-
సీకే వస్తే పార్టీలో ఉండలేం
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీలోకి వస్తే ఆ పార్టీలో ఉండలేమని మేయర్ హేమలత, ఆమె భర్త కటారి ప్రవీణ్ స్పష్టం చేశారు. శుక్రవారం గంగనపల్లెలోని తమ నివాసంలో పలువురు టీడీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలతో మేయర్ దంపతులు సమావేశమయ్యారు. ప్రవీణ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు చివరి నిమిషం వరకు టీడీపీ కోసం పనిచేశారన్నారు. పార్టీ కోసం తీసుకున్న నిర్ణయాలతోనే ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అందరం మనోహరన్న నామినేషన్కు వెళదాం.. వాళ్లు పార్టీలో చేరారంటే నడిరోడ్డునుంచే వచ్చేస్తా, నాతో రావడానికి మీరు సిద్దమా..?’ అని ప్రవీణ్ కార్పొరేటర్లను ప్రశ్నించగా సిద్ధమంటూ చేతులెత్తారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కంద, కిరణ్, వెంకట్, ఆనంద్, రాణి, అన్నపూర్ణ, కృపానందం, తిరుకుమరన్, శేషాద్రినాయుడు, యువరాజులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సీకే బాబు పార్టీలోకి వస్తే కలుపుకుని పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్, ఎమ్మెల్సీ దొరబాబు పేర్కొనడం గమనార్హం. -
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
-
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
సాక్షి,చిత్తూరు: పదేళ్ల క్రితం సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై హత్యాయత్నం కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. 2007 డిసెంబర్ 31న సీకే బాబు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని నిందితులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీకే బాబు గన్మెన్ సురేంద్ర మృతి చెందగా, సీకే బాబుకు, అతని అనుచరులకు గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తును ప్రారంభించిన వన్టౌన్ పోలీసులు 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. సీకే బాబు సహా 81మంది సాక్షుల్ని పోలీసులు చేర్చగా, కోర్టు 51 మందిని విచారించి 13 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఇందులో ఏ-1 నిందితుడు, టీడీపీ నాయకుడు కటారి మోహన్ మృతిచెందగా, ఏ-2 నిందితుడైన చింటూకు కోర్టు జీవితఖైదును విధించింది. మేయర్ కటారి అనూరాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడుగా ఇప్పటికే వైఎస్ఆర్ కడప జిల్లా సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. -
సీకేబాబుపై హత్యాయత్నం కేసులో నేడు తీర్పు
చిత్తూరు (అర్బన్): పదేళ్ల క్రితం చిత్తూరులో అప్పటి మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. సీకే బాబు వెళుతున్న కారును లక్ష్యంగా చేసుకుని పట్టపగలు నడిరోడ్డు పై మందుపాతర పేల్చారు. ఒక పోలీసు కానిస్టేబుల్ (గన్మెన్) చనిపోగా.. సీకే త్రుటిలో బయటపడ్డారు. ఈ కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా ఉంటుందోనని చిత్తూరు వాసులు ఆసక్తిగా ఉన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల నుంచి నగరంలోని ప్రముఖులకు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. 2007 డిసెంబరు 31న అప్పటి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. సీకే.బాబు కట్టమంచిలోని తన నివాసం నుంచి గన్మెన్లు, అనుచరులతో వెళుతుండగా సాయిబాబా ఆలయం సమీపంలోని కల్వర్టు వద్ద మందుపాతర పేలింది. సీకే.బాబు గన్మెన్గా ఉన్న సురేంద్ర మృతి చెందాడు. సీకే.బాబుతో పాటు ఆయన అనుచరులు సైతం గాయపడ్డారు. దీనిపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితుల్లో టీడీపీ నాయకులు కఠారి మోహన్ (చనిపోయాడు), చింటూ, కఠారి ప్రవీణ్ (చిత్తూరు మేయర్ భర్త), జలగం మురళి, కిశోర్, గోపి, జ్యోతి, పురుషోత్తం, గిరిధర్రెడ్డి, ఏకాంబరం, డీఏ శ్రీనివాస్ (చిత్తూరు ఎమ్మెల్యే కొడుకు), వెంకటస్వామి, అర్జున్, రాజేష్, ఏడుకొండల యాదవ్, శ్రీను, వై.శ్రీనివాసులు, రవి ఉన్నారు. సీకే బాబుతో సహా మొత్తం 81 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. వారిలో 51 మందిని న్యాయమూర్తి కపర్తి విచారించి తీర్పును సోమవారానికి రిజర్వు చేశారు. కేసులో రెండో నిందితుడిగా ఉన్న చింటూ చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతను వైఎస్సార్ కడప సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. -
అదే హై డ్రామా..!
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని పూల మార్కెట్ విషయంలో నెలకొన్న వివాదంలో ఆదివారం కూడా నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. పూల మార్కెట్ వద్ద మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మళ్లీ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సీకే బాబు ఉంటున్న కట్టమంచికి ఆదివారం ఉదయం నుంచే పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పూల మా ర్కెట్ వద్దకు వెళ్లేట్లయితే అదుపులోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సీకే బాబు పలమనేరు రోడ్డులోని క్లబ్ వద్దకు చేరుకున్నారు. ఆయన్ను 50 మంది వరకు పోలీసులు వెంబడించారు. తనను ఎందుకు అనుసరిస్తున్నారని సీకేబాబు పోలీసులను ప్రశ్నించారు. తన వెంట రావద్దని సూచించారు. ఇక టీడీపీ నేతలు సైతం ఎమ్మెల్సీ దొరబాబు కార్యాలయం వద్ద సమాలోచనలు జరిపారు. అటు నుంచి ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ హేమలత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని తదితరులు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకు ని నగర అభివృద్ధిపై కమిషనర్తో చర్చిం చారు. పూల మార్కెట్ విషయంలో వెన క్కు తగ్గకూడదని నిర్ణయం తీసుకున్నారు. పేదల కడుపుకొట్టొద్దు.. 11 గంటల ప్రాంతంలో సీకే బాబు వన్టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ డీఎస్పీ సుబ్బారావుతో మాట్లాడారు. పూల మార్కెట్ను అక్కడే ఉంచి పేదలకు న్యాయం చేయాలని కోరారు. అలా కానిపక్షంలో పాత బస్టాండులో తాత్కాలికంగా దుకాణాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సూచించారు. పేదల కడుపుకొట్టకుండా హుందాగా వ్యవహరిం చాలని కోరారు. దీనిపై స్పందించిన డీఎస్పీ మార్కెట్ తరలింపుపై నగరపాలక సంస్థ నిర్ణయం మేరకు మునిసిపల్ కమిషనర్ ఇక్కడ దుకాణాలు ఉంచకూడదని, పోలీసు బందోబస్తు కల్పించాలని తమకు లేఖ రాశారని తెలిపారు. ఇక్కడ దుకాణా లు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ పరిణామాలపై ప్రజాకోర్టులో తేల్చుకుంటామని చెప్పి సీకే బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 30 మందిపై కేసులు.. డీఎస్పీ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూల మార్కెట్ వద్ద జేసీబీ తీసుకొచ్చి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన 30 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో సీకే బాబు సైతం ఉన్నారని పేర్కొన్నారు. అలాగే కార్తీక్, భాస్కర్, మణి, ప్రదీప్, సురేష్, రవి, షేరు, కార్పొరేటర్ చందు, అఫ్జల్ఖాన్, జీవరత్నం, అమీర్ అబ్బాస్, కిశోర్, శ్రీనివాస్ తదితరులను శనివారం రాత్రే అదుపులోకి తీసుకున్నామని చెప్పా రు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామన్నారు. వారికి 14 రోజుల రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరు జిల్లాకు జైలుకు తరలించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement