-
తండ్రి పాపమా ?.. విధి శాపమా ?
లోకం పోకడ తెలియని అన్నదమ్ములు ఆ పసోళ్లు.. మేనరికం పాపమో.. విధి శాపమో.. పదేళ్లు వచ్చినా పట్టుమని పది మందితో ఆడుకోలేని మానసిక దివ్యాంగులు వాళ్లు .. ఆనందమొచ్చినా.. ఆవేదన వచ్చినా ఎదిగీ ఎదగని ఆ రెండు మనసులకే అర్థమయ్యేవి. అనురాగం నిండిన అమ్మ పేగులో ఆవేదన.. మమకారం పంచిన నాన్న గుండెల్లో ఆందోళన వాళ్ల కన్నీళ్లలో కలిసిపోతుండేవి. శనివారం ఆ తండ్రి ఆందోళన క్షణికావేశంగా మారిందో.. కన్నబిడ్డలు పడుతున్న కష్టం చూసి కడుపు తరుక్కుపోయిందో.. ఆ పిల్లల పాలిట మృత్యువైంది. మాచర్ల పట్టణ శివారులో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఉషోదయాన విషాద గీతికై జిల్లా నలుమూలలా ప్రతిధ్వనించింది. ఇద్దరు మానసిక దివ్యాంగుల హత్య మాచర్లరూరల్ : పుట్టుకతో మానసిక వికలాంగులుగా ఉన్న చిన్నారులు ఇంట్లోనే హత్యకు గురయ్యారు. తండ్రే వారిని హతమార్చి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. పట్టణ శివారులోని వికాస్ డీఎడ్ కాలేజి సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామానికి చెందిన కుర్రి బ్రహ్మారెడ్డి, అనిత దంపతులు ఉపాధి కోసం 5 ఏళ్ల నుంచి పట్టణ శివారులోని శ్రీ వికాస్ డీఎడ్ కళాశాల సమీపంలో నివసిస్తున్నారు. బ్రహ్మారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరికి శశాంక్రెడ్డి (11), అదీప్రెడ్డి (9), 9 నెలల చింతన్రెడ్డి అనే ముగ్గురు కుమారులున్నారు. వీరిలో శశాంక్రెడ్డి, అదీప్రెడ్డి పుట్టకతోనే మానసిక దివ్యాంగులుగా జన్మించారు. వీరి ఆరోగ్యం కోసం వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వారిలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే బ్రహ్మారెడ్డి పిల్లలతో కింద పోర్షన్లో నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుంచి బ్రహ్మారెడ్డి బయటకు వెళ్లిపోవడం గమనించిన నాయనమ్మ మాలకొండమ్మ తెల్లవారుతున్నా బ్రహ్మారెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెంది ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులను పరిశీలించగా శశాంక్రెడ్డి, అదీప్రెడ్డి ఉలుకూపలుకూ లేకుండా పడివున్నారు. బహ్మారెడ్డి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తెల్లవారకముందే బయటకు వెళ్లిపోవడంతో బంధువులు అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ దిలీప్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను విచారించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మారెడ్డి కోసం గాలిస్తున్నారు. -
వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
మందమర్రి: అదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్ కి చెందిన నరేష్, ఖలీల్ అనే ఇద్దరు చిన్నారులు గ్రామ సమీపంలోని పాలవాగులో మృత దేహాలై కనిపించారు. స్థానికులు గుర్తించి చిన్నారుల మృత దేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement