-
వరద వదిలింది.. బురద మిగిలింది
కొవ్వూరు/పోలవరం : గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద హెచ్చరికలను గురువారం ఉపసంహరించారు. గోష్పాద క్షేత్రంలోని ఆలయాలు వరద ముంపు నుంచి తేరుకున్నాయి. శ్రీబాలా త్రిపురసుందరి సమేత సుందరేశ్వరస్వామి ఆలయం, గీతా మందిరం, షిర్డీసాయి ఆలయంలో ఒండ్రు మట్టి, ఇసుక మేటలు వేశారుు. మూడు రోజులపాటు ఆలయాలు ముంపులోనే ఉండటంతో ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి. ఆలయాల్లో పేరుకుపోయిన బురదను గురువారం ఉదయం తొలగించి, శుభ్రం చేసే పనులు చేపట్టారు. గోష్పాద క్షేత్రంలోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారాయి. పలుచోట్ల ఇసుక, ఒండ్రు మేటలు వేశారుు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం తగ్గడంతో బుధవారం రాత్రి 11 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.40 అడుగులు నమోదైంది. గోదావరి నుంచి 8,49,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ఆనకట్టకు గల 175 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు తగ్గడంతో లంక భూములు ముంపు బారినుంచి తేరుకుంటున్నాయి. జల దిగ్బంధంలోనే గిరిజన గ్రామాలు పోలవరం/పోలవరం రూరల్ : గోదావరి శాంతించినా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల వరద నీరు ఇంకా తొలగిపోలేదు. గిరిజనులు గ్రామాలను విడిచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్పిల్వే నిర్మాణ ప్రాంతంలో ఇంకా సుమారు ఐదు అడుగుల నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. మామిడిగొంది, దేవరగొంది, చేగొండపల్లి గిరిజనులు మాత్రం కొండల పైనుంచి అంచెలంచెలుగా పోలవరం చేరుకుని నిత్యావసర సరుకులు, అవసరమైన మందులు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. స్పిల్వే ప్రాంతంలో విద్యుత్ స్తంభం విరిగి పోవడంతో ఏజెన్సీ గ్రామాలకు సింగల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. మంచినీటి కోసం గిరి జనులు ఇబ్బందులు పడుతున్నారు. కోండ్రుకోట, మాదాపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేదు. కొత్తూరు కాజ్వే మీదుగా ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల రోడ్లు బయటపడినా బురద పేరుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. -
గోదారి హోరు
- భద్రాద్రి వద్ద 48 అడుగులకు నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక జారీ - ఏజెన్సీలో 50 గ్రామాలకు రాకపోకలు బంద్ - భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులు - సురక్షితంగా బయటపడ్డ ఛత్తీస్గఢ్ కూలీలు - నీటమునిగిన వరి, మిర్చి, పత్తి పంటలు - అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం భద్రాచలం: గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా నీటి ప్రవహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరుకోవటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదికి ఈ ఏడాది ఈస్థాయిలో నీటిప్రవాహం రావడం ఇదే తొలిసారి. వాస్తవంగా ఆగస్టు నెలలోనే గోదావరి నదికి వరదలు రావటం పరిపాటి . కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు లేకపోవటంతో ఈ ప్రాంత వాసులకు వరద ముప్పు తప్పంది. కానీ రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. భారీగా వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కాలేశ్వరం, ఇంద్రావతి ప్రాజెక్టుల నుంచి వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరుతుండటంతో 13 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువన ఉన్న శ బరి నది కూడా పోటెత్తుతోంది. అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి వరదతో వాజేడు మండలంలోని పలు గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చీకుపల్లివాగు పోటెత్తటంతో రహదారి పూర్తిగా మునిగిపోయింది. కొంగాలవాగు పొంగి ప్రవహిస్తోంది. వాజేడు మండల కేంద్రం నుంచి అవతల ఉన్న గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాజేడు- వెంకటాపురం మండలాల్లోని గుండ్లవాగు వద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తున్న చప్టా కుంగిపోయింది. వాజేడుకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు వెంకటాపురం నుంచే వెనుదిరుగుతున్నాయి. ఉధృతంగా వాగులు... భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతంలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వాజేడు మండలంలోని చీకుపల్లి, కొంగాలవాగు పొంగటంతో కిలోమీటర్ మేర రహదారిపై నీరు చేరింది. గోదావరి ఒక్కసారిగా పెరగటంతో వెంకటాపురం మండలం లంకల్లోని మిర్చితోటల్లో పనుల కోసమని వెళ్లిన ఛత్తీస్గఢ్ కూలీలు ప్రవాహంలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు నాటుపడవలను ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. డొంకరాయి, మోతుగూడెం ప్రాజెక్టులు కూడా నిండటంతో భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనివల్ల శబరి నది పోటెత్తుతోంది. సోకిలేరు, కుయిగూరు వాగులు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గిరిజన గ్రామాల ప్రజానీకం రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఏజెన్సీలో గోదావరి పరీవాహక మండలాల్లో సుమారుగా 50 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది ఎకరాల్లో నీటమునిగిన పంటలు భారీ వర్షాలకు తోడు గోదావరి వరద కూడా ఒక్కసారిగా పెరగటంతో పరీవాహక ప్రాంతంలోని వందలాది ఎకరాల్లో మిర్చి, వరి, పత్తి పంటలు నీటమునిగాయి. ఒక్క వాజేడు మండలంలోనే 400 ఎకరాల్లో వరి, 60 ఎకరాల్లో మిర్చి తోటలు పూర్తిగా నీటిపాలయ్యాయి. వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో గోదావరి నదికి ఆనుకొని ఉన్న పొలాల్లోకి నీరు చేరింది. అధికారుల ముందుజాగ్రత్త గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో పరీవాహక మండలాల అధికారులను జిల్లా కలెక్టర్ ఇలంబరితి అప్రమత్తం చేశారు. వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రాచలం ఐటీడీఏ పీవో దివ్య, ఆర్డీవో ఆర్.అంజయ్య సంబంధిత అధికారులతో కలసి ఆదివారం గోదావరి వర ద పరిస్థితిని పరిశీలించారు. ఎప్పటికప్పుడు గోదావరి నీటిమట్టం గురించి కేంద్ర జలవనరుల సంఘం అధికారుల ద్వారా తెలుసుకున్నారు. డివిజన్లోని ఆయా మండలాల అధికారులను అప్రమత్తం చేశారు. డివిజన్ ప్రజానీకం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు తరలాల్సిందిగా సూచించారు. మండల అధికారులంతా స్థానికంగా ఉండి వరద సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్కు బదలాయించిన మండలాల్లో తూర్పు గోదావరి ఆర్డీవో పర్యటించి వరద పరిస్థితిపై సమీక్షించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement