-
ముగ్గురి మృతి.. సినీ ఇండస్ట్రీలో విషాదం
చెన్నై(పెరంబూర్): ఇండస్ట్రీకి సంబంధించిన ముగ్గురు ఒకేరోజు కన్నుమూయడంతో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. హాస్యనటుడు సూరి తండ్రి ఆర్. ముత్తుసామి(75) అనారోగ్యంతో కన్ను మూశారు. వెన్నెలా కబడ్డి కుళు చిత్రం ద్వారా హాస్యనటుడిగా పరిచయమైన సూరి ప్రస్తుతం ప్రముఖ హాస్యనటుడిగా రాణిస్తున్నారు. మదురై సమీపంలోని రాజాకూర్ గ్రామానికి చెందిన సూరి తండ్రి అనారోగ్యం కారణంగా సోమవారం రాత్రి మృతిచెందారు. ఆయన భౌతిక కాయానికి నటుడు శివకార్తికేయ, పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. మంగళవారం స్వగ్రామంలో ముత్తుసామి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖ చాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్ తండ్రి కేవీ.వెంకటేశన్(74) సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఇండస్ట్రీ ప్రముఖుడు, సీనియర్ గాయకుడు సీర్కాళి గోవిందరాజన్ భార్య సులోచన(80) శ్వాసకోస సంబంధిత సమస్యలతో సోమవారం రాత్రి స్థానిక అడయార్లో కన్నుమూశారు. ఇలా పరిశ్రమకు చెందిన ముగ్గురు ఒకే రోజు మరణించడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. -
కమెడియన్తో లేడీ సూపర్స్టార్?
కోలీవుడ్లో ఇప్పుడు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే హాస్యనటుడు సూరికి జంటగా లేడీ సూపర్స్టార్ నయనతార నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి సుమారు మూడు కోట్ల వరకూ పారితోషికం పుచ్చుకుంటున్నారట నయనతార. అదేవిధంగా చేతి నిండా చిత్రాలతో బిజీబిజీగా ఉన్న ఈ మాలీవుడ్ భామతో పెద్దపెద్ద స్టార్ హీరోలు నటించడానికి ఆసక్తి చూపుతున్నా, కాల్షీట్స్ లేవంటూ నో అంటున్న పరిస్థితి. మాయ చిత్రం తరువాత అమ్మడికి లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు వరుసగా తలుపు తడుతున్నాయి. నిజానికి మాయ చిత్రం తరువాత నయనతార నటించిన ఒక్క లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రమూ తెరపైకి రాలేదు. అయితే కొలైయుధీర్ కాలం, డోర, అరమ్ తరహా చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో డోర చిత్రం ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతార కూడా ఇలాంటి కథా చిత్రాల్లో నటించడానికే ఇష్టడడుతున్నట్లు సమాచారం. తాజాగా నవ దర్శకుడొకరు నయనతారకు ఒక కథ వినిపించారట. పూర్తి వినోదభరితంగా సాగే ఆ కథ ఆమెకు విపరీతంగా నచ్చేసిందని సమాచారం. అందులో హీరోగా ప్రస్తుతం హాస్యనటుడిగా బిజీగా ఉన్న సూరి హీరో అని తెలిసినా అందులో నటించడానికి నయనతార సై అన్నట్లు వార్త సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. హాస్య నటుడు సూర్యకు జంటగా నయనతార నటించడానికి సమ్మతించినట్లు జరుగుతున్న ప్రచారం కోలీవుడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే ఇందులో నిజమెంత అన్నది నిలకడ మీదే తెలియాల్సి ఉంది. గతంలో నటి శ్రియ టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలో హాస్యనటుడు వడివేలుతో సింగిల్ సాంగ్లో నటించడానికి అంగీకరించి తన మార్కెట్నే కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో నయనతార ఈ చిత్రంలో నటిస్తున్నారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ చిత్రం గురించి అధికారక ప్రకటన వెలువడేవరకూ వేచి చూడాల్సిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement