-
ఆ నిచ్చెన మీ ఉసురు తీస్తుందనుకోలేదు కొడకా..!
తూర్పుగోదావరి: అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు నీటి ట్యాంకులో పడి దుర్మరణం చెందిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో గురువారం జరిగింది. ఈ సంఘటనలో గట్టిం వినిత (4), కమ్మిల జస్వంత్ (4) మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన గట్టిం శ్రీనివాస్, దేవి దంపతులు, కమ్మిల రాము, గణేశ్వరి దంపతులు పక్కపక్కనే ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్నారు. శ్రీనివాస్ దంపతులకు వినిత పెద్ద కుమార్తె. ఆమె తరువాత ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాము దంపతులకు జస్వంత్తో పాటు ఒక కుమార్తె కూడా ఉంది. వినిత, జస్వంత్ నర్సరీ చదువుతున్నారు. కాన్వెంట్కు వెళ్లి వచ్చిన తరువాత వీరిద్దరూ సాయంత్రం వినిత్ ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకుకు ఉన్న నిచ్చెన ఎక్కి, ప్రమాదవశాత్తూ ఆ ట్యాంకులో పడిపోయారు. పిల్లలిద్దరూ చాలాసేపు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు వారి కోసం వెతికారు. చివరకు వాటర్ ట్యాంకులో చూడగా చిన్నారులిద్దరూ విగతజీవులై ట్యాంకులో తేలుతూ కనిపించారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కళ్ల ముందు ఆడుతూ పాడుతూ చలాకీగా తిరిగే పిల్లల జీవితం విషాదాంతం కావడంతో ఇద్దరు చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి వినిత తండ్రి శ్రీనివాస్ వాటర్ ట్రాక్టర్లపై ట్యాంకర్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన ఇంటి వాటర్ ట్యాంకుకు నిచ్చెన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిచ్చెనే పిల్లల ఉసురు తీస్తుందనుకోలేదంటూ అతడి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మరో మృతుడు జస్వంత్ తండ్రి రాము వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొడుకు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనుకున్నామని, ఇంతలోనే తమ బిడ్డ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందని వారు రోదిస్తున్నారు. ఇవి కూడా చదవండి: కొడుకును పొడిచి.. పురుగు మందు తాగి -
బర్త్డే వేడుకల్లో బెలూన్స్ వాడుతున్నారా?.. ఇది తెలుసుకోండి..
టెన్నెస్సీ: పుట్టిన రోజు వేడుకలే ఆ చిన్నారి పాలిట శాపమయ్యాయి. అందంగా అలంకరించిన బెలూనే చివరికి ఆ చిన్నారి ఉసురుతీసింది. దీంతో, వేడుకలు జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. అందుకే, ప్రమాదకరమైన వాయువులతో నింపిన బెలూన్లతో ఆటలొద్దు.. జాగ్రత్త..! అంటూ చిన్నారి తల్లి హెచ్చరిస్తున్నారు. వివరాల ప్రకారం.. అమెరికాలోని టెన్నెస్సీలో ఇటీవల చోటు చేసుకున్న విషాద ఘటన ఇది. అలెగ్జాండ్రా కెల్లీ అనే ఏడేళ్ల చిన్నారి సెప్టెంబర్ 24వ తేదీన ఏడో పుట్టిన రోజు జరుపుకుంది. బర్త్డే వేడుకలో ఆమె తల్లి చన్నా కెల్లీ ఏడంకెతో కూడిన పెద్ద బెలూన్తోపాటు మరో 10 రబ్బర్ బెలూన్లను అలంకరించారు. అక్టోబర్ ఒకటో తేదీన ఆదివారం నాడు బెలూన్లుంచిన గదిలోకి వెళ్లి ఆడుకుంటోంది. ఈ క్రమంలో సదరు చిన్నారిని ఇంటి సభ్యులు పట్టించుకోలేదు. అయితే, కొద్దిసేపటి తర్వాత వెళ్లి చూడగా గదిలో అలెగ్జాండ్రా పెద్ద బెలూన్పై ఉలుకూపలుకూ లేకుండా పడిపోయి ఉంది. వెంటనే కృత్రిమ శ్వాస(సీపీఆర్) కల్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బెలూన్లోని ప్రమాదకరమైన హీలియం వాయువును పీల్చడం వల్లే ఆమె శ్వాస ఆగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. చిన్నారి తల్లి చన్నా కెల్లీ ఈ విషాద వార్తను సోషల్మీడియాలో పంచుకోవడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. బెలూన్ల వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను ఆమె హెచ్చరించారు. -
TS Crime News: నిన్న వేడుక.. ఈరోజు ఇలా.. తీవ్ర విషాదం!
ఖమ్మం: పాప పుట్టిన ఆనందంలో ఆ కుటుంబం బారసాల వేడుకగా నిర్వహించారు. అంతకుముందు కుమారుడు ఉండడంతో ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడపొచ్చని అనుకున్నారు. కానీ ఆటో రూపంలో వచ్చిన మృత్యువు ఆ ఇంట విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు రేళ్లపాడు రాజీవ్ నగర్కు చెందిన భరత్కుమార్, వేంసూరు మండలం రాయుడుపాలెంకు చెందిన దివ్య వివాహం చేసుకున్నారు. భరత్ హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వీరికి రెండేళ్ల కుమారుడు దర్షిత్ ఉన్నాడు. తాజాగా మరో కుమార్తె జన్మించడంతో పాపకు రాయుడుపాలెంలో బుధవారం బారసాల వేడుక నిర్వహించారు. కాగా, గురువారం ఉదయం దర్షిత్ రోడ్డు పక్కన ఆడుకుంటుండగా అజాగ్రత్తగా ఉల్లిపాయల ఆటో నడిపిన డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దర్షిత్ను సత్తుపల్లి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రాయుడుపాలెం ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. -
చిన్నారుల ప్రాణాలు తీసిన కాల్వ గుంత!
మహబూబ్నగర్: ప్రమాదవశాత్తు సాగునీటి కాల్వలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆముదంబండ తండాకు చెందిన ఇస్లావత్ లాలునాయక్, శ్రీనునాయక్లు అన్నదమ్ములు. వీరు శుక్రవారం తమ వ్యవసాయ భూమిలో వరినాట్లు వేసేందుకు ఉదయమే కుటుంబసభ్యులందరితో కలిసి పొలం వద్దకు వెళ్లారు. వర్షం వచ్చేలా ఉండడంతో మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇస్లావత్ లాలు, లక్ష్మీ దంపతుల కుమారుడు ప్రవీణ్(9), ఇస్లావత్ శ్రీనునాయక్, ముత్యాలి కుమార్తె వైష్ణవి (7)ని ఇంటికి వెళ్లి నాయనమ్మ వద్ద ఉండమని తల్లిదండ్రులు పంపించారు. వారు ఇంటికి వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఉన్న కర్నె తండా ఎత్తిపోతల కాల్వ కోసం పైపులు వేసేందుకు కాంట్రాక్ట్ గుంతలు తవ్వి ఉంచారు. అయితే మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి గుంతల్లో నీళ్లు నిండాయి. ఇది గమనించని చిన్నారులు కొద్ది నీళ్లు ఉన్నాయి అనుకుని దాటేందుకు వెళ్లి.. అందులో పడిపోయారు.ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో తండాలో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో దారివెంట వెతుకుతూ.. అనుమానం వచ్చి నీటి గుంతలో దిగి వెతికారు. దీంతో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. దీంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. ప్రతి రోజు కళ్లముందు ఆడుతూపాడుతూ కనిపించే చిన్నారులు విగతాజీవులుగా పడిఉండడం చూసి గిరిజనులు కంటతడి పెట్టుకున్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ శ్రీహరి తెలిపారు. -
దిక్కుమాలిన టిక్టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్! ఏడుగురు చిన్నారులు బలి
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచ వ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రజాదరణ పొందింది చైనాకు చెందిన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్టాక్. కొద్ది రోజుల్లోనే మిలియన్ల మంది దానిని వినియోగించటం ప్రారంభించారు. అయితే.. దానికి ఎక్కువగా యువకులు, చిన్నారులు బానిసలవుతున్నారు. అందులోని ఛాలెంజ్లను అనుసరించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. టిక్టాక్ తీసుకొచ్చిన 'బ్లాకౌట్ ఛాలెంజ్' కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వారంతా 15 ఏళ్ల వయసులోపు వారే కావటం గమనార్హం. ఏమిటీ బ్లాకౌట్ ఛాలెంజ్? యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చె టిక్టాక్.. బ్లాకౌట్ ఛాలెంజ్ను తీసుకొచ్చింది. ఈ ఛాలెంజ్.. ఆక్సిజన్ అందకుండా చేసుకుని అపస్మారక స్థితికి చేరుకునేలా ప్రోత్సహిస్తుంది. బెల్టులు, చిన్న చిన్న బ్యాగులకు కట్టే దారాలతో తమను తాము ఊపిరి ఆడకుండా చేసుకోవాలి. బ్లాకౌట్ ఛాలెంజ్ ద్వారా తమ పిల్లలు ఊపిరాడకుండా చేసుకుని చనిపోయినట్లు టిక్టాక్పై పలువురు తల్లిదండ్రులు కేసులు పెట్టినట్లు ది వెర్జ్ న్యూస్ గురువారం వెల్లడించింది. ఇటీవలే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లాలాని వాల్టన్(8), అరియాని అరోయో(9)ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. గతంలో 2021, జనవరిలో ఇటలీలో పదేళ్ల చిన్నారి, మార్చిలో అమెరికాలోని కొలొరాడోలో 12 ఏళ్ల బాలుడు, జూన్లో ఆస్ట్రేలియాలో 14 ఏళ్ల బాలుడు, జులైలో ఓక్లాహోమాలో 12 ఏళ్ల చిన్నారి, డిసెంబర్లో పెన్సిల్వేనియాలో 10 ఏళ్ల బాలిక మృతి చెందారు. టిక్టాక్ ప్రమాదకరమైన ఛాలెంజ్లతో చిన్నారులను ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు పెన్సిల్వేనియా చిన్నారి నైలాహ్ అండర్సన్ తల్లి తవైన అండర్సన్. తన మొదటి పేజీలోనే ఈ ఛాలెంజ్ను ఉంచటం వల్ల పిల్లలు ఎక్కువగా చూస్తున్నారని ఆరోపించారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నాం.. టిక్టాక్ బ్లాకౌట్ ఛాలెంజ్ వల్ల చిన్నారులు చనిపోతున్నట్లు కేసులు నమోదవుతున్న క్రమంలో సంస్థ ప్రతినిధి సమాధానమిచ్చారు. వినియోగదారుల భద్రతకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రమాదకర కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగిస్తామని తెలిపారు. చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. చదవండి: మాల్ పార్కింగ్లో శవమై కనిపించిన టిక్టాక్ స్టార్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement