-
సమస్యల సీసీఈ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో ఆలోచన, అవగాహన, సృజనాత్మకత పెంపొందించేందుకు కొత్తగా అమల్లోకి తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని పక్కాగా అమలు చేయలేక టీచర్లు ఆపసోపాలు పడుతున్నారు. సీసీఈ అమలుతో సాధించాల్సిన లక్ష్యాలపై వారికే అవగాహన లేకుండా పోయింది. బట్టీ విధానానికి స్వస్తి చెప్పి సొంతంగా పరీక్షల్లో ఆలోచించి జవాబులు రాయాల్సిన విద్యార్థులు గైడ్లు చూసే రాస్తున్నారు. సమయమంతా ప్రాజెక్టులు, రాత పనులకే పోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవలి విద్యా శాఖ సర్వేలోనే వెల్లడైంది. సీసీఈతో టీచర్లపైనా తీవ్ర పని భారం పడుతోంది. దాంతో ప్రత్యామ్నాయాలపై, వచ్చే విద్యా సంవత్సరంలో తేవాల్సిన మార్పులపై శాఖ దృష్టి సారించింది. సీసీఈ అమలులో సమస్యలివీ... - అన్ని సబ్జెక్టుల టీచర్లూ ఒకేసారి ప్రాజెక్టు పనులు, పుస్తక సమీక్షలు, రాత పనులు ఇవ్వడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. - పదో తరగతిలో సహ పాఠ్య కార్యక్రమాలు నిర్వహించకుండానే మార్కులు వేస్తున్నారు. - 6, 7 తరగతుల్లో సహ పాఠ్య కార్యక్రమాలు నిర్వహించడమూ లేదు, ఆ మార్కులు వేయడమూ లేదు. నమోదూ చేయడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లోనూ అంతే. - చాలా స్కూళ్లలో సైన్స్ ప్రయోగాలు చేయించకుండానే మూస పద్ధతిలో ల్యాబ్ రికార్డులు రాయిస్తున్నారు. - 9, 10 తరగతుల్లోనూ ప్రాజెక్టు పని నివేదికలను ఎంతమంది విద్యార్థులు సొంతంగా రాస్తున్నారో పట్టించుకోవడం లేదు. - ప్రాజెక్టు పనులతో పిల్లలు చదవడం కంటే రాయడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. - ఏ తరగతిలోనూ విద్యార్థులు పరీక్షల్లో సొంతంగా ఆలోచించకుండా, చాలావరకు గైడ్లలో చూసి జవాబులు రాస్తున్నారు. అయినా టీచర్లు మార్కులు వేస్తున్నారు. - పిల్లల భాగస్వామ్యం అంశంలో.. సాంఘిక శాస్త్రంలో సమకాలీన అంశాలపై ప్రతిస్పందన రాయడంపై చాలామందికి అవగాహనే ఉండటం లేదు. - 6, 7 తరగతుల్లో పుస్తక సమీక్షలు నామ మాత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమిక వివరాలు రాసినా మార్కులేస్తున్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి ఈ సమస్యల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యా శాఖ కమిటీలు క్షేత్రస్థాయిలో అధ్యయనంతో చేసిన సిఫార్సులను పరిశీలిస్తోంది. - వచ్చే విద్యా సంవత్సరంలో ప్రాజెక్టు పనులను తగ్గించే యోచన చేస్తోంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో ప్రాజెక్టు పనులు లేకుండా చూడాలని భావిస్తోంది. - 6, 7 తరగతుల్లో విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం; 8, 9, 10 తరగతుల్లో భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాల అభ్యాసాల్లో ప్రశ్నలను తగ్గిస్తే రాత భారం తగ్గుతుందని భావిస్తోంది. - ఏటా నాలుగుసార్లు నిర్వహించే నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫామేటివ్ అసెస్మెంట్–ఎఫ్ఏ) విద్యార్థులకు భారం కాకుండా తగిన మార్పులు చేయాలని భావిస్తోంది. వీటిలో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు 10 మార్కులు, రాత పనులకు 5, లఘు పరీక్షకు 5, మొత్తం 20 మార్కులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోంది. -
సీసీఈ విధానాన్ని మార్చాలి
జిల్లా ఏపీపీఎస్ఏ సర్వసభ్య సమావేశం తీర్మానం తాళ్లరేవు : నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) వి«ధానాన్ని ప్రభుత్వం మార్చాలని జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్ఏ) డిమాండ్ చేసింది. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు తమ్మయ్యనాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశం వివరాలను జిల్లా జనరల్ సెక్రటరీ, తాళ్లరేవు మార్గదర్శి హైస్కూల్ కరస్పాడెంట్ పెమ్మాడి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీపీఎస్ఏ రాష్ట్ర అ«ధ్యక్షుడు కేఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ సీసీఈ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఆరు నుంచి 9వ తరగతి పరీక్షలను ఏప్రిల్లోనే నిర్వహించాలని కోరారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పాటించాలని తదితర సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఆదిత్యా విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఏపీపీఎస్ఏ బలోపేతానికి పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలని కోరారు. తమ్మయ్యనాయుడు మాట్లాడుతూ సమస్యలు తెలిపితే జిల్లా కమిటీ తరఫున పోరాడతామన్నారు. పెమ్మాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ తరహాలో ఏపీపీఎస్ఏ సంఘానికి నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రగౌరవ అధ్యక్షురాలు వసంతాప్రసాద్, రాష్ట్ర కన్వీనర్ చౌదరి, ప్రధాన కార్యదర్శి మురళీమనోహర్, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజు, ఆదిత్య విద్యా సంస్థల కరస్పాండెంట్ మధులత తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన మొక్కు‘బడి’
తూతూ మంత్రంగా ‘ముందస్తు విద్యాసంవత్సరం’ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కానరాని ఉత్సాహం లక్ష్యానికి ఆమడదూరంలో నిలిచిన ప్రయోగం ప్రభుత్వం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ మాదిరిగా కొత్త విద్యా సంవత్సరాన్ని (2017-18) ఒక నెల ముందుగానే ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆశించినా రాష్ట్ర ప్రభుత్వ ఆశయం లక్ష్యానికి ఆమడదూరంలోనే నిలచిపోయింది. రాష్ట్ర విద్యాశాఖ మార్చి 17వ తేదీలోగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించి 2016-17 విద్యాసంవత్సరాన్ని ముగించింది. నాలుగు రోజుల వ్యవధినిచ్చి అదే నెల 21 నుంచి కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించింది. అయితే, మార్చి నెలారంభం నుంచే ఎండలు విపరీతం కావడం, పెళ్లిళ్ల సీజన్, పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్కు టీచర్లు వెళ్లడం తదితర కారణాలతో కొత్త విద్యాసంవత్సరం మొక్కుబడిగా ముగిసింది. తరగతులు జరిగిన రోజులు పలు పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం అతి తక్కువగా కనిపించింది. - కాకినాడ రూరల్ గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో టీచర్లు ఇన్విజిలేషన్కు వెళ్లడం, ఈ నెల మూడు నుంచి ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్కు వెళ్లడంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారే కరువయ్యారు. మిగిలిన ఒకరో, ఇద్దరో పాఠశాలకు వచ్చి మమ అనిపించేశారు. దీంతో అసలు లక్ష్యం నెరవేరకపోగా సమయం వృథా అయ్యిందంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయకపోవడంతో చిన్నారులు పాతపుస్తకాలతోనే పాఠశాలకు వెళ్లడం తప్ప ముందస్తు విద్యాసంవత్సరంతో పిల్లలకు ఒరిగిందేమీలేదు. పాఠశాలలు సక్రమంగా నడుస్తున్నాయా? విద్యార్థుల సాధకబాధలేమిటీ? టీచర్లు సక్రమంగా హాజరవుతున్నారా? అనే విషయాల్లో ఉన్నతాధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. ముందస్తు పుణ్యమా అని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కొత్త అడ్మిషన్ల పేరుతో ఫీజులు దండికోవడం తప్పితే ఒనగూరిన ప్రయోజనం లేదని సర్వతా విమర్శలు వినిపిస్తున్నాయి. బోసిపోయిన తరగతులు ఎండలు తీవ్రమవ్వడంతో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. కొన్ని పాఠశాల్లోనైతే వేళ్లమీద లెక్కించదగ్గ విద్యార్థులే హాజరయ్యారు. ఉపాధ్యాయులు సైతం ఇష్టానుసారంగా వచ్చిపోవడం కూడా ముందస్తు విద్యాసంవత్సరం విఫలమవ్వడానికి కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. మొత్తానికి మండిపోతున్న ఎండలతో శనివారంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో ముందస్తు విద్యాసంవత్సరం ముగించేశారు. మార్పుపై పునరాలోచించాలి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో కొత్త విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించినా అందుకు తగ్గట్టు విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లను ప్రభుత్వం సన్నద్ధం చేయకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైందని తల్లిదండ్రులు, విద్యా మేథావులు అభిప్రాయపడుతున్నారు. కనీసం వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. ముందస్తు విద్యాసంవత్సరాన్ని కొనసాగించదల్చుకుంటే అన్ని వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన పది పరీక్షలు
– చివరి రోజున 233 మంది విద్యార్థులు గైర్హాజరు – వచ్చే నెల 3నుంచి స్పాట్ మొదలు అయ్యే అవకాశం కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి మొదలై.. గురువారం సోషల్ పేపర్–2తో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది సీసీఈ విధానంలో పరీక్షలు జరిగాయి. కొత్త విధానం అయినా.. ఎక్కడా పెద్దగా ఆందోళనలు జరగక పోవడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో ఏవిధంగా పరీక్షలు నిర్వహిస్తారోననే ఆందోళన ఉన్నా ఇంచార్జీ డీఈఓ, డిప్యూటీ ,ఈఓలు, సీనియర్ హెచ్ఎంల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించారు. చివరి రోజున 50,079 మంది విద్యార్థులకుగాను 49,846 మంది విద్యార్థులు హాజరు కాగా.. 233 మంది గైర్హాజరైయ్యారు. డీఈఓ తాహెరా సుల్తానా ఐదు కేంద్రాలు, ఎస్సీఈఆర్టీ నుంచి జిల్లా అబ్జర్వర్గా వచ్చిన లక్ష్మీవాట్స్ ఏడు కేంద్రాలను తనిఖీ చేశారు. వచ్చే నెల 3నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
సీబీఎస్ఈ పాఠశాలల్లో సీసీఈ విధానం రద్దు
న్యూఢిల్లీ: అన్ని సీబీఎస్ఈ స్కూళ్లలో 6–9 తరగతులకు సమగ్ర నిరంతర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సీబీఎస్ఈ బుధవారం తెలిపింది. బోధన, ముల్యాంకనాలను ప్రామాణీకరించడం కోసం చేపట్టనున్న ఈ మార్పులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సీబీఎస్ఈ పాఠశాలల్లో అమల్లోకి రానున్నాయి. పదో తరగతి పరీక్షలను పునరుద్ధరించడంతో ఈ మార్పులు అత్యవసరమయ్యాయని సీబీఎస్ఈ తెలిపింది. సీసీఈ విద్యా విధానంలోని లోపాల కారణంగా ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారే 6–9 తరగతుల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీబీఎస్ఈ అధికారి ఒకరు అన్నారు. నూతన విద్యావిధానంలో రాత పరీక్షకు 90 శాతం మార్కులు ఉండగా, 10 శాతం మార్కుల్ని ఉపాధ్యాయులు ఇతర కార్యక్రమాలకు కేటాయించనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement