-
ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్షాప్
నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు (అర్బన్ ఫార్మింగ్)పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ నెల 24న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు జీడిమెట్ల విలేజ్(పైపులరోడ్డు)లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. అర్బన్ ఫార్మింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ తదితర అంశాలపై కేరళకు చెందిన నిపుణురాలు డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. 25 మంది సీనియర్ ఇంటిపంటల సాగుదారులు తమ అనుభవాలను వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా పాల్గొంటారని ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగలవారు 79977 24936, 79977 24983, 79977 24985 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
హైదరాబాద్ అందరిదీ
నిస్సంకోచంగా పెట్టుబడులు పెట్టండి ఉచిత పథకాలతో దేశ ప్రగతికి చేటు ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కేంద్రమంత్రి వెంకయ్యునాయుుడు హైదరాబాద్: ప్రస్తుత తరుణంలో ప్రపంచంలోని అన్ని పరిశ్రమలు హైదరాబాద్వైపు చూస్తున్నాయని వాటిని ఆకర్షించే శక్తి భాగ్యనగరానికే ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఉప్పల్ పారిశ్రామిక వాడలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ కార్యాలయ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ హైదరాబాదీలేనని, భాగ్యనగరం మన అందరిదన్నారు. దీనిపై అందరికీ సమాన హక్కులున్నాయని, ఎవరైనా పెట్టుబడులు నిస్సంకోచంగా పెట్టవచ్చని సూచించారు. కల్లు గీయడం, కుండలు చేయడం లాంటి కళలు, పోచంపల్లి, కంచి పట్టు లాంటి చీరలు తయారు చేయడం మనం తప్ప మరే దేశం చేయలేదన్నారు. ఇక నుంచి ఎవరూ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్ని సౌకర్యాలు మనదేశంలో ఉన్నాయని తెలిపారు. ఉచిత పథకాల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతుందని అలాం టివి ప్రోత్సహించ వద్దన్నారు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మనందరం భారతీయులమని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రాంతీయత పేరిట విద్వేషాలను రెచ్చగొట్టే వారి ని దూరం పెట్టాలని కోరారు. జన్ధన్ కార్యక్రమాన్ని రూపొందించి 15 రోజు ల్లో మూడు కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఇప్పించామన్నారు. రైతు రుణ మాఫీ శాశ్వత పరిష్కారమా? వ్యవసాయ రంగానికి రైతు రుణ మాఫీ శాశ్వత పరిష్కారమా అని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య సూటిగా ప్రశ్నించారు. రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక పదో వార్షికోత్సవం సందర్భంగా ఆది వారం జరిగిన రైతు నేస్తం పురస్కారాలు-2014 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. వ్యవసాయ రంగానికి అప్పుల మాఫీ కంటే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అవసరమన్నారు. బ్యాంకులు రైతులకు ఇచ్చే అప్పులు ప్రజల డబ్బు అని, ప్రజల సొమ్ముపై కొద్దిపాటి లాభాలతో రైతులకు ఇచ్చే రుణాలను మాఫీ చేస్తే దివాళా తీస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయూనికి ఉచిత విద్యుత్ కంటే నాణ్యమైన పదిగంటల విద్యుత్ అవసరమని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో ప్రతిరైతు కూ వ్యవసాయ భూసార కార్డులు అందించేం దుకు ప్రధాని నరేంద్రమోడీ కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రి ప్రకటించారు. కార్యక్రవుంలో నాబార్డు రిటైర్డ్ సీజీఎం పాలాది మోహనయ్య, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో సేవలు అందిస్తున్న వారికి పురస్కారాలు అందించారు. పురస్కారం అందుకున్న వారిలో సాక్షి దినపత్రిక సబ్ ఎడిటర్ జిట్టా బాల్రెడ్డి ఉన్నారు. రైతు నేస్తం పురస్కార గ్రహీతలు జీవితసాఫల్య పురస్కారం: డా.ఎల్.జలపతి రావు( ఏఎన్జీఆర్ఏయూ రిటైర్డ్ రిజిస్ట్రార్) శ్రమధాత్రి పురస్కారం: జి.మునిరత్నమ్మ(చిత్తూరు), రైతు విభాగం: పారినాయుడు(విజయనగరం), సామినేని హిమవంతరావు(ఖమ్మం), ఎం.విజయరామకుమార్ (కృష్ణా), దండా వీరాంజనేయులు(ప్రకాశం), ఎస్.స్తంభాద్రిరెడ్డి (మహబూబ్నగర్), పి.పావని (రంగారెడ్డి), మేకల వేణు, ఎం.నాగేశ్వరరావు (గుం టూరు), భూక్యా బాలగంగాధర్ నాయక్(అనంతపురం), గోదాసు నర్సింహా (నల్లగొండ), మహమ్మద్ రియాజుద్దీన్ (నిజామాబాద్). శాస్త్రవేత్తల విభాగం: ఆర్. రాఘవయ్య, ఆర్వీఎస్కే రెడ్డి(హైదరాబాద్), వై.కోటేశ్వర్రావు(గుంటూరు), జె.కృష్ణప్రసాద్ (బాపట్ల), టి.స్వర్ణలతాదేవి (కడప), కె.జలజాక్షి(అనంతపురం), జి.జయశ్రీ, కె. విజయలక్ష్మీ(హైదరాబాద్), ఎం.కిషన్కుమార్, వై.ఆంజనేయులు, బి.రమేష్గుప్తా(కరీంనగర్). విస్తరణ విభాగం: వి. లక్ష్మారెడ్డి, డి. చక్రపాణి (మెదక్), పి. గురుమూర్తి(విజయనగరం), బి. మురళీధర్(ఆదిలాబాద్), ఎం. సరితారెడ్డి(హైదరాబాద్). అగ్రి జర్నలిజం విభాగం: జిట్టా బాల్రెడ్డి (సాక్షి), చాపల శ్రీవకుళ (ఈటివి), కందిమళ్ల వెంకట్రావు (ఆంధ్రజ్యోతి), పి.రామచందర్రావు (99 టివి), మట్టిమనిషి కార్యక్రమం (టి న్యూస్), భూమిపుత్ర కార్యక్రమం (మా టీవీ).
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement