-
రోడ్డుపై గుట్టలుగా క్యాలీఫ్లవర్స్.. ఎగబడ్డ జనం
లక్నో : కష్టపడి పండించిన పంటకు దారుణమైన ధర పలుకుతోందన్న బాధతో ఓ రైతు తన మనసును కష్టపెట్టే నిర్ణయం తీసుకున్నాడు. పండించిన పంటను మొత్తం రోడ్డు పాలు చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో చోటుచేసుకుంది. వివరాలు.. జహానాబాద్ టౌన్కు చెందిన మహ్మద్ సలీమ్ తనకున్న పొలంలో క్యాలీఫ్లవర్ పంట పండించాడు. పంటను మొత్తం కోసి అమ్ముకోవటానికి పిలిభిత్లోని మార్కెట్ యార్డ్కు తీసుకువచ్చాడు. కిలో క్యాలీఫ్లవర్ రీటైల్ ధర రూ.12నుంచి రూ.14 ఉంది. అయితే సలీమ్ తనకు రూ.8 వచ్చినా చాలనుకున్నాడు. కానీ, అందుకు భిన్నంగా దళారులు కేవలం ఒక రూపాయి మాత్రమే ధర చెల్లిస్తామన్నారు. దీంతో అతడు షాక్ తిన్నాడు. బాధను తట్టుకోలేక 10 క్వింటాళ్ల పంటను రోడ్డు పాలు చేశాడు. దీంతో రోడ్డు మీద పడిన తాజా క్యాలీఫ్లవర్స్ను సొంతం చేసుకోవటానికి జనం ఎగబడ్డారు. ( రైతుల కోసం రిహన్నా.. ఫూల్ అన్న కంగనా) దీనిపై మహ్మద్ సలీమ్ మాట్లాడుతూ.. ‘‘ నేను నాకున్న అర ఎకరం పొలంలో క్యాలీఫ్లవర్స్ పండించాను. పంట పండించటానికి ఎనిమిది వేల రూపాయలు.. దాన్ని మార్కెట్కు తరలించటానికి మరో నాలుగు వేల రూపాయలు ఖర్చు అయింది. అయితే మార్కెట్లో నా పంటకు దారుణమైన రేటు కట్టారు. దీంతో భరించలేకపోయాను. దానికి తోడు వాటిని ఇంటికి తీసుకొచ్చేంత డబ్బు నా దగ్గరలేదు. అందుకే పంటనంతా రోడ్డు పాలు చేశాను’’ అని చెప్పాడు. -
లింగాయపాలెంలో ఉద్యాన పంటల సాగు
తుళ్లూరు: మండలంలోని లింగాయపాలెంలో ఉద్యాన , కూరగాయల పంటలు సాగవుతున్నాయి. ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వానికి భూములు ఇవ్వని రైతులు తమ పొలాలను సాగు చేసుకుంటున్నారు. ఈ ఏడాది గతంలో మాదిరిగానే 365 రోజులు తమ పొలాల్లో పంటలు సాగు చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. పూలింగ్ భూములు ఇవ్వనందుకు ఏమాత్రం బాధపడటం లేదని, తమకు వ్యవసాయమే ముఖ్యమని రైతులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఈ రోజు వరకూ తమకు కలగకపోవడం వల్లే తాము ప్రభుత్వానికి భూములు ఇవ్వలేక పోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రీన్ ట్రిబ్యునల్లో నడుస్తున్న కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement