-
అంబరాన్నంటిన సంబరాలు
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సంబరాలు రెండో రోజైన మంగళవారమూ అంబరాన్ని తాకాయి. బతుకమ్మ.. బతుకమ్మ.. మా తల్లి బతుకమ్మ అంటూ మహిళలు, చిన్నారులు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఆడిపాడారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు కొనసాగాయి. ఇందులో భాగంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వివిధ సంఘాల మహిళలు సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి.. గౌరమ్మ, వివిధ రకాల పూలతో సద్దుల బతుకమ్మను అలంకరించి, గౌరమ్మపూజలు చేశారు. తెలంగాణ అమరులను స్మరించుకున్నారు. కాగా.. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతిభ కనబర్చిన మహిళా సంఘాలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆదిలాబాద్ పట్టణం కోలీపూరకు చెందిన శ్రీలక్ష్మి బృందం ప్రథమ బహుమతి, జైనథ్ మండలానికి చెందిన గణిత బృందం ద్వితీయ బహుమతి, ఆదిలాబాద్ద పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మి బృందం తృతీయ బహుమతి గెలుచుకుంది. వారికి కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్రెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ రాజ్, డీఎస్డీవో సుధాకర్రావు, మెప్మా పీడీ రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. బతుకమ్మ ఆడిన కలెక్టర్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ పోటీల్లో భాగంగా కలెక్టర్ అహ్మద్బాబు కూడా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆనందంగా గడిపారు. తదుపరి ఆయన మాట్లాడుతూ.. జిల్లా అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ప్రత్యేక రాష్ట్రంలో మరింత ఎక్కువగా పనిచేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలన్నారు. ఈ సంబరాలు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు శుభసూచకమని తెలిపారు. -
అంబరాన్నంటిన సంబురాలు
కలెక్టరేట్, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జిల్లాప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. స్థానిక ప్రగతి భవన్ ముందు సోమవారం ఉద్యోగులు పెద్ద ఎత్తున ‘ప్రత్యేక’ సంబు రాలను ఆనందంగా జరుపుకున్నా రు. ధూం-ధాం ఏర్పాటుచేసి,ఆట,పాటలతో సందడిచేశారు. అంతకు ముందు టీఎన్జీవోస్ కార్యాలయం నుంచి ఉద్యోగులు రైల్వే స్టేషన్, ఎస్పీ క్యాంపు కార్యాలయం మీదుగా ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, అమరులైన వివిధ శాఖల ఉద్యోగులు టి.రాజు(డీఎంహెచ్ఓ), బోయిని వేణు(విద్యాశాఖ), హైమద్(తహశీల్దార్ కార్యాలయం),నర్సింగ్రావు(పాలిటెక్నిక్)లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యోగుల ఉద్యమ ఫలితమేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉద్యోగులు ఎన్నో కష్టాల ఎదుర్కొన్నారన్నారు. కేసులు నమోదు చేసినా, సస్పెండ్ చేసినా ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగారన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతారనే నమ్మకం ఉందన్నారు. ఉద్యోగులకు ప్రత్యే క ఇంక్రిమెంట్లు ప్రకటించడం హర్షణీయమన్నారు. అటెండర్ నుంచి కలెక్టర్ వరకు ఉద్యోగులు సమానమేనన్నారు. ఉద్యోగులు తప్పు చేయకుండా తెలంగాణ అభివృద్ధికి కృషిచేయాలని ఆయన కోరారు. ఉద్యోగులు ఎవరూ కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాను ఆదర్శం గా తీర్చిదిద్దుదామన్నారు. పని గంటలు పెంచుకోవడానికి సిద్ధం.. అనంతరం టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎ. కిషన్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీవోల పాత్ర కీలకమైందన్నారు. 1948, 1969,2009 సంవత్సరాలలో జరిగిన ఉద్యమాల్లో టీఎన్జీవోస్ ఉద్యోగులందరినీ ముందు ండి నడిపించిందన్నారు. తెలంగాణ రాష్ర్టం అభివృద్ధి కోసం అవసరమైతే పని గంటలు పెంచుకోవడానికి సిద్ధమన్నారు. టీజీఓ అధ్యక్షుడు బాబురావు మాట్లాడుతూ... దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రా న్ని అభివృద్ధి పరుచుకోవాల్సి బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు జమాల్పూర్ గణేశ్ మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా నాలుగున్నర కోట్ల ప్రజలు ఉద్యమించారో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా అదేవిధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ నాయకులు నరేందర్, సుధాకర్, దయానంద్, శ్రీనివాస్రావు, టీజీఓ నాయకులు గంగాకిషన్, నిర్మల కుమారి, రెవె న్యూ ఉద్యోగులు, అన్ని సంక్షేమ శాఖ ఉద్యోగు లు, కార్పోరేషన్ ఉద్యోగులు, డీఆర్ఓ రాజశేఖ ర్,జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులందరికీ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సం ఘం ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అలరించిన ఆట,పాట.. చాలా రోజుల తరువాత మరోసారి తెలంగాణ ఆట,పాట మార్మోగింది. అరుణోదయ కళాకారులు లక్ష్మణ్, రాంపూర్ సాయి బృందాలు తెలంగాణ ఆట,పాటలతో ఉద్యోగులను అల రించారు. ‘వీరులారా వందనం....’ అసైదుల ఆరతి...’ పొడుస్తున్న పొద్దుమీద...’ తదితర ఉద్యమ పాటలతో ఉర్రూతలూగించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement