-
ఛేజ్ చేసి..నడి వీధిలో చుట్టుముట్టి..అందరూ చూస్తుండగానే..
తమిళనాడు:తమిళనాడులోని కరైకూడి జిల్లాలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో ఐదుగురు కలిసి ఓ యువకున్ని అందరూ చూస్తుండగానే హత్య చేశారు. బాధితున్ని వెంబడించి కర్రలతో దాడి చేసిన అమానవీయ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితున్ని మధురైకి చెందిన వినీత్గా పోలీసులు గుర్తించారు. ఓ మర్డర్ కేసులో పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేయడానికి బయటకు వచ్చాడు. ఇంతలోనే ఐదుగురు వ్యక్తులు ఎస్యూవీలో వెంబడించి బాధితున్ని చుట్టుముట్టారు. అనంతరం కర్రలతో తీవ్రంగా కొట్టారు. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. దుండగులు ఘటనాస్థలం నుంచి పారిపోగా.. బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు ఓ కేసులో కండిషన్ బెయిల్పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు స్నేహితులతో కలిసి లాడ్జ్లో ఉంటున్నట్లు చెప్పారు. బాధితుని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:వడగాల్పుల దెబ్బకు 54 మంది మృతి.. ఆస్పత్రుల్లో స్ట్రెచర్లు లేక భుజాలపైనే.. -
క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్పై దాడి..పేరెంట్స్ అరెస్టు
టీచర్ని చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏకంగా క్లాస్ రూమ్ చుట్టూ పరిగెత్తించి మరీ చితకబాదారు విద్యార్థి తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తమిళనాడుతో స్కూల్లో టీచర్పై రెండో తరగతి విద్యార్థి పేరెంట్స్ దారుణంగా దాడి చేశారు. విద్యార్థి తల్లిందండ్రలు నేరుగా ఉపాధ్యాయుడి క్లాస్ రూం వద్దకు వచ్చి మరీ గొడవకు దిగారు. మా పిల్లలను కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు?..అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ టీచర్ని క్లాస్లోనే విద్యార్థులందరి ముందు పరిగెత్తించి మరీ దారుణంగా కొట్టారు. ఆఖరికి సమీపంలోని ఇటుక రాయిని కూడా తీసుకుని ఆయన మీదకు విసిరే యత్నం చేశారు. అందుకు సంబంధించిన మూడు నిమిషాల వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు బాధిత ఉపాధ్యాయుడుని ఆర్ భరత్గా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఆచిన్నారి తాతయ్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమేగాక దాడికి పాల్పడినందుకు గాను వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో..సదరు విద్యార్థి క్లాస్లో సరిగా వినకపోవడం, ఇతర పిల్లలను కొట్టడం వంటివి చేయడంతో టీచర్ ఆమెను సీటు మారమని చెప్పారు. ఐతే సీటు మారుతున్న క్రమంలో ఆ చిన్నారి పడిపోయింది. కానీ ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తనను టీచర్ కొట్టాడంటూ.. వాళ్ల తాతయ్యకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు మా పిల్లలనే కొడతావ అంటూ టీచర్పైకి దాడికి దిగారని పోలీసులు తెలిపారు. (చదవండి: ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం) -
ఢిల్లీలో దారుణం.. మహిళను రోడ్డుపై వెంబడించి, పిల్లల ముందే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. పట్టపగలే మహిళను రోడ్డుపై వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. సౌత్ వెస్ట్ ఢిల్లీలో 24 ఏళ్ల మహిళను తన ఇద్దరు పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఆరతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఆమెను ఓ వ్యక్తి వెంబడించడం ప్రారంభించాడు. దీంతో ఏం చేయాలో తోచక ఇద్దరు పిల్లలతోనే మహిళ రోడ్డుపై పరుగెత్తింది. దుండగుడు తన వద్దనున్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యడు. ఈ ఘోర దృశ్యాలన్నీసీసీటీవీ ఫుటేజీలో రికారడ్డయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహిళను పొడిచినట్లు సాగర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మహిళను ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచారణలో నిందితుడు మృతురాలు ఇంతకముందు ఇరుగుపొరుగువారని తేలిందని, ఆమె ఇప్పుడు వేరే ఇంటికి నివాసం మార్చినట్లు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి, పట్టుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని తేలిపారు. చదవండి👉🏻 ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో.. -
భయానకం: మత్స్యకారుడిని వెంటాడిన వింత జీవి.. వీడియో వైరల్
ఈ ప్రపంచలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. నింగి, నేల, నీరు.. ఇలా ప్రతి చోట ఎప్పుడో ఒకసారి ఊహకందని వింత సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. వీటిలో కొన్నింటిని చేధించినప్పటికీ మరికొన్ని మిస్టరీలానే మిగిలిపోతుంటాయి. ఇప్పటికే భూమ్మీద కొన్ని లక్షల రకాల జీవులను గుర్తించినా.. నిత్యం కొత్త రకమైన జీవులు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఓ వింత జీవికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దక్షిణ బ్రెజిల్లోను కోస్ట్లో ఓ వ్యక్తి రాత్రి పూట చేపల వేటకు వెళ్లాడు. స్టీమర్తో వేట సాగిస్తుండగా.. సముద్రం నుంచి ఒక్క సారిగా ఓ వింత ఆకారంతో కూడిన జీవి బయటకు వచ్చింది. ఆ జీవి మత్స్యకారుడి బోటును వెంటాడింది. స్టీమర్ వేగంతో పోటీ పడి మరీ నీళ్ల మీద ఎగురుతూ వ్యక్తిని వెంబడించింది. అది నీళ్లలో నుంచి పైగి లేచినప్పుడు దాని కళ్లు మెరుస్తూ కనిపించాయి. దీన్ని ఆ వ్యక్తి తన కెమెరాలో బంధించగా.. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేశారు. చదవండి: జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్! Criatura misteriosa perseguiu um barco ontem no Rio Grande do Sul. Segue o fio para descobrir que monstro é esse nessa #BioThreadBr pic.twitter.com/chOfZ5d0VK — Pedrohenriquetunes (@PedroHTunes) January 27, 2022 ఆ వింత జీవి కళ్లు మెరుస్తూ ఉండటం.. వేగంగా ఆ వ్యక్తిని వెంబడించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీన్ని చూస్తుంటే భయం కలుగుతోంది. అయితే ఇంతకీ అది ఏ జీవీ అనేది మాత్రం కనుగొనలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. -
కీచకుడిని వెంటాడి రఫ్ఫాడించిన యువతి
సాక్షి, న్యూఢిల్లీ : తనను అనుచితంగా తాకి, ,లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని చీల్చి చెండాడేసిందో యువతి. తన వర్క్ప్లేస్కు నడుచుకుంటూ పోతుండగా కీచకుడు రెచ్చిపోయాడు. నలభైఏళ్ల ప్రబుద్ధుడు అదను చూసి తన దుష్టబుధ్దిని చాటుకున్నాడు. అంతే.. కడుపు రగిలిన ఆమె అతడిని దొరకబుచ్చుకుని రఫ్పాడించింది. నోయిడాలోని సహారా రెడ్ లైట్ సమీపంలో శుక్రవారం (మార్చి 12) ఈ సంఘటన జరిగింది. వివరాలను పరిశీలిస్తే నోయిడా సెక్టార్ 12 లోని పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న యువతి తన ప్లేస్కు వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తోంది. ఇంతలో కారు అడ్డు వచ్చింది. దాన్ని తప్పించుకుని ముందుకు పోతున్న సమయంలో ఎప్పటినుంచో ఆమెను గమనిస్తున్న వ్యక్తి సైకిల్ వచ్చి ఆమె ఛాతీపై తాకి ఉడాయించాడు. దీంతో క్షణం షాకైనా.. వెంటనే తేరుకుని సివంగిలా మారిపోయింది. వెంబడించి,వెంటాడి అతడి చొక్కాపట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి పడేసింది. ఆనక తీరిగ్గా సదరు వ్యక్తి క్షమాపణ చెప్పినా వదల్లేదు. ఇలాంటి వారిని అస్సలు క్షమించకూడదని ఆమె పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కానీ ఎపుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, వేధింపులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారని ఆమె చెప్పారు. కొంతమంది బాటసారులు అక్కడ గుమిగూడినా, ఎవరూ తనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని వాపోయారు. అయితే ఇలాంటి దుశ్చర్యలను గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్నారు. మరోవైపు నోయిడా అడిషనల్ డీసీపీ రణవిజయ్ సింగ్ ఫిర్యాదు దాఖలు చేయాల్సిందిగా బాధిత మహిళను కోరారు. ఈ మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు జగన్వైపే
మండే ఎండలు X మధుమేహం!
అమ్మ ఆదర్శ కమిటీలు నామమాత్రమేనా?
కామారెడ్డిలో దొంగల అలజడి
హై ఓల్టేజీతో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం
వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి
సేల్స్టాక్స్ అధికారులమని బెదిరింపులు
ఓటు వజ్రాయుధం వంటిది
జనసభకు ఏర్పాట్లు పూర్తి
ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement