించపరిచే మాటలు ఎందుకు? కులాల సమ్మేళనంతో కూడిన హిందూ మత నిర్మాణంలోనే కులాధిపత్య భాషా సమస్య ఇమిడి ఉన్నది. ఒక కులం, ఇంకొక కులం వారిని సాటి మనుషులుగా భావించదు. కొందరు తాము అధి కుల మనుకుంటే, ఇంకొందరు తమను తాము తక్కువవారమని భావించడం కుల సమాజ లక్షణం. అయితే అణచివేతకు గురౌతున్న వృత్తి కులాలు, సేవా రంగంలోని కులాలు, అంటరాని కులాలు ఇటీవలి కాలంలో చైతన్యవంతం అయ్యాయి. దీంతో వారు ఆధిపత్య కులాలు తమను కించపరిచే భాషా ప్రయోగాన్ని, పద ప్రయోగాలను సహించడానికి సిద్ధపడటం లేదు. అయినా ఆధిపత్య కులాలు నేటికీ కొన్ని సామా జిక వర్గాలను కించపరిచేలా అలవోకగా మాట్లా డుతుండడం విచారకరం. ఛండాల అంటే? తరచుగా చాలా మంది నోట వినిపించే మాట ‘ఛండాల’. అది ఒక కులాన్ని అవమాన పరచేది, ఒక వ్యక్తి నీచుడైతే ఛండాలుడు అనేయడం చాలా మందికి అలవాటు. ఏది నచ్చకపోయినా ఛండా లంగా ఉందంటారు. విజ్ఞానులు, పండితులు, మేధావులు సైతం తడబాటే లేకుండా ఇలా మాట్లాడేస్తుంటారు. అది తప్పేం కాదనుకుం టారు. ఆ కులస్తుల సంఖ్య చాలా తక్కువ, కొన్ని ప్రాంతాలకే పరిమితం. కాబట్టి అందుకు నిరసనా తక్కువే. కానీ ఎవరైనా ‘ఛండాల’ అనే పదాన్ని హీనమైన అర్థంలో వాడితే, వారి మీద ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టవచ్చు. అయితే మన దేశంలో చట్టాలకన్నా, సంప్ర దాయాలు బలమైనవి. అవి మనకు తెలియకుండానే తప్పులు చేయిస్తుం టాయి. పైగా అంటరాని కులాల ఉద్యమాలు ‘ఛండాల’ పద ప్రయోగంపై దృష్టి పెట్టలేదు. ఛండాల పద ప్రయోగంతో అంటరాని కులాలకున్న సంబంధం ఏమిటో తెలియకపోవడమే ఇందుకు కారణం. కులాధిపత్య ధిక్కార సంకేతం... ఆది శంకరుడు అతి చిన్న వయస్సులోనే దేశాన్ని చుట్టివచ్చి, హిందూ మతాన్ని సంస్కరించే ప్రయత్నం చేశాడని ప్రతీతి. ఆయన ఒకనాడు శిష్యులతో కలసి స్నానానికి నదికి వెళుతుండగా... ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కలతో ఎదురు పడతాడు. ఆ వ్యక్తిని పక్కకు తప్పుకోమని కోరగా అతడు గుక్క తిప్పుకోకుండా ఇలా ప్రశ్నిస్తాడు: ‘‘వేద వేదాంగాలు తెలిసిన నువ్వేనా నన్ను తప్పుకోమంటున్నది? సరే ఒకవేళ తప్పుకోవాల్సి వస్తే నా శరీరం తప్పుకోవాలా? లేదా ఆత్మ తప్పుకోవాలా? ఆత్మకు రూపం లేదు కదా? నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది. ఏమిటి తేడా? సూర్యుడు ఆకాశం నుంచి ప్రసరిస్తుంటే కిరణాలు నీ మీదా పడుతున్నాయి, నా మీదా పడుతున్నాయి. ఎందుకో చెప్పగలవా? ఇక్కడ వీస్తున్న గాలి, నన్ను తాకుతున్నది. నిన్ను తాకుతున్నది ఏమిటి తేడా? మనుషులంతా ఒక్కటే అందరి శరీరాలలో ఉన్న చీము, నెత్తురులు ఒక్కటే అని చెప్పే నువ్వు ఎందుకు నన్ను తప్పుకోమంటున్నావు’’. దీంతో శంకరుడు తాను ప్రవ చిస్తున్న సిద్ధాంతానికి ఆచరణ పూర్వకమైన సమాధానం దొరికినందుకు ఆ వ్యక్తి కాళ్లకు నమస్కరిస్తాడు. ఆ వ్యక్తే ఛండాలుడు. ఆది శంకరుడు ఛండా లుని కాళ్లకు మొక్కాడంటే ఆయన ప్రతిష్టకు భంగం కలుగుతుంటుందని శివుడే ఛండాలుని రూపంలో వచ్చాడని కథలు అల్లారు. ఛండాలుని తిరుగు బాటును శివుని హితబోధగా చిత్రించారు. బౌద్ధం సమానతా సందేశం అయితే ఛండాల జాతి గురించిన ప్రస్తావనలు చరిత్రలో, ప్రత్యేకించి బౌద్ధ సాహిత్యంలో చాలా ఉన్నాయి. అంటరానివారిగా పరిగణించే ఛండాల కుల స్తుడైన మాతంగుడు పలు అవమానాలకు గురవుతాడు. వాటికి వ్యతి రేకంగా పోరాడి, చివరకు విజేతగా నిలుస్తాడు. జైన సాహిత్యంలోని ‘అచ రంగ నిరుక్త’ గ్రం«థంలో కూడా ఈ ప్రస్తావన ఉన్నది. ఆనాటికి ఛండాల జాతి ఒక స్వతంత్ర తెగగా ఉండడం మాత్రమే కాదు. వైదిక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో బౌద్ధం అనుచరులుగా మారారు. బౌద్ధ సాహి త్యంలో ఛండాలిక బాలిక ప్రస్తావన ఉంది. దాని ఆధారంగానే రవీంద్రనాథ్ ఠాగూర్ ‘ఛండాలిక’ నాటికకు సృజించాడు. బావి నుంచి నీళ్లు తోడు తున్న ఒక ఛండాల బాలికను... బుద్ధుని ప్రథమ శిష్యుడు ఆనందుడు నీళ్లు పోయమని అడుగు తాడు. అంటరానిదానినంటూ ఆ బాలిక నిరా కరిస్తుంది. అందరూ సమానమేనని, నీవు నీళ్లు పోయాల్సిందేనని ఆనందుడు పట్టుపడతాడు. దానితో ఎంతో చలించిపోయిన ఛండాలిక ఆనం దునికి నీళ్లు పోస్తుంది. తర్వాత బౌద్ధ భిక్కునిగా మారుతుంది. వైదిక, బ్రాహ్మణ, హిందూ సంప్ర దాయాలను వ్యతిరేకించిన చరిత్ర ఛండాల జాతిదేనని చెప్పక తప్పదు. పూర్వ చరిత్రను గుర్తుంచుకోవాలి ఆర్యుల రాకకు పూర్వమే ఛండాల జాతి ఉన్నట్టు చారిత్రక పరిశోధనల వల్ల తెలుస్తున్నది. ఆర్యు లకు ముందు స్త్రీ దేవతారాధన అధికంగా ఉండేది. చండీగఢ్కు మధ్యలో చండీ దేవి ఆలయం ఉన్నది. ఆ చండీదేవి పేరిటనే చంఢీగఢ్ను నిర్మించారు. కశ్మీర్లోని పూంచ్కు సమీపంలో చండీ గ్రామం ఉన్నది. జార్ఖండ్లో ఛండేలియా ప్రాంతం ఉన్నది. నేడు మన దేశంలో ఉన్న వందలాది అంటరాని కులాల ప్రాచీన నామం ఛండాల అనే అనుకోవాల్సి ఉంటుంది. కాలక్రమేణా అంటరాని కులాలకు వేరు వేరు పేర్లు ఏర్పడ్డట్టు భావించాలి. ఒకప్పుడు దేశమంతా విస్తరించి ఉన్న ఛండాల కులం కొన్నివేల మందికి పరిమితమైంది. పశ్చిమ బెంగాల్లోని నామ శూద్రులను ఒకప్పుడు ఛండాలురనే వారు. ఈ ప్రాంతంలోని సాంఘిక సంస్కరణ ఉద్యమం ఛండాల అనే పేరును మార్చిందని బెంగాల్ దళిత ఉద్యమ చరిత్ర చెబుతున్నది. అలాంటి మార్పులు దేశవ్యాప్తంగానే జరిగినట్టు తెలుస్తున్నది. ఛండాల జాతికి చెంది నవారైన నేటి షెడ్యూల్డ్ కులాలవారు తమ పూర్వ చరిత్రను అర్థం చేసు కోవాలి. ఆధిపత్య కులాహంకారంతో పదే పదే ఛండాల పద ప్రయోగానికి పూనుకోవడాన్ని ఎంత మాత్రం సహించరాదు. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య మొబైల్ : 97055 66213
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement