-
కాఫీ సాగుకు ప్రోత్సాహం
హుకుంపేట: ఏజెన్సీలోని గిరిజన రైతులంతా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర కాఫీ బోర్డు, పాడేరు ఐటీడీఏ కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర కాఫీ బోర్డు మినుములూరు శాఖ సీనియర్ లైజన్ అధికారి (ఎస్ఎల్వో) ఎస్.రమేష్ అన్నారు. మండలంలోని మారుమూల రాప పంచాయతీ గొందిరాప, దంపులుపడప గ్రామాల పరిధిలోని గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పనులపై పలు గ్రామాల గిరిజన రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ రైతులంతా తమ తోటల్లోని సస్యరక్షణ పనులపై నిర్లక్ష్యం వహిస్తే దిగుబడులు తగ్గిపోయి, మొక్కలు చనిపోయే అవకాశం ఉందన్నారు. కలప వ్యాపారుల ఒత్తిడితో నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లను విచ్చలవిడిగా నరికేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని కోరారు. ఏటా కాఫీ, మిరియాల పంటల ద్వారా ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని వివరించారు. తోటల్లో నీడనిచ్చే చెట్లు, కాఫీ మొక్కల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరి రైతులంతా కాఫీతోటల్లో ఖాళీల మొక్కలను నాటుకోవాలని సూచించారు. తోటల్లో ఎండు కొమ్మలను తొలగించడంతో పాటు, పంట గింజ దశలో ఉండడంతో మొక్కలకు కాండం తొలిచే పురుగులను తొలగించాలన్నారు. తోటల్లో అడుగున్నర లోతు, నాలుగు అడుగుల వెడల్పులో ఇంకుడు గుంతలను తవ్వుకోవాలని సూచించారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా కాఫీ తోటలు సాగు చేసేందుకు ఎంపికైన రైతులు కూడా ఆగస్టు 10 నాటికి మొక్కలు నాటుకోవాలన్నారు. హుకుంపేట మండలంలోనే 800 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ మొక్కలు నాటే లక్ష్యంతో ఉన్నామన్నారు. అనంతరం ఈ ప్రాంతంలోని కాఫీ మొక్కల నర్సరీలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో రాప ఎంపీటీసీ సభ్యులు ఎస్.దర్మయ్యపడాల్, కాఫీ తోటల విస్తరణ ఇన్స్పెక్టర్ ఎం.సెల్వరాజ్, సబ్ అసిస్టెంట్ కంకిపాటి శ్రీరాములు,ఉద్యానవన కన్సల్టెంట్ పి.పద్మావతి, ఫీల్డ్ అసిస్టెంట్లు సీతారామ మజ్జి, శివశంకర్, లైజన్ వర్కర్ వాసుదేవుడు, రాప ఉపసర్పంచ్ శోభ రాంబాబుదొర, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
కాఫీ సాగుకు ప్రోత్సాహం
హుకుంపేట: ఏజెన్సీలోని గిరిజన రైతులంతా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర కాఫీ బోర్డు, పాడేరు ఐటీడీఏ కాఫీ సాగును ప్రోత్సహిస్తున్నాయని కేంద్ర కాఫీ బోర్డు మినుములూరు శాఖ సీనియర్ లైజన్ అధికారి (ఎస్ఎల్వో) ఎస్.రమేష్ అన్నారు. మండలంలోని మారుమూల రాప పంచాయతీ గొందిరాప, దంపులుపడప గ్రామాల పరిధిలోని గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ తోటలను సోమవారం ఆయన పరిశీలించారు. తోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ పనులపై పలు గ్రామాల గిరిజన రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ రైతులంతా తమ తోటల్లోని సస్యరక్షణ పనులపై నిర్లక్ష్యం వహిస్తే దిగుబడులు తగ్గిపోయి, మొక్కలు చనిపోయే అవకాశం ఉందన్నారు. కలప వ్యాపారుల ఒత్తిడితో నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లను విచ్చలవిడిగా నరికేసే పద్ధతికి స్వస్తి చెప్పాలని కోరారు. ఏటా కాఫీ, మిరియాల పంటల ద్వారా ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని వివరించారు. తోటల్లో నీడనిచ్చే చెట్లు, కాఫీ మొక్కల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరి రైతులంతా కాఫీతోటల్లో ఖాళీల మొక్కలను నాటుకోవాలని సూచించారు. తోటల్లో ఎండు కొమ్మలను తొలగించడంతో పాటు, పంట గింజ దశలో ఉండడంతో మొక్కలకు కాండం తొలిచే పురుగులను తొలగించాలన్నారు. తోటల్లో అడుగున్నర లోతు, నాలుగు అడుగుల వెడల్పులో ఇంకుడు గుంతలను తవ్వుకోవాలని సూచించారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా కాఫీ తోటలు సాగు చేసేందుకు ఎంపికైన రైతులు కూడా ఆగస్టు 10 నాటికి మొక్కలు నాటుకోవాలన్నారు. హుకుంపేట మండలంలోనే 800 ఎకరాల విస్తీర్ణంలో కాఫీ మొక్కలు నాటే లక్ష్యంతో ఉన్నామన్నారు. అనంతరం ఈ ప్రాంతంలోని కాఫీ మొక్కల నర్సరీలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో రాప ఎంపీటీసీ సభ్యులు ఎస్.దర్మయ్యపడాల్, కాఫీ తోటల విస్తరణ ఇన్స్పెక్టర్ ఎం.సెల్వరాజ్, సబ్ అసిస్టెంట్ కంకిపాటి శ్రీరాములు,ఉద్యానవన కన్సల్టెంట్ పి.పద్మావతి, ఫీల్డ్ అసిస్టెంట్లు సీతారామ మజ్జి, శివశంకర్, లైజన్ వర్కర్ వాసుదేవుడు, రాప ఉపసర్పంచ్ శోభ రాంబాబుదొర, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement