-
ఆ హిట్ డైరెక్టర్తో స్టార్ హీరో మరో సినిమా.. !
వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. గతంలో సూర్య నటించిన సూరారై పోట్రు, జై భీమ్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిరుతై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జేఈ జ్ఞానవేల్ రాజా యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. త్రీడీ ఫార్మాట్లో రూపొందుతున్న కంగువ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ ఇప్పటికే విడుదల కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కాగా ఈ చిత్ర షూటింగ్లోనే నటుడు సూర్య గాయాల పాలై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. కంగువ తర్వాత మరోసారి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది సూర్య నటించే 43వ చిత్రం కానుంది. దీనిని సూర్య తన 2డీ ఎంటర్టైన్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో నటి నజ్రియా నాయకిగా నటించనుండగా.. మలయాళ యువ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. అదే విధంగా విజయవర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడుగా 100వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ చిత్ర పాటల రికార్డింగ్ మొదలైంది. తొలిపాటను ఓ యువ గాయని పాడారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్కుమార్ మంగళవారం తన ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. అందులో సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ గాయని ‘దీ‘తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. -
తెలుగు హీరో- డైరెక్టర్ లిప్లాక్ ఫోటో వైరల్!
సాక్షి, హైదరాబాద్: హీరో, హీరోయిన్ లిప్లాక్ సీన్లు సినిమాలో ఉండటం సాధారణమైన విషయం కానీ హీరో-డైరెక్టర్ లిప్లాక్ ఫోటోలు బయట పడితే అది సెన్సేషన్ విషయమే అవుతుంది. ఓటీటీ ఫ్లాట్ఫామ్లో విడుదలైన లేటెస్ట్ తెలుగు సినిమా ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’. రవికాంత్ పెరుపు దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో గురువారం విడుదలై మంచి టాక్ను సంపాదించుకుంది. అందరూ సినిమా గురించి మాట్లాడుకుంటున్న సమయంలో హీరో- డైరెక్టర్ల లిప్లాక్ ఫోటో ఇప్పుడు వారందరికి షాక్ ఇస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమా పూర్తయి గురువారం నాడు నెట్ఫ్లిక్స్లో విడుదల అయ్యింది. ఈ మూవీలో సిద్దూ జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్, షాలిని వడ్నికట్టి నటించారు. (‘అప్పటి నుంచే ఆ అలవాటు ఉంది’) -
‘మహాబలి‘ సినిమాలో స్థానికులకు అవకాశాలు : డైరెక్టర్ రోహిత్
దామెర: స్థానిక కళాకారులను ప్రోత్సహించి సినిమాలో అవకాశం కల్పిస్తున్నట్లు మహాబలి సినిమా డైరెక్టర్ రోహిత్ గురువారం తెలిపారు. మహాబలి చిత్రం యునిట్ మండలంలోని పులుకుర్తి గ్రామంలో గత నాలుగు రోజులుగా సందడి చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ మాట్లాడారు. ఎస్ఆర్ ఫిలిం మేకర్స్ బ్యానర్పై సన్నీ నిర్మాతగా, ప్రధాన తారాగణం రాధాకృష్ణ, మిత్రలు నటిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి 9 ప్రముఖ డైరెక్టర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ, 10న ప్రముఖ హీరో చేతుల మీదుగా టీజర్ను విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసోసియేట్ డైరెక్టర్ నిరంజన్, సురేందర్, వర్మ, బాలు, సర్పంచ్ గోవిందు అశోక్, రైతు సమన్వయ సమితి మండల డైరెక్టర్ ముదిగొండ క్రిష్ణమూర్తి, సినిమా యునిట్ సభ్యులు పాల్గొన్నారు. -
భగవాన్ టీచరంటే ఎందుకంత ప్రేమ?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు తిరువల్లూర్లోని వెలైగారం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు టీచర్గా పనిచేస్తున్న 28 ఏళ్ల భగవాన్ బదిలీపై మరో పాఠశాలకు వెళ్లడాన్ని తట్టుకోలేని ఆ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఆయన్ని వెళ్లద్దంటూ ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో తీవ్రంగా హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనిపై ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు హృతిక్ రోషన్లు, కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్లు కూడా తమదైన శైలిలో స్పందించారు. ఇలాంటి ‘గురుశిష్యుల’ అనుబంధం తానెక్కడా చూడల్లేదంటూ రెహమాన్ వ్యాఖ్యానించగా, వీరి అనుబంధం తన హృదయాన్ని ఎంతో హత్తుకుందని హృతిక్ రోషన్ వ్యాఖ్యానించారు. భగవాన్ లాంటి ఉపాధ్యాయులు తమకు ఎంతో మంది అవసరం అంటూ కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిల్ వ్యాఖ్యానించారు. తాను ఇంతగా విద్యార్థినీ విద్యార్థులతో ఎలా అనుబంధాన్ని పెంచుకున్నారో భగవాన్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా విన్నవించారు. ‘నేను విద్యార్థులతో ఓ అనుబంధాన్ని ఏర్పరుచుకోవడంలో భాగంగా వారికి ఆసక్తికరమైన కథలను చెప్పేవాడిని. పాఠాలను కూడా అదే తరహాలో బోధించేందుకు ప్రయత్నించేవాడిని. వారి వారి కుటుంబాల నేపథ్యం గురించి విచారించే వాడిని. వారి భవిష్యత్ ప్రణాళికల గురించి గుచ్చి గుచ్చి అడిగి తెలుసుకునేవాడిని. వారి కుటుంబ నేపథ్యాలు, వారి భవిష్యత్తు కలలను దృష్టిలో పెట్టుకొని వారు భవిష్యత్తులో ఎంచుకోవాల్సిన మార్గాల గురించి సూచించే వాడిని’ అని చెప్పారు. భగవాన్ ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్న రెండు ప్రధాన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భగవాన్ ఇంగ్లీషు టీచరు. అయినప్పటికీ ఆయన తప్పులు లేకుండా ఇంగ్లీషును మాట్లాడలేక పోతున్నారు. ఆయన సాదాసీదా అందరికి తెలిసిన సాధారణ పదాల్లోనే తన అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. వాటిలోనూ వ్యాకరణ దోషాలు కనిపించాయి. ఆయన కూడా చదువుకున్నది ప్రస్తుత ప్రభుత్వ విద్యా విధానంలోనే కావడం వల్ల ఆయనకు కూడా భాష అంతగా అబ్బినట్లు లేదు. ఇది ప్రభుత్వ విద్యావిధానంలో ఉన్న ప్రధాన లోపాల్లో ఒకటి. ఇక రెండో లోపం కూడా విద్యార్థులతో ఆయన పెనవేసుకున్న బంధమే సూచిస్తోంది. ఏ ఉపాధ్యాయుడికైనా విద్యార్థులతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నప్పుడే విద్యారంగంలో గురుశిష్యులు రాణించగలరు. ఇలాంటి బంధాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విద్యా విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం విద్యారంగాన్ని కూడా అన్ని ప్రభుత్వ విభాగాల్లాగే చూస్తోంది. ఉపాధ్యాయులను ఇతర విభాగాల గుమాస్తాలుగా పరిగణిస్తోంది. ఆ ధోరణి మారాలి. అవసరమైతే బదిలీ నిబంధనల్లో మార్పులు తీసుకరావాలి. వెలైగారంలో భగవాన్ టీచర్ బదిలీని ఆపాల్సిందిగా గ్రామస్థులు కూడా కోరగా అది తన చేతిలో లేదంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చేతులెత్తేశారు. నచ్చిన టీచర్ను కాకుండా ఉత్తమ టీచరును రిటేన్ చేసుకునే అధికారం ప్రధానోపాధ్యాయుడికి ఉండాలి. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే కనుక సామాజిక శాస్త్రంలో వారికి సరైన శిక్షణ ఉండాలి. విద్యార్థులకు కూడా చిన్పప్పటి నుంచే సమాజాన్ని అర్థం చేసుకునే పాఠ్యాంశాలు ఉండాలి. ఎందుకంటే భగవన్ను, విద్యార్థుల మధ్య బంధాన్ని పెంచిందీ ఈ అంశాలే. భగవాన్కు సంబంధించిన వీడియో వైరల్ కాగానే కొంత మంది సినీ నిర్మాతలు ఆయనపై సినిమా తీసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. గురుశిష్యుల అనుబంధం గురించి చెప్పి నాలుగు డబ్బులు వెనకేసుకునే విధంగా ఆయనపై సినిమా ఉండకూడదు. ఆయన విద్యార్థులతో ఎందుకు అలాంటి అనుబంధాన్ని ఏర్పరుచుకోవాల్సి వచ్చిందో వివరణ ఉండాలి. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే విధంగానూ సినిమా ఉండాలి. -
ఆ ఉపాధ్యాయుడి నేపథ్యంపై సినిమా
పళ్లిపట్టు: ఉపాధ్యాయుడు భగవాన్పై విద్యార్థుల ప్రేమ పోరాటానికి సంబంధించి సినిమా తీసేందుకు వీలుగా సినీ డైరెక్టర్లు ఇద్దరు శుక్రవారం వెలిగరం పాఠశాల్లో భగవాన్ను కలిసి చర్చలు జరిపారు. అదే సమయంలో డీఈఓ విచారణ, తమ ఉపాధ్యాయుడిని బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రిని కలిసిందుకు నిర్ణయించుకోవడంతో వెలిగరం పాఠశాల్లో శుక్రవారం సైతం హడావుడి చోటుచేసుకుంది. పళ్లిపట్టు సమీపంలోని వెలిగరం పాఠశాల్లో ఆంగ్లం బీటీ టీచర్ భగవాన్ నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ స్థితిలో పాఠశాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల ఉండేలా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 35 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ నిష్పత్తిలో ఉండాలి. అయితే వెలిగరం పాఠశాల్లో 280 మంది విద్యార్థులకు ప్రస్తుతం 19మంది టీచర్లు (తెలుగు మీడియం ఉపాధ్యాయులతో కలిపి) ఉన్నారు. వారిలో టీచర్ పోస్టులో ఉన్న జూనియర్లను స్థాన చలనం చేయాల్సి రావడంతో ఇద్దరు టీచర్లను వేర్వేరు పాఠశాలకు బదిలీ చేస్తూ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు కేటాయించారు. అయితే భగవాన్ బదిలీ సమాచారంతో పాఠశాల విద్యార్థులు చలించి తరగతులు బహిష్కరించి ప్రేమ పోరాటం నిర్వహించిన విషయం తెలిసిందే. బదిలీ అయ్యేందుకు పాఠశాలకు వచ్చిన భగవాన్ను విద్యార్థులు చుట్టిముట్టి తమ పాఠశాలను వీడి వెళ్లరాదని బోరున విలపించడంతో విద్యార్థుల ప్రేమకు చలించిన టీచర్ సైతం విలపించారు. విద్యార్థులు గ్రామీణుల కోర్కె మేరకు కొద్ది రోజుల పాటు బదిలీ నిలిపివేస్తూ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం భగవాన్ యథావిధిగా వెలిగరం పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించారు. ఈ స్థితిలో ఉదయం పది గంటల సమయంలో చెన్నైకు చెందిన సినిమా డైరెక్టర్లు ఇద్దరూ పాఠశాలకు వెళ్లి భగవాన్కు కలుసుకుని విద్యార్థులు, టీచర్ అనుబంధం మీద సినిమా తెరకెక్కించడంపై మంతనాలు జరిపారు. అదే సమయంలో పాఠశాలకు చేరుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి అరుల్సెల్వం ప్రధానోపాధ్యాయులు అరవింద్ సహా 18 మంది ఉపాధ్యయులతో సంఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. విచారణ వివరాలను జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారికి సమర్పించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అదే సమయంలో మరో వారంలో భగవాన్ను మరో పాఠశాలకు బదిలీ చేయనుండడంతో, బదిలీని నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ డైరెక్టర్ను కలిసి వేడుకోవాలని నిర్ణయించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 202: కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
ఏపీ పరిశ్రమలపై ఈనాడు విషం.. అసలు విషయం ఇదే!
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement