-
సొంతంగా షేర్ల బదిలీ
బ్రోకర్ దగ్గర షేర్లు విక్రయిస్తే, ఆటోమేటిగ్గా అవి డీమ్యాట్ ఖాతా నుంచి డెబిట్ అవుతాయి. ఇందుకు ఖాతాను ప్రారంభించే సమయంలోనే అనుమతి (పవర్ ఆఫ్ అటార్నీ) తీసుకునే విధానం అమల్లో ఉంది. అయితే, కొన్ని సందర్భాల్లో బ్రోకర్ దగ్గర ఖాతా ద్వారా కాకుండా ఆఫ్లైన్లో షేర్లను విక్రయించుకోవడం లేదంటే కుటుంబ సభ్యులకు బహుమతిగా షేర్లను బదిలీ చేయాల్సి రావచ్చు. మరి అటువంటప్పుడు స్వయంగా ఎవరికి వారు ఆ బదిలీ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. దీని గురించి ఎక్కువ మందికి దాదాపుగా తెలియదు. ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేయడానికి ఆఫ్లైన్, ఆన్లైన్ మార్గాలున్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయో అవగాహన కల్పించే ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం ఇది... ఇదంతా డిజిటల్ యుగం. దాదాపు బ్యాంకు సేవలు, బ్రోకింగ్ సేవలను ఆన్లైన్లోనే చేసుకుంటున్నాం. అయినా కానీ, రెండు డీమ్యాట్ ఖాతాల మధ్య షేర్లను బదిలీ చేసేందుకు ఇప్పటికీ ఆఫ్లైన్ విధానాన్నే ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. నూతనతరం బ్రోకర్లు (డిపాజిటరీ పార్టిసిపెంట్) అయిన జెరోదా, ఏంజెల్ వన్ తదితర కొన్ని సంస్థలు ఆన్లైన్లోనే షేర్లను సులభంగా బదిలీ చేసుకునే సేవలను అందిస్తున్నాయి. ఆన్లైన్లో షేర్ల బదిలీని రెండు విధాలుగా చేపట్టొచ్చు. డీమ్యాట్ ఖాతా ద్వారా లేదంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) ఈజీఎస్ట్ కోసం నమోదు చేసుకుని ఆన్లైన్లో షేర్లను బదిలీ చేసుకోవచ్చు. ఈజీఎస్ట్అనేది సెక్యూరిటీల సమాచారం తెలుసుకునేందుకు, లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఉద్దేశించినది. అలాగని అన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్లో బదిలీ సేవలను అందించడం లేదు. చాలా డీపీలు, బ్యాంకులకు సంబంధించిన బ్రోకింగ్ విభాగాల్లో ఖాతా ఉన్న వారు ఆఫ్లైన్ (భౌతిక రూపంలో) విధానంలో చేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్లైన్ మార్గం.. ఆఫ్లైన్లో అయితే ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్) బుక్లెట్ ఉండాలి. షేర్లను బదిలీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బుక్లెట్లోని ఓ స్లిప్పై బదిలీ చేయాలనుకుంటున్న కంపెనీ, ఐఎస్ఐఎన్ నంబర్, ఎన్ని షేర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. ఏ డీపీ పరిధిలోని క్లయింట్కు బదిలీ చేయాలనుకుంటున్నారో, ఆ వివరాలు కూడా ఇవ్వాలి. అంటే క్లయింట్ ఐడీ, డీపీ ఐడీ వివరాలు నమోదు చేయాలి. ఐఎస్ఐఎన్ అన్నది ప్రతీ కంపెనీకి కేటాయించే ఓ యూనిక్ నంబర్. గూగుల్లో సెర్చ్ చేసినా ఈ నంబర్ తెలుస్తుంది. షేర్లను స్వీకరించే క్లయింట్ సీఎంఆర్ కాపీ జత చేయాలి. డీఐఎస్ అన్నది బ్యాంక్ చెక్ మాదిరిగా పనిచేస్తుంది. ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కు నగదు బదిలీకి చెక్ ఉపయోగపడినట్టే.. డీఐఎస్ అన్నది ఒక డీమ్యాట్ ఖాతా నుంచి మరొక డీమ్యాట్ ఖాతాకు షేర్లను బదిలీ చేసే సాధనం. ఆఫ్లైన్లో ఇలా షేర్ల బదిలీకి కొన్ని రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో, కొందరు బ్రోకర్ల వద్ద ఇందుకు నెల వరకు సమయం తీసుకోవచ్చు. బ్రోకర్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ నుంచి లేదంటే బ్రోకర్కు ఈ మెయిల్ రూపంలో, బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి డీఐఎస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు సంబంధించిన డీమ్యాట్ ఖాతా కలిగి ఉన్న వారు నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే బ్యాంకు శాఖకు వెళ్లి దీనికి దరఖాస్తు సమర్పించొచ్చు. రిజిస్టర్డ్ చిరునామాకు డీఐఎస్ బుక్లెట్ వస్తుంది. లేదా బ్రోకర్ ఆఫీసుకు వెళ్లి తీసుకోవచ్చు. బదిలీ చేయాలనుకున్నప్పుడు డీఐఎస్ స్లిప్లో అన్ని వివరాలు నమోదు చేసి, సీఎంఆర్ కాపీ జతచేసి బ్రోకర్ ఆఫీసులో సమర్పించాలి. లేదంటే కార్యాలయానికి పంపించాలి. బ్యాంకులు అయితే కేవలం కొన్ని శాఖల్లోనే ఈ సేవలు లభిస్తాయి. ఆన్లైన్లో షేర్ల బదిలీ ఆన్లైన్లో షేర్ల బదిలీకి రెండు విధానాలున్నాయి. ఒకటి డీమ్యాట్ ఖాతా ద్వారా చేసుకోవచ్చు. అలాగే, సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా బదిలీ చేసుకోవచ్చు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సేవను అందిస్తున్నాయి. కానీ, భద్రత రీత్యా ఈ ప్రక్రియ కొంత ఆన్లైన్, కొంత ఆఫ్లైన్తో కూడుకుని ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ డైరెక్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ అన్నది కనీసం ఒక అకౌంట్ హోల్డర్ వ్యక్తిగతంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఆమోదం పొందితే, ఏ డీమ్యాట్ ఖాతాకు అయినా ఆన్లైన్లోనే షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే గరిష్టంగా ఐదు ఖాతాల వరకు ఆన్లైన్లో, అది కూడా నిర్ణీత విలువ మేరకే బదిలీకి అనుమతి ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. సీడీఎస్ఎల్లో అకౌంట్ ఉండి, బదిలీ చేయాలనుకుంటున్న ఖాతా కూడా సీడీఎస్ఎల్ పరిధిలోనే ఉన్నట్టయితే బదిలీ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది. ఇందుకోసం సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ వద్ద ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే, ఎన్ఎస్డీఎల్ పరిధిలోనే రెండు ఖాతాల మధ్య బదిలీకి ఎన్ఎస్డీఎల్ స్పీడ్–ఈ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సీడీఎస్ఎల్ పరిధిలో జాయింట్ అకౌంట్ ఉంటే, ఖాతాను నిర్వహించే వ్యక్తికి అనుకూలంగా మిగిలిన జాయింట్ అకౌంట్ హోల్డర్స్ నుంచి డిక్లరేషన్తో భౌతికంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ ముగిసి, బ్రోకర్ నుంచి అమోదం లభించిన తర్వాత సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలో ఏ ఖాతాకు అయినా షేర్లను బదిలీ చేసుకోవడం సాధ్యపడుతుంది. సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ పరిధిలోని రెండు ఖాతాల మధ్య ఆన్లైన్లో షేర్ల బదిలీ చాలా సులభం. కాకపోతే సీడీఎస్ఎల్ – ఎన్ఎస్డీఎల్ పరిధిలోని ఖాతాల మధ్య బదిలీ చేసుకోవాలంటే ఓటీపీ వంటి అదనపు భద్రతా రక్షణలు అమల్లో ఉన్నాయి. మోసపూరిత లావాదేవీలకు చెక్ పెట్టేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అదనపు సమయం కూడా తీసుకుంటుంది. సొంత ఖాతాల మధ్య.. తన పేరిటే మరో ఖాతాకు షేర్లను బదిలీ చేయాలనుకుంటే అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్. అంటే ఒక డీపీ వద్ద డీమ్యాట్ ఖాతాను మూసేసి, మరో డీపి వద్ద ఖాతా ప్రారంభించడం. అలాంటప్పుడు క్లోజర్ కమ్ ట్రాన్స్ఫర్ విధానం అనుసరించాలి. ముందుగా మరో బ్రోకర్ వద్ద ఖాతాను తెరవాలి. అప్పుడు మూసి వేయాలని అనుకుంటున్న బ్రోకర్కు దరఖాస్తు ఇవ్వాలి. దాంతో అందులో ఉన్న అన్ని సెక్యూరిటీలను అదే క్లయింట్ వేరొక ఖాతాకు బదిలీ చేసిన తర్వాత, క్లోజ్ చేస్తారు. ఇందుకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఒక బ్రోకర్ సేవలు నచ్చనప్పుడు, న్యూఏజ్ బ్రోకర్కు మారిపోవాలని అనుకున్నప్పుడు ఈ మార్గాన్ని అనుసరించొచ్చు. ఈ ప్రక్రియను భౌతికంగా చేసుకోవాల్సిందే. మరో విధానం పాక్షిక బదిలీ. అంటే అప్పటికే ఉన్న ఒక డీమ్యాట్ ఖాతాను కొనసాగిస్తూ, అందులోని షేర్లను మరో సొంత ఖాతాకు బదిలీ చేసుకోవడం ఈ విధానంలో ముఖ్యాంశం. వ్యయాలు, పన్నులు ఒక డీమ్యాట్ ఖాతాను మూసివేస్తూ, అందులోని షేర్లను అదే వ్యక్తికి సంబంధించి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే ఎలాంటి చార్జీల్లేవు. ఖాతా మూసివేయకుండా, వాటిని వేరొక ఖాతాకు బదిలీ చేసేట్టు అయితే షేర్ల విలువలో నిర్ణీత శాతం లేదంటే రూ.15–25 (స్క్రిప్ వారీ) ఫ్లాట్ చార్జీ పడుతుంది. ఒకవేళ ఆఫ్ మార్కెట్ విక్రయం ద్వారా బదిలీ చేస్తున్నట్టు అయితే స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సి రావచ్చు. ఇలా షేర్లను బదిలీ చేస్తున్న వారు ధరసహా పలు వివరాలను నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మూలధన లాభాల పన్నును చెల్లించేందుకు ఈ వివరాలు ప్రామాణికం అవుతాయి. భవిష్యత్తులో ఇలాంటి ఆఫ్ మార్కెట్ (స్టాక్ ఎక్సే్ఛంజ్లతో సంబంధం లేకుండా) లావాదేవీలపై ఏదైనా పన్ను వివాదం తలెత్తినప్పుడు ఈ రికార్డులు అవసరంపడతాయి. ఒక వ్యక్తి ఒక డీపీ పరిధిలోని ఖాతా నుంచి వేరొక డీపీ పరిధిలోని ఖాతాకు షేర్లను బదిలీ చేసుకున్నప్పుడు కొందరు బ్రోకర్లు ఈ వివరాలను రికార్డు చేస్తున్నారు. అటువంటప్పుడు దీర్ఘకాల మూలధన లాభం, స్వల్పకాల మూలధన లాభం పన్ను వివరాలు సులభంగా పొందొచ్చు. కొందరు బ్రోకర్ల పరిధిలో ఈ వివరాలు నమోదవడంలేదు. కనుక ఎంత కాలం పాటు సదరు సెక్యూరిటీని కలిగి ఉన్నామనే వివరాల కోసం పాత ఖాతాకు సంబంధించి (కొనసా గిస్తున్నా లేదా మూసివేస్తున్నా కానీ) అకౌంట్ స్టేట్మెంట్ జాగ్రత్త చేసి పెట్టుకోవాలి. జెరోదా వంటి కొందరు బ్రోకర్లు ఆఫ్లైన్లో బదిలీ ద్వారా డీమ్యాట్ ఖాతాలోకి కొత్తగా సెక్యూరిటీలు వచ్చి చేరినప్పుడు.. మాన్యువల్గా వాటిని కొనుగోలు చేసిన తేదీ, ధర వివరాలు నమోదు చేసే ఆప్షన్ ఇస్తున్నాయి. ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి షేర్లను బదిలీ చేస్తున్నట్టు అయితే ఆ లావాదేవీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకే కుటుంబం పరిధిలోని వేరొక సభ్యుడికి బదిలీ చేస్తే పన్ను లేదు. వేర్వేరు కుటుంబాల వారి మధ్య బదిలీ (ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలకు మించినప్పుడు) గిఫ్ట్ ట్యాక్స్ పడుతుంది. సీడీఎస్ఎల్ పరిధిలో ఆన్లైన్ బదిలీకి... ► సీడీఎస్ఎల్ పరిధిలో డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారు సీడీఎస్ఎల్ ఈజీఎస్ట్ పేజీకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ► డీపీ ఐడీ, క్లయింట్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ కొట్టాలి. ► అప్పుడు మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని అక్కడ ఇవ్వాలి. ► యూజర్ నేమ్, టైప్ ఆఫ్ అకౌంట్ సెలక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ► ట్రస్టెడ్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలి. ► ట్రస్టెడ్ అకౌంట్ కింద 4 సీడీఎస్ఎల్ ఖాతాల వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చు. ► అకౌంట్ ఆఫ్ చాయిస్ కింద సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ బదిలీ విధానం ► బ్రోకర్ నుంచి డీఐఎస్ బుక్లెట్ తీసుకోవాలి. ► బదిలీ చేయాలనుకుంటే డీఐఎస్ స్లిప్పై అన్ని వివరాలు నమోదు చేయాలి. ► మీ నుంచి షేర్లను పొందే డీమ్యాట్ ఖాతాకు సంబంధించి క్లయింట్ మాస్టర్ రిపోర్ట్ (సీఎంఆర్) కాపీని తెప్పించుకోవాలి. ► అప్పుడు డీఐఎస్ స్లిప్తోపాటు, సీఎంఆర్ కాపీని బ్రోకర్కు సమర్పించాలి. ► బ్రోకర్ అన్ని వివరాలను వెరిఫై చేసి బదిలీ ప్రక్రియ పూర్తి చేస్తారు. ► ఏ విధానంలో అయినా షేర్లు మీ ఖాతా నుంచి బదిలీ, జమ అయిన సమయంలో సీడీఎస్ఎల్ లేదా ఎన్ఎస్డీఎల్ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. -
నవ యువ ఇన్వెస్టార్స్
‘ఎంజాయ్ చేద్దాం...దీంతో పాటు పొదుపు కూడా చేద్దాం’ అంటుంది యువతరం. పొదుపు సంగతి పక్కన పెడితే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ లెక్కల ప్రకారం మిలీనియల్స్, జెన్–జెడ్ నుంచి మదుపు చేస్తున్నవారి సంఖ్య పెరిగింది. కోవిడ్ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకున్న టెక్–శావీ యంగర్ జనరేషన్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లపై అధిక ఆసక్తి ప్రదర్శిస్తోంది. దిల్లీకి చెందిన ప్రియాంక భాటియా మంచి ఉద్యోగమే చేస్తోంది. అయితే సహ ఉద్యోగులు సొంత ఇల్లు కొనుక్కున్నారుగానీ తాను మాత్రం కొనలేకపోయింది. దీనికి కారణం ఆ ఉద్యోగులకు ఎక్కువమొత్తంలో పొదుపు చేసే అలవాటు ఉండడం. తానేమో బాగా ఖర్చు చేస్తుంది. ‘ఇలా అయితే ఇక కష్టం’ అనుకున్న ప్రియాంక కొత్త అడుగులు వేసింది. స్టాక్ ఇన్వెస్టర్, ప్రాపర్టీ ఇన్వెస్టర్, బిజినెస్ కోచ్... మొదలైన వారితో మాట్లాడటం, పుస్తకాలు చదవడం, వర్క్షాప్లకు హాజరు కావడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకోగలిగింది. ఆ తరువాత స్టాక్మార్కెట్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయింది. పొదుపుపై అధికదృష్టి పెట్టింది. ఉద్యోగానికి రాజీనామా చేసి వావ్ (ఉమెన్ ఆన్ వెల్త్) ఫైనాన్షియల్ కోర్స్ను రూపొందించి ‘ఆర్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్’ పేరుతో శిక్షణ ఇస్తోంది. వాట్సాప్, ఫేస్బుక్లలో ప్రియాంకకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువమంది యువతరమే. ఇండోర్కు చెందిన రాజ్ షమని డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు మంచి ఇన్వెస్టర్ కూడా. సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘పొదుపు చేయడం అనేది కూడా ఒక కళ. సరిౖయెన పద్ధతిలో పొదుపు చేయడం ఎలా?’ అనే టాపిక్పై రాజ్ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ‘పర్సనల్ ఫైనాన్స్ నుంచి పాసివ్ ఇన్కమ్ వరకు యువతరం రకరకాల విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తుంది. అయితే కేవలం ఆసక్తి మాత్రమే సరిపోదు. స్టాక్మార్కెట్ నుంచి క్రిప్టో కరెన్సీ వరకు అవగాహన లేకుండా దిగితే నష్టాలు మూటగట్టుకోవాల్సి ఉంటుంది.’ అంటున్నారు ఆర్థికనిపుణులు. అయితే యువ ఇన్వెస్టర్లు ‘ఇన్వెస్ట్మెంట్’ను ఆషామాషీగా తీసుకోవడం లేదు. కేవలం ఉత్సాహంతో మాత్రమే ఇన్వెస్టర్ అవతారం ఎత్తడం లేదు. చాలా సీరియస్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్, న్యూస్ ఆర్టికల్స్ను చదువుతున్నారు. తమ నిర్ణయాలపై నిపుణుల సలహాలు తీసుకొని వాటిని క్రాస్చెక్ చేసుకుంటున్నారు. వాట్సాప్లో ‘ఫైనాల్షియల్ ఇన్ఫో’ అనే గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్, లాస్ గురించి చర్చలు జరుగుతుంటాయి. దీన్ని క్రియేట్ చేసింది ట్వంటీ ప్లస్ యువతరమే. బెంగళూరుకు చెందిన రీతిక ఇంజనీరింగ్ స్టూడెంట్. తన దగ్గర ఉన్న చిన్న పొదుపు మొత్తాలు, క్యాష్గిఫ్ట్లు అన్నీ కలిపి ఇన్వెస్ట్ చేసింది. ‘ఏ కంపెనీ బెటర్? ఏ విధంగా?’ అనే కోణంలో రకరకాలుగా స్టడీ చేసింది రీతిక. చెన్నైకి చెందిన ఇరవై మూడు సంవత్సరాల హర్షితకు పుస్తకాలు చదవడం అంటే బొత్తిగా ఇష్టం ఉండదు. అయితే ఇటీవల కాలంలో ఆమె చేతిలో ఒక పుస్తకం తప్పనిసరిగా కనిపిస్తోంది. అదేమీ టైమ్పాస్ పుస్తకం కాదు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే తన టైమ్ను మార్చివేయగల శక్తివంతమైన పుస్తకం. ఆ పుస్తకం పేరు...ది ఇంటిలిజెంట్ ఇన్వెస్టర్, రచయిత: బెంజిమిన్ గ్రాహమ్. 1949లో ప్రచురితమైన ఈ పుస్తకానికి ఇప్పటికీ గ్లామర్ తగ్గలేదు. అపర కుబేరుడు వారెన్ బఫెట్కు బాగా ఇష్టమైన పుస్తకం ఇది. ‘19సంవత్సరాల వయసులో తొలిసారిగా ఈ పుస్తకాన్ని చదివాను. ఇప్పటికీ అది చూపిన దారిలోనే నడుస్తున్నాను’ అంటాడు బఫెట్. ‘తెలివైన ఇన్వెస్టరెప్పుడూ వాస్తవికవాది అయి ఉంటాడు. నిరాశవాదుల నుంచి కొని ఆశావాదులకు అమ్ముతాడు’ ‘ఏ గ్రేట్ కంపెనీ ఈజ్ నాట్ ఏ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ యూ పే టూ మచ్ ఫర్ ది స్టాక్’... బెంజిమిన్ గ్రాహమ్ ప్రవచించిన ఇలాంటి తెలివైన మాటలను ఇష్టపడుతూనే ఇన్వెస్టర్లుగా తమవైన తెలివితేటలను రుజువు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది యువతరం. -
4 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా లీక్: సైబర్ఎక్స్9
న్యూఢిల్లీ: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్)లో భాగమైన సీడీఎస్ఎల్ వెంచర్స్ (సీవీఎల్) వ్యవస్థలో లోపాల కారణంగా కోట్ల కొద్దీ దేశీ ఇన్వెస్టర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు లీక్ అయ్యాయి. 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు 4.39 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా బైటికి వచ్చినట్లు సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ స్టార్టప్ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. ఈ వివరాలను ఇప్పటికే సైబర్ నేరగాళ్లు చోరీ చేసి ఉంటారని, సీడీఎస్ఎల్ వ్యవస్థలో డేటా భద్రతపై ప్రభుత్వం ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
ఎన్ఎస్ఈ ఐపీఓ రూ. 10,000 కోట్లు!
11 కోట్ల షేర్లు(20–25% వాటా) జారీ పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి దరఖాస్తు.. న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) పత్రాలను సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని ఎన్ఎస్ఈ భావిస్తోంది. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద ఐపీఓ కానున్నది. ఈ ఐపీఓలో భాగంగా ఎన్ఎస్ఈలో 20–25 శాతం వాటా(సుమారుగా 11 కోట్ల షేర్ల)ను ఎన్ఎస్ఈలో ప్రస్తుతం వాటా కలిగిన సంస్థలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. ఎన్ఎస్ఈ విలువ రూ.50,000–55,000 కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐపీఓ ప్రక్రియ కోసం ఒక లిస్టింగ్ కమిటీని కూడా ఎన్ఎస్ఈ ఏర్పాటు చేసింది. ఐపీఓ సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓ చిత్ర రామకృష్ణ అనూహ్యంగా రాజీనామా చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి ఎన్ఎస్ఈ రూ.588 కోట్ల నికర లాభాన్ని, రూ.1,344 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. బీఎస్ఈ కూడా... బీఎస్ఈ కూడా ఐపీఓ పత్రాలను ఈ ఏడాది సెప్టెంబర్లోనే సెబీకి సమర్పించింది. రూ.1,500 కోట్లు సమీకరించాలనేది ప్రణాళిక. బీఎస్ఈ ప్రమోట్ చేసిన సీడీఎస్ఎల్(సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్) కూడా తాజాగా ఐపీఓ పత్రాలను దాఖలు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్(ఎంసీఎక్స్)...భారత్లో ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్లో లిస్టయిన స్టాక్ ఎక్సే్చంజ్ ఇదొక్కటే. -
రికార్డ్ స్థాయికి ఎఫ్ఐఐ నిధులు
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) గత ఆర్థిక సంవత్సరంలో భారత క్యాపిటల్ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఐఐలు భారత్లో రూ.2.7 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) తెలిపింది. వీటిల్లో నికర ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులు రూ.1.09 లక్షల కోట్లుగా, డెట్ మార్కెట్ పెట్టుబడులు రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. 1992 నవంబర్ నుంచి భారత క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఎఫ్ఐఐలను అనుమతించారు. అప్పటి నుంచి అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి చూస్తే ఎఫ్ఐఐల పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా వచ్చాయి. ఇంతవరకూ 2012-13లో అధికంగా(రూ.1.68 లక్షల కోట్లు) ఎఫ్ఐఐల నిధులు భారత్లోకి వచ్చాయి. -
రూ.21,000 కోట్ల విదేశీ పెట్టుబడులు
రూ.5,992 కోట్లు ఈక్విటీల్లోకి బాండ్లలో రూ.15,336 కోట్లు న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లో ఈ ఏడాది ఇప్పటివరకూ(జనవరి 23) రూ.21,328 కోట్లు పెట్టుబడులు పెట్టారని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) పేర్కొంది. ద్రవ్యోల్బణం దిగొస్తుండడం, వడ్డీరేట్లు తగ్గే అవకాశాలుండడం వంటి కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ఈ నెల 14న ఆర్బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. కీలక రేట్లను ఆర్బీఐ మరింతగా తగ్గిస్తుందనే అంచనాలతో పెట్టుబడుల జోరు పెరుగుతోందని విశ్లేషకుల ఉవాచ. సీడీఎస్ఎల్ గణాంకాల ప్రకారం..., విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ-ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు) ఇప్పటివరకూ రూ.5,992 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రుణ సాధనాల్లో రూ. 15,336 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ నెల 23 వరకూ రూ. 21,328 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇక గత ఏడాది మొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.98,150 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రూ.1.16 లక్షల కోట్లు డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద వీరి పెట్టుబడులు గత ఏడాది రూ.2.58 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Delhi liquor scam: కేజ్రీవాల్కు ‘ప్రచార’ బెయిల్
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ఖలిస్తాన్ మద్దతుదారులు
- పీవోకేలో భగ్గుమన్న నిరసనలు
- తనిఖీలు చేయండి.. నిఘా పెంచండి
- అబద్ధాల మోదీ
- Aravind Kejriwal: నేను వచ్చేశా...
- బీజేపీ వైపే ప్రజలు
- మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
Advertisement