-
చిల్లరదేవుళ్లు
ప్రతిధ్వనించే పుస్తకం ‘బ్రిటీషు రాజ్యంలోని బెజవాడ’ నుంచి నైజాం రాజ్యంలోని ఒక గ్రామానికి ఆదరణ కోసం వస్తాడు సారంగపాణి. అతడికి సంగీతం తెలుసు. ‘రాళ్ళను కరి’గించేలా పాడిన సారంగపాణి పాట విన్న దొర రామారెడ్డి తన గడీలోనే ఉండిపొమ్మంటాడు. గడీ దొరవారి ఖిల్లా. ఆ ఊరి మొత్తానికీ ఏకైక భవంతి. అక్కడినుంచీ సారంగపాణి కోణంలో నైజాం రాజ్యంలో స్వాతంత్య్రానికి పూర్వపు తెలంగాణ చరిత్రను ‘చిల్లర దేవుళ్లు’లో చిత్రిస్తాడు రచయిత దాశరథి రంగాచార్య. తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, అప్పుడు వేళ్లూనుకొనివున్న దారుణమైన బానిస పద్ధతులను వివరిస్తాడు. ‘పట్నం పోవడానికి ఎక్కిన బండి ముంగల ఒకడూ, బెడ్డింగు నెత్తిన పెట్టుకుని ఇంకొకడూ ఉరికి రావడం’ చూస్తాడు. ఉరకలేనివాణ్ని దొర ములుగర్రతో బాదినప్పుడు అతడి ప్రాణం విలవిల్లాడుతుంది. బల్లమీద సర్దుతుండగా గాజుబిందె పగిలిపోతే పనివాడిని దొర లాగి కొడతాడు, కాలితో తంతాడు. రామారెడ్డి కూతురు మంజరి. ఆమెకు సంగీతమంటే ప్రాణం. దాంతో ఇద్దరికీ పరస్పరం ప్రేమ అంకురిస్తుంది. వాళ్లింట్లోనే దాసి వనజ ఉంటుంది. ఆమె ఆడబాప. గడీకి వచ్చిపోయే అతిథులకు ఒక బొమ్మగా ఉండాల్సిన బతుకు. ఆమె ‘కన్నెచెర’ను దొర బావమరిది ఇంద్రారెడ్డి విడిపిస్తాడు. ఈ ఇద్దరూ ఒకే ఈడు ఆడపిల్లలే అయినా మంజరి జీవితానికీ, వనజ బతుక్కీ ఉన్న తేడా గ్రహిస్తాడు సారంగపాణి. రామారెడ్డికి తోడు లంబాడీల పైకం తిన్న కరణం మరో ముఖ్యపాత్ర. దొరకీ కరణానికి వైరం ఉన్నప్పటికీ జనాన్ని అణిచివేయాల్సి వచ్చినప్పుడు ఇద్దరూ ఒకటేనని తెలుసుకుంటాడు. బాగా తాగి లంబాడోళ్ల లక్ష్మిపై అత్యాచారం చేయబోతాడు అమీను. ఆమె ఎదురుతిరిగితే కాల్చేస్తాడు. మొత్తంగా, అధికార రూపంలో వెలిసిన చిల్లర దేవుళ్లు జరిపిన దాష్టీకాలకు ఈ నవల అద్దం పడుతుంది. మతమార్పిడుల ప్రహసనం, అప్పటి తెలుగు భాష పరిస్థితి కూడా అవగతమవుతాయి. కృష్ణ ఒడ్డున తప్పిపోయిన మేనల్లుడే సారంగపాణి అని తెలియడమూ, చివర్లో రామారెడ్డి మారిపోవడమూ కొంత నాటకీయంగా ఉన్నప్పటికీ సహజమైన తెలంగాణ నుడికారంతో సాగే ఈ నవల చరిత్రను అర్థం చేసుకోవడానికి తప్పక చదవాల్సిన నవల. -
ప్రభుత్వ లాంఛనాలతో 'దాశరథి' అంత్యక్రియలు
హైదరాబాద్: ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీ దాశరథి రంగాచార్యుల పార్థీవదేహానికి మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని వెస్ట్ మారేడుపల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలలు, శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించిన గొప్ప వ్యక్తి దాశరథి రంగాచార్యులు. -
దాశరథి 'జీవనయానం'
దాశరథి రంగాచార్యులు ఖమ్మం జిల్లా లోని చిట్టి గూడూరులో జన్మించారు. ఆయన అన్న ప్రముఖ కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికింద్రాబాద్ పురపాలక కార్పోరేషన్లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు. నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.తండ్రి కుటుంబకలహాల్లో భాగంగా తల్లినీ, తమనూ వదిలివేయడంతో అన్నతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో కౌమార ప్రాయం ముగిసేలోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథపాలకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్యపరిచారు. ఆ క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనుదీయలేదు. పోరాటం కీలకదశకు చేరుకున్న కాలానికి ఆయన కాంగ్రెస్ దళంలో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్టు దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు.తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు "జనపదం"లో అక్షరీకరించారు. వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. పోరాటానికి పూర్వం, పోరాట కాలం, పోరాటం అనంతరం అనే విభజనతో నవలలు రాసి పోరాటాన్ని నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహిత్యవేత్తలపై ఉన్న సామాజిక బాధ్యత అనే అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నవారే కావడంతో ఆళ్వారుస్వామి మరణానంతరం ఆ బాధ్యతను రంగాచార్యులు స్వీకరించారు. ఆ నవలా పరంపరలో తొలి నవలగా 1942వరకూ ఉన్న స్థితిగతులు "చిల్లర దేవుళ్లు"లో కనిపిస్తాయి. తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తదనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకున్నారు. ఈ నేపథ్యంలో రంగాచార్యులు శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు. నవలలు: మోదుగుపూలు, చిల్లర దేవుళ్ళు, జనపథం, రానున్నది ఏది నిజం?, అమృతంగమయ ఆత్మకథ: జీవనయానం అనువాదాలు: నాలుగు వేదాల అనువాదం, ఉమ్రావ్ జాన్ జీవిత చరిత్ర రచనలు: శ్రీమద్రామానుజాచార్యులు, బుద్ధుని కథ ఇతరాలు: శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతం, వేదం-జీవన నాదం, శతాబ్ది
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
T20 WC జట్టులో నో ఛాన్స్.. రింకూతో రోహిత్ సీరియస్ డిస్కషన్
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
తప్పక చదవండి
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
Advertisement