-
ఉద్యమ పార్టీ ఎందుకు స్పందించదు?
సాక్షి, హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టాన్ని రెండు రాష్ట్రాల్లో అమలు చేయాలని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయనందు వల్లే కోర్టుకు వెళ్లామన్నారు. ప్రతిపక్షం బాధ్యతగా తాము చేయాల్సిందింతా చేస్తున్నామని.. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసమే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఇందుకు ప్రతిగా కేంద్రం వివిధ శాఖల ద్వారా కౌంటర్ దాఖలు చేయిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం తన సొంత ఖర్చుతో కేసుకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహిస్తున్నానన్న ఆయన.. ఉద్యమ పార్టీ అని చెప్పుకునే టీఆర్ఎస్ ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పొలిటికల్, పర్సనల్ అజెండాతోనే అధికార పార్టీ వ్యవహరిస్తున్నట్లు కనబడుతోందని విమర్శించారు. శ్వేతపత్రం విడుదల చేయాలి.. ఏపీ పునర్విభజన చట్టం కింద తెలంగాణకు ఎంత మేలు జరిగిందనే విషయాలపై శ్వేతప్రతం విడుదల చేయాలని సుధాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధన కోసం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి లక్ష పోస్టు కార్డులు రాసే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. బయ్యారం గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతోంటే తెలంగాణ, ఆంధ్ర పరిస్థితులు వేరంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. -
‘సొరంగం’ పూర్తిచేయడమే లక్ష్యం
సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి కనగల్: శ్రీశైలం సొరంగ మార్గం పూర్తిచేయడమే లక్ష్యమని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొరంగం పూర్తయితేనే జిల్లాను పీడిస్తున్న ఫ్లోరోసిస్ భూతంతో పాటు రైతులను సాగు నీరందనుందన్నారు. శ్రీశైలం సొరంగం నిర్మాణం పనులు ఇప్పటికే అరవై శాతం పూర్తయ్యాయని వివరించారు. 2007 శ్రీశైలం సొ రంగం నిర్మాణానికి 2 వేల కోట్ల ను మంజూరు చేయించానన్నారు. మిగతా పనుల పూర్తికి ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశా ల్లో రెండు గంటలు చర్చించామన్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీర్ స్పందించి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి సొరంగం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. రాబోయే మూడేళ్లలో సొరంగాన్ని పూర్తిచేసి రైతులకు నిరంతరం రెండు పంటలకు సాగు నీరందించడమే ధ్యేయమన్నారు. ఇప్పటికే సుమారు 15 కోట్ల పంచాయతీరాజ్ నిధులు మండలంలోని వివిధ లింక్రోడ్ల అభివృద్ధికి మం జూరైనట్లు వివరిం చారు. ఇటీవల మంజూరైన పొనుగోడు 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మూడు మాసాల్లో నిర్మా ణం పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చర్లగౌరారం, చెట్లచెన్నారం గ్రామాలకు సైతం త్వరలోనే సబ్ స్టేషన్లు మంజూరు కానున్నట్లు తెలిపారు. నాలుగేళ్లపాటు అభివృద్ధి ఆ తర్వా తే రాజకీయాలన్నారు. అభివృద్ది పనుల నిధుల మం జూరికే ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుస్తున్నానని, పార్టీ మా రడానకి కాదని స్పష్టం చేశారు. జి.చెన్నారం శ్రీబ్రమరాం బిక మల్లికార్జున స్వా మి ఆలయ అభివృద్ధికి 10 వేల విరాళం అందజేశారు. ఆలయం నిర్మాణ క్రమంలో మరో లక్ష అందజేస్తాన న్నారు. అంతకుముందు పర్వతగిరి ఫీడర్ చానల్పై ఉన్న శిథిల బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీని వాస్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ భిక్షంయాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్రెడ్డి, సర్పంచులు పావనీవెంకటే శం, సునీతావేంకన్న, యాదయ్య, పెంటయ్య, పెద్దులు, లింగయ్య, ఎంపీటీసీలు సునితాకృష ్ణయ్య, హఫీజొద్దీన్,రాజీవ్ ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement